రాజన్న ఆలయంలో కల్యాణాలకు కష్టం
దక్షిణకాశీగా పేరొందిన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామిని దర్శించుకున్న భక్తులు వివిధ పూజలు చేయించుకుంటారు. అయితే భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
భక్తులకు సరిపోని మండపం
న్యూస్టుడే, వేములవాడ గ్రామీణం
ఇటీవల కల్యాణ పూజలో పాల్గొన్న భక్తులు
దక్షిణకాశీగా పేరొందిన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామిని దర్శించుకున్న భక్తులు వివిధ పూజలు చేయించుకుంటారు. అయితే భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వేలాది మంది పాల్గొనే వివిధ పూజా కార్యక్రమాలకు సరైన వసతి లేక అవస్థలు తప్పడం లేదు.
రాజన్నను దర్శించుకున్న భక్తులు, కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలు ఆలయంలో కల్యాణ పూజలు, సత్యనారాయణ వ్రతాలు, చండీ హోమం, మహా లింగార్చన పూజలు చేయించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. వీటిని నిత్య కల్యాణమండపంలో ఆలయ అధికారులు, అర్చకులు నిర్వహిస్తుంటారు. కల్యాణాలు (టికెట్ ధర రూ.1,500) పైఅంతస్తులో, గ్రౌండ్ ఫ్లోర్లో సత్యనారాయణ వ్రతాలు (టికెట్ ధర రూ.600), మహాలింగార్చన (టికెట్ ధర రూ.1000) పూజలను నిర్వహిస్తుంటారు. వాస్తవానికి ఈ మండపంలో జరిగే పూజా కార్యక్రమంలో కూర్చోవడానికి 150 టికెట్లు జారీ చేశారు. ఒక్కోదానిపై ఇద్దరిని చొప్పున అనుమతిస్తుంటారు. ప్రస్తుతం ఆలయానికి పోటెత్తుతున్న భక్తులతో చాలా మందికి టికెట్లు లభించని పరిస్థితి ఉంది. డిమాండ్ మేరకు ఒక్కో సందర్భంలో 200 పైగా టికెట్లు విక్రయిస్తుంటారు. దీంతో పూజా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు భక్తులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. టికెట్లు లభించని సందర్భంలో ఆలయ సిబ్బందిపై భక్తులు దురుసుగా ప్రవర్తించిన సంఘటనలు కూడా ఉన్నాయి.
పరిమిత సంఖ్యలోనే టికెట్ల విక్రయం- బ్రహ్మన్నగారి శ్రీనివాస్, ఏఈవో రాజన్న ఆలయం
నిత్య కల్యాణ మండపం చిన్నదిగా ఉండటంతో ఇబ్బందిగా ఉంది. వాస్తవానికి 100 నుంచి 150 వరకు కల్యాణ టికెట్లు ఇవ్వాల్సి ఉంది. భక్తుల డిమాండ్ మేరకు ఒక్కోసారి 200లకు పైగా ఇస్తున్నాం. అయినా చాలా మంది టికెట్లు లభించక వాయిదా వేసుకొని మరుసటి రోజు పూజలు చేయించుకుంటున్నారు. ప్రస్తుతం కొవిడ్, ఒమిక్రాన్ కేసులు ఎక్కువగా ఉండటంతో రోజుకు వంద వరకే ఇస్తున్నాం.
