logo

యువకుడి ఆత్మహత్య

అనారోగ్యంతో బాధపడుతూ ఓ యువకుడు అధిక మోతాదులో మత్తు మందు తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జమ్మికుంట మండలం కొరెపల్లికి చెందిన గైకోటి అఖిల్‌(24) ప్రస్తుతం కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ల్యాబ్‌ టెక్నిషియన్‌గా పని చేసుకుంటూ

Published : 27 Jan 2022 04:49 IST

కరీంనగర్‌ నేరవార్తలు, న్యూస్‌టుడే: అనారోగ్యంతో బాధపడుతూ ఓ యువకుడు అధిక మోతాదులో మత్తు మందు తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జమ్మికుంట మండలం కొరెపల్లికి చెందిన గైకోటి అఖిల్‌(24) ప్రస్తుతం కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ల్యాబ్‌ టెక్నిషియన్‌గా పని చేసుకుంటూ స్నేహితుడితో కలిసి వావిలాలపల్లిలో గదిలో అద్దెకు ఉంటున్నాడు. అయిదు సంవత్సరాలుగా మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నాడు. తల్లిదండ్రులు పలు ఆసుపత్రుల్లో చూపించినా ఆరోగ్యం కుదుటపడలేదు. పని చేసుకుంటూ సంపాదించిన డబ్బులు ఇష్టానుసారంగా ఖర్చు చేయడంపై తల్లిదండ్రులు మందలించడంతో ఎవరికి చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయి కరీంనగర్‌లో ఉంటున్నాడు. బుధవారం ఉదయం గదిలో అఖిల్‌ను నిద్రలేపడానికి స్నేహితుడు ప్రయత్నించగా లేవలేదు. పక్కనే మత్తు మందుకు సంబంధించిన ఇంజెక్షన్‌ తెరిచి ఉండటంతో అతని చేతిని పరీక్షించగా మత్తు మందు అధిక మోతాదులో తీసుకున్నట్లు గుర్తించాడు. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే అఖిల్‌ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుని తండ్రి నాగరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మూడో ఠాణా సీఐ దామోదర్‌రెడ్డి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని