50 రోజులు.. 5 లక్షల పని దినాలు
‘ఉపాధిహామీ పథకంలో కోరిన ప్రతి కూలీకి పని కల్పిస్తున్నాం. వేసవిలో ఎండల తీవ్రత దృష్ట్యా పని వేళల్లో స్వల్ప మార్పులు జరగనున్నాయి. పని ప్రదేశాల్లో మౌలిక వసతులు సమకూరుస్తున్నాం. చెరువుల్లో
కూలీల ‘ఉపాధి’ భద్రతకు పెద్దపీట
జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీధర్
న్యూస్టుడే, పెద్దపల్లి కలెక్టరేట్
‘ఉపాధిహామీ పథకంలో కోరిన ప్రతి కూలీకి పని కల్పిస్తున్నాం. వేసవిలో ఎండల తీవ్రత దృష్ట్యా పని వేళల్లో స్వల్ప మార్పులు జరగనున్నాయి. పని ప్రదేశాల్లో మౌలిక వసతులు సమకూరుస్తున్నాం. చెరువుల్లో పూడికతీత, కాలువలు, ఎస్సారెస్పీ కాలువల మరమ్మతు, భూగర్భ జలాలు పెంపొందించే పనులు కొనసాగుతున్నాయి. హరితహారం మొక్కల సంరక్షణలో కొన్ని చోట్ల లోపాలను సరిదిద్దుతున్నాం. ఈ ఏడాది లక్ష్యాలు అధిగమించేలా చర్యలు తీసుకుంటున్నాం’ అని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి శ్రీధర్ తెలిపారు. కొవిడ్ నేపథ్యంలో గత వేసవిలో ఆశించిన స్థాయిలో కూలీలు పనికి రాకపోవడంతో లక్ష్యాలపై కొంత ప్రభావం చూపిందని, వచ్చే యాభై రోజుల్లో (ఫిబ్రవరి, మార్చి నెలల్లో) అయిదు లక్షల పని దినాలు పూర్తి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించామన్నారు. పథకం నిర్వహణ, కూలీలకు ఉపాధి, హరితహారంలో మొక్కలు, నర్సరీల పెంపకం తదితర అంశాలపై ‘న్యూస్టుడే’తో ఆయన మాట్లాడారు..
న్యూ: ఎలాంటి పనులకు ప్రాధాన్యం ఇస్తున్నారు?
జి.గ్రా.అ.: చెరువులు, కుంటల్లో పూడికతీత, కట్ట సామర్థ్యం పెంచడం, ప్రధాన కాలువల్లో, పిల్ల కాలువల్లో పూడిక తొలగించే పనులను గుర్తించాం. పూడిక మట్టి తొలగింపుతో చెరువుల్లోకి నీరు సమృద్ధిగా చేరి ఆయకట్టులో సాగుకు భరోసా కలగనుంది. భూగర్భ జలాలు ఒడిసిపట్టేలా గుట్టలు, కొండల ప్రాంతాల్లో నీటి నిల్వకు కాంటూరు, సమతల కందకాలు, ఇంకుడుగుంతల నిర్మాణాన్ని వేగిరం చేస్తున్నాం. జిల్లాలోని డీ-83, డీ-86 కాలువలను ఆధునికీకరించే పనులు చేస్తున్నాం.
న్యూ: జిల్లాలో ఈ ఏడాది లక్ష్యాలు చేరుకోవడానికి ప్రణాళిక ఏమిటి?
జి.గ్రా.అ.: గతేడాది 28.50 లక్షల పని దినాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం ఆ సంఖ్యను అధిగమించేందుకు ప్రణాళిక చేపట్టాం. ఏప్రిల్, మే నెలల్లో కొవిడ్ తీవ్రతతో కూలీలు పనికి రాలేదు. ప్రస్తుతం రోజుకు 10 వేల మంది హాజరయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి ఊరిలో కనీసం 50 మంది కూలీలు తప్పకుండా పని చేసేలా చూడాలని ఆదేశించాం. ఇప్పటివరకు 23.34 లక్షల పని దినాలు చేశారు. మరో ఐదు లక్షల పని దినాలను 50 రోజుల్లో పూర్తి చేస్తాం.
న్యూ: నూతన సాంకేతిక విధానం అమలు ఎలా ఉంది?
జి.గ్రా.అ.: ఉపాధిహామీ పథకం నిర్వహణలో నూతన సాంకేతిక విధానం అందుబాటులోకి వచ్చింది. ఇప్పటివరకు ఎంబీ రికార్డుల ఆధారంగా కూలీల వేతనాలు ఆన్లైన్లో నమోదు చేస్తే రాష్ట్ర స్థాయిలో వారి ఖాతాలో జమయ్యేవి. ప్రస్తుత విధానంతో కూలీల పని సామర్థ్యంతో రికార్డు చేస్తే కేంద్రం నుంచే నేరుగా జమ కానున్నాయి. వేతనాల చెల్లింపులో జాప్యం ఉండదు.
న్యూస్టుడే: జిల్లాలో కూలీలకు ఉపాధి కల్పన ఎలా సాగుతోంది?
జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి: జిల్లాలో 1,17,234 జాబ్కార్డులున్నాయి. వీటి పరిధిలో 2,56,724 మంది కూలీలుగా నమోదయ్యారు. గ్రామాల్లో కోరిన ప్రతి కూలీకి పని చూపేందుకు ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారం తీసుకుంటున్నాం. పనులకు వచ్చేలా కూలీలకు అవగాహన కల్పిస్తున్నాం. క్షేత్ర సహాయకులు లేకపోవడంతో కార్యదర్శులు ఆ బాధ్యతలు చూస్తున్నారు.
న్యూ: హరితహారం మొక్కల సంరక్షణలో అక్రమాలపై చర్యలేమిటి?
జి.గ్రా.అ.: జిల్లాలో ఆవాస, ప్రభుత్వ భూముల్లో మొక్కలు పెంచుతున్నాం. పంచాయతీ ట్యాంకర్ల ద్వారా మొక్కలకు నీటిని సరఫరా చేస్తున్నాం. ఒక్కో ట్రిప్పుతో 333 మొక్కలకు నీరందించాలి. ఇందుకు మొక్కకు రూ.5 చొప్పున చెల్లిస్తున్నాం. నెలకు మూడు సార్లు నీరు పట్టాలి. నీటి సరఫరా బిల్లులు నేరుగా పంచాయతీ ఖాతాలో జమ కానున్నాయి. మంథని మండలంలో ఎక్కువ సంఖ్యలో మొక్కలు పెంచుతున్నందున అదనంగా ట్రాక్టర్లను వినియోగించారని ఫిర్యాదులు అందాయి. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి అవినీతికి పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తాం.
న్యూ: కూలీల వేతన నిధులు స్వాహా అవుతున్న నేపథ్యంలో పర్యవేక్షణ ఎలా ఉంది?
జి.గ్రా.అ.: గతంతో పోలిస్తే నిధుల దుర్వినియోగం తక్కువగానే ఉంది. సామాజిక తనిఖీ ప్రజావేదికల్లో పలు చోట్ల అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. కూలీల హాజరు నమోదులో తప్పిదాలు, బినామీ పేర్లతో నిధులు స్వాహా చేస్తున్నట్లు వెల్లడవుతోంది. పక్కదారి పట్టిన ప్రతి పైసాను రికవరీ చేస్తున్నాం. స్వాహా చేసిన సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్వితీయంలో 4.. ప్రథమంలో 5
[ 25-04-2024]
రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు వారు బుధవారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. గత విద్యాసంవత్సరం కంటే మెరుగైన ఫలితాలను సాధించారు. ద్వితీయ సంవత్సరంలో నాలుగు, ప్రథమలో అయిదో స్థానం సాధించారు. -
రాజేందర్రావు చేతికే టికెట్
[ 25-04-2024]
రోజుల తరబడి నిరీక్షణకు కాంగ్రెస్ పార్టీ తెరదించింది. ఎట్టకేలకు నామినేషన్ల చివరి రోజుకు ముందు బుధవారం రాత్రి అభ్యర్థిని ప్రకటించింది. కరీంనగర్ లోక్సభ స్థానంలో పోటీ చేసేందుకు వెలిచాల రాజేందర్రావుకు అవకాశమిచ్చింది. -
కాంగ్రెస్తో భారాస నేతల కుమ్మక్కు
[ 25-04-2024]
కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలని తాను కొట్లాడుతుంటే భారాస నేతలు ఆ పార్టీతో కుమ్మక్కై తనను ఓడించాలని చూస్తున్నారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విమర్శించారు. -
ఆరో రోజు 17 నామినేషన్లు
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలక అంకానికి గురువారంతో తెరపడనుంది. లోక్సభ నియోజకవర్గం బరిలో నిలిచే అభ్యర్థుల నామినేషన్ దాఖలుకు నేడు చివరి రోజు కావడంతో గడిచిన వారం రోజుల నుంచి కొనసాగుతున్న ప్రక్రియ మధ్యాహ్నం 3 గంటలతో ముగియనుంది. -
పేదింటి బిడ్డలు ఇంటర్లో మెరిశారు
[ 25-04-2024]
కరీంనగర్ విద్యావిభాగం, భాగ్యనగర్, న్యూస్టుడే : ఇంటర్మీడియెట్ ఫలితాల్లో పేద విద్యార్థులు ప్రతిభ చాటారు. తల్లిదండ్రులు కష్టపడి చదివించగా.. వారి పేరు నిలబెట్టారు. ఉపాధ్యాయుల సహకారంతో ఉత్తమ మార్కులు సాధించారు. -
భూ కబ్జా వ్యవహారంలో కార్పొరేటర్.. ఆమె భర్తపై కేసు
[ 25-04-2024]
కొనుగోలు చేసిన భూమికి సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించడమే కాకుండా బాధితుడిని డబ్బుల కోసం బెదిరించిన నాయకులతోపాటు వారికి సహకరించిన నగరపాలక సంస్థ సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేసి కొంత మందిని అరెస్టు చేశారు. -
బాలికలదే పై చేయి
[ 25-04-2024]
జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు నిరాశ పరిచాయి. సర్కారు కళాశాలల్లో ఆధునిక వసతులు, సరిపడా బోధన సిబ్బంది, విద్యార్థుల దత్తత, తరుచూ చరవాణిలో తల్లిదండ్రులను సంప్రదించినా ఆశించిన మేర ఫలితాలు రాలేదు. -
జూన్ 6 తర్వాత నిరుపేదలకు ఇళ్లు
[ 25-04-2024]
జూన్ 6 తర్వాత ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్లు ఇచ్చే కార్యాచరణ చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పేర్కొన్నారు. -
భాజపా బీఫామ్ ఎవరికో!
[ 25-04-2024]
నామినేషన్ల ఘట్టం తుది దశకు చేరిన వేళ పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలో భాజపా తరఫున బరిలో ఉండే అభ్యర్థిపై ఉత్కంఠ వీడటం లేదు. పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన గోమాసె శ్రీనివాస్ బుధవారం రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాల్లో అమ్మాయిల హవా కొనసాగింది. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరిగిన పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో ఒకేషనల్ కలిపి 7,624 మంది పరీక్షలకు హాజరవగా అందులో 4,628 మంది ఉత్తీర్ణత సాధించారు. -
పెరిగిన వినియోగం.. తగ్గిన గృహజ్యోతి లబ్ధిదారులు
[ 25-04-2024]
వేసవి ఎండల తీవ్రత కారణంగా విద్యుత్తు వినియోగం భారీగా పెరిగింది. దీని ప్రభావం గృహజ్యోతి పథకం లబ్ధిదారులపై పడింది. దీంతో చాలా మంది మార్చిలో ఈ పథకానికి అనర్హులుగా తేలారు. -
ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్లు కుమ్మక్కు: కేటీఆర్
[ 25-04-2024]
ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని, అందుకే ప్రజలకు తెలియని వ్యక్తిని కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
ఇంటర్లో బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ప్రథమ సంవత్సరంలో 5,717 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 2,955 మంది ఉత్తీర్ణులయ్యారు. 51.69 శాతం ఉత్తీర్ణత నమోదైంది. వొకేషనల్లో 949 మంది విద్యార్థులకుగాను 419 మంది ఉత్తీర్ణత సాధించారు. -
భానుడి భగభగ
[ 25-04-2024]
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నమోదైన పది గరిష్ఠ పగటి ఉష్ణోగ్రత ప్రాంతాల్లో కరీంనగర్ జిల్లాలోని రెండు ప్రదేశాలున్నాయి. -
బెదిరింపు రాజకీయాలు సరికాదు
[ 25-04-2024]
కాంగ్రెస్ నాయకులు బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతూ తమ పార్టీ అభ్యర్థులు, శ్రేణులను చేర్చుకుంటున్నారని, అలాంటి చర్యలు తగవని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం