తెల్లగీత.. ఇక సులువు
రహదారులపై ముగ్గు చేతిలో పట్టుకుని గీతగీసే విధానంతో కాకుండా యంత్రం ద్వారా ఎలాంటి శ్రమ లేకుండా చేపట్టే విధానాన్ని ఓ యువకుడు తన ఆలోచనతో ఆవిష్కరించాడు. వీఐపీలు వచ్చిన సందర్భంలో రోడ్డు పక్కన తెల్లని గీత గీస్తారు. ఏదైనా కార్యక్రమాలు
యంత్రం తయారు చేసిన యువకుడు
యంత్రంతో భగత్ప్రశాంత్
రహదారులపై ముగ్గు చేతిలో పట్టుకుని గీతగీసే విధానంతో కాకుండా యంత్రం ద్వారా ఎలాంటి శ్రమ లేకుండా చేపట్టే విధానాన్ని ఓ యువకుడు తన ఆలోచనతో ఆవిష్కరించాడు. వీఐపీలు వచ్చిన సందర్భంలో రోడ్డు పక్కన తెల్లని గీత గీస్తారు. ఏదైనా కార్యక్రమాలు జరిగిన సమయంలోనూ ఆ దారిని గుర్తించేందుకు ప్రధాన రహదారి పక్క నుంచి తెల్లని గీత వేస్తారు. ఒక మనిషి చేతిలో తెల్లని పొడి పట్టుకొని గీస్తూ ముందుకు సాగాలి. ఈ యువకుడు తయారు చేసిన యంత్రంతో అలాంటి శ్రమ లేకుండా సులువుగా పనిచేసే అవకాశం కలిగింది. గోదావరిఖనికి చెందిన భగత్ప్రశాంత్ తన ఆలోచనతో ఇనుప రేకుతో ఒక డబ్బాను తయారు చేశాడు. దానికి మూడు చక్రాలు అమర్చాడు. ఇనుప రాడ్తో పట్టుకోవడానికి హ్యాండిల్ను ఏర్పాటు చేశాడు. దానికి సైకిల్ బ్రేకును అమర్చాడు. రేకు డబ్బాకు కింద చిన్న రంధ్రం చేశాడు. దీనికి చిన్న పిల్లల సైకిల్ చక్రాలు, ఇనుప రేకు, సైకిల్ బ్రేకు సెట్, లాక్స్ కేబుల్ను వినియోగించాడు. రేకు డబ్బాలో తెల్లని ముగ్గు పోసి ముందుకు నడుపుకొంటూ వెళ్తూ బ్రేకు నొక్కి పట్టుకుంటే కింద నుంచి తెల్లని గీత ఏర్పడుతుంది. కళ్లలో ముగ్గు ధూళి పడే అవకాశం లేకపోవడంతో పాటు వంగి పనిచేయడం వల్ల వచ్చే నొప్పి కూడా లేకుండా ఉంటుందని భగత్ ప్రశాంత్ తెలిపారు. చాలా తక్కువ ఖర్చుతో తయారు చేసిన ఈ యంత్రాన్ని గ్రామ పంచాయతీ, పురపాలక, నగరపాలక సంస్థల్లో వినియోగించుకుంటే పని సులువుగా చేసుకోవచ్చని చెబుతున్నారు.
-న్యూస్టుడే, గోదావరిఖని
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాకా.. వెంకటస్వామికి ఆ పేరెలా వచ్చింది?
[ 24-04-2024]
కాంగ్రెస్ పార్టీ దివంగత, కేంద్ర మాజీ మంత్రి జి.వెంకటస్వామి ‘కాకా’గానే ఎక్కువ మందికి సుపరిచితులు. ఆయనకు ఈ పేరు రావడం వెనుక ఆసక్తికర అంశం ఉంది. -
యాప్ కష్టాలు
[ 24-04-2024]
జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల నిర్వాహకులు అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన యాప్ల్లో సమాచారం నిక్షిప్తం చేయాల్సి ఉంది. -
నిర్వహణ భారం.. కమీషన్లో కోత
[ 24-04-2024]
కేంద్రాల నిర్వహణ భారంగా మారగా.. వచ్చిన కమీషన్లో కోత విధించడంతో నిర్వాహకులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. -
ఇక ట్వంటీ20 పోరు!
