పేదల సంతోషమే లక్ష్యం
పేద ప్రజలు సంతోషంగా ఉండటమే తమకు కావాల్సిందని బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శుక్రవారం హుజూరాబాద్ నియోజకవర్గంలోని దళితబంధు లబ్ధిదారులకు
బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్
పొక్లెయిన్ అందజేస్తున్న మంత్రి గంగుల, ఎమ్మెల్సీ కౌశిక్రెడ్డి, ఎమ్మెల్యే రవిశంకర్, తదితరులు
కరీంనగర్ సంక్షేమ విభాగం, న్యూస్టుడే: పేద ప్రజలు సంతోషంగా ఉండటమే తమకు కావాల్సిందని బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శుక్రవారం హుజూరాబాద్ నియోజకవర్గంలోని దళితబంధు లబ్ధిదారులకు అంబేడ్కర్ క్రీడా మైదానంలో గ్రూపుగా ఎంపిక చేసుకున్న వారికి వాహనాలు అందజేశారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ.. దళితుల కుటుంబాల్లో వెలుగులు నింపేందుకే కేసీఆర్ దళితబంధు పథకం ప్రారంభించారని చెప్పారు. 24 మంది లబ్ధిదారులకు 10 యూనిట్లుగా రూ.2.60 కోట్ల విలువ చేసే ఆరు హార్వెస్టర్లు, ఒక్క డీసీఎం వ్యాను, మూడు జేసీబీలను అందించినట్లు తెలిపారు. నాడు డ్రైవర్గా పనిచేసిన వారు నేడు ఓనర్గా సంతోషంగా ఉన్నారని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా పాలనాధికారి ఆర్వీ.కర్ణన్, జడ్పీ ఛైర్పర్సన్ కనుమల్ల విజయ, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, ఎమ్మెల్సీ కౌశిక్రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ బండ శ్రీనివాస్, సుడా ఛైర్మన్ జీవీ.రామకృష్ణారావు, గ్రంథాలయ ఛైర్మన్ రవీందర్ రెడ్డి, డీటీసీ చంద్రశేఖర్ గౌడ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సురేశ్ రెడ్డి పాల్గొన్నారు.
మార్చి 31లోగా మొదటి దశ..
కరీంనగర్, మానకొండూర్, చొప్పదండి నియోజకవర్గాల్లో 100 మంది లబ్ధిదారులను ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో ఎంపిక చేసి మార్చి 31లోగా మొదటి దశ దళితబంధును పూర్తి చేస్తామని బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శుక్రవారం జిల్లా పాలనాధికారి సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో అర్హులైన 17,556 మంది లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేసినట్లు చెప్పారు. 1500 మంది డెయిరీ యూనిట్లు ఎంపిక చేసుకోగా వారికి షెడ్ల నిర్మాణం కోసం రూ.1.50లక్షలు అందించినట్లు చెప్పారు. 6,800 మంది రవాణా వాహనాల కోసం దరఖాస్తు చేసుకోగా వారందరికి లైసెన్సులు ఇప్పించినట్లు చెప్పారు. అనంతరం జిల్లా పాలనాధికారి ఆర్వీ.కర్ణన్ మాట్లాడుతూ.. అర్హులైనా ప్రతి ఒక్కరికి దళితబంధు పథకం అమలవుతుందన్నారు. సమావేశంలో జడ్పీ ఛైర్పర్సన్ కనుమల్ల విజయ, సుడా ఛైర్మన్ జీ.వీ.రామకృష్ణారావు, జిల్లా అదనపు పాలనాధికారులు గరిమఅగ్రవాల్, శ్యాంప్రసాద్లాల్, మున్సిపల్ కమిషనర్ సేవ ఇస్లావత్ పాల్గొన్నారు.
మేం ముగ్గురం యజమానులం
సరమ్మ, వెంకట్రావ్పల్లి, హుజురాబాద్ మండలం
మాకు ఉన్న రెండెకరాలతో పాటు ఇతరుల భూమి కౌలుకి తీసుకొని వ్యవసాయం చేస్తున్నాం. మా పెద్దకొడుకు జేసీబీ కిరాయికి తీసుకువచ్చి నడిపించాడు. ఇప్పుడు దళితబంధు పథకంలో ఇంటికి రూ.పది లక్షలు ఇవ్వడంతో మేమే ముగ్గురం కలిసి రూ.30లక్షలతో జేసీబీ తీసుకున్నాం.
20ఏళ్లు డ్రైవర్గా పనిచేశాను
మా ఊరికి సమీపంలో జమ్మికుంట మార్కెట్ ఉంది. ఇక్కడి నుంచి రాష్ట్రంలోని గ్రామాలకు, దేశంలోని వివిధ రాష్ట్రాలకు డీసీఎంపై డ్రైవర్గా 20 సంవత్సరాలు పనిచేశాను. ఇప్పుడు దళితబంధు మా పాలిట వరం అయింది. నేను మా బావమరిది కలిసి రెండు యూనిట్లుగా రూ.20లక్షలతో డీసీఎం వ్యాన్ తీసుకున్నాం. నాకు డ్రైవింగ్లో అనుభవంతో పాటు వ్యాపారం తెలుసు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాకా.. వెంకటస్వామికి ఆ పేరెలా వచ్చింది?