డిమాండు ఎక్కువ... టికెట్లు తక్కువ
ఆలయంలో వివిధ పూజలు చేయించుకునే టికెట్లు లభించకపోవడంతో మరుసటి రోజు వరకు నిరీక్షించాల్సిన పరిస్థితి భక్తులను ఆందోళనకు గురిచేస్తోంది. కొవిడ్, ఒమిక్రాన్ వ్యాప్తి చెందక ముందు ఆది, సోమ, శుక్రవారాల్లో వేలాది మంది స్వామివారి దర్శనానికి వచ్చి వివిధ పూజల్లో పాల్గొంటుంటారు. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో రోజుకు 150 నుంచి 200 వరకు టికెట్లు విక్రయిస్తున్నారు. అయినా చాలా మందికి టికెట్లు లభించక మరుసటి రోజు టికెట్లు పొంది కల్యాణ పూజ జరిపించుకున్న సందర్భాలున్నాయి. కొవిడ్, ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో టికెట్లను పరిమిత సంఖ్యలో విక్రయిస్తున్నారు. దీంతో చాలా మందికి నిరాశ తప్పడం లేదు. వాస్తవానికి గతంలో తక్కువ మంది కల్యాణాలు చేయించుకోవడంతో ఈ పూజలన్నింటిని ఆలయ అద్దాల మండపంలో నిర్వహించేవారు. ప్రస్తుతం రద్దీ పెరగడంతో కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ కోసం నిర్మించిన కళా భవనాన్ని నిత్య కల్యాణమండపంగా మార్చారు. ఇది కూడా ప్రస్తుత రద్దీకి ఏమాత్రం సరిపడటం లేదు. దీంతో భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. టికెట్లు లభించక చాలా మంది పూజా కార్యక్రమాలను వాయిదా వేసుకొని వెళ్లిపోతున్నారు. పలువురు మరుసటి రోజు టికెట్ పొంది పూజలు చేయించుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
[ 19-04-2024]
కమాన్పూర్ మండలం రొంపికుంట ఉపకేంద్రం పరిధిలో ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని ట్రాన్స్ కో ఏఈ రాజేంద్ర కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
పద్మవ్యూహంలో ఉన్నా.. నావైపూ చూడండి
[ 19-04-2024]
‘నిజామాబాద్ నియోజకవర్గం పద్మవ్యూహంలా ఉంది. నన్ను అభిమన్యుడిని చేస్తారో.. అర్జునుడిని చేస్తారో అంతా మీ చేతుల్లో ఉంది’ అని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుతో నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్రెడ్డి పేర్కొన్నారు. -
మొదటిరోజు ఆరు నామినేషన్లు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం గురువారం ప్రారంభమైంది. మొదటి రోజు స్వతంత్ర అభ్యర్థులు మాత్రమే నామపత్రాలను దాఖలు చేశారు. కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు కోట శ్యామ్కుమార్, పోతూరి రాజేందర్లు -
350 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్
[ 19-04-2024]
హుజూరాబాద్లో పట్టుబడ్డ 350 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులు గురువారం సీజ్ చేశారు. హనుమకొండ జిల్లా పరకాలలోని శ్రీరాజరాజేశ్వర రైస్మిల్లులో 1,347 బస్తాల బియ్యాన్ని లారీలో లోడ్ చేసి... -
కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేయండి
[ 19-04-2024]
పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపునకు కలిసికట్టుగా కృషి చేయాలని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. ధర్మపురి పట్టణంలోని ఓ వేడుక మందిరంలో పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల... -
గీతదాటితే కొరడా ఝళిపిస్తారు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఆ మేరకు ఉమ్మడి జిల్లాలో రాజకీయ పార్టీల ప్రచార పర్వం వేడెక్కనుంది. మరోవైపు ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఎంసీసీ (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్)ని తీసుకొచ్చింది. -
కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు : మంత్రి
[ 19-04-2024]
ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులను ఇస్తామని, అవసరమైతే పక్క రాష్ట్రం నుంచి భిక్షాటన చేసైనా పదవులను తెచ్చిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ అన్నారు. -
నాలుగేళ్లా.. రెండేళ్లా!
[ 19-04-2024]
సింగరేణి గుర్తింపు సంఘం కాలపరిమితిపై సందిగ్ధం నెలకొంది. గెలిచిన అనంతరం సంఘానికి అధికారిక పత్రం ఇప్పటి వరకు అందలేదు.గుర్తింపు ఎన్నికలకు ముందు కాలపరిమితిపై స్పష్టత లేకపోవడంతో ఫలితాల అనంతరం కార్మిక శాఖ -
గంట ముందే పోలింగ్ ప్రారంభం
[ 19-04-2024]
గోదావరి పరీవాహక ప్రాంతం.. అంతర్రాష్ట్ర సరిహద్దు.. దట్టమైన అడవులు విస్తరించిన పెద్దపల్లి లోక్సభ పరిధిలో కొన్ని ప్రాంతాల్లో ముందస్తు పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. -
రహదారి నిర్మించారు.. సమస్యలు మరిచారు
[ 19-04-2024]
గుంతల రహదారితో ఇబ్బందులు ఎదురవుతుండటంతో ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. దీంతో పక్కా రోడ్డు నిర్మాణంతో రవాణా సదుపాయం మెరుగైంది. దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం లభించింది. -
స్థలం కేటాయించారు.. ఆసుపత్రి నిర్మాణం విస్మరించారు
[ 19-04-2024]
తంగళ్లపల్లి మండలం టెక్స్టైల్ పార్కు వద్ద బీడీ కార్మికుల కోసం ఏర్పాటు చేసే ఈఎస్ఐ ఆసుపత్రికి పదేళ్ల క్రితం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 13 ఎకరాల స్థలం కేటాయించింది. -
ఓట్లు కొల్లగొట్టి.. దిల్లీ తలుపుతట్టి
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలో కొంత మంది నేతలు అత్యధిక ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. రికార్డు స్థాయిలో ఓట్లు సంపాదించి ప్రత్యర్థులకు అందనంత దూరంలో నిలిచారు. -
స్వశక్తి.. ప్రజాస్వామ్య స్ఫూర్తి
[ 19-04-2024]
అన్నింటా ముందుంటున్న అతివలు ప్రతి ఎన్నికల్లో అధిక సంఖ్యలో ఓటు వేయడంలోనూ పైచేయి సాధిస్తున్నారు. ప్రజాస్వామ్యం కల్పించిన వజ్రాయుధాన్ని తప్పనిసరిగా వినియోగించుకొంటూ స్ఫూర్తి నింపుతున్నారు. -
ఇంటి నుంచే నామినేషన్
[ 19-04-2024]
ఎన్నికల ప్రక్రియను సులభతరం చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. ఓటరు నమోదు, ప్రచార సభలు, సమావేశాల నిర్వహణకు అనుమతుల కోసం -
17 ఎన్నికలు.. ఒక్కసారే అతివకు అవకాశం
[ 19-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి సాధారణ, ఉప ఎన్నికలతో కలిపి ఇప్పటివరకు 17 సార్లు ఎన్నికలు జరగగా ఒక్కసారే మహిళకు అవకాశం లభించింది. -
ఫోన్ ట్యాపింగ్లో ఎవరినీ వదిలేది లేదు
[ 19-04-2024]
రాముడిపై తాను అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఎంపీ బండి సంజయ్ నిరూపిస్తే సజీవ దహనం చేసుకుంటానని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ పొన్నం ప్రభాకర్ అన్నారు. -
వామ్మో.. ఇదేం ఎండ!
[ 19-04-2024]
జనం బెదిరేలా ఎండ ఠారెత్తిస్తోంది. ఉమ్మడి జిల్లాను ఉక్కపోతతో ఉడికిస్తోంది. రోజురోజుకు గణనీయంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు గురువారంతో మరింతగా పెరిగాయి. -
గంజాయి మాయం కేసులో ఇద్దరు ఎస్సైలు సహా నలుగురి సస్పెన్షన్తో కలకలం
[ 19-04-2024]
సారంగాపూర్ పోలీసుస్టేషన్ నుంచి గంజాయి మాయమైన సంఘటనలో ఇద్దరు ఎస్సైలు సహా నలుగురు సస్పెన్షన్కు గురవడం కలకలం రేపింది. -
చిట్టీల పేరిట ఆర్ఎంపీ డబ్బు వసూళ్లు
[ 19-04-2024]
శంకరపట్నం మండలం కొత్తగట్టులో ఓ ఆర్ఎంపీ సుమారు రూ.70 లక్షలతో ఉడాయించినట్లు ఆలస్యంగా తెలిసింది. బాధితుల కథనం ప్రకారం..
తాజా వార్తలు (Latest News)
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు
-
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
-
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