బొగ్గు ఉత్పత్తి సాగేనా..!
బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలపై కరోనా ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల కొవిడ్ కేసులు పెరుగుతుండటంతో బొగ్గు ఉత్పత్తి కుంటుపడే అవకాశం ఉంది. 2020లో మార్చిలోనే కరోనా కేసులు పెరిగాయి. ఆ
పెరుగుతున్న కేసులతో లక్ష్య సాధనపై సందేహాలు
న్యూస్టుడే, గోదావరిఖని
గనిలో కార్మికులు
బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలపై కరోనా ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల కొవిడ్ కేసులు పెరుగుతుండటంతో బొగ్గు ఉత్పత్తి కుంటుపడే అవకాశం ఉంది. 2020లో మార్చిలోనే కరోనా కేసులు పెరిగాయి. ఆ తర్వాత 2021లో సైతం మార్చి నుంచి కరోనా కేసులు పెరగడంతో బొగ్గు ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపింది. తొలిదశ సమయంలో భూగర్భ బొగ్గుగనులకు లేఆఫ్ ప్రకటించారు. దీంతో ఉత్పత్తి నిలిచిపోయింది. రెండో దశలో భారీగా కేసులు పెరగడంతో కార్మికుల గైర్హాజరు శాతం పెరిగింది. దీంతో ఉత్పత్తి ఆశించిన స్థాయిలో చేపట్టలేకపోయింది. దీంతో గత ఆర్థిక సంవత్సరం 50.5 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి మాత్రమే చేపట్టింది. ఈ ఏడాది 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా నిర్దేశించుకున్న సింగరేణికి వార్షిక సంవత్సరం ముగిసేందుకు ఇంకా రెండున్నర నెలల సమయం ఉంది. ఇప్పటి వరకు 50 మిలియన్ టన్నుల బొగ్గుఉత్పత్తి సాధించిన సింగరేణి రానున్న కాలంలో మరో 20 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించాల్సి ఉంది. ప్రస్తుతం కొవిడ్ పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉండటంతో యాజమాన్యం అప్రమత్తమైంది. నివారణ చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది.
క్వారంటైన్లో కార్మికులు
కొవిడ్ సోకిన కార్మికులు హోం క్వారంటైన్లో ఉంటున్నారు. కొంత మంది సింగరేణి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు సింగరేణిలో 1000కి పైగా మంది కరోనా సోకిన వారున్నారు. వీరంతా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరికొంతమంది ఇళ్లలోనే ఉండి మందులు వాడుతున్నారు. కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన కార్మికులకు ఏడు రోజులు క్వారంటైన్ సెలవులు ఇవ్వాల్సి ఉంటుంది. ఏడు రోజుల పాటు వీరు విధులకు దూరంగా ఉండటంతో బొగ్గుఉత్పత్తి లక్ష్య సాధనకు ఆటంకం ఏర్పడుతోంది. వరుసగా రెండు సంవత్సరాలు ఆర్థిక సంవత్సరం చివరలో కరోనా కేసులు విజృంభించగా ఈసారి మాత్రం మరో రెండునెలలు ఉండగానే కొవిడ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలకు విఘాతం కలిగే అవకాశం ఉంది. దీంతో యాజమాన్యం కార్మికులను అప్రమత్తం చేసే పనిలో పడింది. గనుల్లో పనిచేసే ఉద్యోగులకు కరోనా నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పిస్తోంది. మాస్కులు తప్పనిసరిగా ధరించడంతో పాటు శానిటైజర్లు వినియోగించాలని చెబుతోంది. గనులపై హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయించడంతో పాటు కార్మికులకు మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పత్తి రైతులు, వ్యాపారుల ఆందోళన
[ 23-04-2024]
ఎన్నికల కోడ్ పేరుతో తనిఖీలు నిర్వహించి బ్యాంకుల నుంచి డబ్బును తీసుకొస్తున్న తమను ఇబ్బందులకు గురి చేయవద్దని జమ్మికుంట పత్తి మార్కెట్ వద్ద వ్యాపారులు, పత్తి రైతులు ఆందోళనకు దిగారు. -
మానేరు వాగుపై కూలిన నిర్మాణంలోని వంతెన
[ 23-04-2024]
పెద్దపల్లి జిల్లాలో మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. ముత్తారం మండలం ఓడేడు పరిధిలో సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. -
పిల్లల అల్లరిని దారి మళ్లించండి
[ 23-04-2024]
పది నెలలపాటు చదువుతో కుస్తీ పడిన పిల్లలకు వేసవి సెలవులు ఉపశమనం ఇస్తాయి. ఆటాపాటలతో సరదాగా గడపొచ్చని భావిస్తుంటారు. -
మోదీ వ్యాఖ్యల్లో ఓటమి భయం
[ 23-04-2024]
లోక్సభ మొదటి దశ ఎన్నికల తీరును చూసిన ప్రధాని మోదీ ఓటమి భయంతో దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సంపద అంతా ముస్లింలకు ఇస్తుందని వ్యాఖ్యానించారని మంత్రి పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు. -
నాలుగో రోజు 25 నామినేషన్లు
[ 23-04-2024]
నామినేషన్ల ప్రక్రియ నాలుగో రోజు సోమవారం కరీంనగర్, పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గ స్థానాలకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. -
హామీలను విస్మరించిన ప్రభుత్వం
[ 23-04-2024]
శాసనసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిందని కరీంనగర్ భారాస అభ్యర్థి వినోద్కుమార్ అన్నారు. -
సెప్టెంబరులో చక్కెర కర్మాగారం తెరిపిస్తాం
[ 23-04-2024]
శాసనసభ ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీ మేరకు నిజాం చక్కెర కర్మాగారాలు తెరిపించేందుకు అవసరమైన చర్యలు చేపట్టినట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. -
అవకాశమిస్తే అభివృద్ధి చేసి చూపిస్తా!
[ 23-04-2024]
ప్రాంతానికి కొత్త కావచ్చు, రాజకీయాలకు, ప్రజా సేవకు కొత్తకాదని, అవకాశమిస్తే పార్లమెంట్ పరిధిని అభివృద్ధి చేసి చూపిస్తానని నిజామాబాద్ భారాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. -
దారులన్నీ కొండగట్టుకే
[ 23-04-2024]
తమ ఇష్టదైవాన్ని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి దీక్షాపరులు తరలివస్తున్నారు. -
ఓటరు నమోదులో ఫలించిన చైతన్యం
[ 23-04-2024]
ప్రజాస్వామ్యం కల్పించిన ఓటు హక్కు నమోదుకు యువతలో నూతనోత్సాహం ఉరకలేసింది. -
ప్రత్యేక నిధులు.. తీరనున్న ఇక్కట్లు
[ 23-04-2024]
రామగుండం నగరపాలక ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు అమృత్-2.0, యు.ఐ.డి.ఎఫ్.(అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్) నిధులతో పరిష్కారం కానున్నాయి. -
కాంగ్రెస్ నైజాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి
[ 23-04-2024]
భారాస పాలనలోనే అన్ని వర్గాల ప్రజలు సంక్షేమ ఫలాలు అందుకున్నారని, గడిచిన నాలుగు నెలల కాలంలో సంక్షేమ పథకాలను అటకెక్కించిన కాంగ్రెస్ పాలకుల నైజాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పెద్దపల్లి లోక్సభ భారాస అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. -
లెక్కలు తేలేనా?
[ 23-04-2024]
జిల్లా వస్త్ర పరిశ్రమకు గత ప్రభుత్వం సంక్షేమ, పాఠశాల విద్యాశాఖలకు సంబంధించిన వస్త్రోత్పత్తుల ఆర్డర్లు ఇచ్చింది. -
నిధులున్నా ప్రారంభం కాని పనులు
[ 23-04-2024]
గ్రామీణ, గిరిజన ప్రాంతాలకు రవాణా వ్యవస్థ మెరుగుపరిచి రెండు జిల్లాల గ్రామాలను అనుసంధానం చేయాలనే లక్ష్యంతో తారు రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. -
పట్టాలెక్కని ప్రతిపాదనలు
[ 23-04-2024]
ఉమ్మడి జిల్లాలో రైల్వే శాఖాపరంగా అభివృద్ధికి అడుగులు పడాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు. -
అమాత్యులుగా ఆ నలుగురు
[ 23-04-2024]
ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, పెద్దపల్లి లోక్సభా నియోజకవర్గాల నుంచి ఎన్నికైన ఎంపీల్లో ఇప్పటివరకు నలుగురికి మాత్రమే కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది.
తాజా వార్తలు (Latest News)
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?
-
బ్రిటన్కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?
-
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా