అదనపు కాలువకు భూములివ్వబోమంటూ ధర్నా
ఇప్పటికే వరదకాలువ, సాగునీటి ఉపకాలువలు, కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వేలైన్, జాతీయ రహదారికోసం వేలాది ఎకరాల విలువైన భూములు కోల్పోయాం..ఇప్పుడేమో అదనపు వరదకాలువకు మరోసారి వ్యవసాయ భూములు బలవంతంగా లాక్కునేందుకు కుట్ర
కురిక్యాల వద్ద ఆందోళన నిర్వహిస్తున్న మహిళలు, రైతులు
గంగాధర, న్యూస్టుడే: ఇప్పటికే వరదకాలువ, సాగునీటి ఉపకాలువలు, కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వేలైన్, జాతీయ రహదారికోసం వేలాది ఎకరాల విలువైన భూములు కోల్పోయాం..ఇప్పుడేమో అదనపు వరదకాలువకు మరోసారి వ్యవసాయ భూములు బలవంతంగా లాక్కునేందుకు కుట్ర చేసి తమను ముంచుతారా అంటూ గంగాధర మండలం కురిక్యాల వద్ద రైతులు గురువారం ఆందోళనకు దిగారు. కొండన్నపల్లి, న్యాలకొండపల్లి, తాడిజెర్రి, కురిక్యాల, రంగారావుపల్లి, రామడుగు, బోయినపల్లి మండలాలకు చెందిన రైతులు, మహిళలు ధర్నా చేశారు. ఇప్పుడున్న వరదకాలువ నుంచి నీటిని తరలించాల్సి ఉండగా దాని పక్కనే అదనంగా కాలువ తవ్వకానికి భూసేకరణతో తమను వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే వరదకాలువ, ఎల్లంపల్లి ప్రాజెక్టులతో వ్యవసాయ భూములన్నీ జాలువారుతున్నాయని వాపోయారు. వరి వేస్తే ఉరి అంటున్న సీఎం కేసీఆర్, మంత్రులు కాలువలు ఎందుకు తవ్వుతారని ప్రశ్నించారు. మార్కెట్లో ఎకరా రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల ధర పలుకుతుండగా ప్రభుత్వం తమను ముంచుతుందని ఆరోపించారు. గ్రామీణ ఏసీపీ విజయసారథి, చొప్పదండి సీఐ నాగేశ్వర్రావు, ఎస్సై నరేష్రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు భూనిర్వాసితులను అరెస్టు చేసి ఠాణాకు తరలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాకా.. వెంకటస్వామికి ఆ పేరెలా వచ్చింది?
[ 24-04-2024]
కాంగ్రెస్ పార్టీ దివంగత, కేంద్ర మాజీ మంత్రి జి.వెంకటస్వామి ‘కాకా’గానే ఎక్కువ మందికి సుపరిచితులు. ఆయనకు ఈ పేరు రావడం వెనుక ఆసక్తికర అంశం ఉంది. -
యాప్ కష్టాలు
[ 24-04-2024]
జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల నిర్వాహకులు అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన యాప్ల్లో సమాచారం నిక్షిప్తం చేయాల్సి ఉంది. -
నిర్వహణ భారం.. కమీషన్లో కోత
[ 24-04-2024]
కేంద్రాల నిర్వహణ భారంగా మారగా.. వచ్చిన కమీషన్లో కోత విధించడంతో నిర్వాహకులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. -
ఇక ట్వంటీ20 పోరు!
[ 24-04-2024]
పోలింగ్ తేదీకి బుధవారం నుంచి సరిగ్గా ఇరవై రోజులుంది.. అచ్చంగా ట్వంటీ20 క్రికెట్ ఆటలోని 20 ఓవర్ల మాదిరి సమరం. -
మిగిలింది రెండు రోజులే!
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో తొలి అంకం రెండు రోజుల్లో ముగియనుంది. ఈ నెల 25వ తేదీతో నామినేషన్ల స్వీకరణ పూర్తవనుంది. -
నకిలీ పత్రాలు సృష్టించి.. ఇల్లు ధ్వంసం
[ 24-04-2024]
నకిలీ పత్రాలు సృష్టించి, ఇంటిని ధ్వంసం చేసి, దాడికి పాల్పడిన అయిదుగురిని కరీంనగర్ కొత్తపల్లి పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. -
పార్టీ పెద్దల సమ్మతితోనే రాజేందర్ నామినేషన్
[ 24-04-2024]
పార్టీ పెద్దల సమ్మతితోనే తామంతా కలిసి కాంగ్రెస్ తరఫున వెలిచాల రాజేందర్రావుతో నామినేషన్ వేయించామని, గెలిపిం చుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. -
అతివల ఉపాధికి ఆదరువేదీ!
[ 24-04-2024]
రాష్ట్రంలో 6 లక్షల మంది బీడీ కార్మికులుండగా అత్యధికంగా నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోనే ఉన్నారు. -
ఆ పది మందికే 50 శాతం ఓటర్ల మద్దతు
[ 24-04-2024]
ఎన్నికల్లో ప్రత్యర్థి కంటే ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా విజయం సాధించినట్లే. అయితే గెలుపొందిన అభ్యర్థికి నియోజకవర్గంలోని ఎంత మంది ఓటర్ల మద్దతు ఉందనేది పోటీలో ఉన్న అభ్యర్థులు, నమోదైన పోలింగ్ శాతాన్ని బట్టి మారుతుంది. -
ఆయుధాలు అప్పగించారు..
[ 24-04-2024]
వ్యక్తిగత భద్రత కోసం లైసెన్సు తీసుకొని వెంట ఉంచుకున్న ఆయుధాలను ఉమ్మడి జిల్లావాసులు ఠాణాలకు అప్పగించారు. -
మాతాశిశుకు తప్పని ఉక్కపోత
[ 24-04-2024]
చంటి బిడ్డలు, బాలింతలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో వేసవి ఉక్కపోత తప్పడం లేదు. -
బ్యాలెట్ యుద్ధానికి చకచకా సన్నద్ధం
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికలను సమర్థంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. -
పనులకు ఆటంకాలు.. రాకపోకలకు అవస్థలు
[ 24-04-2024]
రెండు జిల్లాల సరిహద్దులోని మానేరు వాగు దాటడానికి ఇరువైపులా గ్రామాల ప్రజలు దశాబ్దాల తరబడి నానా అవస్థలు పడుతున్నారు. -
తైబజార్... చిరు వ్యాపారుల బేజార్
[ 24-04-2024]
పురపాలక సంఘంలో తైబజార్ గుత్తేదారు ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేస్తున్నా పట్టించుకున్న నాథుడు లేడు.