logo

క్యాబిన్‌లో లారీ డ్రైవర్‌ మృతి

ఎన్టీపీసీ ఒప్పంద కార్మికుల ద్వారం సమీపంలో ఓ లారీ డ్రైవర్‌ క్యాబిన్‌లో గురువారం మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. ఎన్టీపీసీ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తమిళనాడు తిరువర్రూర్‌కు చెందిన వేలుమురుగన్‌ వైత్యలింగం(48) చెన్నయ్‌

Published : 28 Jan 2022 03:33 IST

మృతి చెందిన వైత్యలింగం

జ్యోతినగర్‌, న్యూస్‌టుడే : ఎన్టీపీసీ ఒప్పంద కార్మికుల ద్వారం సమీపంలో ఓ లారీ డ్రైవర్‌ క్యాబిన్‌లో గురువారం మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. ఎన్టీపీసీ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తమిళనాడు తిరువర్రూర్‌కు చెందిన వేలుమురుగన్‌ వైత్యలింగం(48) చెన్నయ్‌ నుంచి సామగ్రిని తీసుకొని ఎన్టీపీసీ ఒప్పంద కార్మికుల ద్వారం వద్ద లారీని నిలిపాడు. విశ్రాంతి తీసుకోవడానికి మరో లారీ క్యాబిన్‌లో నిద్రపోయాడు. నిద్రలోనే మృతి చెందగా స్థానికులు గమనించి 108 సిబ్బందికి సమాచారం ఇచ్చారు. 108 సిబ్బంది పరిశీలించి వైత్యలింగం మృతి చెందినట్లు తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని గోదావరిఖని ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలియవచ్చని పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని