తోబుట్టువులే మోసం చేశారని ఆత్మహత్య
సోదరుడు, సోదరి మోసం చేసిన తీరును వివరిస్తూ సెల్ఫీ వీడియో తీసుకుని పురుగు మందు తాగి ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. కుటుంబ
ఆస్తి వివాదంపై సెల్పీ వీడియోలో వెల్లడి
సెల్ఫీ వీడియోలో వివరాలు వెల్లడిస్తున్న శ్రీనివాస్
కరీంనగర్ నేరవార్తలు, న్యూస్టుడే : సోదరుడు, సోదరి మోసం చేసిన తీరును వివరిస్తూ సెల్ఫీ వీడియో తీసుకుని పురుగు మందు తాగి ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిసిన వివరాల ప్రకారం.. నగరంలోని తిరుమల్నగర్కు చెందిన తిప్పారపు శ్రీనివాస్ (42) గాయిత్రీనగర్లో వెల్డింగ్ దుకాణం నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. శ్రీనివాస్ తన సోదరుడు ఆంజనేయులుతో కలిసి పొత్తులో 15 ఏళ్ల కిందట గోదాంగడ్డ వద్ద రెండున్నర గుంటల స్థలంలో రెండంతస్తుల భవనాన్ని నిర్మించుకున్నారు. కింద భాగంలో శ్రీనివాస్ ఉంటుండగా, ఆంజనేయులు మొదటి అంతస్తులో నివాసం ఉంటున్నాడు. నాలుగేళ్లుగా అన్నదమ్ముల మధ్య గొడవలు జరుగుతున్నాయి. పొత్తులో కట్టుకున్న ఇంటిలో ఎలాంటి సంబంధం లేదని ఇంటి నుంచి వెళ్లిపోవాలని ఆంజనేయులు వేధిస్తుండేవాడు. దీంతో రెండేళ్ల క్రితం గోదాంగడ్డలోని సొంత ఇంటిని వదిలి తిరమల్నగర్లో అద్దెకు ఉంటున్నాడు. ఇంటి విషయంలో పెద్దల సమక్షంలో పంచాయితీ జరిగినా ఆంజనేయులు సొంత ఇంట్లోకి రానివ్వలేదు. తిమ్మాపూర్ మండలం అల్గునూర్లో సోదరుడు ఆంజనేయులు, సోదరి మదుపు లక్ష్మి, శ్రీనివాస్ పొత్తు కింద రూ.3 లక్షలు ఇచ్చి కొంత భూమిని కొనుగోలు చేశాడు. శ్రీనివాస్కు సంబంధం లేకుండానే లక్ష్మీ, ఆంజనేయులు వారి పేరు మీద ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. విషయం తెలుసుకున్న శ్రీనివాస్ సోదరి, సోదరున్ని నిలదీయగా వారు ఇబ్బందులకు గురిచేశారు. భూమి కొనుగోలు సమయంలో పెట్టుబడిగా పెట్టిన రూ.3 లక్షలు ఇవ్వమని అడిగినా ఇవ్వలేదు. వారం రోజుల కింద శ్రీనివాస్ సోదరుడు, సోదరిని డబ్బులు, ఇంటి విషయంలో నిలదీయగా చావమంటూ వేధింపులకు గురి చేశారు. దీంతో తీవ్ర మానసిక వేదనకు గురైన శ్రీనివాస్ 19న మధ్యాహ్నం వెల్డింగ్ దుకాణానికి పోతున్నట్లు చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. సాయంత్రం భార్య స్వరూప శ్రీనివాస్కు ఫోన్ చేసినా తీయకపోవడంతో వెంటనే కుమారున్ని దుకాణం వద్దకు పంపించగా శ్రీనివాస్ పురుగు మందు తాగి కింద పడిపోయాడు. స్థానికులతో కలిసి చికిత్స నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గురువారం తెల్లవారుజామున మృతిచెందాడు. తన సోదరుడు ఆంజనేయులు, సోదరి లక్ష్మీ తనను మోసం చేశారని పేర్కొంటూ శ్రీనివాస్ తన బాధŸను సెల్ఫీ వీడియో ద్వారా వెల్లడించాడు. తన భర్త మృతికి కారణమైన ఆంజనేయులు, లక్ష్మీలపై చర్యలు తీసుకోవాలని మృతుడు శ్రీనివాస్ భార్య స్వరూప ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఒకటో ఠాణా ఎస్సై సాంబమూర్తి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పద్మవ్యూహంలో ఉన్నా.. నావైపూ చూడండి
[ 19-04-2024]
‘నిజామాబాద్ నియోజకవర్గం పద్మవ్యూహంలా ఉంది. నన్ను అభిమన్యుడిని చేస్తారో.. అర్జునుడిని చేస్తారో అంతా మీ చేతుల్లో ఉంది’ అని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుతో నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్రెడ్డి పేర్కొన్నారు. -
మొదటిరోజు ఆరు నామినేషన్లు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం గురువారం ప్రారంభమైంది. మొదటి రోజు స్వతంత్ర అభ్యర్థులు మాత్రమే నామపత్రాలను దాఖలు చేశారు. కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు కోట శ్యామ్కుమార్, పోతూరి రాజేందర్లు -
350 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్
[ 19-04-2024]
హుజూరాబాద్లో పట్టుబడ్డ 350 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులు గురువారం సీజ్ చేశారు. హనుమకొండ జిల్లా పరకాలలోని శ్రీరాజరాజేశ్వర రైస్మిల్లులో 1,347 బస్తాల బియ్యాన్ని లారీలో లోడ్ చేసి... -
కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేయండి
[ 19-04-2024]
పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపునకు కలిసికట్టుగా కృషి చేయాలని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. ధర్మపురి పట్టణంలోని ఓ వేడుక మందిరంలో పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల... -
గీతదాటితే కొరడా ఝళిపిస్తారు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఆ మేరకు ఉమ్మడి జిల్లాలో రాజకీయ పార్టీల ప్రచార పర్వం వేడెక్కనుంది. మరోవైపు ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఎంసీసీ (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్)ని తీసుకొచ్చింది. -
కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు : మంత్రి
[ 19-04-2024]
ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులను ఇస్తామని, అవసరమైతే పక్క రాష్ట్రం నుంచి భిక్షాటన చేసైనా పదవులను తెచ్చిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ అన్నారు. -
నాలుగేళ్లా.. రెండేళ్లా!
[ 19-04-2024]
సింగరేణి గుర్తింపు సంఘం కాలపరిమితిపై సందిగ్ధం నెలకొంది. గెలిచిన అనంతరం సంఘానికి అధికారిక పత్రం ఇప్పటి వరకు అందలేదు.గుర్తింపు ఎన్నికలకు ముందు కాలపరిమితిపై స్పష్టత లేకపోవడంతో ఫలితాల అనంతరం కార్మిక శాఖ -
గంట ముందే పోలింగ్ ప్రారంభం
[ 19-04-2024]
గోదావరి పరీవాహక ప్రాంతం.. అంతర్రాష్ట్ర సరిహద్దు.. దట్టమైన అడవులు విస్తరించిన పెద్దపల్లి లోక్సభ పరిధిలో కొన్ని ప్రాంతాల్లో ముందస్తు పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. -
రహదారి నిర్మించారు.. సమస్యలు మరిచారు
[ 19-04-2024]
గుంతల రహదారితో ఇబ్బందులు ఎదురవుతుండటంతో ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. దీంతో పక్కా రోడ్డు నిర్మాణంతో రవాణా సదుపాయం మెరుగైంది. దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం లభించింది. -
స్థలం కేటాయించారు.. ఆసుపత్రి నిర్మాణం విస్మరించారు
[ 19-04-2024]
తంగళ్లపల్లి మండలం టెక్స్టైల్ పార్కు వద్ద బీడీ కార్మికుల కోసం ఏర్పాటు చేసే ఈఎస్ఐ ఆసుపత్రికి పదేళ్ల క్రితం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 13 ఎకరాల స్థలం కేటాయించింది. -
ఓట్లు కొల్లగొట్టి.. దిల్లీ తలుపుతట్టి
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలో కొంత మంది నేతలు అత్యధిక ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. రికార్డు స్థాయిలో ఓట్లు సంపాదించి ప్రత్యర్థులకు అందనంత దూరంలో నిలిచారు. -
స్వశక్తి.. ప్రజాస్వామ్య స్ఫూర్తి
[ 19-04-2024]
అన్నింటా ముందుంటున్న అతివలు ప్రతి ఎన్నికల్లో అధిక సంఖ్యలో ఓటు వేయడంలోనూ పైచేయి సాధిస్తున్నారు. ప్రజాస్వామ్యం కల్పించిన వజ్రాయుధాన్ని తప్పనిసరిగా వినియోగించుకొంటూ స్ఫూర్తి నింపుతున్నారు. -
ఇంటి నుంచే నామినేషన్
[ 19-04-2024]
ఎన్నికల ప్రక్రియను సులభతరం చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. ఓటరు నమోదు, ప్రచార సభలు, సమావేశాల నిర్వహణకు అనుమతుల కోసం -
17 ఎన్నికలు.. ఒక్కసారే అతివకు అవకాశం
[ 19-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి సాధారణ, ఉప ఎన్నికలతో కలిపి ఇప్పటివరకు 17 సార్లు ఎన్నికలు జరగగా ఒక్కసారే మహిళకు అవకాశం లభించింది. -
ఫోన్ ట్యాపింగ్లో ఎవరినీ వదిలేది లేదు
[ 19-04-2024]
రాముడిపై తాను అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఎంపీ బండి సంజయ్ నిరూపిస్తే సజీవ దహనం చేసుకుంటానని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ పొన్నం ప్రభాకర్ అన్నారు. -
వామ్మో.. ఇదేం ఎండ!
[ 19-04-2024]
జనం బెదిరేలా ఎండ ఠారెత్తిస్తోంది. ఉమ్మడి జిల్లాను ఉక్కపోతతో ఉడికిస్తోంది. రోజురోజుకు గణనీయంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు గురువారంతో మరింతగా పెరిగాయి. -
గంజాయి మాయం కేసులో ఇద్దరు ఎస్సైలు సహా నలుగురి సస్పెన్షన్తో కలకలం
[ 19-04-2024]
సారంగాపూర్ పోలీసుస్టేషన్ నుంచి గంజాయి మాయమైన సంఘటనలో ఇద్దరు ఎస్సైలు సహా నలుగురు సస్పెన్షన్కు గురవడం కలకలం రేపింది. -
చిట్టీల పేరిట ఆర్ఎంపీ డబ్బు వసూళ్లు
[ 19-04-2024]
శంకరపట్నం మండలం కొత్తగట్టులో ఓ ఆర్ఎంపీ సుమారు రూ.70 లక్షలతో ఉడాయించినట్లు ఆలస్యంగా తెలిసింది. బాధితుల కథనం ప్రకారం..