కరోనా సోకిన గర్భిణికి ప్రసవం
వైద్య సిబ్బంది కరోనా రోగులకు అండగా నిలుస్తున్నారు. ప్రాణాలకు తెగించి మరీ చికిత్స అందిస్తున్నారు. కరోనా బారిన పడ్డ మహిళలకు సాధారణ ప్రసవం చేసి మానవత్వం చూపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే... వీర్నపల్లి మండలం రంగంపేటకు చెందిన
మగ శిశువుతో వైద్య సిబ్బంది
ఎల్లారెడ్డిపేట, న్యూస్టుడే : వైద్య సిబ్బంది కరోనా రోగులకు అండగా నిలుస్తున్నారు. ప్రాణాలకు తెగించి మరీ చికిత్స అందిస్తున్నారు. కరోనా బారిన పడ్డ మహిళలకు సాధారణ ప్రసవం చేసి మానవత్వం చూపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే... వీర్నపల్లి మండలం రంగంపేటకు చెందిన గర్భిణికి రెండు రోజుల క్రితం కొవిడ్ సోకింది. బుధవారం ఆమెకు పురిటినొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఎల్లారెడ్డిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లారు. జిల్లా ఆసుపత్రికి తరలించేందుకు వీలు లేకపోవడంతో జిల్లా వైద్యాధికారి సుమన్మోహన్రావు, ఎంసీహెచ్ అధికారి కపిల్సాయి సూచనలతో ఎల్లారెడ్డిపేట వైద్య సిబ్బంది పుష్పలత, సుజాత, కీర్తిలు పీపీఈ కిట్లు ధరించి పురుడు పోశారు. సాధారణ ప్రసవం చేసిన వైద్య సిబ్బందిని మండల వైద్యాధికారి ధర్మానాయక్, స్థానికులు అభినందించారు.
వైద్య సిబ్బందికి మంత్రి కేటీఆర్ అభినందన
కరోనా బారిన పడ్డ మహిళకు ఎల్లారెడ్డిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది ప్రసవం చేశారు. ఈ విషయాన్ని రాజన్నసిరిసిల్ల జిల్లా వైద్యాధికారి ట్విటర్లో పంచుకున్నారు. సిబ్బంది పనితీరు మెచ్చిన మంత్రి కేటీఆర్ అభినందిస్తూ బుధవారం ట్వీట్ చేశారు. ‘వెల్ డన్’ అంటూ వారిని ట్విటర్ వేదికగా ప్రశంసించారు. మంత్రి హరీశ్రావు సైతం ఎల్లారెడ్డిపేట వైద్య సిబ్బందిని అభినందించారు.
గోశాలలకు రాజన్న కోడెల అప్పగింత
వేములవాడ గ్రామీణం, న్యూస్టుడే : వేములవాడ ఆలయానికి చెందిన తిప్పాపూర్ గోశాల నుంచి కోడెలను ఇతర గోశాలలకు ఆలయ అధికారులు బుధవారం అందజేశారు. మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండలంలోని పోచంపల్లి గ్రామ మహేశ్వరి గోశాల వెల్ఫేర్ సోసైటికీ, జనగాం జిల్లా జాపర్గడ్ మండలంలోని ముగ్దంతండా సంతోషి మాత గోశాలకు ఒక్కొక్క దానికి 20 కోడెల చొప్పున అందజేశారు. కోడెలకు చెందిన ధ్రువపత్రాలను గోశాల నిర్వాహకులకు అందజేశారు. కార్యక్రమంలో ఏఈవో శ్రీనివాస్, సూపరింటెండెంట్ హరిహరినాథ్, రాజేందర్, శంకర్, తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పత్తి రైతులు, వ్యాపారుల ఆందోళన
[ 23-04-2024]
ఎన్నికల కోడ్ పేరుతో తనిఖీలు నిర్వహించి బ్యాంకుల నుంచి డబ్బును తీసుకొస్తున్న తమను ఇబ్బందులకు గురి చేయవద్దని జమ్మికుంట పత్తి మార్కెట్ వద్ద వ్యాపారులు, పత్తి రైతులు ఆందోళనకు దిగారు. -
మానేరు వాగుపై కూలిన నిర్మాణంలోని వంతెన
[ 23-04-2024]
పెద్దపల్లి జిల్లాలో మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. ముత్తారం మండలం ఓడేడు పరిధిలో సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. -
పిల్లల అల్లరిని దారి మళ్లించండి
[ 23-04-2024]
పది నెలలపాటు చదువుతో కుస్తీ పడిన పిల్లలకు వేసవి సెలవులు ఉపశమనం ఇస్తాయి. ఆటాపాటలతో సరదాగా గడపొచ్చని భావిస్తుంటారు. -
మోదీ వ్యాఖ్యల్లో ఓటమి భయం
[ 23-04-2024]
లోక్సభ మొదటి దశ ఎన్నికల తీరును చూసిన ప్రధాని మోదీ ఓటమి భయంతో దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సంపద అంతా ముస్లింలకు ఇస్తుందని వ్యాఖ్యానించారని మంత్రి పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు. -
నాలుగో రోజు 25 నామినేషన్లు
[ 23-04-2024]
నామినేషన్ల ప్రక్రియ నాలుగో రోజు సోమవారం కరీంనగర్, పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గ స్థానాలకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. -
హామీలను విస్మరించిన ప్రభుత్వం
[ 23-04-2024]
శాసనసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిందని కరీంనగర్ భారాస అభ్యర్థి వినోద్కుమార్ అన్నారు. -
సెప్టెంబరులో చక్కెర కర్మాగారం తెరిపిస్తాం
[ 23-04-2024]
శాసనసభ ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీ మేరకు నిజాం చక్కెర కర్మాగారాలు తెరిపించేందుకు అవసరమైన చర్యలు చేపట్టినట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. -
అవకాశమిస్తే అభివృద్ధి చేసి చూపిస్తా!
[ 23-04-2024]
ప్రాంతానికి కొత్త కావచ్చు, రాజకీయాలకు, ప్రజా సేవకు కొత్తకాదని, అవకాశమిస్తే పార్లమెంట్ పరిధిని అభివృద్ధి చేసి చూపిస్తానని నిజామాబాద్ భారాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. -
దారులన్నీ కొండగట్టుకే
[ 23-04-2024]
తమ ఇష్టదైవాన్ని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి దీక్షాపరులు తరలివస్తున్నారు. -
ఓటరు నమోదులో ఫలించిన చైతన్యం
[ 23-04-2024]
ప్రజాస్వామ్యం కల్పించిన ఓటు హక్కు నమోదుకు యువతలో నూతనోత్సాహం ఉరకలేసింది. -
ప్రత్యేక నిధులు.. తీరనున్న ఇక్కట్లు
[ 23-04-2024]
రామగుండం నగరపాలక ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు అమృత్-2.0, యు.ఐ.డి.ఎఫ్.(అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్) నిధులతో పరిష్కారం కానున్నాయి. -
కాంగ్రెస్ నైజాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి
[ 23-04-2024]
భారాస పాలనలోనే అన్ని వర్గాల ప్రజలు సంక్షేమ ఫలాలు అందుకున్నారని, గడిచిన నాలుగు నెలల కాలంలో సంక్షేమ పథకాలను అటకెక్కించిన కాంగ్రెస్ పాలకుల నైజాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పెద్దపల్లి లోక్సభ భారాస అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. -
లెక్కలు తేలేనా?
[ 23-04-2024]
జిల్లా వస్త్ర పరిశ్రమకు గత ప్రభుత్వం సంక్షేమ, పాఠశాల విద్యాశాఖలకు సంబంధించిన వస్త్రోత్పత్తుల ఆర్డర్లు ఇచ్చింది. -
నిధులున్నా ప్రారంభం కాని పనులు
[ 23-04-2024]
గ్రామీణ, గిరిజన ప్రాంతాలకు రవాణా వ్యవస్థ మెరుగుపరిచి రెండు జిల్లాల గ్రామాలను అనుసంధానం చేయాలనే లక్ష్యంతో తారు రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. -
పట్టాలెక్కని ప్రతిపాదనలు
[ 23-04-2024]
ఉమ్మడి జిల్లాలో రైల్వే శాఖాపరంగా అభివృద్ధికి అడుగులు పడాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు. -
అమాత్యులుగా ఆ నలుగురు
[ 23-04-2024]
ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, పెద్దపల్లి లోక్సభా నియోజకవర్గాల నుంచి ఎన్నికైన ఎంపీల్లో ఇప్పటివరకు నలుగురికి మాత్రమే కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది.
తాజా వార్తలు (Latest News)
-
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
-
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు
-
ఫొటోకు పోజులిస్తూ... అగ్నిపర్వతంలో జారిపడిన పర్యటకురాలు
-
విమానాల్లో 12 ఏళ్లలోపు వారికి తల్లిదండ్రుల పక్కనే సీటివ్వాలి: డీజీసీఏ
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
-
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్