[ 24-04-2024]
పోలింగ్ తేదీకి బుధవారం నుంచి సరిగ్గా ఇరవై రోజులుంది.. అచ్చంగా ట్వంటీ20 క్రికెట్ ఆటలోని 20 ఓవర్ల మాదిరి సమరం. -
మిగిలింది రెండు రోజులే!
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో తొలి అంకం రెండు రోజుల్లో ముగియనుంది. ఈ నెల 25వ తేదీతో నామినేషన్ల స్వీకరణ పూర్తవనుంది. -
నకిలీ పత్రాలు సృష్టించి.. ఇల్లు ధ్వంసం
[ 24-04-2024]
నకిలీ పత్రాలు సృష్టించి, ఇంటిని ధ్వంసం చేసి, దాడికి పాల్పడిన అయిదుగురిని కరీంనగర్ కొత్తపల్లి పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. -
పార్టీ పెద్దల సమ్మతితోనే రాజేందర్ నామినేషన్
[ 24-04-2024]
పార్టీ పెద్దల సమ్మతితోనే తామంతా కలిసి కాంగ్రెస్ తరఫున వెలిచాల రాజేందర్రావుతో నామినేషన్ వేయించామని, గెలిపిం చుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. -
అతివల ఉపాధికి ఆదరువేదీ!
[ 24-04-2024]
రాష్ట్రంలో 6 లక్షల మంది బీడీ కార్మికులుండగా అత్యధికంగా నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోనే ఉన్నారు. -
ఆ పది మందికే 50 శాతం ఓటర్ల మద్దతు
[ 24-04-2024]
ఎన్నికల్లో ప్రత్యర్థి కంటే ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా విజయం సాధించినట్లే. అయితే గెలుపొందిన అభ్యర్థికి నియోజకవర్గంలోని ఎంత మంది ఓటర్ల మద్దతు ఉందనేది పోటీలో ఉన్న అభ్యర్థులు, నమోదైన పోలింగ్ శాతాన్ని బట్టి మారుతుంది. -
ఆయుధాలు అప్పగించారు..
[ 24-04-2024]
వ్యక్తిగత భద్రత కోసం లైసెన్సు తీసుకొని వెంట ఉంచుకున్న ఆయుధాలను ఉమ్మడి జిల్లావాసులు ఠాణాలకు అప్పగించారు. -
మాతాశిశుకు తప్పని ఉక్కపోత
[ 24-04-2024]
చంటి బిడ్డలు, బాలింతలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో వేసవి ఉక్కపోత తప్పడం లేదు. -
బ్యాలెట్ యుద్ధానికి చకచకా సన్నద్ధం
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికలను సమర్థంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. -
పనులకు ఆటంకాలు.. రాకపోకలకు అవస్థలు
[ 24-04-2024]
రెండు జిల్లాల సరిహద్దులోని మానేరు వాగు దాటడానికి ఇరువైపులా గ్రామాల ప్రజలు దశాబ్దాల తరబడి నానా అవస్థలు పడుతున్నారు. -
తైబజార్... చిరు వ్యాపారుల బేజార్
[ 24-04-2024]
పురపాలక సంఘంలో తైబజార్ గుత్తేదారు ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేస్తున్నా పట్టించుకున్న నాథుడు లేడు.
తాజా వార్తలు (Latest News)
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
-
టేకాఫ్ సమయంలో ఊడిన బోయింగ్ విమానం టైరు
-
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!
-
రెజ్యూమె రూపొందించడంలో ఈ తప్పులొద్దు.. గూగుల్ మాజీ రిక్రూటర్ టిప్స్