పథకం ప్రకారమే ముగ్గురి హత్య
మంత్రాలు చేస్తున్నారనే అనుమానంతో జగిత్యాల పట్టణంలోని టీఆర్నగర్లో గురువారం జగన్నాథం నాగేశ్వర్రావు అతని కుమారులు రాంబాబు, రమేశ్ల హత్య ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. శుక్రవారం
టీఆర్నగర్ కేసులో పోలీసుల దర్యాప్తు
న్యూస్టుడే జగిత్యాల, జగిత్యాల గ్రామీణం
మృతదేహాల వద్ద కుటుంబ సభ్యుల రోదనలు
మంత్రాలు చేస్తున్నారనే అనుమానంతో జగిత్యాల పట్టణంలోని టీఆర్నగర్లో గురువారం జగన్నాథం నాగేశ్వర్రావు అతని కుమారులు రాంబాబు, రమేశ్ల హత్య ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. శుక్రవారం మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి పోలీసు భద్రత మధ్య అంత్యక్రియలు జరిపారు. డీఎస్పీ ప్రకాశ్, రూరల్ సీఐ కృష్ణకుమార్, రూరల్ ఎస్సై అనిల్ కేసు దర్యాప్తు చేపట్టారు. గురువారం రాత్రి 8 మంది వనం దుర్గయ్య, చిన్న గంగయ్య, మధు, పోషయ్య, శేఖర్, దాసరి రాములు, పల్లాని భూమయ్య, కందుల శ్రీనుపై కేసు నమోదు చేయగా వారంతా పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. మంత్రాలు చేస్తున్నారని, పాత కక్షల కారణంగా అందరం కలిసి పథకం ప్రకారమే హత్య చేసినట్లు నిందితులు పోలీసుల సమక్షంలో ఒప్పుకున్నట్లు తెలిసింది.
ఆరోజు తప్పించుకుని..
నాగేశ్వర్రావుపై కొన్నేళ్లుగా మంత్రాలు చేస్తున్నాడని, అధిక వడ్డీతో తమను దోచుకుంటున్నాడని టీఆర్నగర్కు చెందిన ఎరుకల కాలనీ వాసుల్లో వ్యతిరేకత నెలకొంది. కాలనీలో 40 కుటుంబాలు ఒక వర్గం, నాగేశ్వర్రావు కుటుంబం ఒక వర్గంగా ఉంటున్నారు. అయితే గ్రామానికి చెందిన శంకరమ్మ అనే మహిళ అనారోగ్యంతో నాలుగు నెలల కిందట మృతి చెందింది. దీనికి కారణం నాగేశ్వర్రావు మంత్రాలు చేయడమేనని కాలనీ వాసులంతా ఒక్కటయ్యారు. అప్పు ఇచ్చిన డబ్బులు ఇస్తామని గత నెలలో సిరిసిల్ల సమీపంలో ఆగ్రహారం వద్దకు నాగేశ్వర్రావు అతని కుమారులు రాంబాబు, రమేశ్ను మృతి చెందిన మహిళ తరఫున వారు పిలిపించి ముగ్గురిపై దాడిచేశారు. ఈ దాడిలో కారు ధ్వంసం కాగా ఎట్టకేలకు ముగ్గురు తప్పించుకున్నారు. ప్రస్తుతం వారు గ్రామంలోనే ఉంటున్నారు. ప్రతి జనవరి 20న కుల సంఘం సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ఎలాగైనా వారిని హతమార్చాలని పథకం రచించారు. కత్తులు, బరిసెలతో అక్కడికి చేరుకుని సమావేశం జరుగుతుండగానే ముందుగా నాగేశ్వర్రావుపై, మరికొంత రాంబాబు, రమేశ్పై దాడి చేశారు. నాగేశ్వర్రావు మెడ కోయగా ఛాతిభాగంలో రెండు చోట్ల కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. రాంబాబుపై 16, రమేశ్పై 15 కత్తిపోట్లను గుర్తించారు. ఈ హత్యలో 8 నుంచి 10 మంది పాల్గొన్నట్లు పోలీసుల ద్వారా తెలిసింది. అయితే హత్య చేయాలని అంతా కలిసి నిర్ణయం తీసుకున్నట్లు కాలనీ వాసులు శుక్రవారం పోలీసుల సమక్షంలో బహిరంగంగానే చెప్పారు. ఎంతో మందిని చంపారని, అధిక వడ్డీలతో తమను దోచుకున్నారని పలువురు మహిళలు పోలీసుల ముందు కన్నీళ్ల పర్యంతమయ్యారు. నాగేశ్వర్రావు అతని కుమారులు రాంబాబు, రమేశ్ మృతదేహాలకు గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించగా గ్రామానికి చెందిన ఒక్కరు కూడా హాజరు కాలేదు. అతని కుటుంబానికి చెందిన వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బంధువులు మాత్రమే అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
అంత్యక్రియలకు హాజరుకాని కుమారులు
నాగేశ్వర్రావుకు ఇద్దరు భార్యలు. పెద్ద భార్యకు ముగ్గురు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. ఇందులో చిన్న కుమారుడు రాజేశ్ను ప్రత్యర్థులు వెంబడించగా కొద్దిలో తప్పించుకుని పారిపోవటంతో ప్రాణాలతో బయటపడ్డారు. బంధువుల ఇళ్లలో తలదాచుకున్నాడు. రెండో భార్యకు కుమారుడు విజయ్, కూతురు ఉండగా విజయ్ సైతం భయంతో అతని బంధువు ఇళ్లలోనే ఉండిపోయి తండ్రి, సోదరుల అంత్యక్రియలకు హాజరు కాలేదు.
మరికొన్ని రోజులు పోలీసుల పికెట్
పోలీసు బందోబస్తు
మిగిలిన నాగేశ్వర్రావు కుటుంబ సభ్యులకు సైతం మంత్రాలు వస్తాయని వారిని హతమారుస్తామని, వారు గ్రామంలో ఉండవద్దని కాలనీవాసులు పోలీసుల ముందే హెచ్చరించడంతో మరికొన్ని రోజులు గ్రామంలో పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేస్తామని, చేతబడిపై అవగాహన కల్పిస్తామని జగిత్యాల డీఎస్పీ ప్రకాశ్ తెలిపారు. కాలనీవాసుల్లో నాగేశ్వర్రావు కుటుంబంపై ఇంకా కోపం ఉండడంతో పోలీసులు గట్టి భద్రతా చర్యలు చేపట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్వితీయంలో 4.. ప్రథమంలో 5
[ 25-04-2024]
రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు వారు బుధవారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. గత విద్యాసంవత్సరం కంటే మెరుగైన ఫలితాలను సాధించారు. ద్వితీయ సంవత్సరంలో నాలుగు, ప్రథమలో అయిదో స్థానం సాధించారు. -
రాజేందర్రావు చేతికే టికెట్
[ 25-04-2024]
రోజుల తరబడి నిరీక్షణకు కాంగ్రెస్ పార్టీ తెరదించింది. ఎట్టకేలకు నామినేషన్ల చివరి రోజుకు ముందు బుధవారం రాత్రి అభ్యర్థిని ప్రకటించింది. కరీంనగర్ లోక్సభ స్థానంలో పోటీ చేసేందుకు వెలిచాల రాజేందర్రావుకు అవకాశమిచ్చింది. -
కాంగ్రెస్తో భారాస నేతల కుమ్మక్కు
[ 25-04-2024]
కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలని తాను కొట్లాడుతుంటే భారాస నేతలు ఆ పార్టీతో కుమ్మక్కై తనను ఓడించాలని చూస్తున్నారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విమర్శించారు. -
ఆరో రోజు 17 నామినేషన్లు
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలక అంకానికి గురువారంతో తెరపడనుంది. లోక్సభ నియోజకవర్గం బరిలో నిలిచే అభ్యర్థుల నామినేషన్ దాఖలుకు నేడు చివరి రోజు కావడంతో గడిచిన వారం రోజుల నుంచి కొనసాగుతున్న ప్రక్రియ మధ్యాహ్నం 3 గంటలతో ముగియనుంది. -
పేదింటి బిడ్డలు ఇంటర్లో మెరిశారు
[ 25-04-2024]
కరీంనగర్ విద్యావిభాగం, భాగ్యనగర్, న్యూస్టుడే : ఇంటర్మీడియెట్ ఫలితాల్లో పేద విద్యార్థులు ప్రతిభ చాటారు. తల్లిదండ్రులు కష్టపడి చదివించగా.. వారి పేరు నిలబెట్టారు. ఉపాధ్యాయుల సహకారంతో ఉత్తమ మార్కులు సాధించారు. -
భూ కబ్జా వ్యవహారంలో కార్పొరేటర్.. ఆమె భర్తపై కేసు
