పార్టీ అభ్యున్నతే ఎజెండా
గులాబీ పార్టీకి మరింత గుబాళింపు అందించేలా శక్తియుక్తుల్ని ఒడ్డుతామని పార్టీ జిల్లాల నూతన అధ్యక్షులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పార్టీలోని అన్ని వయస్సుల వారి సహకారం.. సమష్ఠి నిర్ణయాలే తమ స్ఫూర్తి మంత్రాలని చెబుతున్నారు. నాలుగు జిల్లాల తెరాస కొత్త అధ్యక్షులతో ‘ఈనాడు’ సంధించిన ప్రశ్నలకు సమాధానాలు వారి మాటల్లోనే...
గులాబీ పార్టీకి మరింత గుబాళింపు అందించేలా శక్తియుక్తుల్ని ఒడ్డుతామని పార్టీ జిల్లాల నూతన అధ్యక్షులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పార్టీలోని అన్ని వయస్సుల వారి సహకారం.. సమష్ఠి నిర్ణయాలే తమ స్ఫూర్తి మంత్రాలని చెబుతున్నారు. నాలుగు జిల్లాల తెరాస కొత్త అధ్యక్షులతో ‘ఈనాడు’ సంధించిన ప్రశ్నలకు సమాధానాలు వారి మాటల్లోనే...
ప్రశ్నావళి
1. పార్టీ అధ్యక్షుడిగా మిమ్మల్ని నియమించడంపై మీరెలాంటి అనుభూతి పొందుతున్నారు.?
2. పార్టీ అభ్యున్నతికి అమలుచేయనున్న వ్యూహాలు?
3. ప్రత్యర్థి పార్టీలపై పైచేయి సాధించేలా మీ ప్రణాళికలు?
4. ఉద్యమకారులకు అన్యాయం, గ్రూపులు, ఇతర సమస్యలను ఎలా అధిగమిస్తారు.?
5. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేలా భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతోంది.?
మరింత బలోపేతం..
- కోరుకంటి చందర్, పెద్దపల్లి
1. తెరాసలో ఒక కార్యకర్తగా ఒకప్పుడున్న నన్ను ఇప్పుడు జిల్లా అధ్యక్షుడిగా చేయడం కేసీఆర్తోనే సాధ్యమైంది. పార్టీ కోసం పనిచేసే నాయకత్వానికి ఉద్యమకారునికి దక్కిన ఫలితమిది.
2. ఆనాడు ఉద్యమంలో కేసీఆర్ అడుగుజాడల్లో నడిచాం. పదవులు లేనినాడే ప్రజల బాగోగుల గురించి ఆలోచించి, రాష్ట్రం కోసం పోరాటం చేశాం. ఇప్పుడు రాష్ట్రం సాధించిన తరువాత తెలంగాణను అభివృద్ధిలో ఆదర్శంగా నిలబెడుతున్నాం. చేస్తున్న.. చేయబోతున్న అభివృద్ధిని ప్రజలకు పార్టీ ద్వారా తెలియజేస్తాం.
3. ప్రజలకు అన్యాయం చేస్తూ తప్పుడు మాటలతో తప్పుదోవ పట్టించే ప్రత్యర్థి పార్టీలపై పోరుని పక్కాగా కొనసాగిస్తాం. కాంగ్రెస్, భాజపాలు ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదు. కేసీఆర్ నాయకత్వంలో ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయి.
4. పార్టీలో ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందనే విషయమై చర్చించుకుంటాం. అవసరాన్ని బట్టి అధిష్ఠానం దృష్టికి సమస్యను తీసుకెళ్లి పరిష్కారాన్ని అన్వేషిస్తాం. మా పార్టీలో అంతర్గతంగా విభేదాలు ఉండవు. ఒకవేళ ఎక్కడైనా వచ్చినా వాటిని సామరస్యంగా చర్చించుకొని పరిష్కరించుకుంటాం. పెద్దల సలహాలు స్వీకరిస్తాం.
5. జిల్లాలో అందరినీ కలుపుకొని ముందుకు సాగుతా. వచ్చే ఎన్నికల్లో తెరాస తిరిగి అధికారం చేజిక్కించుకునేందుకు అవసరమైన విధంగా పార్టీని గ్రామాల్లో పట్టణాల్లో తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దుతాం. తరచూ మండల, జిల్లాస్థాయి సమావేశాలతో పార్టీలో కొత్త ఉత్సాహం నింపేందుకు ప్రయత్నిస్తాం.
బాధ్యతాయుతంగా ముందుకు..
- తోట ఆగయ్య, రాజన్న సిరిసిల్ల
1. పార్టీ పట్ల విశ్వసనీయత చూపిస్తూ చేసిన పనితీరుకి వచ్చిన బహుమతిగా భావిస్తున్నా. జిల్లా అధ్యక్ష పదవితో మరింత బాధ్యత పెరిగిందని నేను నమ్ముతున్నా.
2. తెరాస ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ఫలాలతో ప్రజల మనసులను గెలుచుకుంటూ ముందుకు వెళ్తాం. మంత్రి కేటీఆర్తోపాటు జిల్లాలోని అందరు నాయకులు, కార్యకర్తల సలహాలతో ముందుకుసాగుతా. వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల్లో ప్రత్యేకమైన విధానాలతో పార్టీని మరింతగా బలోపేతం చేస్తా.
3. ఏ ప్రాంతమైనా ప్రతి పార్టీకి ఎంతో కొంత ప్రాబల్యముంటుంది. అంతమాత్రాన ప్రత్యర్థి పార్టీల హవా ఉంటున్నట్లు కాదు. పార్టీకి ప్రత్యేక గుర్తింపు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉంటుంది. దానిని ఎప్పటికప్పుడు మరింతగా పెంచుకునే ప్రయత్నాలను తప్పకుండా చేపడతాం. ఇతర పార్టీలకు అందనంత ఎత్తున మా జెండాను నిలుపుతాం.
4. అలాంటిదేమీ ఉండదు. తెరాస అందరినీ ఆదరిస్తుంది. చిన్నచిన్న మనస్పర్థలు వస్తే ఎప్పటికప్పుడు సమీక్షించుకొని సమస్యలను తీర్చుకుంటాం. అందరి లక్ష్యం పార్టీ అభ్యున్నతి కాబట్టి ఎలాంటి వివాదాలకు తావివ్వం. పార్టీలో సీనియర్లు మొదలు కార్యకర్తల వరకు అందరికీ మేలు చేసేలా అధిష్ఠానం నిర్ణయాలు ఉంటాయని విశ్వసిస్తున్నా. మా జిల్లాలో పార్టీ క్రమశిక్షణతో ఉంటుంది.
5. ముచ్చటగా మూడోసారి రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం ఏర్పాటవడంలో కీలక పాత్రను పార్టీ పరంగా పోషిస్తాం. కేసీఆర్ మార్క్ మంత్రమే మా బలం. కేటీఆర్లాంటి మంత్రి ఉండటం అదనపు బలం.
కీలక పాత్ర పోషిస్తా
- కల్వకుంట్ల విద్యాసాగర్రావు, జగిత్యాల
1. పార్టీ అభ్యున్నతి కోసం అహర్నిశలు పాటుపడే నాకు ఇలాంటి మంచి అవకాశాన్ని పార్టీ అధినేత కల్పించారు. మాటల్లో చెప్పలేని సంతోషం కలుగుతుంది.
2. ఎమ్మెల్యేలు, మంత్రి సహకారంతో జిల్లాలో గులాబీ పార్టీకి తిరుగులేదనే తీరుని చేతల్లో చూపిస్తా. గ్రామస్థాయి నుంచి ప్రతి కార్యకర్త మొదలు సీనియర్లందరి సేవలు పార్టీకి అందేలా చూస్తా.
3. ప్రత్యర్థి పార్టీలు ఇన్నాళ్లుగా చేసిందేమీ లేదు. కొత్తగా ఇకపై చేస్తారనే నమ్మకం సైతం ప్రజలకు కలగడం లేదు. అలాంటప్పుడు వారి వ్యవహారాన్ని ఎప్పటికప్పుడు మా పార్టీ తరఫున ఎండగట్టేలా ఎత్తుకు పైఎత్తులు వేస్తాం. ప్రత్యర్థి పార్టీల ఉనికిని ప్రశ్నార్థకం చేసేలా మా పార్టీ ఆదరణను ప్రజల్లో మరింతగా పెంచుకుంటాం.
4. తెలంగాణ ఉద్యమం నుంచి పార్టీని నమ్ముకున్న వారికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎల్లవేళలా అండగా ఉన్నారు. కష్టపడిన వారికి అన్యాయం జరగకుండా ప్రతి ఒక్కరిపై ప్రత్యేక దృష్టిసారిస్తా. ఎవరికైనా ఇబ్బందిగా ఉంటే నేరుగా వారితో మాట్లాడతా. అందరి ఆలోచనలకు అనుగుణంగా నడచుకుంటూ ఎలాంటి గ్రూపులు లేకుండా చూస్తా.
5. యువత, మహిళలు పార్టీలో మరింత క్రియాశీలక పాత్ర పోషించేలా చూస్తా. రైతులు, కార్మిక సంఘాల సహకారంతో పార్టీని ముందుకు తీసుకెళ్తాం. సమావేశాల నిర్వహణతోపాటు కార్యకర్తలకు అవసరమైన తర్ఫీదు పార్టీ పరంగా అందించేందుకు చొరవ చూపుతా.
నమ్మకాన్ని నిలబెట్టేలా..
- జీవీ రామకృష్ణారావు, కరీంనగర్
1. వందశాతం సంతోషంగా ఉన్నా. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న నాకు కీలక బాధ్యతను అధిష్ఠానం అప్పగించింది. నమ్మకాన్ని వమ్ము చేయకుండా శక్తివంచన లేకుండా కృషి చేస్తా.
2. అధికారంలో ఉన్న పార్టీ కావడం వల్ల ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకాలను కార్యకర్తల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తా. అటు ప్రజలకు ఇటు కార్యకర్తలకు మధ్య వారధిగా ఉంటూ పార్టీ అభ్యున్నతికి పాటుపడతా. కరీంనగర్లో కొత్తగా పార్టీ కార్యాలయం నిర్మితమైంది. త్వరలో ఇది అందుబాటులోకి రానుంది. పార్టీ శ్రేణులకు అవసరమైన శిక్షణ తరగతులను నిర్వహిస్తాం. పథకాల ప్రచారంపై సంపూర్ణ అవగాహన కల్పిస్తాం.
3. పోరాటాల జిల్లా అయిన కరీంనగర్లో ఉద్యమం నుంచి ప్రజలకు తెరాసతో మంచి అనుబంధముంది. అందుకనే తెరాసకు రెండు సార్లు అధికారాన్నిచ్చారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్, భాజపాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. రెచ్చగొట్టే వ్యాఖ్యలతో భాజపా ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది.
4. చిన్నచిన్నవి ఎక్కడైనా ఉంటే క్రమశిక్షణ పరంగా సమస్యలను తీరుస్తాం. పార్టీకోసం పనిచేసేవారికి మంచి పదవులు వస్తాయనేందుకు వరుసగా కరీంనగర్ జిల్లాలో ఉద్యమకారులకు వచ్చిన అవకాశాలే నిదర్శనం.
5. ఇప్పటికే వేసిన పలు కమిటీల అధ్యక్షులను మరింత చురుగ్గా పనిచేసేలా చూస్తాం. క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధులకు, కార్యకర్తలకు అవగాహన కల్పిస్తాం. మా పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తరువాత చేసిన అభివృద్ధి ప్రజలకు అర్థమయ్యేలా తెలియజేస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పార్లమెంట్ సభ్యత్వం పునరావాస కేంద్రమా?: వినోద్కుమార్
[ 20-04-2024]
తెలంగాణ తెచ్చిన భారాస పార్టీ పార్లమెంట్లో ఉండాల్సిన అవసరం ఉందని కరీంనగర్ లోక్సభ భారాస అభ్యర్థి బి. వినోద్ కుమార్ అన్నారు. -
జమ్మికుంటలో వర్షం.. అప్రమత్తమైన అన్నదాతలు
[ 20-04-2024]
జమ్మికుంటలో వర్షం కురిసింది. దీంతో స్థానిక పాత వ్యవసాయ మార్కెట్లో ధాన్యం తడవకుండా అన్నదాతలు, మార్కెట్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. -
రెండో రోజు నలుగురు నామినేషన్
[ 20-04-2024]
కరీంనగర్, పెద్దపల్లి లోక్సభ స్థానాలకు రెండో రోజు శుక్రవారం కేవలం నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. కరీంనగర్ స్థానం కోసం భాజపా అభ్యర్థి బండి సంజయ్ తరఫున ఆ పార్టీ నాయకులు ఎన్నికల అధికారికి నామపత్రాలను అందజేశారు. -
ఆర్ఎం కార్యాలయానికి ఆరుగురు ఉద్యోగుల సరెండర్
[ 20-04-2024]
హుజూరాబాద్ ఆర్టీసీ డిపోనకు చెందిన ఆరుగురు ఉద్యోగులను కరీంనగర్ ఆర్ఎం కార్యాలయానికి సరెండర్ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. స్థానిక డిపోలో పనిచేసే డ్రైవర్ రవీందర్ వద్ద రూ.20 వేలు లంచం తీసుకుంటూ డిపో మేనేజర్ శ్రీకాంత్ ఈ నెల 15న అనిశా అధికారులకు చిక్కిన విషయం విదితమే. -
ఉక్కపోతతో తల్లీబిడ్డల ఉక్కిరిబిక్కిరి
[ 20-04-2024]
భానుడి భగభగలకు ఉదయం 9 గంటలు దాటితే ఇళ్ల నుంచి బయటకు రావడానికి జనం భయపడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఎండలు 40 డిగ్రీల కంటే అధికంగానే ఉంటున్నాయి. -
కాంగ్రెస్ నేతలకు మానసిక చికిత్స అవసరం
[ 20-04-2024]
కాంగ్రెస్ నేతలకు మానసిక చికిత్స అవసరమని హుస్నాబాద్ నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు అన్నారు. వారికి చికిత్స అందేలా చూడాలని శుక్రవారం కరీంనగర్లో ఎంపీ, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్కి వినతిపత్రం అందజేశారు. -
గంగుల, బండిల స్నేహం అందరికీ తెలుసు
[ 20-04-2024]
కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎంపీ బండి సంజయ్ల మధ్య స్నేహం అందరికీ తెలుసునని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. భారాస ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్ను ఓడించేందుకు గంగుల కమలాకర్ భాజపాతో కుమ్మకైనట్లు ఆరోపించారు. -
వారసత్వ సంపద పరిరక్షణకు ఓటేద్దాం
[ 20-04-2024]
ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంటేనే ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలకు, వారసత్వ కట్టడాలకు పెట్టింది పేరు. శాతవాహనులు, కాకతీయులు, నిజాముల కాలంలో నిర్మించిన కోటలు, మెట్ల బావులు, ఆలయాలు ఇక్కడ కనిపిస్తాయి. -
ఇదీ అన్నదాత ఎజెండా!
