బద్దిపోచమ్మ ఆలయ అభివృద్ధికి ముందడుగు
వేములవాడలోని రాజరాజేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి అడుగులు ముందుకు పడుతున్నాయి. మొన్నటి వరకు నిధులేమితో సతమతమైన వేములవాడ టెంపుల్ ఏరియా అభివృద్ధి సంస్థ (వీటీఏడీఏ)కు ఆలయ నిధుల నుంచి రూ.20 కోట్లు
పరిహారానికి రూ.20 కోట్లు సిద్ధం
ఈనాడు డిజిటల్, సిరిసిల్ల
వేములవాడలోని బద్దిపోచమ్మ ఆలయం
వేములవాడలోని రాజరాజేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి అడుగులు ముందుకు పడుతున్నాయి. మొన్నటి వరకు నిధులేమితో సతమతమైన వేములవాడ టెంపుల్ ఏరియా అభివృద్ధి సంస్థ (వీటీఏడీఏ)కు ఆలయ నిధుల నుంచి రూ.20 కోట్లు జమ చేశారు. వీటిని బద్దిపోచమ్మ ఆలయ విస్తరణలో నిర్వాసితులకు పరిహారంగా చెల్లించనున్నారు. వేములవాడ ఆలయ పట్టణ అభివృద్ధిపై గతేడాది హైదరాబాద్లో మంత్రులు కె.తారక రామారావు, ఇంద్రకరణ్రెడ్డిలు వీటీఏడీఏ, జిల్లా ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఇక్కడ కీలకమైనవి భూసేకరణ, పరిహారం చెల్లింపు. దీనికి వీటీఏడీఏ వద్ద నిధులు లేవు. అప్పుడు ఆలయ నిధుల్లోంచి అవసరం మేరకు వీటీఏడీఏకు బదిలీ చేయాలని ఈవోకు లేఖ రాశారు. ఈ నిధులను ప్రభుత్వం ద్వారా తిరిగి చెల్లిస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం నిధులు సమకూరడంతో బద్దిపోచమ్మ ఆలయ అభివృద్ధికి మార్గం సుగమమైంది.
పట్టణంలోని బద్దిపోచమ్మ ఆలయం ప్రస్తుతం రెండు గుంటల విస్తీర్ణంలో ఉంది. బోనాలతో వచ్చే భక్తుల దర్శనానికి ఇబ్బందులు కలగకుండా సుమారు ఎకరంపైన విస్తరించనున్నారు. దీనిలో ఆలయ చుట్టుపక్కల ఉన్న 11 కుటుంబాలు పూర్తిగా నిర్వాసితులవుతున్నారు. ఇప్పటికే రెవెన్యూశాఖ సర్వే చేపట్టి వివరాలు సేకరించి ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసింది. గజానికి రూ.30 వేలు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారు. పరిహారం విషయంలో నిర్వాసితుల నుంచి కొంత వ్యతిరేకత వచ్చింది. వారితో ఎమ్మెల్యే రమేశ్బాబు సైతం పలుమార్లు మాట్లాడారు. నిర్వాసిత కుటుంబాలకు ఆలయ పరిధిలోనే దుకాణాల నిర్వహణ, ఇతర ఉపాధి మార్గాల్లో ప్రథమ ప్రాధాన్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
త్వరలోనే చెల్లింపులు -శ్రీనివాసరావు, ఇన్ఛార్జి డీఆర్వో
పట్టణంలో వ్యాపార సముదాయం కావడంతో డిమాండ్ ఉంది. స్థానిక పరిస్థితులను అధ్యయనం చేశాక పరిహారం ఫైనల్ చేశాం. ఇటీవలే వీటీఏడీఏకు నిధులు జమయ్యాయి. గృహాలు, నిర్వాసితుల తుది జాబితాను సిద్ధం చేస్తున్నాం. ఆ జాబితా ప్రకారం త్వరలోనే చెల్లింపుల ప్రక్రియ చేపడతాం.
నిధుల లేమితోనే జాప్యమా?
వేములవాడలోని ఆలయాన్ని 2015లో ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.400 కోట్లతో అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. దాని తర్వాత వీటీఏడీఏ ఏర్పాటు చేశారు. ఆలయ అభివృద్ధికి సంబంధించి పలు నమూనాలు రూపొందించారు. దీనిపై శృంగేరి పీఠాధిపతి భారతీ తీర్థస్వామి పరిశీలన తర్వాత కొన్ని మార్పులు కూడా సూచించారు. ఆలయ విస్తరణకు గుడి చెరువుకు 35 ఎకరాల మేరకు పూడ్చివేసి చెరువుకు అవసరమైన అదనపు స్థలాన్ని సమీపంలోని రైతుల నుంచి సేకరించారు. జలవనరులశాఖ ఆధ్వర్యంలో గుడిచెరువును ట్యాంక్బండ్గా మార్చుతున్నారు. రాజరాజేశ్వర జలాశయం వెనక జలాల నుంచి గుడిచెరువులోకి నీటిని తరలించేందుకు ఎత్తిపోతల పథకం పూర్తయింది. ఆర్అండ్బీశాఖ ఆధ్వర్యంలో పట్టణానికి ఇరువైపులా రెండు బాహ్యవలయ రహదారులు, మూలవాగుపై రెండు వంతెనలు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం రాజన్న ప్రధాన ఆలయం విస్తరణ మిగిలి ఉంది. ఆరున్నరేళ్లుగా ఇప్పుడు అప్పుడు అంటూ వస్తున్నారు. పరిహారం చెల్లింపులకే వీటీఏడీఏ వద్ద నిధులు లేకపోతే ఇక అభివృద్ధి ఎలా జరుగుతుందనే విమర్శలు లేకపోలేవు. ఇప్పటికైనా ఆలయ నిధులతో పనులు చేపడితే భక్తులకు మెరుగైన వసతులు సమకూరుతాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణం
[ 18-04-2024]
దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి క్షేత్రంలో బుధవారం శ్రీరామనవమి సందర్భంగా శ్రీసీతారాముల కల్యాణోత్సవాన్ని ఆలయ వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. -
నేటి నుంచి నామినేషన్లు షురూ!
[ 18-04-2024]
ఎన్నికల సమరంలో అసలైన ఘట్టం గురువారం నుంచి మొదలవనుంది. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ నెల రోజుల కిందటే వెలువడినప్పటికీ నేడు వెలువడే అధికారిక నోటిఫికేషన్తో అసలు అంకం షురూ అవనుంది. -
ప్రచార పర్వానికి కాంగ్రెస్ సిద్ధం!
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికలకు సంబంధించి గురువారం నామపత్రాల స్వీకరణ కార్యక్రమం ప్రారంభమవుతున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ లోక్సభ స్థానం పరిధిలో ప్రచార కసరత్తు ప్రారంభించింది. -
కొప్పుల మొదటిసారి.. జీవన్ మూడోసారి
[ 18-04-2024]
ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో వేర్వేరు పార్టీలు, వేర్వేరు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్న తాటిపర్తి జీవన్రెడ్డి, కొప్పుల ఈశ్వర్లకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. ఆరు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా గెలుపొందిన జీవన్రెడ్డి స్వగ్రామం పెగడపల్లి మండలం బతికెపల్లి. -
క్లిక్ దూరంలో సమగ్ర సమాచారం
[ 18-04-2024]
ఎన్నికలకు సంబంధించిన సమగ్ర సమాచారం అందుబాటులో ఉండేలా కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక వెబ్సైట్ రూపొందించింది. ceotelangana.nic.in లో ఓటరు నమోదుతో పాటు సవరణలు, తొలగింపులు తదితర అంశాలుంటాయి. -
రెండు సార్లు ఎంపీ.. సాధారణ జీవనం
[ 18-04-2024]
వరుసగా రెండు సార్లు ఎంపీగా ఎన్నికైనా చివరి శ్వాస వరకు పల్లెటూరులోనే సాధారణ జీవితం గడిపారు జువ్వాడి రమాపతిరావు. 1916లో గన్నేరువరంలో జన్మించిన ఆయన వివాహం అనంతరం అత్తగారి ఊరైన గంగాధర మండలం సర్వారెడ్డిపల్లికి వచ్చి స్థిరపడ్డారు. -
ఎన్నికల పరిశీలకులొస్తున్నారు
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికలను స్వేచ్ఛగా, శాంతియుతంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పకడ్బందీ చర్యలు చేపట్టింది. ప్రలోభాలకు అడ్డుకట్ట వేసేందుకు ఉన్నతాధికారుల పర్యవేక్షణ పెంచింది. -
హాట్రిక్ విజేత..అరుదైన ఘనత
[ 18-04-2024]
ఉమ్మడి జిల్లాలో నలుగురు నేతలు వరుసగా మూడు సార్లు లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా హ్యాట్రిక్ రికార్డు సొంతం చేసుకున్నారు. కరీంనగర్ నుంచి ముగ్గురు, పెద్దపల్లి నుంచి ఒకరు గెలుపొంది రాజకీయాల్లో తమదైన ముద్ర వేసుకున్నారు. -
అక్కడ స్థానికేతరులే అధికం
[ 18-04-2024]
1962లో ఆవిర్భవించిన పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గం నుంచి ఇప్పటివరకు ఒక్కసారి మినహా అన్ని ఎన్నికల్లో స్థానికేతరులే గెలుపొందారు. 1980లో 7వ లోక్సభ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించిన కోదాటి రాజలింగం మాత్రమే స్థానికుడు. -
వసతుల మెరుగుకు కార్యాచరణ
[ 18-04-2024]
ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, రామగుండం నగరపాలికల్లో కనీస మౌలిక వసతులు మెరుగుపర్చడానికి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ప్రధానంగా తాగునీరు, భూగర్భ మురుగునీటి వ్యవస్థను బలోపేతం చేసేలా చర్యలు తీసుకుంటారు. -
ఆదాయంలో జమ్మికుంట మార్కెట్ టాప్
[ 18-04-2024]
పంటలకు పెరిగిన మద్దతు ధర, ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా పాత బకాయిలు జమకావటం, చెక్పోస్టులు, గిడ్డంగుల అద్దెలు, లైసెన్సులు, మార్కెట్లకు వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాల ద్వారా లభించే ఆదాయంతో ఉమ్మడి జిల్లాలోని జగిత్యాల వ్యవసాయ మార్కెట్ మినహా కరీంనగర్, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లు మార్కెటింగ్ శాఖ నిర్ణయించిన ఆర్థిక ఆదాయ లక్ష్యాన్ని అధిగమించాయి. -
ఓటరు దరఖాస్తులకు త్వరితగతిన పరిష్కారం
[ 18-04-2024]
నామినేషన్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ సూచించారు. బుధవారం ఆయన నిర్వహించిన పెద్దపల్లి నుంచి కలెక్టర్ ముజమ్మిల్ఖాన్, అదనపు కలెక్టర్లు అరుణశ్రీ, శ్యామ్ప్రసాద్లాల్లు పాల్గొన్నారు. -
మిల్లుల్లోనే బియ్యం.. ధాన్యానికేదీ స్థలం?
[ 18-04-2024]
గత వానాకాలం సీజన్కు సంబంధించిన బియ్యానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో మిల్లుల్లోనే నిల్వలు పేరుకుపోయాయి. గత సీజన్కు సంబంధించిన సీఎంఆర్ లక్ష్యాలను మిల్లర్లు పూర్తి చేయాలనే గడువును జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు పొడిగిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
వైకాపా అభ్యర్థి అంబటి మురళీపై చర్యలకు ఈసీ ఆదేశం
-
విధుల్లో అలసత్వం.. ఆరుగురు పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు
-
కిమ్ ‘జీవాయుధ’ కార్యక్రమం.. వ్యాధుల వ్యాప్తికి ‘విషపు పెన్నులు’, స్ప్రేలు!
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
‘కేజ్రీవాల్ హత్యకు కుట్ర’.. ఆప్ తీవ్ర ఆరోపణలు