కేసీఆర్కు భయం మొదలైంది
ఇటీవల ఒక సర్వే ప్రపంచ వ్యాప్తంగా నంబర్ వన్ నాయకుడు నరేంద్ర మోదీ అని ప్రకటించడంతో కేసీఆర్కు భయం మొదలైందని కరీంనగర్ ఎంపీ, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. సిరిసిల్లలోని
సిరిసిల్లలోని సమావేశంలో మాట్లాడుతున్న బండి సంజయ్
సిరిసిల్ల (విద్యానగర్), న్యూస్టుడే: ఇటీవల ఒక సర్వే ప్రపంచ వ్యాప్తంగా నంబర్ వన్ నాయకుడు నరేంద్ర మోదీ అని ప్రకటించడంతో కేసీఆర్కు భయం మొదలైందని కరీంనగర్ ఎంపీ, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. సిరిసిల్లలోని లహరిగ్రాండ్లో సోమవారం జరిగిన భాజపా నియోజకవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రానికి నంబర్వన్ ద్రోహి ముఖ్యమంత్రి కేసీఆర్ అని విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పార్లమెంటులో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం బిల్లు పాసైనప్పటి నుంచి ప్రజలను ద్రోహం చేస్తున్నారన్నారు. ఆరు పార్లమెంటు నియోజకవర్గ స్థానాలలో భాజపా విజయం ఖాయమని సర్వే తెలిపిందని, తెరాస పతనం ప్రారంభమైందన్నారు. ఎస్సీ నియోజకవర్గాలలో భాజపా సమన్వయ కమిటీలు వేసినట్లు చెప్పారు. ఎస్సీ నియోజక వర్గాలలో ఏ పార్టీ విజయం సాధిస్తే అదే పార్టీ అధికారంలోకి వస్తుందని తెరాస సెంటిమెంట్ అని, అందుకే రాష్ట్రంలోని దళితులందరికీ దళితబంధు అందజేస్తామని ప్రకటించారని ఆరోపించారు. మొన్నటి వరకు హామీ ఇచ్చిన హుజూరాబాద్ నియోజకవర్గంలోనే పూర్తిగా దళితబంధు అందజేయలేదని, ఇప్పుడు భాజపాపై భయం, ప్రజలలో వ్యతిరేకత కారణంగా రాష్ట్రమంతటా దళితులకు దళితబంధు అందిస్తాననడం విడ్డూరమన్నారు. రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఏడుస్తున్నారన్నారు. ఏ స్థానికత కోసమైతే తెలంగాణ సాధించామో ఇప్పుడు ఆ స్థానికత కోసమే రాష్ట్రంలో గొడవలు జరగనున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రజలు ఒక సమస్య గురించి బాధపడుతుండగానే ప్రభుత్వం ఇంకో సమస్య వైపు దృష్టి మళ్లిస్తోందన్నారు. 317 జీవోను రద్దు చేయాలని ప్రజాస్వామ్యబద్ధంగా దీక్ష చేస్తుంటే జైలుకు పంపించారని పేర్కొన్నారు. రాష్ట్రంలో తెరాస ఎమ్మెల్యేలు, మంత్రులు భాజపాపై భయంతో ప్రశాంతంగా పర్యటించలేకపోతున్నారన్నారు. అందుకే భాజపా కార్యకర్తలు, నాయకులను అరెస్టులు చేస్తున్నారన్నారు. తెరాస కార్యక్రమాలు నిర్వహించేప్పుడు లేని కరోనా భాజపా దీక్ష చేస్తుంటేనే గుర్తొస్తుందా అన్ని ప్రశ్నించారు. 317 జీవో రద్దు గురించి ఉద్యోగ, ఉపాధ్యాయులతో జాతీయ నాయకులతో ఈ నెలాఖరులో వర్చువల్ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయులను మూడు విభాగాలుగా విభజించి నెలాఖరులో జాతీయ అధ్యక్షుడు నడ్డా గానీ, అమిత్షా వంటి నాయకులతో వర్చువల్ సమీక్ష నిర్వహించి 317 జీవో రద్దుకు ఒత్తిడి తీసుకువస్తామని చెప్పారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఆందోళన విరమించబోమన్నారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్ తగ్గించాలని నిరసన తెలుపుతుండగా భాజపా పట్టణ అధ్యక్షుడు అన్నల్దాస్ వేణు కాలు విరగగా బండి సంజయ్ ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం, జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, జిల్లా ఇన్ఛార్జి గంగాడి మోహన్రెడ్డి, ఆవునూరి రమాకాంత్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు బర్కం లక్ష్మీ యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి, గౌడ వాసు, ఎర్రం మహేష్, మ్యాన రాంప్రసాద్, బర్కం నవీన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కరీంనగర్ కాంగ్రెస్ టికెట్ ఎవరి చేతికి?.. మల్లగుల్లాలు పడుతున్న అధిష్ఠానం
[ 29-03-2024]
కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి ఖరారుపై ఆ పార్టీ అధిష్ఠానం మల్లగుల్లాలు పడుతోంది.. ఇప్పటికే భారాస, భాజపాల అభ్యర్థులు ఖరారవగా.. హస్తం పార్టీ తరఫున బరిలో నిలిచేదెవరో తెలియకపోవడంతో కాంగ్రెస్ స్థానిక నాయకులు, కార్యకర్తలు అభ్యర్థి తేలేదెప్పుడు.. అని ఆందోళన చెందుతున్నారు. -
కనుల పండువగా శివయ్య కల్యాణం
[ 29-03-2024]
ప్రసిద్ధ శైవక్షేత్రమైన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి క్షేత్రంలో గురువారం శివ కల్యాణోత్సవం కనుల పండువగా జరిగింది. -
ఆందోళన వద్దు.. అవకాశాలు కోకొల్లలు!
[ 29-03-2024]
విద్యార్థులు ప్రాథమిక విద్య నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ పదో తరగతి పూర్తి చేశారు. ఒకట్రెండు రోజుల్లో పరీక్షలు కూడా పూర్తి చేసి ఉన్నతవిద్య వైపు అడుగులు వేయనున్నారు. -
అవసరాల మేరకు ఏదీ అనుసంధానం!
[ 29-03-2024]
ఈ రెండు అంశాల్లోనే కాదు. ప్రయాణికుల అవసరాలు తీర్చడంలో ద.మ.రై.అధికారులు ఆది నుంచీ నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. రైల్వే ఉద్యోగుల అవసరాలు, అధికారులు, నాయకులు లాబీయింగులతోనే కొత్త హాల్టింగులు, ఇతర వసతులు కల్పిస్తున్నారు. -
కరీంనగర్ బస్స్టేషన్ ఆస్తి పన్ను రూ.1.88 కోట్లు చెల్లింపు
[ 29-03-2024]
ఆస్తిపన్ను బకాయిలపై 90 శాతం రాయితీ గడువు మూడు రోజుల్లో ముగుస్తుందని నగరపాలక కమిషనర్ బోనగిరి శ్రీనివాస్ తెలిపారు. -
భార్య చేతిలో భర్త హతం
[ 29-03-2024]
భర్త మద్యానికి బానిసై శారీరకంగా.. మానసికంగా వేధిస్తున్నాడని వేదనకు గురైన ఓ భార్య తనకు తెలిసిన ఇద్దరి సహాయంతో తాళ్లతో కట్టేసి.. కళ్లలో కారం చల్లి... ఒంటిపై వేడి నీళ్లు పోసి తీవ్రంగా కొట్టడంతో స్పృహ కోల్పోయి మృతి చెందాడు. -
లోక్సభ ఎన్నికలు ప్రజాస్వామ్యానికి పరీక్ష
[ 29-03-2024]
రానున్న లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 15 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయమని శాసనమండలి సభ్యుడు, నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి టి.జీవన్రెడ్డి అన్నారు. -
వేసవి గట్టెక్కేనా!
[ 29-03-2024]
జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, రాయికల్ పట్టణాలకు డబ్బాలోని గ్రిడ్ ద్వారా మిషన్ భగీరథ పథకం నీరు సరఫరా అవుతోంది. ధర్మపురి పట్టణానికి డబ్బా నుంచి పైపులైన్లు వేసినా చివరి ప్రాంతం కావడంతో నీరు సరఫరా సక్రమంగా కావడం లేదు. -
మట్టి గుట్టలు మాయం!
[ 29-03-2024]
మండలంలోని వరద కాలువ మట్టిని కొందరు గుత్తేదార్లు, స్తిరాస్థి వ్యాపారులు అక్రమంగా తరలించుకుపోతుండటంతో మట్టికట్టలు మాయమవుతున్నాయి. -
నిధులు దూరం.. నిర్వహణ భారం
[ 29-03-2024]
వ్యవసాయ శాఖ సేవలను రైతులకు మరింత చేరువ చేసే లక్ష్యంతో గత ప్రభుత్వం క్లస్టర్ల వారీగా రైతు వేదికలను నిర్మించింది. శాఖాపరంగా రైతులకు ఆధునిక సాగు విధానంపై సలహాలు, సూచనలు ఇవ్వాలనేది ప్రధాన లక్ష్యం. -
లక్ష్యానికి చేరువగా సింగరేణి
[ 29-03-2024]
సింగరేణి సంస్థ తొలిసారిగా 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి చేరువ అవుతోంది. మూడేళ్లుగా ఈ లక్ష్యాన్ని నిర్దేశించుకున్న సంస్థ ఇప్పటివరకు ఆ మేరకు బొగ్గు ఉత్పత్తిని చేరుకోలేకపోయింది. -
బయో మైనింగ్ ప్రక్రియకు అవాంతరాలు
[ 29-03-2024]
పెరుగుతున్న నగరీకరణ.. అందుకు అనుగుణంగా పారిశుద్ధ్య నిర్వహణ ప్రభుత్వ యంత్రాంగానికి సవాల్గా మారుతోంది. ఈ క్రమంలో చెత్త నుంచి సేంద్రియ ఎరువును తయారు చేసేందుకు రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. -
భాజపా పాలనపై ప్రజల్లో విసుగు
[ 29-03-2024]
రానున్న పార్లమెంటు ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించాలని భారాస ఎంపీ అభ్యర్థులు ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్, కొప్పుల ఈశ్వర్లు అన్నారు. -
మతం పేరిట కేసీఆర్ రాజకీయం చేయలేదు: కేటీఆర్
[ 29-03-2024]
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పదేళ్లలో ఏ రోజు కూడా మతం పేరిట రాజకీయం చేయలేదని మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. -
రాష్ట్రాన్ని దోచుకుంది భారాసనే: ఆది శ్రీనివాస్
[ 29-03-2024]
తెలంగాణ ఏర్పడిన తరవాత రూ.16 వేల కోట్ల నిల్వ బడ్జెట్తో రాష్ట్రాన్ని అప్పగిస్తే భారాస తొమ్మిదిన్నరేళ్ల పాలనలో రాష్ట్రాన్ని రాబంధుల్లా దోచుకుందని, రూ.6.67 లక్షల కోట్ల అప్పుల భారాన్ని రాష్ట్ర ప్రజలపై మోపిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ
-
ఫోన్ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు
-
కొరియాపై ఐరాస ఆంక్షల వల్ల ప్రయోజనం లేదు: రష్యా
-
టిల్లు స్క్వేర్.. రూ.100 కోట్ల గ్రాస్ వస్తుందనుకుంటున్నా: నాగవంశీ