సంపూర్ణ పారిశుద్ధ్యం.. ప్రజారోగ్యమే లక్ష్యం
గ్రామాల్లో సంపూర్ణ పారిశుద్ధ్యం, ప్రజారోగ్యమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. నిధులు మంజూరు చేస్తూ స్వచ్ఛసర్వేక్షణ్ ర్యాంకులను ప్రకటిస్తూ పారిశుద్ధ్యంలో మెరుగైన ప్రగతి సాధించేలా ప్రోత్సహిస్తోంది.
26 గ్రామాల్లో పర్యటించిన కేంద్ర బృందం
మెట్పల్లి, న్యూస్టుడే
వివరాలు తెలుసుకుంటున్న కేంద్ర బృందం ప్రతినిధి
గ్రామాల్లో సంపూర్ణ పారిశుద్ధ్యం, ప్రజారోగ్యమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. నిధులు మంజూరు చేస్తూ స్వచ్ఛసర్వేక్షణ్ ర్యాంకులను ప్రకటిస్తూ పారిశుద్ధ్యంలో మెరుగైన ప్రగతి సాధించేలా ప్రోత్సహిస్తోంది. ఏటా ఆదర్శంగా నిలుస్తున్న పంచాయతీలకు నగదు పురస్కారాలు అందజేస్తోంది.
పంచాయతీ నిధులతోపాటు జాతీయ ఉపాధిహామీ పథకం అనుసంధానంతో చెత్త నిల్వల కేంద్రాలు, డంపింగ్ యార్డులు, తడి, పొడి చెత్తను సేకరిస్తున్నారు. పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. వృథా నీరు భూమలోకి ఇంకించేలా ఇంటింటికీ ఇంకుడుగుంతలు తవ్విస్తున్నారు. మూడేళ్ల కిందట వంద శాతం మరుగుదొడ్లు నిర్మాణమైన జిల్లాగా జగిత్యాల గుర్తింపు పొందింది. గత ఏడేళ్లలో 380 పంచాయతీల్లో వివిధ పథకాల కింద 70,221 మరుగుదొడ్లు నిర్మించారు. జిల్లాలో పలు పంచాయతీలు స్వచ్ఛ గ్రామాలుగా గుర్తింపు పొంది ఆదర్శంగా నిలిచాయి. కొన్ని గ్రామాల్లో మూత్ర విసర్జన బహరంగాగానే చేస్తుండడంతో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా కొత్తగా నిర్మాణంలో ఉన్న 4వేల ఇళ్లలో మరుగుదొడ్ల నిర్మాణానికి అధికారులు ప్రతిపాదించారు. ఇటీవల కేంద్ర బృందం జిల్లాల్లో పర్యటించి గ్రామాల్లో వివిధ అంశాలను పరిశీలించారు.
వివరాల సేకరణ ఇలా..
జిల్లాలో 18 మండలాల్లో 380 పంచాయతీలు ఉండగా కేంద్రం ప్రతినిధులు 15 మండలాల్లో ఎంపిక చేసిన 26 గ్రామాల్లో పర్యటించి ప్రతి గ్రామంలో పది ఇళ్లను పరిశీలించి వివరాలు సేకరించారు. ఆయా ఇళ్లలో మరుగుదొడ్లు ఉన్నాయా? వాటిని వినియోగిస్తున్నారా? గ్రామంలో బహిరంగ మల విసర్జన చేస్తున్నారా? గ్రామంలో పారిశుద్ధ్యం పరిస్థితి ఎలా, చెత్త సేకరణ ఎలా ఉంది? చెత్త ట్రాక్టర్ ప్రతి రోజు ఇంటికి వస్తూందా? తడి, పొడి చెత్తను వేరు చేసి ఇస్తున్నారా? కంపోస్టు షెడ్, డంపింగ్ యార్డు ఉందా? ఎరువును తయారు చేస్తున్నారా? ఇంకుడు గుంతలు నిర్మిస్తున్నారా? సర్పంచి, కార్యదర్శి నిత్యం అందుబాటులో ఉంటున్నారా? తదితర అంశాలపై వివరాలు సేకరించారు.
ప్రజల భాగస్వామ్యంతో.. -శ్రీనివాస్, సర్పంచి, ఆత్మనగర్ గ్రామం
గ్రామ అభివృద్ధి, సంపూర్ణ పారిశుద్ధ్య నిర్వహణకు ప్రజలు, ప్రజాప్రతినిధులు సహకరిస్తున్నారు. ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా గ్రామంలో పచ్చదనం పరిశుభ్రత మెరుగుపడింది. వందశాతం మరుగుదొడ్లు నిర్మించి ఆదర్శంగా నిలిచాం. డంపింగ్ యార్డుకు తడి, పొడి చెత్తను తరిలిస్తున్నాం. గ్రామ ప్రజల భాగస్వామ్యంతో గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం.
ఈ ఫొటోలో ఉంది మెట్పల్లి మండలంలోని ఆత్మనగర్ గ్రామం. ఇది పునరావాస గ్రామం. ఇక్కడ 520 గృహాలు ఉన్నాయి. ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించుకున్నారు. బహిరంగ మల విసర్జన లేని గ్రామంగా గుర్తింపు పొందింది. సర్పంచి శ్రీనివాస్ ప్రజల భాగస్వామ్యంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారు. ఇటీవల హైదారాబాద్లోని ఎన్ఐఆర్డీలో జరిగిన యూనిసెఫ్ 6వ నీటి పారిశుద్ధ్యం, పరిశుభ్రత సమావేశంలో గ్రామంలో స్వచ్ఛత, సుస్థిర పారిశద్ధ్యం కోసం నిరంతరం కృషి చేస్తున్న సర్పంచి శ్రీనివాస్ యూనిసెఫ్ ప్రతినిధుల ద్వారా ప్రశంసాపత్రం అందుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్వితీయంలో 4.. ప్రథమంలో 5
[ 25-04-2024]
రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు వారు బుధవారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. గత విద్యాసంవత్సరం కంటే మెరుగైన ఫలితాలను సాధించారు. ద్వితీయ సంవత్సరంలో నాలుగు, ప్రథమలో అయిదో స్థానం సాధించారు. -
రాజేందర్రావు చేతికే టికెట్
[ 25-04-2024]
రోజుల తరబడి నిరీక్షణకు కాంగ్రెస్ పార్టీ తెరదించింది. ఎట్టకేలకు నామినేషన్ల చివరి రోజుకు ముందు బుధవారం రాత్రి అభ్యర్థిని ప్రకటించింది. కరీంనగర్ లోక్సభ స్థానంలో పోటీ చేసేందుకు వెలిచాల రాజేందర్రావుకు అవకాశమిచ్చింది. -
కాంగ్రెస్తో భారాస నేతల కుమ్మక్కు
[ 25-04-2024]
కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలని తాను కొట్లాడుతుంటే భారాస నేతలు ఆ పార్టీతో కుమ్మక్కై తనను ఓడించాలని చూస్తున్నారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విమర్శించారు. -
ఆరో రోజు 17 నామినేషన్లు
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలక అంకానికి గురువారంతో తెరపడనుంది. లోక్సభ నియోజకవర్గం బరిలో నిలిచే అభ్యర్థుల నామినేషన్ దాఖలుకు నేడు చివరి రోజు కావడంతో గడిచిన వారం రోజుల నుంచి కొనసాగుతున్న ప్రక్రియ మధ్యాహ్నం 3 గంటలతో ముగియనుంది. -
పేదింటి బిడ్డలు ఇంటర్లో మెరిశారు
[ 25-04-2024]
కరీంనగర్ విద్యావిభాగం, భాగ్యనగర్, న్యూస్టుడే : ఇంటర్మీడియెట్ ఫలితాల్లో పేద విద్యార్థులు ప్రతిభ చాటారు. తల్లిదండ్రులు కష్టపడి చదివించగా.. వారి పేరు నిలబెట్టారు. ఉపాధ్యాయుల సహకారంతో ఉత్తమ మార్కులు సాధించారు. -
భూ కబ్జా వ్యవహారంలో కార్పొరేటర్.. ఆమె భర్తపై కేసు
[ 25-04-2024]
కొనుగోలు చేసిన భూమికి సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించడమే కాకుండా బాధితుడిని డబ్బుల కోసం బెదిరించిన నాయకులతోపాటు వారికి సహకరించిన నగరపాలక సంస్థ సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేసి కొంత మందిని అరెస్టు చేశారు. -
బాలికలదే పై చేయి
[ 25-04-2024]
జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు నిరాశ పరిచాయి. సర్కారు కళాశాలల్లో ఆధునిక వసతులు, సరిపడా బోధన సిబ్బంది, విద్యార్థుల దత్తత, తరుచూ చరవాణిలో తల్లిదండ్రులను సంప్రదించినా ఆశించిన మేర ఫలితాలు రాలేదు. -
జూన్ 6 తర్వాత నిరుపేదలకు ఇళ్లు
[ 25-04-2024]
జూన్ 6 తర్వాత ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్లు ఇచ్చే కార్యాచరణ చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పేర్కొన్నారు. -
భాజపా బీఫామ్ ఎవరికో!
[ 25-04-2024]
నామినేషన్ల ఘట్టం తుది దశకు చేరిన వేళ పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలో భాజపా తరఫున బరిలో ఉండే అభ్యర్థిపై ఉత్కంఠ వీడటం లేదు. పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన గోమాసె శ్రీనివాస్ బుధవారం రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాల్లో అమ్మాయిల హవా కొనసాగింది. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరిగిన పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో ఒకేషనల్ కలిపి 7,624 మంది పరీక్షలకు హాజరవగా అందులో 4,628 మంది ఉత్తీర్ణత సాధించారు. -
పెరిగిన వినియోగం.. తగ్గిన గృహజ్యోతి లబ్ధిదారులు
[ 25-04-2024]
వేసవి ఎండల తీవ్రత కారణంగా విద్యుత్తు వినియోగం భారీగా పెరిగింది. దీని ప్రభావం గృహజ్యోతి పథకం లబ్ధిదారులపై పడింది. దీంతో చాలా మంది మార్చిలో ఈ పథకానికి అనర్హులుగా తేలారు. -
ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్లు కుమ్మక్కు: కేటీఆర్
[ 25-04-2024]
ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని, అందుకే ప్రజలకు తెలియని వ్యక్తిని కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
ఇంటర్లో బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ప్రథమ సంవత్సరంలో 5,717 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 2,955 మంది ఉత్తీర్ణులయ్యారు. 51.69 శాతం ఉత్తీర్ణత నమోదైంది. వొకేషనల్లో 949 మంది విద్యార్థులకుగాను 419 మంది ఉత్తీర్ణత సాధించారు. -
భానుడి భగభగ
[ 25-04-2024]
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నమోదైన పది గరిష్ఠ పగటి ఉష్ణోగ్రత ప్రాంతాల్లో కరీంనగర్ జిల్లాలోని రెండు ప్రదేశాలున్నాయి. -
బెదిరింపు రాజకీయాలు సరికాదు
[ 25-04-2024]
కాంగ్రెస్ నాయకులు బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతూ తమ పార్టీ అభ్యర్థులు, శ్రేణులను చేర్చుకుంటున్నారని, అలాంటి చర్యలు తగవని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం