నద్ది నాలా.. కబ్జా గోల
రేకుర్తిలో కొందరు భూదాహం తీర్చుకునే విషయంలో తగ్గేదేలె..! అంటున్నారు. కాస్త జాగ కనపడితే చాలు.. ఎలాగోలా కబ్జా చేయాలనే ఆలోచనే ధ్యేయంగా పెట్టుకుంటున్నారు. తమకున్న పలుకుబడితో
కాలువ ప్రాంతాన్ని మింగే ప్రయత్నాలు
రేకుర్తిలో తీరొక్క విధంగా భూ ఆక్రమణలు
ఈనాడు డిజిటల్, కరీంనగర్
ఇలా రాళ్లను నింపడంతో కుచించుకుపోయిన తీరు..
రేకుర్తిలో కొందరు భూదాహం తీర్చుకునే విషయంలో తగ్గేదేలె..! అంటున్నారు. కాస్త జాగ కనపడితే చాలు.. ఎలాగోలా కబ్జా చేయాలనే ఆలోచనే ధ్యేయంగా పెట్టుకుంటున్నారు. తమకున్న పలుకుబడితో అనుకున్నది చేసేస్తున్నారు. విలువైన భూముల విషయంలో తిమ్మిని బమ్మిగా మార్చేస్తున్నారు. వారనుకున్నట్లే తప్పు ఒప్పు అయిపోయేలా సరిహద్దులను తెలివిగా చెరిపేస్తున్నారు. ఆక్రమణల తీరుని యథేచ్ఛగా కొనసాగించేస్తున్నారు. కబ్జాల కోరల్లో కొట్టుమిట్టాడుతున్న రేకుర్తిలో భూమిని మింగినట్లే.. గలగల పారే నీటి పరివాహక ప్రాంతాన్ని మింగేలా ఎత్తుగడల జోరు చాకచక్యంగా సాగిస్తున్నారు. ఏళ్ల కిందటి నుంచి గొలుసు కట్టు చెరువులకు ఆధారమైన ఓ ప్రధాన నాలా అన్యాక్రాంతమవుతోంది.అధికారులు కనీసం ఈ కాలువను పట్టించుకున్న పాపాన పోకపోవడంతో ఇది ప్రవహించే పొడుగునా ఇరువైపుల ఉన్న ఖరీదైన ప్రభుత్వ స్థలం అన్యాక్రాంతమవుతోంది.
ఏం జరుగుతుందంటే..?
రేకుర్తిలోని విలువైన స్థలాల మధ్య నుంచి వర్షాకాలంలో వరద నీటిని ఆయా గ్రామాలకు తీసుకెళ్లే నద్దినాలా కథే ఇది. కొత్తపల్లి పెద్ద చెరువు కట్ట మత్తడి నుంచి ప్రారంభమైన ఈ నాలా రేకుర్తి, ఆరెపల్లి, తీగలగుట్టపల్లి గ్రామాల మీదుగా నగునూర్ సమీపంలోని వాగులో కలుస్తుంది. చెరువు నిండినప్పుడు మత్తడి నీళ్లతోపాటు ఎస్సారెస్పీ డి-94 ఉప కాలువ నీళ్లు పొలాలకు చేరగా.. మిగిలినవన్నీ ఈ నాలాలో కలుస్తూ ముందుకెళ్తుంటాయి. కరీంనగర్- జగిత్యాల రహదారిలో రేకుర్తికి ఇరువైపుల వెడల్పుగా ఉన్న ఈ కాలువ కాలక్రమంగా తన సహజ రూపును కోల్పోతోంది. పలుగ్రామాలకు అనుసంధానంగా ఉన్న దీని వెడల్పు ఒక్కో స్థానంలో ఒక్కో విధంగా ఉంటుంది. మొత్తంగా మాత్రం దీని పరివాహక ప్రాంతంతోపాటు ఆనుకుని ఉండే బఫర్ జోన్ అంతా కలిపి ప్రవాహపు పొడుగునా దాదాపుగా 50కిపైగా ఎకరాలే ఉంటుందని వినికిడి. కొన్నిచోట్ల 50 అడుగులు ఇంకొన్ని చోట్ల 80 అడుగుల వెడల్పుతో నీళ్లు నిల్వ ఉంటాయి. గడిచిన దశాబ్ద కాలానికిపైగా ఈ నద్దినాలా సరిహద్దుల విషయంలో సంబంధిత అధికారుల పర్యవేక్షణే లేకపోవడంతో ఇది చాలాచోట్ల నామరూపాలు లేకుండా పోయింది. స్థిరాస్తి ముసుగులో చాలాచోట్ల కబ్జాకు గురైంది.
వ్యూహాత్మక ఎత్తుగడలు..
కొన్నేళ్లుగా ఇక్కడి ప్రాంతంలో స్థిరాస్తి వ్యాపారం జోరుగా సాగుతుండటంతో ఈ నాలాకు ఆనుకుని ఇరువైపులా పలునిర్మాణాలు జరుగుతున్నాయి. నాలాకు రెండు దిక్కులా 10 నుంచి 20 అడుగుల బఫర్జోన్ అక్కడి ప్రాంతాన్ని బట్టి ఉంటుంది. దాన్ని చాలాచోట్ల చెరబట్టారు. పక్కనే ప్రభుత్వ భూములున్న స్థలాలే కాకుండా ఇరువైపుల ఉండే పట్టా భూముల సర్వే నంబర్లలో ఈ జాగను దర్జాగా కొందరు కలిపేసుకుంటున్నారు. ఇటీవల రేకుర్తి శివారులోని రైల్వే కట్ట చెంతన ఈ కాలువ స్థలానికి ఆనుకుని ఉన్న స్థలాన్ని కొందరు చదును చేశారు. నీళ్లు నిలిచే ప్రాంతాన్ని దాదాపుగా వారి స్థలంలో మిళితమయ్యేలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఇక దీన్ని అటు నీటిపారుదల శాఖ అధికారులు కూడా పట్టించుకోకపోవడం, పూడిక తీత సహా హద్దుల ఏర్పాటు, రక్షణ చర్యల దిశగా అడుగులేయకపోవడంతో చాలా చోట్ల ఈ నాలా ఇతరుల భూముల్లో బందీ అవుతోంది. కొన్నిచోట్ల కనీసం దాన్ని పరిశీలించే అవకాశం కూడా లేకపోవడం గమనార్హం.! పలుమార్లు ఈ విషయమై ఫిర్యాదులు అందినా ఇటు రెవెన్యూ, అటు నీటిపారుదల శాఖ అధికారులు క్షేత్రస్థాయి రావడం లేదనే విమర్శలున్నాయి. కొందరి నేతల ఒత్తిళ్లకు తలొగ్గి సరిహద్దుల్ని పట్టించుకోవడంలేదనే ఆరోపణలున్నాయి. నీటిపారుదల శాఖ అధికారులు ఇకమీదటనైనా స్థలాన్ని కోల్పోకుండా హద్దుల్ని గుర్తించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. అదే సమయంలో పట్టాభూముల వాస్తవ స్థితిగతుల్ని రెవెన్యూ యంత్రాంగం అంచనా వేయాల్సిన అవసరముంది.
అధికారులేమన్నారంటే..!
నద్ది నాలాను ఆనుకుని ఉన్న స్థలాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తామని కరీంనగర్ ఆర్డీవో ఆనంద్కుమార్ వివరణ ఇచ్చారు. నక్ష ప్రకారం రికార్డుల్లో ఉన్న తీరుకు క్షేత్రస్థాయిలోని వాస్తవ స్థితిగతుల్ని గమనిస్తామని చెప్పారు. నీటిపారుదల శాఖ ఈఈ నాగభూషణం మాట్లాడుతూ.. తక్షణమే కాలువను మ్యాప్ ప్రకారం పరిశీలించి సరిహద్దులు పెడుతామన్నారు. అవసరాన్నిబట్టి సర్వే కోసం సహాయక సంచాలకులకు లేఖను రాసి సర్వేచేసి ఆక్రమణల్ని తొలిగిస్తామన్నారు. మ్యాప్ ఆధారంగా బఫర్జోన్ ప్రదేశాల్ని ఇరువైపుల గుర్తిస్తామని తెలిపారు.
ప్రభుత్వ భూములు పరిశీలించిన ఆర్డీవో
ఈనాడు డిజిటల్, కరీంనగర్
ప్రభుత్వ భూముల్ని యథేచ్ఛగా కొల్లగొడుతున్న అక్రమార్కుల తీరుపై ‘ఈనాడు’లో వచ్చిన వరస కథనాలకు రెవెన్యూ అధికారులు స్పందించారు. ఈ నెల 18న ‘రేకుర్తి కబ్జాల కక్కుర్తి’.. 19న ‘గుట్టల చుట్టూ ఆక్రమణల గుట్టు’ శీర్షికలతో వచ్చిన కథనాలకు స్పందించిన రెవెన్యూ సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. కరీంనగర్ ఆర్డీవో ఆనంద్కుమార్, కొత్తపల్లి తహసీల్దార్ శ్రీనివాస్, ఇతర సిబ్బంది రేకుర్తి సమీపంలోని సమ్మక్కసారలమ్మ చెంతన ఉన్న భూముల్లో తిరుగుతూ వాస్తవాల్ని గమనించారు. ఈ సందర్భంగా రికార్డులతోపాటు నక్షాను అధికారులు పరిశీలించారు. త్వరలోనే ఇక్కడి భూముల విషయమై సమగ్రంగా సర్వేను నిర్వహించి హద్దులు నిర్ణయిస్తామని స్థానికులకు తెలిపారు. మరోవైపు రేకుర్తిలోని రెండు డివిజన్ల కార్పొరేటర్లైన సుధగోని మాధవి, ఏదుల్ల రాజశేఖర్లు రేకుర్తిలోని విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రాల్ని అందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాకా.. వెంకటస్వామికి ఆ పేరెలా వచ్చింది?
[ 24-04-2024]
కాంగ్రెస్ పార్టీ దివంగత, కేంద్ర మాజీ మంత్రి జి.వెంకటస్వామి ‘కాకా’గానే ఎక్కువ మందికి సుపరిచితులు. ఆయనకు ఈ పేరు రావడం వెనుక ఆసక్తికర అంశం ఉంది. -
యాప్ కష్టాలు
[ 24-04-2024]
జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల నిర్వాహకులు అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన యాప్ల్లో సమాచారం నిక్షిప్తం చేయాల్సి ఉంది. -
నిర్వహణ భారం.. కమీషన్లో కోత
[ 24-04-2024]
కేంద్రాల నిర్వహణ భారంగా మారగా.. వచ్చిన కమీషన్లో కోత విధించడంతో నిర్వాహకులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. -
ఇక ట్వంటీ20 పోరు!
[ 24-04-2024]
పోలింగ్ తేదీకి బుధవారం నుంచి సరిగ్గా ఇరవై రోజులుంది.. అచ్చంగా ట్వంటీ20 క్రికెట్ ఆటలోని 20 ఓవర్ల మాదిరి సమరం. -
మిగిలింది రెండు రోజులే!
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో తొలి అంకం రెండు రోజుల్లో ముగియనుంది. ఈ నెల 25వ తేదీతో నామినేషన్ల స్వీకరణ పూర్తవనుంది. -
నకిలీ పత్రాలు సృష్టించి.. ఇల్లు ధ్వంసం
[ 24-04-2024]
నకిలీ పత్రాలు సృష్టించి, ఇంటిని ధ్వంసం చేసి, దాడికి పాల్పడిన అయిదుగురిని కరీంనగర్ కొత్తపల్లి పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. -
పార్టీ పెద్దల సమ్మతితోనే రాజేందర్ నామినేషన్
[ 24-04-2024]
పార్టీ పెద్దల సమ్మతితోనే తామంతా కలిసి కాంగ్రెస్ తరఫున వెలిచాల రాజేందర్రావుతో నామినేషన్ వేయించామని, గెలిపిం చుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. -
అతివల ఉపాధికి ఆదరువేదీ!
[ 24-04-2024]
రాష్ట్రంలో 6 లక్షల మంది బీడీ కార్మికులుండగా అత్యధికంగా నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోనే ఉన్నారు. -
ఆ పది మందికే 50 శాతం ఓటర్ల మద్దతు
[ 24-04-2024]
ఎన్నికల్లో ప్రత్యర్థి కంటే ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా విజయం సాధించినట్లే. అయితే గెలుపొందిన అభ్యర్థికి నియోజకవర్గంలోని ఎంత మంది ఓటర్ల మద్దతు ఉందనేది పోటీలో ఉన్న అభ్యర్థులు, నమోదైన పోలింగ్ శాతాన్ని బట్టి మారుతుంది. -
ఆయుధాలు అప్పగించారు..
[ 24-04-2024]
వ్యక్తిగత భద్రత కోసం లైసెన్సు తీసుకొని వెంట ఉంచుకున్న ఆయుధాలను ఉమ్మడి జిల్లావాసులు ఠాణాలకు అప్పగించారు. -
మాతాశిశుకు తప్పని ఉక్కపోత
[ 24-04-2024]
చంటి బిడ్డలు, బాలింతలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో వేసవి ఉక్కపోత తప్పడం లేదు. -
బ్యాలెట్ యుద్ధానికి చకచకా సన్నద్ధం
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికలను సమర్థంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. -
పనులకు ఆటంకాలు.. రాకపోకలకు అవస్థలు
[ 24-04-2024]
రెండు జిల్లాల సరిహద్దులోని మానేరు వాగు దాటడానికి ఇరువైపులా గ్రామాల ప్రజలు దశాబ్దాల తరబడి నానా అవస్థలు పడుతున్నారు. -
తైబజార్... చిరు వ్యాపారుల బేజార్
[ 24-04-2024]
పురపాలక సంఘంలో తైబజార్ గుత్తేదారు ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేస్తున్నా పట్టించుకున్న నాథుడు లేడు.
తాజా వార్తలు (Latest News)
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్
-
‘‘వాళ్లింట్లో వ్యక్తులను ఇలాగే కామెంట్ చేస్తే..’’: నెటిజన్పై బిగ్బాస్ నటి ఆగ్రహం
-
ఉచిత ఆధార్ కోసం వార్నర్ పరుగులు.. వీడియో చూశారా..?
-
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్నవూ సెంచరీ హీరో