[ 24-04-2024]
కాంగ్రెస్ పార్టీ దివంగత, కేంద్ర మాజీ మంత్రి జి.వెంకటస్వామి ‘కాకా’గానే ఎక్కువ మందికి సుపరిచితులు. ఆయనకు ఈ పేరు రావడం వెనుక ఆసక్తికర అంశం ఉంది. -
యాప్ కష్టాలు
[ 24-04-2024]
జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల నిర్వాహకులు అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన యాప్ల్లో సమాచారం నిక్షిప్తం చేయాల్సి ఉంది. -
నిర్వహణ భారం.. కమీషన్లో కోత
[ 24-04-2024]
కేంద్రాల నిర్వహణ భారంగా మారగా.. వచ్చిన కమీషన్లో కోత విధించడంతో నిర్వాహకులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. -
ఇక ట్వంటీ20 పోరు!
[ 24-04-2024]
పోలింగ్ తేదీకి బుధవారం నుంచి సరిగ్గా ఇరవై రోజులుంది.. అచ్చంగా ట్వంటీ20 క్రికెట్ ఆటలోని 20 ఓవర్ల మాదిరి సమరం. -
మిగిలింది రెండు రోజులే!
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో తొలి అంకం రెండు రోజుల్లో ముగియనుంది. ఈ నెల 25వ తేదీతో నామినేషన్ల స్వీకరణ పూర్తవనుంది. -
నకిలీ పత్రాలు సృష్టించి.. ఇల్లు ధ్వంసం
[ 24-04-2024]
నకిలీ పత్రాలు సృష్టించి, ఇంటిని ధ్వంసం చేసి, దాడికి పాల్పడిన అయిదుగురిని కరీంనగర్ కొత్తపల్లి పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. -
పార్టీ పెద్దల సమ్మతితోనే రాజేందర్ నామినేషన్
[ 24-04-2024]
పార్టీ పెద్దల సమ్మతితోనే తామంతా కలిసి కాంగ్రెస్ తరఫున వెలిచాల రాజేందర్రావుతో నామినేషన్ వేయించామని, గెలిపిం చుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. -
అతివల ఉపాధికి ఆదరువేదీ!
[ 24-04-2024]
రాష్ట్రంలో 6 లక్షల మంది బీడీ కార్మికులుండగా అత్యధికంగా నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోనే ఉన్నారు. -
ఆ పది మందికే 50 శాతం ఓటర్ల మద్దతు
[ 24-04-2024]
ఎన్నికల్లో ప్రత్యర్థి కంటే ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా విజయం సాధించినట్లే. అయితే గెలుపొందిన అభ్యర్థికి నియోజకవర్గంలోని ఎంత మంది ఓటర్ల మద్దతు ఉందనేది పోటీలో ఉన్న అభ్యర్థులు, నమోదైన పోలింగ్ శాతాన్ని బట్టి మారుతుంది. -
ఆయుధాలు అప్పగించారు..
[ 24-04-2024]
వ్యక్తిగత భద్రత కోసం లైసెన్సు తీసుకొని వెంట ఉంచుకున్న ఆయుధాలను ఉమ్మడి జిల్లావాసులు ఠాణాలకు అప్పగించారు. -
మాతాశిశుకు తప్పని ఉక్కపోత
[ 24-04-2024]
చంటి బిడ్డలు, బాలింతలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో వేసవి ఉక్కపోత తప్పడం లేదు. -
బ్యాలెట్ యుద్ధానికి చకచకా సన్నద్ధం
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికలను సమర్థంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. -
పనులకు ఆటంకాలు.. రాకపోకలకు అవస్థలు
[ 24-04-2024]
రెండు జిల్లాల సరిహద్దులోని మానేరు వాగు దాటడానికి ఇరువైపులా గ్రామాల ప్రజలు దశాబ్దాల తరబడి నానా అవస్థలు పడుతున్నారు. -
తైబజార్... చిరు వ్యాపారుల బేజార్
[ 24-04-2024]
పురపాలక సంఘంలో తైబజార్ గుత్తేదారు ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేస్తున్నా పట్టించుకున్న నాథుడు లేడు.
తాజా వార్తలు (Latest News)
-
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!
-
రెజ్యూమె రూపొందించడంలో ఈ తప్పులొద్దు.. గూగుల్ మాజీ రిక్రూటర్ టిప్స్
-
కోటక్ బ్యాంక్కు ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డుల జారీ, కొత్త కస్టమర్ల చేరికపై ఆంక్షలు
-
‘మా పేరుతో తప్పుడు ప్రచారం’.. ప్రజలకు ఎల్ఐసీ అలర్ట్!
-
సభలో మాట్లాడుతూ.. స్పృహ కోల్పోయిన నితిన్ గడ్కరీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM