ధాన్యం డబ్బులకు పడిగాపులు
యాసంగి సీజన్ ప్రారంభమై అప్పుడే నెల రోజులు దాటిపోయింది. వరి, ఇతర ఆరుతడి పంటల సాగులో రైతులు తలమునకలయ్యారు. ఖరీఫ్ (వానాకాలం) ధాన్యం డబ్బులు అందకపోవడంతో రైతులు
జిల్లా వ్యాప్తంగా రూ. 25.65 కోట్ల బకాయిలు
గంగాధర, న్యూస్టుడే
వరి ధాన్యం కొనుగోలు (పాతచిత్రం)
యాసంగి సీజన్ ప్రారంభమై అప్పుడే నెల రోజులు దాటిపోయింది. వరి, ఇతర ఆరుతడి పంటల సాగులో రైతులు తలమునకలయ్యారు. ఖరీఫ్ (వానాకాలం) ధాన్యం డబ్బులు అందకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఎరువులు, క్రిమిసంహారక మందుల వ్యాపారులకు చెల్లించేందుకు, ట్రాక్టర్ దున్నినవి, హార్వెస్టర్తో వరికోతకు, ధాన్యం తూకం వేసిన హమాలీలకు, ఇతర పెట్టుబడులు చెల్లించలేక అగచాట్లు పడుతున్నారు. ఇక రెండో పంట పెట్టుబడులకు అప్పు కూడా దొరకడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. రెండు నెలలుగా కొనుగోలు కేంద్రాల అధికారులు, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు.
సంఘాలు, బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణ
జిల్లాలో 351 ఐకేపీ, ప్యాక్స్, డీసీఎంఎస్, మార్కెటింగ్ కేంద్రాల ద్వారా గత సీజన్లో 73,571 మంది రైతులకు చెందిన 3,91,211 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేశారు. ఇందుకుగాను రూ.766.77 కోట్లకు ఇప్పటి వరకు రూ. 741.12 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఇంకా రూ. 25.65 కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉండగా గడిచిన 10 రోజులుగా బకాయిలు రైతుల ఖాతాల్లో జమ కాలేదు. గంగాధర ప్యాక్స్ పరిధిలోని 9 కేంద్రాల్లో 254 మంది రైతులకు రూ. 3.94 కోట్ల ధాన్యం రొక్కం జమ కావాల్సి ఉండగా కురిక్యాల ప్యాక్స్ పరిధిలోని 65 మందికి రూ. 78 లక్షలు అందాల్సి ఉంది. వెంకంపల్లి, కాసారం, గోపాల్రావుపల్లి, తాడిజెర్రి గ్రామాల రైతులతోపాటు గంగాధర పరిధిలోని ఆయా గ్రామాల రైతులు సంఘాల కార్యాలయాలు, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ నెల 3 వరకు కొందరు రైతుల ఖాతాల్లో డబ్బులు జమయ్యాక మళ్లీ డబ్బులు రాలేదని ప్యాక్స్ సిబ్బంది తెలిపారు.
వారం రోజుల్లో చెల్లిస్తాం
- శ్రీకాంత్రెడ్డి, సివిల్సప్లై డీఎం
గడిచిన వారం రోజులుగా డబ్బులు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ కాకపోవడం కొంత ఇబ్బందిగా ఉంది. ఇప్పటివరకు రూ.741.12 కోట్ల ధాన్యం డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేశాం. ఇంకా రావాల్సిన డబ్బులు రూ. 25.65 కోట్లు వారం రోజుల్లో రైతులకు చెల్లిస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భూసేకరణలో జాప్యం
[ 28-03-2024]
భూసేకరణలో జాప్యమే జాతీయ రహదారుల విస్తరణకు శాపంగా మారుతోంది. జిల్లాలో ప్రధానంగా జగిత్యాల-కరీంనగర్ జాతీయ రహదారిగా మార్చి దశాబ్దం కావస్తున్నా.. నిర్మాణం మొదలు కావటం లేదు -
నత్తనడకన నిర్మాణాలు
[ 28-03-2024]
వైద్యాన్ని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం పల్లెదవాఖానాలు ఏర్పాటు చేసింది. గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్ర(సబ్సెంటర్ల)ను పల్లె దవాఖానాలుగా మార్చారు -
నిధులు వెచ్చించి.. పనులు వదిలేసి
[ 28-03-2024]
పారిశుద్ధ్య పనుల నిర్వహణలో ఆధునిక సాంకేతికను జోడించి పెద్ద నగరాలకు దీటుగా పోటీ పడేందుకు ప్రణాళికలు చేసిన నగరపాలిక.. ఆ విధానం అమలులో వెనుకబడింది -
తాగునీటి వృథా వద్దు : కలెక్టర్
[ 28-03-2024]
అధికారులంతా అప్రమత్తంగా ఉంటూ ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు -
నిజామాబాద్ బరిలో జీవన్రెడ్డి
[ 28-03-2024]
కాంగ్రెస్ నిజామాబాద్ లోక్సభ స్థానం టికెట్ జీవన్రెడ్డికే దక్కింది. పార్టీకి సుదీర్ఘ కాలంగా సేవలందిస్తున్న ఆయనను కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం అభ్యర్థిగా ప్రకటించింది -
తొలిమెట్టు నోడల్ అధికారులకు భత్యం
[ 28-03-2024]
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలను పెంచేందుకు ప్రభుత్వం ‘తొలిమెట్టు’ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ప్రత్యేక బోధన పద్ధతులతో కొనసాగుతున్న ఈ కార్యక్రమ పర్యవేక్షణకు మండలానికి ఒక నోడల్ అధికారిని నియమించారు. -
అరచేతిలో వాతావరణ సమాచారం
[ 28-03-2024]
వాతావరణ సమాచారాన్ని ప్రతిఒక్కరి దైనందిన కార్యకలాపాల్లో భాగం చేయాలనే ఉద్దేశంతో భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఇటీవల ‘పంచాయత్ మౌసం సేవా’ మొబైల్ యాప్ విడుదల చేసింది. -
పఠనాలయం సద్వినియోగం... కల సాకారం
[ 28-03-2024]
గ్రంథాలయ పుస్తకాలతోనే ఏకకాలంలో రెండు ఉద్యోగాలు సాధించగలిగాను. తెలంగాణ మైనార్టీ గురుకుల సొసైటీ నిర్వహించిన ఫలితాల్లో పీజీటీ సాంఘికశాస్త్రం, జూనియర్ కళాశాలలో పౌరశాస్త్రం లెక్చరర్గా ఉద్యోగాలకు ఎంపికయ్యాను -
పంచాయతీల ఖజానా ఖాళీ
[ 28-03-2024]
ఓవైపు ఖజానా ఖాళీ, మరోవైపు సమస్యలు పంచాయతీలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. జమయ్యే నిధులకు మించిన వ్యయం చేయడంతో పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు ఇవ్వలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. -
ఓటు నమోదుకు ప్రత్యేక సాధారణ సెలవు
[ 28-03-2024]
పార్లమెంట్ ఎన్నికల్లో విధులు నిర్వహించే ప్రతి ఉద్యోగికి తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి పేర్కొన్నారు
తాజా వార్తలు (Latest News)
-
ఈడీ విచారణను ఎదుర్కొంటా.. కోర్టులో కేజ్రీవాల్ స్వీయ వాదనలు
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
-
మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
-
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్