స్వచ్ఛతలో పోటీ.. కొవిడ్ నిబంధనలు వదిలేసి
మెట్పల్లి బల్దియా పరిధిలో తడి, పొడి చెత్తను వేరుచేసి బల్దియా ఆటోలకు అందించి స్వచ్ఛసర్వేక్షణ్లో ప్రజలు పాలుపంచుకోవాలంటూ నిత్యం బల్దియా అధికారులు వీధివీధినా విస్తృత ప్రచారం చేస్తున్నారు.
అవార్డు కోసం ఉబలాటం.. కరోనా నియంత్రణలో విఫలం
కేసులు పెరుగుతున్నా పట్టించుకోని అధికారులు
మెట్పల్లి పట్టణం, న్యూస్టుడే
స్వచ్ఛ సర్వేక్షణపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన అధికారులు
మెట్పల్లి బల్దియా పరిధిలో తడి, పొడి చెత్తను వేరుచేసి బల్దియా ఆటోలకు అందించి స్వచ్ఛసర్వేక్షణ్లో ప్రజలు పాలుపంచుకోవాలంటూ నిత్యం బల్దియా అధికారులు వీధివీధినా విస్తృత ప్రచారం చేస్తున్నారు. స్వచ్ఛసర్వేక్షణ్ అవార్డు వచ్చేందుకు అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా ప్రజల ఆరోగ్యాలపై దృష్టి సారించకపోవడం విడ్డూరంగా మారింది. ఓ పక్క కొవిడ్ కేసులు రోజురోజుకు పెరుగుతూ భయాందోళనకు గురిచేస్తున్న కొవిడ్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. లక్షలు ఖర్చులు చేసి స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు కోసం విస్తృత ప్రచారం చేసేందుకు ఫ్లెక్సీలు, హరిత బోర్డులు, ప్రత్యేక ఆటోలు, కరపత్రాలను వినియోగిస్తూ ప్రచారం చేస్తున్నారు. కానీ కరోనా నియంత్రణపై అధికారులు దృష్టి సారించకపోవడంతో పట్టణంలో రోజురోజుకు కేసులు పెరిగే అవకాశం కనిపిస్తుంది.
అధికారుల తీరు ప్రజలు బేజారు..
పట్టణంలోని కొవిడ్ కేసు నమోదు అయిందని తెలిస్తే చాలు వెంటనే ఆ ఇంటి వద్దకు పారిశుద్ధ్య కార్మికులతో బ్లీచింగ్ చల్లించడం, స్ప్రే చేయిస్తూ వస్తున్నారే తప్పా నిబంధనలను పాటించాలని ఒక్క మాట కూడా చెప్పకపోవడం విడ్డూరంగా మారింది. రెండో విడత కరోనా వచ్చిన సమయంలో కరోనా నిబంధనలను తప్పకుండా పాటించాలని పదేపదే ప్రచారం చేస్తూనే నిబంధనలను పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకున్నారు. జరిమానా విధించారు. దీంతో ప్రజల్లో అవగాహనతో పాటు భయంతో మాస్కులను ధరించే అవసరమున్న వారే బయటకు వచ్చారు. ప్రస్తుతం అవేమి పట్టింపు లేకపోవడంతో ప్రజలు ఇష్టారీతిన తిరుగుతున్నారు. పట్టణంలో ప్రధాన కూడళ్ల వద్ద, హోటళ్ల వద్ద, మార్కెట్లలో ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఉండే స్థలాల్లో గుంపు గుంపులుగా ఉంటున్నారు. మాస్కులను ధరించడమే కొందరు మరిచిపోయారు. పలు ప్రభుత్వ కార్యాలయాలలో పలువురు ఉద్యోగులు మాస్కులను ధరించడంలో పూర్తిగా విఫలమవుతున్నారు. కొందరు ధరించిన అవి పూర్తిగా పెట్టుకోకుండా కేవలం నోరు కింది భాగంలో ఉంచుకోవడం ప్రమాదకరంగా మారింది. పట్టణంలో కొవిడ్పై ఇలాగే కొనసాగుతే రానున్న రోజులలో ప్రమాద స్థాయికి కరోనా పెరుగుతుందని ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికైనా బల్దియా అధికారులు కరోనాపై ప్రత్యేక దృష్టి సారించి కరోనా నిబంధనలపై ప్రత్యేక ప్రచారం చేస్తూనే ప్రజల్లో అవగాహన పెంచాల్సినా అవసరం ఎంతైనా ఉంది. దీంతో పాటు కరోనా నిబంధనలను పాటించని వారిపై చర్యలు తీసుకుంటే కరోనాను కొంత వరకైనా అరికట్టిన వారవుతారు. ఈ విషయంపై బల్దియా కమిషనర్ సమ్మయ్యను ‘న్యూస్టుడే’ వివరణ కోరగా కరోనా నియంత్రణ కోసం ప్రజలకు అవగాహన కల్పిస్తామని, మాస్క్లు లేని వారికి జరిమానాలు విధిస్తామని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్వితీయంలో 4.. ప్రథమంలో 5
[ 25-04-2024]
రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు వారు బుధవారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. గత విద్యాసంవత్సరం కంటే మెరుగైన ఫలితాలను సాధించారు. ద్వితీయ సంవత్సరంలో నాలుగు, ప్రథమలో అయిదో స్థానం సాధించారు. -
రాజేందర్రావు చేతికే టికెట్
[ 25-04-2024]
రోజుల తరబడి నిరీక్షణకు కాంగ్రెస్ పార్టీ తెరదించింది. ఎట్టకేలకు నామినేషన్ల చివరి రోజుకు ముందు బుధవారం రాత్రి అభ్యర్థిని ప్రకటించింది. కరీంనగర్ లోక్సభ స్థానంలో పోటీ చేసేందుకు వెలిచాల రాజేందర్రావుకు అవకాశమిచ్చింది. -
కాంగ్రెస్తో భారాస నేతల కుమ్మక్కు
[ 25-04-2024]
కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలని తాను కొట్లాడుతుంటే భారాస నేతలు ఆ పార్టీతో కుమ్మక్కై తనను ఓడించాలని చూస్తున్నారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విమర్శించారు. -
ఆరో రోజు 17 నామినేషన్లు
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలక అంకానికి గురువారంతో తెరపడనుంది. లోక్సభ నియోజకవర్గం బరిలో నిలిచే అభ్యర్థుల నామినేషన్ దాఖలుకు నేడు చివరి రోజు కావడంతో గడిచిన వారం రోజుల నుంచి కొనసాగుతున్న ప్రక్రియ మధ్యాహ్నం 3 గంటలతో ముగియనుంది. -
పేదింటి బిడ్డలు ఇంటర్లో మెరిశారు
[ 25-04-2024]
కరీంనగర్ విద్యావిభాగం, భాగ్యనగర్, న్యూస్టుడే : ఇంటర్మీడియెట్ ఫలితాల్లో పేద విద్యార్థులు ప్రతిభ చాటారు. తల్లిదండ్రులు కష్టపడి చదివించగా.. వారి పేరు నిలబెట్టారు. ఉపాధ్యాయుల సహకారంతో ఉత్తమ మార్కులు సాధించారు. -
భూ కబ్జా వ్యవహారంలో కార్పొరేటర్.. ఆమె భర్తపై కేసు
[ 25-04-2024]
కొనుగోలు చేసిన భూమికి సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించడమే కాకుండా బాధితుడిని డబ్బుల కోసం బెదిరించిన నాయకులతోపాటు వారికి సహకరించిన నగరపాలక సంస్థ సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేసి కొంత మందిని అరెస్టు చేశారు. -
బాలికలదే పై చేయి
[ 25-04-2024]
జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు నిరాశ పరిచాయి. సర్కారు కళాశాలల్లో ఆధునిక వసతులు, సరిపడా బోధన సిబ్బంది, విద్యార్థుల దత్తత, తరుచూ చరవాణిలో తల్లిదండ్రులను సంప్రదించినా ఆశించిన మేర ఫలితాలు రాలేదు. -
జూన్ 6 తర్వాత నిరుపేదలకు ఇళ్లు
[ 25-04-2024]
జూన్ 6 తర్వాత ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్లు ఇచ్చే కార్యాచరణ చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పేర్కొన్నారు. -
భాజపా బీఫామ్ ఎవరికో!
[ 25-04-2024]
నామినేషన్ల ఘట్టం తుది దశకు చేరిన వేళ పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలో భాజపా తరఫున బరిలో ఉండే అభ్యర్థిపై ఉత్కంఠ వీడటం లేదు. పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన గోమాసె శ్రీనివాస్ బుధవారం రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాల్లో అమ్మాయిల హవా కొనసాగింది. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరిగిన పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో ఒకేషనల్ కలిపి 7,624 మంది పరీక్షలకు హాజరవగా అందులో 4,628 మంది ఉత్తీర్ణత సాధించారు. -
పెరిగిన వినియోగం.. తగ్గిన గృహజ్యోతి లబ్ధిదారులు
[ 25-04-2024]
వేసవి ఎండల తీవ్రత కారణంగా విద్యుత్తు వినియోగం భారీగా పెరిగింది. దీని ప్రభావం గృహజ్యోతి పథకం లబ్ధిదారులపై పడింది. దీంతో చాలా మంది మార్చిలో ఈ పథకానికి అనర్హులుగా తేలారు. -
ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్లు కుమ్మక్కు: కేటీఆర్
[ 25-04-2024]
ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని, అందుకే ప్రజలకు తెలియని వ్యక్తిని కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
ఇంటర్లో బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ప్రథమ సంవత్సరంలో 5,717 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 2,955 మంది ఉత్తీర్ణులయ్యారు. 51.69 శాతం ఉత్తీర్ణత నమోదైంది. వొకేషనల్లో 949 మంది విద్యార్థులకుగాను 419 మంది ఉత్తీర్ణత సాధించారు. -
భానుడి భగభగ
[ 25-04-2024]
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నమోదైన పది గరిష్ఠ పగటి ఉష్ణోగ్రత ప్రాంతాల్లో కరీంనగర్ జిల్లాలోని రెండు ప్రదేశాలున్నాయి. -
బెదిరింపు రాజకీయాలు సరికాదు
[ 25-04-2024]
కాంగ్రెస్ నాయకులు బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతూ తమ పార్టీ అభ్యర్థులు, శ్రేణులను చేర్చుకుంటున్నారని, అలాంటి చర్యలు తగవని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్