పకడ్బందీగా ఇంటింటి సర్వే
జిల్లాలో జ్వరాలపై ఇంటింటి సర్వే పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ గుగులోతు రవి చెప్పారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా అన్ని ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో అవసరమైన సదుపాయాలు కల్పిస్తున్నామని
జగిత్యాల, న్యూస్టుడే
జిల్లాలో జ్వరాలపై ఇంటింటి సర్వే పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ గుగులోతు రవి చెప్పారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా అన్ని ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో అవసరమైన సదుపాయాలు కల్పిస్తున్నామని ప్రజలు కచ్చితంగా కొవిడ్ నిబంధనలు పాటించి అవసరమైన జాగ్రత్తలు తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. జిల్లాలో కొవిడ్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు జ్వరాలపై సర్వే, ఆస్పత్రుల్లో సదుపాయాలపై శుక్రవారం ‘ఈనాడు-ఈటీవీ’తో మాట్లాడారు.
* జిల్లాలో జ్వరాలపై పకడ్బందీ సర్వే నిర్వహిస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా 2.63 లక్షల నివాసాలుండగా 713 బృందాలు ఏర్పాటు చేశాం. ప్రతి బృందంలో ఆశా, అంగన్వాడీ, పట్టణాల్లో రిసోర్స్పర్సన్, గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శి ఉంటారు. తొలిరోజు 5298 నివాసాల్లో సర్వే చేయగా 1505 మంది జ్వరాలతో ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా అయిదు రోజుల్లో సర్వే పూర్తి చేస్తాం.
* జిల్లాలో ఇది వరకే నాలుగు విడతల్లో జ్వరాలపై ఇంటింటి సర్వే నిర్వహించాం. తొలివిడత 7314 మంది రెండో విడత 3696, మూడోవిడత 1619, నాల్గో విడత 1436 మందికి జ్వరాలున్నట్లు తేలింది. ప్రస్తుతం ప్రభుత్వ నిర్ణయం మేరకు మరోసారి సర్వే నిర్వహిస్తున్నప్పటికి వ్యాధుల తీవ్రతను బట్టి నిరంతరం కొనసాగిస్తాం.
* జిల్లాలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఇంటింటి సర్వేలో జ్వరాలు తేలిన వారికి వెంటనే ఏడు రకాల గోలిలతో మందుల కిట్ ఇస్తున్నాం. కిట్లకు కొరత లేదు. జిల్లా వ్యాప్తంగా అన్ని ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో 40 వేల కిట్లు అందుబాటులో ఉండగా శుక్రవారం మరో 10 వేలు వచ్చాయి.
* జిల్లాలోని ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో సదుపాయాలు కల్పిస్తున్నాం. జిల్లా కేంద్ర ఆసుపత్రిలో 20 వెంటిలేటర్లు ఉన్నాయి. మెట్పల్లి ఆస్పత్రిలో రెండు ఏర్పాటు చేస్తాం. జిల్లా కేంద్ర ఆసుపత్రిలో నిమిషానికి 500 లీటర్ల ఉత్పత్తి సామర్థ్యం గల ఆక్సిజన్ ప్లాంటు ఏర్పాటైంది. ధర్మపురి, కోరుట్ల ఆస్పత్రుల్లోనూ ప్రారంభిస్తాం. జిల్లాలోని అన్ని ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో ఆక్సిమీటర్లు సైతం అందుబాటులో ఉన్నాయి.
* జిల్లాలో కరోనా పరీక్షల సంఖ్య పెంచుతాం. ప్రతిరోజూ 4 వేలకు తగ్గకుండా పరీక్షలు చేయాలని ఆదేశించాం. పాజిటివ్ వచ్చిన వారిని ఐసోలేషన్లో ఉండే విధంగా చూస్తున్నాం. వివిధ ప్రాంతాల్లో టీకా ఇచ్చే బృందాలకు కరోనా టెస్టింగ్ కిట్లు ఇచ్చాం. ఎవరైనా ఆస్పత్రులకు రాని వారికి ఇంటి వద్దే పరీక్షలు జరిపే ఏర్పాట్లు చేశాం.
* జిల్లాలో కొవిడ్ టీకా కార్యక్రమంలో వేగం పెంచాం మొదటి డోసు వందశాతం పూర్తయ్యింది. రెండోడోసు 77 శాతం పూర్తికాగా టీనేజర్లతో పాటు అర్హులైన వారికి బూస్టర్డోసు ఇస్తున్నాం. ప్రాణరక్షణకు టీకా తప్పనిసరని ప్రజలు గుర్తించాలి. కొవిడ్ నిబంధనలు సైతం కచ్చితంగా పాటించాలి. ఈ విషయమై అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తూనే పాటించని వారికి జరిమానా విధిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్వితీయంలో 4.. ప్రథమంలో 5
[ 25-04-2024]
రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు వారు బుధవారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. గత విద్యాసంవత్సరం కంటే మెరుగైన ఫలితాలను సాధించారు. ద్వితీయ సంవత్సరంలో నాలుగు, ప్రథమలో అయిదో స్థానం సాధించారు. -
రాజేందర్రావు చేతికే టికెట్
[ 25-04-2024]
రోజుల తరబడి నిరీక్షణకు కాంగ్రెస్ పార్టీ తెరదించింది. ఎట్టకేలకు నామినేషన్ల చివరి రోజుకు ముందు బుధవారం రాత్రి అభ్యర్థిని ప్రకటించింది. కరీంనగర్ లోక్సభ స్థానంలో పోటీ చేసేందుకు వెలిచాల రాజేందర్రావుకు అవకాశమిచ్చింది. -
కాంగ్రెస్తో భారాస నేతల కుమ్మక్కు
[ 25-04-2024]
కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలని తాను కొట్లాడుతుంటే భారాస నేతలు ఆ పార్టీతో కుమ్మక్కై తనను ఓడించాలని చూస్తున్నారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విమర్శించారు. -
ఆరో రోజు 17 నామినేషన్లు
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలక అంకానికి గురువారంతో తెరపడనుంది. లోక్సభ నియోజకవర్గం బరిలో నిలిచే అభ్యర్థుల నామినేషన్ దాఖలుకు నేడు చివరి రోజు కావడంతో గడిచిన వారం రోజుల నుంచి కొనసాగుతున్న ప్రక్రియ మధ్యాహ్నం 3 గంటలతో ముగియనుంది. -
పేదింటి బిడ్డలు ఇంటర్లో మెరిశారు
[ 25-04-2024]
కరీంనగర్ విద్యావిభాగం, భాగ్యనగర్, న్యూస్టుడే : ఇంటర్మీడియెట్ ఫలితాల్లో పేద విద్యార్థులు ప్రతిభ చాటారు. తల్లిదండ్రులు కష్టపడి చదివించగా.. వారి పేరు నిలబెట్టారు. ఉపాధ్యాయుల సహకారంతో ఉత్తమ మార్కులు సాధించారు. -
భూ కబ్జా వ్యవహారంలో కార్పొరేటర్.. ఆమె భర్తపై కేసు
[ 25-04-2024]
కొనుగోలు చేసిన భూమికి సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించడమే కాకుండా బాధితుడిని డబ్బుల కోసం బెదిరించిన నాయకులతోపాటు వారికి సహకరించిన నగరపాలక సంస్థ సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేసి కొంత మందిని అరెస్టు చేశారు. -
బాలికలదే పై చేయి
[ 25-04-2024]
జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు నిరాశ పరిచాయి. సర్కారు కళాశాలల్లో ఆధునిక వసతులు, సరిపడా బోధన సిబ్బంది, విద్యార్థుల దత్తత, తరుచూ చరవాణిలో తల్లిదండ్రులను సంప్రదించినా ఆశించిన మేర ఫలితాలు రాలేదు. -
జూన్ 6 తర్వాత నిరుపేదలకు ఇళ్లు
[ 25-04-2024]
జూన్ 6 తర్వాత ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్లు ఇచ్చే కార్యాచరణ చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పేర్కొన్నారు. -
భాజపా బీఫామ్ ఎవరికో!
[ 25-04-2024]
నామినేషన్ల ఘట్టం తుది దశకు చేరిన వేళ పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలో భాజపా తరఫున బరిలో ఉండే అభ్యర్థిపై ఉత్కంఠ వీడటం లేదు. పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన గోమాసె శ్రీనివాస్ బుధవారం రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాల్లో అమ్మాయిల హవా కొనసాగింది. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరిగిన పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో ఒకేషనల్ కలిపి 7,624 మంది పరీక్షలకు హాజరవగా అందులో 4,628 మంది ఉత్తీర్ణత సాధించారు. -
పెరిగిన వినియోగం.. తగ్గిన గృహజ్యోతి లబ్ధిదారులు
[ 25-04-2024]
వేసవి ఎండల తీవ్రత కారణంగా విద్యుత్తు వినియోగం భారీగా పెరిగింది. దీని ప్రభావం గృహజ్యోతి పథకం లబ్ధిదారులపై పడింది. దీంతో చాలా మంది మార్చిలో ఈ పథకానికి అనర్హులుగా తేలారు. -
ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్లు కుమ్మక్కు: కేటీఆర్
[ 25-04-2024]
ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని, అందుకే ప్రజలకు తెలియని వ్యక్తిని కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
ఇంటర్లో బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ప్రథమ సంవత్సరంలో 5,717 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 2,955 మంది ఉత్తీర్ణులయ్యారు. 51.69 శాతం ఉత్తీర్ణత నమోదైంది. వొకేషనల్లో 949 మంది విద్యార్థులకుగాను 419 మంది ఉత్తీర్ణత సాధించారు. -
భానుడి భగభగ
[ 25-04-2024]
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నమోదైన పది గరిష్ఠ పగటి ఉష్ణోగ్రత ప్రాంతాల్లో కరీంనగర్ జిల్లాలోని రెండు ప్రదేశాలున్నాయి. -
బెదిరింపు రాజకీయాలు సరికాదు
[ 25-04-2024]
కాంగ్రెస్ నాయకులు బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతూ తమ పార్టీ అభ్యర్థులు, శ్రేణులను చేర్చుకుంటున్నారని, అలాంటి చర్యలు తగవని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!