విదేశాల్లో రయ్..రయ్..
విద్య, ఉద్యోగ, ఉపాధి కోసం, పర్యాటక ప్రాంతాల సందర్శన కోసం విదేశాలకు వెళ్లే వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా ఉన్నత విద్యను అభ్యసించడానికి అమెరికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, కెనడా ఇతర దేశాలకు వెళ్తున్న వారి సంఖ్య గణనీయంగా ఉంది.
అంతర్జాతీయ లైసెన్స్లకు పెరుగుతున్న ఆదరణ
జిల్లా రవాణా శాఖ కార్యాలయం
న్యూస్టుడే, కరీంనగర్ రవాణావిభాగం: విద్య, ఉద్యోగ, ఉపాధి కోసం, పర్యాటక ప్రాంతాల సందర్శన కోసం విదేశాలకు వెళ్లే వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా ఉన్నత విద్యను అభ్యసించడానికి అమెరికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, కెనడా ఇతర దేశాలకు వెళ్తున్న వారి సంఖ్య గణనీయంగా ఉంది. ఆయా దేశాల్లో భారతీయులు ఎన్ఆర్ఐలుగా స్థిరపడుతున్నారు. అక్కడ వాహనాలు నడపాలంటే లైసెన్స్ తప్పనిసరి కావడంతో ఇక్కడ అంతర్జాతీయ లైసెన్స్లు తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.
ఉపాధికి సైతం
చదువు, కొలువులు, ఉపాధి కోసం విదేశాలకు వెళ్తున్న వారిలో చాలామంది సొంతంగా వాహనాలు కొనుగోలు చేస్తుండగా మరికొందరు ఇతరుల వాహనాలు నడుపుతూ ఉపాధి పొందుతున్నారు.
ఏడాది పాటు...
రాష్ట్ర రావాణా శాఖ జారీ చేసే ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్కు విదేశాల్లో సంవత్సరం పాటు చెల్లుబాటు అవుతోంది. దీని ఆధారంగా ఆయా దేశాల్లో వాహనాలు నడపడానికి అనుమతిస్తారు. ఇది ఒక విధంగా లెర్నింగ్ లైసెన్స్లా పనిచేస్తుంది. ఆయా దేశాల నిబంధనలు అనుసరించి గడువులోగా అక్కడి లైసెన్స్ను తీసుకోవాల్సి ఉంటుంది. వివిధ దేశాల్లో నిబంధనలు కఠినంగా ఉండటంతో ఎక్కువ మంది మన దేశం నుంచే ఇంటర్నేషనల్ డీఎల్ తీసుకుంటున్నారు.
జారీ ఇలా
పూర్తి వివరాలు పరిశీలించిన అనంతరం రవాణా శాఖ అధికారులు అంతర్జాతీయ లైసెన్స్లు జారీచేస్తారు. ఏ జిల్లాలో అయితే డీఎల్ తీసుకుంటామో అదే జిల్లాలో ఐటీడీఎల్కు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో గతేడాది జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు 872 మంది లైసెన్స్లు పొందారు. ఇందులో అత్యధికంగా కరీంనగర్ జిల్లాలో, అత్యల్పంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో జారీ చేశారు.
కార్డులకు కటకట?
ఐటీడీఎల్ కార్డులకు కొరత ఉండటంతో సకాలంలో అందడం లేదని సమాచారం. అంతర్జాతీయ లైసెన్స్ పొందిన వారు. తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిసింది. కార్డుదారులు విదేశాలకు వెళ్లిపోతే ఇతరుల ద్వారా కాని, కొరియర్ ద్వారా పంపించాల్సిన పరిస్థితి ఉంది.
లైసెన్స్ పొందడం ఇలా...
ఐడీఎల్ తీసుకోవాలనుకుంటే ముందుగా సొంత దేశంలో లైసెన్స్ కలిగి ఉండాలి. ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్కు దరఖాస్తు చేసేప్పుడు ఇక్కడ తీసుకున్న డీఎల్తో పాటు పాస్పోర్టు (గడువు ఆరు నెలలైనా ఉండాలి), మనం ఏ దేశానికి అయితే వెళ్తున్నామో అందుకు సంబంధించిన వీసా జత చేయాలి. వీసా త్వరలో వస్తుంది అనుకుంటే అందుకు తగిన ఆధారాలు సమర్పించాలి. ఆరోగ్యవంతంగా (శారీరకంగా దృఢంగా) ఉన్నట్లు మెడికల్ ధ్రువీకరణ పత్రం (ప్రభుత్వ గుర్తింపు పొందిన వైద్యుడు ఇచ్చినది), ఫామ్-1ఏ జతచేయాలి. పూర్తి వివరాలతో స్లాట్ బుక్ చేసుకోవాలి. కేటాయించిన తేదీ రోజు ఆర్టీఏ కార్యాలయంలో సంబంధిత పత్రాలు అందజేయాలి. ఫీజు రూ.1500 వరకు ఉంటుంది. ఇది కూడా ఆన్లైన్లోనే చెల్లించాల్సి ఉంటుంది.
ప్రపంచ వ్యాప్తంగా....
-చంద్రశేఖర్గౌడ్, ఉమ్మడి జిల్లా ఉపరవాణా కమిషనర్
స్వదేశంలో అంతర్జాతీయ లైసెన్స్ తీసుకుంటే విదేశాల్లో పొందడం సులువుగా ఉంటుంది. ఉపాధి కోసం వెళ్లి చోదకులుగా పని చేసే వారికి ఎంతో మేలు చేస్తుంది. ఇక్కడ జారీ చేసిన ఐడీఎల్ ప్రపంచ వ్యాప్తంగా పనిచేస్తుంది. ఆయా దేశాల నిబంధనల మేరకు గడువు లోగా పొందాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పత్తి రైతులు, వ్యాపారుల ఆందోళన
[ 23-04-2024]
ఎన్నికల కోడ్ పేరుతో తనిఖీలు నిర్వహించి బ్యాంకుల నుంచి డబ్బును తీసుకొస్తున్న తమను ఇబ్బందులకు గురి చేయవద్దని జమ్మికుంట పత్తి మార్కెట్ వద్ద వ్యాపారులు, పత్తి రైతులు ఆందోళనకు దిగారు. -
మానేరు వాగుపై కూలిన నిర్మాణంలోని వంతెన
[ 23-04-2024]
పెద్దపల్లి జిల్లాలో మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. ముత్తారం మండలం ఓడేడు పరిధిలో సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. -
పిల్లల అల్లరిని దారి మళ్లించండి
[ 23-04-2024]
పది నెలలపాటు చదువుతో కుస్తీ పడిన పిల్లలకు వేసవి సెలవులు ఉపశమనం ఇస్తాయి. ఆటాపాటలతో సరదాగా గడపొచ్చని భావిస్తుంటారు. -
మోదీ వ్యాఖ్యల్లో ఓటమి భయం
[ 23-04-2024]
లోక్సభ మొదటి దశ ఎన్నికల తీరును చూసిన ప్రధాని మోదీ ఓటమి భయంతో దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సంపద అంతా ముస్లింలకు ఇస్తుందని వ్యాఖ్యానించారని మంత్రి పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు. -
నాలుగో రోజు 25 నామినేషన్లు
[ 23-04-2024]
నామినేషన్ల ప్రక్రియ నాలుగో రోజు సోమవారం కరీంనగర్, పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గ స్థానాలకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. -
హామీలను విస్మరించిన ప్రభుత్వం
[ 23-04-2024]
శాసనసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిందని కరీంనగర్ భారాస అభ్యర్థి వినోద్కుమార్ అన్నారు. -
సెప్టెంబరులో చక్కెర కర్మాగారం తెరిపిస్తాం
[ 23-04-2024]
శాసనసభ ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీ మేరకు నిజాం చక్కెర కర్మాగారాలు తెరిపించేందుకు అవసరమైన చర్యలు చేపట్టినట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. -
అవకాశమిస్తే అభివృద్ధి చేసి చూపిస్తా!
[ 23-04-2024]
ప్రాంతానికి కొత్త కావచ్చు, రాజకీయాలకు, ప్రజా సేవకు కొత్తకాదని, అవకాశమిస్తే పార్లమెంట్ పరిధిని అభివృద్ధి చేసి చూపిస్తానని నిజామాబాద్ భారాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. -
దారులన్నీ కొండగట్టుకే
[ 23-04-2024]
తమ ఇష్టదైవాన్ని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి దీక్షాపరులు తరలివస్తున్నారు. -
ఓటరు నమోదులో ఫలించిన చైతన్యం
[ 23-04-2024]
ప్రజాస్వామ్యం కల్పించిన ఓటు హక్కు నమోదుకు యువతలో నూతనోత్సాహం ఉరకలేసింది. -
ప్రత్యేక నిధులు.. తీరనున్న ఇక్కట్లు
[ 23-04-2024]
రామగుండం నగరపాలక ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు అమృత్-2.0, యు.ఐ.డి.ఎఫ్.(అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్) నిధులతో పరిష్కారం కానున్నాయి. -
కాంగ్రెస్ నైజాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి
[ 23-04-2024]
భారాస పాలనలోనే అన్ని వర్గాల ప్రజలు సంక్షేమ ఫలాలు అందుకున్నారని, గడిచిన నాలుగు నెలల కాలంలో సంక్షేమ పథకాలను అటకెక్కించిన కాంగ్రెస్ పాలకుల నైజాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పెద్దపల్లి లోక్సభ భారాస అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. -
లెక్కలు తేలేనా?
[ 23-04-2024]
జిల్లా వస్త్ర పరిశ్రమకు గత ప్రభుత్వం సంక్షేమ, పాఠశాల విద్యాశాఖలకు సంబంధించిన వస్త్రోత్పత్తుల ఆర్డర్లు ఇచ్చింది. -
నిధులున్నా ప్రారంభం కాని పనులు
[ 23-04-2024]
గ్రామీణ, గిరిజన ప్రాంతాలకు రవాణా వ్యవస్థ మెరుగుపరిచి రెండు జిల్లాల గ్రామాలను అనుసంధానం చేయాలనే లక్ష్యంతో తారు రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. -
పట్టాలెక్కని ప్రతిపాదనలు
[ 23-04-2024]
ఉమ్మడి జిల్లాలో రైల్వే శాఖాపరంగా అభివృద్ధికి అడుగులు పడాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు. -
అమాత్యులుగా ఆ నలుగురు
[ 23-04-2024]
ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, పెద్దపల్లి లోక్సభా నియోజకవర్గాల నుంచి ఎన్నికైన ఎంపీల్లో ఇప్పటివరకు నలుగురికి మాత్రమే కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది.
తాజా వార్తలు (Latest News)
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