[ 25-04-2024]
కొనుగోలు చేసిన భూమికి సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించడమే కాకుండా బాధితుడిని డబ్బుల కోసం బెదిరించిన నాయకులతోపాటు వారికి సహకరించిన నగరపాలక సంస్థ సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేసి కొంత మందిని అరెస్టు చేశారు. -
బాలికలదే పై చేయి
[ 25-04-2024]
జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు నిరాశ పరిచాయి. సర్కారు కళాశాలల్లో ఆధునిక వసతులు, సరిపడా బోధన సిబ్బంది, విద్యార్థుల దత్తత, తరుచూ చరవాణిలో తల్లిదండ్రులను సంప్రదించినా ఆశించిన మేర ఫలితాలు రాలేదు. -
జూన్ 6 తర్వాత నిరుపేదలకు ఇళ్లు
[ 25-04-2024]
జూన్ 6 తర్వాత ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్లు ఇచ్చే కార్యాచరణ చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పేర్కొన్నారు. -
భాజపా బీఫామ్ ఎవరికో!
[ 25-04-2024]
నామినేషన్ల ఘట్టం తుది దశకు చేరిన వేళ పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలో భాజపా తరఫున బరిలో ఉండే అభ్యర్థిపై ఉత్కంఠ వీడటం లేదు. పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన గోమాసె శ్రీనివాస్ బుధవారం రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాల్లో అమ్మాయిల హవా కొనసాగింది. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరిగిన పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో ఒకేషనల్ కలిపి 7,624 మంది పరీక్షలకు హాజరవగా అందులో 4,628 మంది ఉత్తీర్ణత సాధించారు. -
పెరిగిన వినియోగం.. తగ్గిన గృహజ్యోతి లబ్ధిదారులు
[ 25-04-2024]
వేసవి ఎండల తీవ్రత కారణంగా విద్యుత్తు వినియోగం భారీగా పెరిగింది. దీని ప్రభావం గృహజ్యోతి పథకం లబ్ధిదారులపై పడింది. దీంతో చాలా మంది మార్చిలో ఈ పథకానికి అనర్హులుగా తేలారు. -
ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్లు కుమ్మక్కు: కేటీఆర్
[ 25-04-2024]
ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని, అందుకే ప్రజలకు తెలియని వ్యక్తిని కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
ఇంటర్లో బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ప్రథమ సంవత్సరంలో 5,717 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 2,955 మంది ఉత్తీర్ణులయ్యారు. 51.69 శాతం ఉత్తీర్ణత నమోదైంది. వొకేషనల్లో 949 మంది విద్యార్థులకుగాను 419 మంది ఉత్తీర్ణత సాధించారు. -
భానుడి భగభగ
[ 25-04-2024]
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నమోదైన పది గరిష్ఠ పగటి ఉష్ణోగ్రత ప్రాంతాల్లో కరీంనగర్ జిల్లాలోని రెండు ప్రదేశాలున్నాయి. -
బెదిరింపు రాజకీయాలు సరికాదు
[ 25-04-2024]
కాంగ్రెస్ నాయకులు బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతూ తమ పార్టీ అభ్యర్థులు, శ్రేణులను చేర్చుకుంటున్నారని, అలాంటి చర్యలు తగవని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
-
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు