logo

ఆగి ఉన్న లారీని ఢీకొని యువకుడి దుర్మరణం

పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎగ్లాస్‌పూర్‌ సమీపంలో బుధవారం రాత్రి 8 గం.ల ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఆగి ఉన్న లారీని ద్విచక్రవాహనం ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. ఎగ్లాస్‌పూర్‌ సమీపంలోని ఫంక్షన్‌హాల్‌

Published : 27 Jan 2022 04:49 IST

మంథని గ్రామీణం, న్యూస్‌టుడే: పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎగ్లాస్‌పూర్‌ సమీపంలో బుధవారం రాత్రి 8 గం.ల ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఆగి ఉన్న లారీని ద్విచక్రవాహనం ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. ఎగ్లాస్‌పూర్‌ సమీపంలోని ఫంక్షన్‌హాల్‌ వద్ద లారీ పశువుని ఢీకొనడంతో మృతి చెందింది. దీంతో లారీని పక్కన నిలిపి డ్రైవరు రైతులతో మాట్లాడుతున్నాడు. అదే సమయంలో జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మల్హర్‌ మండలం తాడిచెర్లకు చెందిన రామిడి రవి(30) మంథని నుంచి కాటారం వైపు ద్విచక్రవాహనంపై వెళ్తూ ఆగి ఉన్న లారీని ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. తాడిచెర్ల ఏఎంఆర్‌ కంపెనీలో పని చేస్తున్న రవి మంథనిలో ఉన్న తల్లిదండ్రులను కలిసి అత్తగారి ఊరైన మహదేవపూర్‌కు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలిసింది. ప్రమాద సమాచారం తెలుసుకున్న ఎస్సై చంద్రకుమార్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని