46 మందికి కరోనా
కరీంనగర్ జిల్లాలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రభుత్వం మంగళవారం వెలువరించిన బులెటిన్లో 46 మందికి పాజిటివ్ నిర్ధారణ అయినట్లు పేర్కొన్నారు. రెండో దశ కరోనా సమయంలో
ముగ్గురు గర్భిణులకు పాజిటివ్
కరోనా బాధితులకు సిద్ధంగా ఉన్న వార్డు
కరీంనగర్ వైద్య విభాగం, న్యూస్టుడే: కరీంనగర్ జిల్లాలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రభుత్వం మంగళవారం వెలువరించిన బులెటిన్లో 46 మందికి పాజిటివ్ నిర్ధారణ అయినట్లు పేర్కొన్నారు. రెండో దశ కరోనా సమయంలో కిటకిటలాడిన కరీంనగర్ ఆసుపత్రిలో మంగళవారం నాటికి కేవలం ఇద్దరు మహిళలు మాత్రమే కొవిడ్ చికిత్స పొందుతున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. పిల్లల కోసం కూడా ప్రత్యేక ఐసీయూ కేంద్రం అందుబాటులో ఉంచారు. నాలుగు రోజుల నుంచి 21 నుంచి 24 వరకు కేసులు నమోదైనట్లు ప్రభుత్వ బులెటిన్లో పేర్కొన్నారు. కొవిడ్ బారిన పడ్డవారిలో అత్యధికులు హోంఐసోలేషన్లో ఉండి చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వాసుపత్రిలో ఉన్నవారి పరిస్థితి కూడా బాగానే ఉన్నట్లు వైద్యులు వివరించారు.
* పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలకు చెందిన గర్భిణలకు కరోనా సోకడంతో వారిద్దరిని ప్రసవం కోసం కరీంనగర్ మాతా శిశు కేంద్రానికి పంపించారు. వారిలో ఒకరికి ఐదు రోజుల క్రితం మరొకరికి రెండ్రోజుల క్రితం శస్త్ర చికిత్సలు చేసి ప్రసవం చేశారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కరీంనగర్లోని ఒక ప్రాంతానికి చెందిన ఎనిమిది నెలల గర్భిణికి పాజిటివ్ రాగా ఆమె హోంఐసోలేషన్లో ఉండి చికిత్స పొందుతోంది.
పిల్లల కోసం ప్రత్యేక ఐసీయూ
ఇప్పటికే పెద్దవారి కోసం 95 పడకల ఐసీయూ కేంద్రం ఉంది. పిల్లల కోసం కూడా 42 పడకలతో ప్రత్యేక ఐసీయూవార్డు అందుబాటులోకి తెచ్చినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అనుమానితులకు వైద్యం అందించేందుకు 28 పడకలతో సారి వార్డు కూడా ఉంది. కరోనాతో చికిత్స కోసం వచ్చే వారికి సౌకర్యాలు కల్పించినట్లు ఆస్పత్రి ఆర్ఎంఓ జ్యోతి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్వశక్తి.. ప్రజాస్వామ్య స్ఫూర్తి
[ 19-04-2024]
అన్నింటా ముందుంటున్న అతివలు ప్రతి ఎన్నికల్లో అధిక సంఖ్యలో ఓటు వేయడంలోనూ పైచేయి సాధిస్తున్నారు. ప్రజాస్వామ్యం కల్పించిన వజ్రాయుధాన్ని తప్పనిసరిగా వినియోగించుకొంటూ స్ఫూర్తి నింపుతున్నారు. -
ఇంటి నుంచే నామినేషన్
[ 19-04-2024]
ఎన్నికల ప్రక్రియను సులభతరం చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. ఓటరు నమోదు, ప్రచార సభలు, సమావేశాల నిర్వహణకు అనుమతుల కోసం -
17 ఎన్నికలు.. ఒక్కసారే అతివకు అవకాశం
[ 19-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి సాధారణ, ఉప ఎన్నికలతో కలిపి ఇప్పటివరకు 17 సార్లు ఎన్నికలు జరగగా ఒక్కసారే మహిళకు అవకాశం లభించింది. -
పద్మవ్యూహంలో ఉన్నా.. నావైపూ చూడండి
[ 19-04-2024]
‘నిజామాబాద్ నియోజకవర్గం పద్మవ్యూహంలా ఉంది. నన్ను అభిమన్యుడిని చేస్తారో.. అర్జునుడిని చేస్తారో అంతా మీ చేతుల్లో ఉంది’ అని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుతో నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్రెడ్డి పేర్కొన్నారు. -
ఫోన్ ట్యాపింగ్లో ఎవరినీ వదిలేది లేదు
[ 19-04-2024]
రాముడిపై తాను అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఎంపీ బండి సంజయ్ నిరూపిస్తే సజీవ దహనం చేసుకుంటానని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ పొన్నం ప్రభాకర్ అన్నారు. -
వామ్మో.. ఇదేం ఎండ!
[ 19-04-2024]
జనం బెదిరేలా ఎండ ఠారెత్తిస్తోంది. ఉమ్మడి జిల్లాను ఉక్కపోతతో ఉడికిస్తోంది. రోజురోజుకు గణనీయంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు గురువారంతో మరింతగా పెరిగాయి. -
గంజాయి మాయం కేసులో ఇద్దరు ఎస్సైలు సహా నలుగురి సస్పెన్షన్తో కలకలం
[ 19-04-2024]
సారంగాపూర్ పోలీసుస్టేషన్ నుంచి గంజాయి మాయమైన సంఘటనలో ఇద్దరు ఎస్సైలు సహా నలుగురు సస్పెన్షన్కు గురవడం కలకలం రేపింది. -
చిట్టీల పేరిట ఆర్ఎంపీ డబ్బు వసూళ్లు
[ 19-04-2024]
శంకరపట్నం మండలం కొత్తగట్టులో ఓ ఆర్ఎంపీ సుమారు రూ.70 లక్షలతో ఉడాయించినట్లు ఆలస్యంగా తెలిసింది. బాధితుల కథనం ప్రకారం..
తాజా వార్తలు (Latest News)
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్