మురుగు జలాల ‘శుద్ధీకరణ’
కరీంనగర్ నగరాన్ని ఆకర్షణీయంగా, పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు చకచకా పనులు కొనసాగుతున్నాయి. అన్ని హంగులతో తీర్చిదిద్దుకుంటున్న నగరంలో జనాభా పెరగడంతో పాటు ఇళ్ల సంఖ్య, కాలనీల విస్తీర్ణం పెరిగింది.
వాటర్ ప్లస్ హోదా కోసం నగరపాలిక కసరత్తు
న్యూస్టుడే, కరీంనగర్ కార్పొరేషన్
నగర వీధుల్లోంచి ప్రతిరోజు లక్షల లీటర్ల మురుగునీరు కాల్వల గుండా మానేరు నది వరకు ప్రవహిస్తోంది. ఇందులో కొంత నీరు పొలాలకు మళ్లిస్తుండగా..మిగతా నీరంతా నదిలో కలుస్తోంది.
కరీంనగర్ నగరాన్ని ఆకర్షణీయంగా, పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు చకచకా పనులు కొనసాగుతున్నాయి. అన్ని హంగులతో తీర్చిదిద్దుకుంటున్న నగరంలో జనాభా పెరగడంతో పాటు ఇళ్ల సంఖ్య, కాలనీల విస్తీర్ణం పెరిగింది. దీనికి తోడు కాల్వల గుండా వచ్చే మురుగునీరంతా లక్షల లీటర్ల మేర ఉండగా మానేరు నదిలో ప్రవహిస్తోంది. చుట్టూ ఉన్న ప్రాంతాల్లో భూగర్భ జలాలు కూడా కలుషితం అవుతున్నాయనే ఫిర్యాదులు లేకపోలేదు. 30ఎంఎల్డీల మురుగునీరు బయటకు వస్తుండగా ఇదంతా శుద్ధి చేయడం ద్వారా పునర్వినియోగానికి అవకాశం కల్పించాలనే లక్ష్యంతో స్మార్ట్సిటీ ప్రాజెక్టులో ప్రాధాన్యం ఇచ్చారు. వాటర్ ప్లస్ హోదా సాధించేందుకు కసరత్తు ప్రారంభించారు.
రోజుకు 2 ఎంఎల్డీలు
భూగర్భ మురుగునీటి శుద్ధి కేంద్రం 38ఎంఎల్డీల సామర్థ్యంతో ఉండగా ప్రస్తుతం సుమారు 3,500 ఇళ్లకు కనెక్షన్లు ఇచ్చి రోజుకు 2ఎంఎల్డీల మురుగునీటిని శుద్ధి చేస్తున్నారు. శుద్ధి చేసిన నీరంతా చెరువుల్లోకి వదిలి పెట్టాల్సి ఉంటుంది. ఆ ప్రక్రియ సక్రమంగా జరగకపోవడంతో శుద్ధి చేసిన నీరంతా మురుగునీటిలోనే కలుస్తోంది.
ఏమిటీ వాటర్ ప్లస్..
స్వచ్ఛతలో పోటీ పడేందుకు కేంద్ర ప్రభుత్వం ఏటా స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకులను ప్రకటిస్తోంది. ఓడీఎఫ్, ఓడీఎఫ్+, ఓడీఎఫ్++ సర్టిఫికెట్లను అందిస్తోంది. ఇవన్నీ సాధించిన పుర, నగరపాలికలు ‘వాటర్ ప్లస్’ హోదాకు దరఖాస్తు చేసుకోవాలని గతేడాది కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సూచించింది. వ్యర్థ జలాలను శుద్ధి చేసి పునర్వినియోగించే నగరాలకు ఈ గుర్తింపు ఇవ్వనుంది. ఈ హోదా దక్కితే స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో అదనపు మార్కులు కలుస్తాయి. వచ్చే మురుగునీటిలో 30శాతం శుద్ధీకరణ చేసిన అర్హత సాధించే వీలుంది.
రెండు చోట్ల ఎస్టీపీల నిర్మాణం
నగరపాలక సంస్థ పరిధిలో ఇప్పటికే భూగర్భ మురుగునీటి శుద్ధి కేంద్రం ఉంది. దీనికి తోడుగా అదనంగా రెండు చోట్ల నిర్మించేందుకు అనుమతి తీసుకున్నారు. హైదరాబాద్ హైవేలో కోతిరాంపూర్లో 14.9 ఎంఎల్డీలు, జ్యోతినగర్లో 13.3ఎంఎల్డీల సామర్థ్యంతో వీటిని నిర్మిస్తారు. ఈ పనులు పూర్తయితే నది జలాలు కలుషితమయ్యే ప్రమాదం తప్పడంతో పాటు ఆరోగ్యకర వాతావరణం నెలకొంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
హోదా సాధిస్తాం: - వై.సునీల్రావు, మేయర్, కరీంనగర్
మురుగునీటిని శుద్ధి చేసేందుకు కార్యాచరణ తీసుకున్నాం. ప్రస్తుతమున్న ఎస్టీపీ దగ్గర శుద్ధి చేసిన నీటిని సరైన విధంగా తిరిగి ఉపయోగించుకుంటే కచ్చితంగా వాటర్ ప్లస్ హోదా సాధించే వీలుంది. దీంతో పాటు అదనంగా స్మార్ట్సిటీలో రెండు ఎస్టీపీలు నిర్మించేందుకు త్వరలోనే టెండర్లు పిలుస్తాం. వాటర్ప్లస్ హోదా కోసం చేస్తున్న కృషిని ఇటీవల జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ అభినందించారు.
భూగర్భ మురుగునీటి శుద్ధి కేంద్రంలో శుద్ధి అవుతున్న నీరు పైపులైను ద్వారా చెరువుల్లోకి పంపించాలి. శుద్ధి చేసిన నీరంతా మళ్లీ మురుగునీటిలోనే కలిసిపోయి చెరువుల్లోకి వెళుతోంది.
డివిజన్లు : 60
నగర విస్తీర్ణం : 65.33చకిమీ
జనాభా : 3,51,344
ఇళ్ల సంఖ్య: 62,840
రోజు వచ్చే మురుగునీరు: 30ఎంఎల్డీలు
ఎస్టీపీలో శుద్ధి : 2ఎంఎల్డీలు
కొత్తగా నిర్మించేవి : 2 ఎస్టీపీలు
నిధుల కేటాయింపు(అంచనా): రూ.5.26కోట్లు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పత్తి రైతులు, వ్యాపారుల ఆందోళన
[ 23-04-2024]
ఎన్నికల కోడ్ పేరుతో తనిఖీలు నిర్వహించి బ్యాంకుల నుంచి డబ్బును తీసుకొస్తున్న తమను ఇబ్బందులకు గురి చేయవద్దని జమ్మికుంట పత్తి మార్కెట్ వద్ద వ్యాపారులు, పత్తి రైతులు ఆందోళనకు దిగారు. -
మానేరు వాగుపై కూలిన నిర్మాణంలోని వంతెన
[ 23-04-2024]
పెద్దపల్లి జిల్లాలో మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. ముత్తారం మండలం ఓడేడు పరిధిలో సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. -
పిల్లల అల్లరిని దారి మళ్లించండి
[ 23-04-2024]
పది నెలలపాటు చదువుతో కుస్తీ పడిన పిల్లలకు వేసవి సెలవులు ఉపశమనం ఇస్తాయి. ఆటాపాటలతో సరదాగా గడపొచ్చని భావిస్తుంటారు. -
మోదీ వ్యాఖ్యల్లో ఓటమి భయం
[ 23-04-2024]
లోక్సభ మొదటి దశ ఎన్నికల తీరును చూసిన ప్రధాని మోదీ ఓటమి భయంతో దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సంపద అంతా ముస్లింలకు ఇస్తుందని వ్యాఖ్యానించారని మంత్రి పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు. -
నాలుగో రోజు 25 నామినేషన్లు
[ 23-04-2024]
నామినేషన్ల ప్రక్రియ నాలుగో రోజు సోమవారం కరీంనగర్, పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గ స్థానాలకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. -
హామీలను విస్మరించిన ప్రభుత్వం
[ 23-04-2024]
శాసనసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిందని కరీంనగర్ భారాస అభ్యర్థి వినోద్కుమార్ అన్నారు. -
సెప్టెంబరులో చక్కెర కర్మాగారం తెరిపిస్తాం
[ 23-04-2024]
శాసనసభ ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీ మేరకు నిజాం చక్కెర కర్మాగారాలు తెరిపించేందుకు అవసరమైన చర్యలు చేపట్టినట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. -
అవకాశమిస్తే అభివృద్ధి చేసి చూపిస్తా!
[ 23-04-2024]
ప్రాంతానికి కొత్త కావచ్చు, రాజకీయాలకు, ప్రజా సేవకు కొత్తకాదని, అవకాశమిస్తే పార్లమెంట్ పరిధిని అభివృద్ధి చేసి చూపిస్తానని నిజామాబాద్ భారాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. -
దారులన్నీ కొండగట్టుకే
[ 23-04-2024]
తమ ఇష్టదైవాన్ని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి దీక్షాపరులు తరలివస్తున్నారు. -
ఓటరు నమోదులో ఫలించిన చైతన్యం
[ 23-04-2024]
ప్రజాస్వామ్యం కల్పించిన ఓటు హక్కు నమోదుకు యువతలో నూతనోత్సాహం ఉరకలేసింది. -
ప్రత్యేక నిధులు.. తీరనున్న ఇక్కట్లు
[ 23-04-2024]
రామగుండం నగరపాలక ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు అమృత్-2.0, యు.ఐ.డి.ఎఫ్.(అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్) నిధులతో పరిష్కారం కానున్నాయి. -
కాంగ్రెస్ నైజాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి
[ 23-04-2024]
భారాస పాలనలోనే అన్ని వర్గాల ప్రజలు సంక్షేమ ఫలాలు అందుకున్నారని, గడిచిన నాలుగు నెలల కాలంలో సంక్షేమ పథకాలను అటకెక్కించిన కాంగ్రెస్ పాలకుల నైజాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పెద్దపల్లి లోక్సభ భారాస అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. -
లెక్కలు తేలేనా?
[ 23-04-2024]
జిల్లా వస్త్ర పరిశ్రమకు గత ప్రభుత్వం సంక్షేమ, పాఠశాల విద్యాశాఖలకు సంబంధించిన వస్త్రోత్పత్తుల ఆర్డర్లు ఇచ్చింది. -
నిధులున్నా ప్రారంభం కాని పనులు
[ 23-04-2024]
గ్రామీణ, గిరిజన ప్రాంతాలకు రవాణా వ్యవస్థ మెరుగుపరిచి రెండు జిల్లాల గ్రామాలను అనుసంధానం చేయాలనే లక్ష్యంతో తారు రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. -
పట్టాలెక్కని ప్రతిపాదనలు
[ 23-04-2024]
ఉమ్మడి జిల్లాలో రైల్వే శాఖాపరంగా అభివృద్ధికి అడుగులు పడాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు. -
అమాత్యులుగా ఆ నలుగురు
[ 23-04-2024]
ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, పెద్దపల్లి లోక్సభా నియోజకవర్గాల నుంచి ఎన్నికైన ఎంపీల్లో ఇప్పటివరకు నలుగురికి మాత్రమే కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది.
తాజా వార్తలు (Latest News)
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM