logo

150 క్వింటాళ్ల బియ్యం పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న 150 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని బుధవారం కరీంనగర్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇల్లందుకుంట

Published : 20 Jan 2022 02:27 IST

కరీంనగర్‌ నేరవార్తలు, న్యూస్‌టుడే: అక్రమంగా తరలిస్తున్న 150 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని బుధవారం కరీంనగర్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇల్లందుకుంట మండలం మల్లంపల్లికి చెందిన పసునూటి ప్రశాంత్‌(27), ముల్కానూర్‌ మండల కేంద్రానికి చెందిన వీరయ్య అనే వ్యక్తి వద్ద నుంచి రూ.3.50లక్షల విలువగల 150 క్వాంటాళ్ల రేషన్‌ బియ్యాన్ని సేకరించాడు. డీసీఎం వ్యాన్‌లో మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు వచ్చిన సమచారం మేరకు బుధవారం అల్గునూర్‌ వద్ద దాడి చేసి పట్టుకున్నారు. పట్టుబడిన వ్యక్తితో పాటు రేషన్‌ బియ్యాన్ని ఎల్‌.ఎం.డి. ఠాణాలో అప్పగించినట్లు టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ సృజన్‌రెడ్డి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు