logo

సైనికులకు ప్రత్యేక దర్శనం కల్పించాలని వినతి

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో సైనికులకు ప్రత్యేక దర్శనం కల్పించాలని జవాన్‌ పౌండేషన్‌, సైనిక్‌ వెల్ఫేర్‌ సొసైటీ సైనికులు బుధవారం ఆలయ ఈవో రమాదేవిని మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు.

Published : 27 Jan 2022 04:49 IST

ఈవో రమాదేవికి వినతిపత్రం అందజేస్తున్న సైనిక ఉద్యోగులు

వేములవాడ గ్రామీణం, న్యూస్‌టుడే : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో సైనికులకు ప్రత్యేక దర్శనం కల్పించాలని జవాన్‌ పౌండేషన్‌, సైనిక్‌ వెల్ఫేర్‌ సొసైటీ సైనికులు బుధవారం ఆలయ ఈవో రమాదేవిని మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. దేశ సరిహద్దుల్లో సేవలు చేస్తూ సెలవులపై వచ్చిన సందర్భంలో ఆలయంలో స్వామివారి దర్శనం, ప్రత్యేక వసతి కల్పించాలని కోరారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో సైనికులకు సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఇక్కడ కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఇందుకు ఈవో సానుకూలంగా స్పందించినట్లు వారు పేర్కొన్నారు. జవాన్‌ పౌండేషన్‌, సైనిక్‌ వెల్ఫేర్‌ సోసైటీ సైనికులు జవ్వాజి ప్రసాద్‌గౌడ్‌, సంజీవ్‌కుమార్‌, బండి సతీష్‌కుమార్‌, నవీన్‌కుమార్‌, మనోహర్‌, భవన్‌రెడ్డి, జితేందర్‌, శ్రీకాంత్‌, రాములు, శ్రావన్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని