నాసిరకం పనులు... లక్ష్యానికి తూట్లు
ఒకసారి సీసీ రహదారి నిర్మిస్తే అక్కడి నేల స్వభావాన్ని బట్టి ఇంజినీరింగ్ ప్రమాణాల ప్రకారం కనీసం పదేళ్లయినా మన్నికగా ఉండాలి. జిల్లా కేంద్రమైన సిరిసిల్ల పురపాలకలో నిర్మించిన రహదారులు రెండేళ్లు గడవకుండానే నాణ్యత తేలిపోతోంది. కోట్లాది
రెండేళ్లకే దెబ్బతింటున్న సీసీ రోడ్లు
అధికారుల పర్యవేక్షణ లోపం
ఈనాడు డిజిటల్, సిరిసిల్ల
బీవైనగర్లో కుంగిన సీసీ రహదారి
ఒకసారి సీసీ రహదారి నిర్మిస్తే అక్కడి నేల స్వభావాన్ని బట్టి ఇంజినీరింగ్ ప్రమాణాల ప్రకారం కనీసం పదేళ్లయినా మన్నికగా ఉండాలి. జిల్లా కేంద్రమైన సిరిసిల్ల పురపాలకలో నిర్మించిన రహదారులు రెండేళ్లు గడవకుండానే నాణ్యత తేలిపోతోంది. కోట్లాది రూపాయలు మట్టిలో కలిసిపోతున్నాయి. పురపాలక ఎన్నికలకు ముందు 14వ ఆర్థిక సంఘం, ఎస్డీఎఫ్ పథకంలో అభివృద్ధికి భారీగా నిధులు మంజూరయ్యాయి. వీటిలో ఎక్కువగా సీసీ రహదారులు, కాల్వల నిర్మాణం చేపట్టారు. పనులు చేజిక్కించుకున్న గుత్తేదారులు ఎన్నికలు సమీపిస్తుండటంతో ఇష్టారీతిన నిర్మించారు. నిరంతరం పర్యవేక్షించాల్సిన అధికారులు అంతా బాగుందంటూ బిల్లులు చెలించేశారు. అధికారులు... ప్రజాప్రతినిధులు.. గుత్తేదారులతో కలిసి ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పొడిచిన తీరుకు ఇక్కడ జరిగిన పనులే నిదర్శనం.
జిల్లా కేంద్రమైన సిరిసిల్ల పురపాలక సంఘానికి గత పాలకవర్గం సమయంలో భారీగా నిధుల కేటాయింపు జరిగింది. వీటిలో ప్రధాన రహదారులు, కూడళ్ల విస్తరణ, పార్కులు వంటి ఆహ్లాదకర ప్రాంతాల అభివృద్ధికి వినియోగించారు. ఎక్కువగా కార్మికవాడల్లో అంతర్గత సీసీ రహదారులు, మురుగు కాల్వల నిర్మాణానికి కేటాయించారు. అప్పట్లో ఎన్నికలు సమీపిస్తుండటంతో హడావుడి పనులతో నాణ్యతకు తిలోదకాలిచ్చారు. ప్రస్తుతం రోడ్లు బీటలు వారాయి. చాలా చోట్ల సీసీ కాల్వలు, సైడ్బర్మ్లో మట్టితో చదును చేయక రహదారులు కుంగిపోయాయి. చాలా వరకు నల్లరేగడి నేలు ఉన్నాయి. నేల స్వభావాన్ని బట్టి ఆరు నుంచి తొమ్మిది ఇంచుల మందంతో వేయాలి. క్యూరింగ్, పక్కన సైబ్బర్మ్లు, కాల్వల నిర్మాణం వంటి కనీస ప్రమాణాలేవీ పాటించలేదు. ఎన్నికల ముందు ఎలా పని చేసినా బిల్లులు అవుతాయనే భావనతో కొందరు నేతలే గుత్తేదారులుగా అవతారమెత్తి చేపట్టారు. అప్పటికే అభివృద్ధి పనుల్లో వాటాలపై పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. పనుల నిర్వహణలో సరైన పర్యవేక్షణ లేకపోవడంతో కొన్నాళ్లు నిలవాల్సినవి తొందరగా దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది.
గుత్తేదారుల ఇష్టారాజ్యంతో...
సిరిసిల్ల పురపాలకలో గత పాలకవర్గం సమయంలో లక్ష్యానికి మించి నిధుల కేటాయింపు జరిగాయి. గుత్తేదారులు సీసీ రోడ్ల నిర్మాణాలు ఇష్టారాజ్యంగా చేపట్టారు. అధికారులు సైతం పనుల పర్యవేక్షణను విస్మరించారన్న ఆరోపణలున్నాయి. 14వ ఆర్థిక సంఘంలో 2015-18లో రూ.10.5 కోట్లతో 15 సీసీ రహదారులు, రూ.92 లక్షలతో మురుగు కాల్వలు నిర్మించారు. రూ.8.57 కోట్ల ఎస్డీఎఫ్ నిధులతో 51 సీసీ రహదారులు, 26 కాల్వల పనులు చేపట్టారు. రూ.32.11 కోట్ల సాధారణ నిధులతో 164 సీసీ రహదారులు ఏర్పాటు చేశారు. వివిధ దశల్లో జరిగిన సీసీ రహదారులు, మురుగు కాల్వల నిర్మాణాల్లో చాలా వరకు నాణ్యతలోపించింది. జులై, సెప్టెంబరులో కురిసిన వర్షాలకు సిరిసిల్ల పట్టణం నీటమునిగింది. దీనిలో చాలా వరకు కాల్వలు, సీసీ రోడ్లు దెబ్బతిన్నాయి. సిరిసిల్ల-కరీంనగర్ ప్రధాన రహదారి కాలిబాటల్లోని టైల్స్, సిమెంటు దిమ్మలు దెబ్బతిన్నాయి. సెప్టెంబరులో మంత్రి కేటీఆర్ పర్యటనకు వచ్చిన సమయంలో అప్పటికప్పుడు వరద పనులకు రూ.2.50 కోట్లు మంజూరు చేశారు. నేటికీ ఈ పనులు ప్రారంభం కాలేదు.
నేను రాకముందే పనులు జరిగాయి
- ప్రసాద్, డీఈ, ప్రజారోగ్యశాఖ, సిరిసిల్ల
నేను బాధ్యతలు స్వీకరించక ముందే పనులు జరిగాయి. అప్పుడు పనులు ఎలా చేశారనేది పూర్తిగా పరిశీలించాల్సి ఉంది. వివిధ పథకాల్లో పూర్తి చేసిన పనులకు గుత్తేదారు నిర్వహణ సమయం కూడా పూర్తయ్యే దశలో ఉన్నాయి. పట్టణంలో దెబ్బతిన్న రహదారులు, మురుగుకాల్వల వివరాలు సేకరిస్తున్నాం. బాగా దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు ప్రతిపాదనలు పంపుతాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
[ 19-04-2024]
కమాన్పూర్ మండలం రొంపికుంట ఉపకేంద్రం పరిధిలో ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని ట్రాన్స్ కో ఏఈ రాజేంద్ర కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
పద్మవ్యూహంలో ఉన్నా.. నావైపూ చూడండి
[ 19-04-2024]
‘నిజామాబాద్ నియోజకవర్గం పద్మవ్యూహంలా ఉంది. నన్ను అభిమన్యుడిని చేస్తారో.. అర్జునుడిని చేస్తారో అంతా మీ చేతుల్లో ఉంది’ అని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుతో నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్రెడ్డి పేర్కొన్నారు. -
మొదటిరోజు ఆరు నామినేషన్లు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం గురువారం ప్రారంభమైంది. మొదటి రోజు స్వతంత్ర అభ్యర్థులు మాత్రమే నామపత్రాలను దాఖలు చేశారు. కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు కోట శ్యామ్కుమార్, పోతూరి రాజేందర్లు -
350 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్
[ 19-04-2024]
హుజూరాబాద్లో పట్టుబడ్డ 350 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులు గురువారం సీజ్ చేశారు. హనుమకొండ జిల్లా పరకాలలోని శ్రీరాజరాజేశ్వర రైస్మిల్లులో 1,347 బస్తాల బియ్యాన్ని లారీలో లోడ్ చేసి... -
కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేయండి
[ 19-04-2024]
పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపునకు కలిసికట్టుగా కృషి చేయాలని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. ధర్మపురి పట్టణంలోని ఓ వేడుక మందిరంలో పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల... -
గీతదాటితే కొరడా ఝళిపిస్తారు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఆ మేరకు ఉమ్మడి జిల్లాలో రాజకీయ పార్టీల ప్రచార పర్వం వేడెక్కనుంది. మరోవైపు ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఎంసీసీ (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్)ని తీసుకొచ్చింది. -
కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు : మంత్రి
[ 19-04-2024]
ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులను ఇస్తామని, అవసరమైతే పక్క రాష్ట్రం నుంచి భిక్షాటన చేసైనా పదవులను తెచ్చిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ అన్నారు. -
నాలుగేళ్లా.. రెండేళ్లా!
[ 19-04-2024]
సింగరేణి గుర్తింపు సంఘం కాలపరిమితిపై సందిగ్ధం నెలకొంది. గెలిచిన అనంతరం సంఘానికి అధికారిక పత్రం ఇప్పటి వరకు అందలేదు.గుర్తింపు ఎన్నికలకు ముందు కాలపరిమితిపై స్పష్టత లేకపోవడంతో ఫలితాల అనంతరం కార్మిక శాఖ -
గంట ముందే పోలింగ్ ప్రారంభం
[ 19-04-2024]
గోదావరి పరీవాహక ప్రాంతం.. అంతర్రాష్ట్ర సరిహద్దు.. దట్టమైన అడవులు విస్తరించిన పెద్దపల్లి లోక్సభ పరిధిలో కొన్ని ప్రాంతాల్లో ముందస్తు పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. -
రహదారి నిర్మించారు.. సమస్యలు మరిచారు
[ 19-04-2024]
గుంతల రహదారితో ఇబ్బందులు ఎదురవుతుండటంతో ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. దీంతో పక్కా రోడ్డు నిర్మాణంతో రవాణా సదుపాయం మెరుగైంది. దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం లభించింది. -
స్థలం కేటాయించారు.. ఆసుపత్రి నిర్మాణం విస్మరించారు
[ 19-04-2024]
తంగళ్లపల్లి మండలం టెక్స్టైల్ పార్కు వద్ద బీడీ కార్మికుల కోసం ఏర్పాటు చేసే ఈఎస్ఐ ఆసుపత్రికి పదేళ్ల క్రితం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 13 ఎకరాల స్థలం కేటాయించింది. -
ఓట్లు కొల్లగొట్టి.. దిల్లీ తలుపుతట్టి
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలో కొంత మంది నేతలు అత్యధిక ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. రికార్డు స్థాయిలో ఓట్లు సంపాదించి ప్రత్యర్థులకు అందనంత దూరంలో నిలిచారు. -
స్వశక్తి.. ప్రజాస్వామ్య స్ఫూర్తి
[ 19-04-2024]
అన్నింటా ముందుంటున్న అతివలు ప్రతి ఎన్నికల్లో అధిక సంఖ్యలో ఓటు వేయడంలోనూ పైచేయి సాధిస్తున్నారు. ప్రజాస్వామ్యం కల్పించిన వజ్రాయుధాన్ని తప్పనిసరిగా వినియోగించుకొంటూ స్ఫూర్తి నింపుతున్నారు. -
ఇంటి నుంచే నామినేషన్
[ 19-04-2024]
ఎన్నికల ప్రక్రియను సులభతరం చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. ఓటరు నమోదు, ప్రచార సభలు, సమావేశాల నిర్వహణకు అనుమతుల కోసం -
17 ఎన్నికలు.. ఒక్కసారే అతివకు అవకాశం
[ 19-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి సాధారణ, ఉప ఎన్నికలతో కలిపి ఇప్పటివరకు 17 సార్లు ఎన్నికలు జరగగా ఒక్కసారే మహిళకు అవకాశం లభించింది. -
ఫోన్ ట్యాపింగ్లో ఎవరినీ వదిలేది లేదు
[ 19-04-2024]
రాముడిపై తాను అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఎంపీ బండి సంజయ్ నిరూపిస్తే సజీవ దహనం చేసుకుంటానని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ పొన్నం ప్రభాకర్ అన్నారు. -
వామ్మో.. ఇదేం ఎండ!
[ 19-04-2024]
జనం బెదిరేలా ఎండ ఠారెత్తిస్తోంది. ఉమ్మడి జిల్లాను ఉక్కపోతతో ఉడికిస్తోంది. రోజురోజుకు గణనీయంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు గురువారంతో మరింతగా పెరిగాయి. -
గంజాయి మాయం కేసులో ఇద్దరు ఎస్సైలు సహా నలుగురి సస్పెన్షన్తో కలకలం
[ 19-04-2024]
సారంగాపూర్ పోలీసుస్టేషన్ నుంచి గంజాయి మాయమైన సంఘటనలో ఇద్దరు ఎస్సైలు సహా నలుగురు సస్పెన్షన్కు గురవడం కలకలం రేపింది. -
చిట్టీల పేరిట ఆర్ఎంపీ డబ్బు వసూళ్లు
[ 19-04-2024]
శంకరపట్నం మండలం కొత్తగట్టులో ఓ ఆర్ఎంపీ సుమారు రూ.70 లక్షలతో ఉడాయించినట్లు ఆలస్యంగా తెలిసింది. బాధితుల కథనం ప్రకారం..
తాజా వార్తలు (Latest News)
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!