[ 20-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గం వ్యవసాయపరంగా అభివృద్ధి చెందిన ప్రాంతం. భిన్న వ్యవసాయ ఉత్పత్తులతో రాష్ట్రంలోనే ప్రత్యేకత చాటుకుంటోంది. దేశ విదేశాలకు ఎగుమతి చేసే పసుపు, మామిడి, మొక్కజొన్న, సన్న వరి, చెరకు, ఆవాలు, ఎర్రజొన్న, తెల్లజొన్న, సజ్జ తదితర పంటల దిగుబడిలో ఆదర్శంగా నిలుస్తున్నా అన్నదాతను సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. -
ఒక ఎంపీ.. అయిదు జిల్లాలు
[ 20-04-2024]
కరీంనగర్ లోక్సభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు గతంలో ఒకే జిల్లా పరిధిలో ఉండేవి. తెలంగాణ ఆవిర్భావం అనంతరం జిల్లాల పునర్విభజనతో ఎంపీ స్థానం అయిదు జిల్లాలకు విస్తరించింది. -
నీటి తొట్టిలో పడి బాలుడి మృతి
[ 20-04-2024]
ఇటుక బట్టీ వద్ద నీటి తొట్టిలో పడి ఏడేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన విషాదం నింపింది. కుటుంబసభ్యులు పోలీసుల కథనం ప్రకారం.. -
శిక్షణ తరగతులు సద్వినియోగం చేసుకోండి
[ 20-04-2024]
కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని కేజీబీవీల్లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పూర్తి చేసుకున్న విద్యార్థినులకు కరీంనగర్ కేజీబీవీలో నిర్వహిస్తున్న ఎప్సెట్ శిక్షణ తరగతులను సమగ్ర శిక్షా రాష్ట్ర ప్రాజెక్టు అధికారి మల్లయ్య భట్టు శుక్రవారం సందర్శించారు. -
కరీంనగర్లో రూ.15.81 లక్షల పట్టివేత
[ 20-04-2024]
పార్లమెంటు ఎన్నికల సందర్భంగా శుక్రవారం పోలీసులు కరీంనగర్లో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో రూ.15.81 లక్షల నగదును పట్టుకున్నట్లు కమిషనర్ కార్యాలయం తెలిపింది. -
ఇంటి నుంచే ఓటింగ్పై అధికారులకు శిక్షణ
[ 20-04-2024]
ఇంటినుంచే ఓటింగ్పై పాటించాల్సిన నిబంధనలపై అధికారులకు మంథని శాసనసభ సెగ్మెంట్ అధికారి హనుమనాయక్ అవగాహన కల్పించారు. శుక్రవారం మంథని ఆర్డీవో కార్యాలయంలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న అధికారులకు శిక్షణ ఇచ్చారు. -
అడుగడుగునా తనిఖీలతో ప్రలోభాలకు అడ్డుకట్ట
[ 20-04-2024]
ఎన్నికల్లో డబ్బు, మద్యం, మాదకద్రవ్యాల పంపిణీకి అడ్డుకట్ట వేసేందుకు జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. లోక్సభ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల, జగిత్యాల జిల్లాలో జిల్లా సరిహద్దు, అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. -
పెరుగుతున్న పసిడి ధరలు... తగ్గుతున్న వ్యాపారం
[ 20-04-2024]
బంగారం ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకి వెళుతున్నాయి. గతంలో పెళ్లి ముహూర్తాల సమయంలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టేవి. దీనికి భిన్నంగా మార్కెట్లో ప్రస్తుతం పసిడి ధర పది గ్రాములు(తులం) రూ.76,000 వరకు పలుకుతోంది. -
కిట్టు సరే.. పరీక్ష చేసేవారేరీ?
[ 20-04-2024]
కలుషిత నీటితో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. దీంతో ప్రజలకు శుద్ధ జలం అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే అక్కడక్కడ పైపులు పగిలి లీకేజీతో కలుషితమైన నీరు సరఫరా అయ్యే అవకాశం ఉంది. -
ఆరేళ్లుగా ఉపాధి కరవు
[ 20-04-2024]
వలసల నివారణకు అమలు చేస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల కోసం ఆరేళ్లుగా అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా ఆ కుటుంబాలకు పనులు కల్పించడం లేదు. -
ప్రజలు మళ్లీ మోసపోవద్దు
[ 20-04-2024]
భాజపా అభ్యర్థి అర్వింద్ రాముడి పేరుతో రాజకీయం తప్ప.. ప్రజలకు చేసింది ఏమీ లేదని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. పొద్దునలేస్తే హిందూ-ముస్లిం, పాకిస్థాన్-ఇండియా, రోహింగ్యాంటూ మాటలు చెప్పడమే గాని ఎంపీగా ప్రజలకు చేసింది శూన్యమని ఎద్దేవా చేశారు. -
‘పసుపు బోర్డు పేరుతో మోసం’
[ 20-04-2024]
పసుపు బోర్డు పేరుతో ఎంపీ ధర్మపురి అర్వింద్ రైతులను మోసం చేశారని కాంగ్రెస్ అభ్యర్థి జీవన్రెడ్డి ఆరోపించారు. ఇప్పుడు కూడా మభ్యపెట్టి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
తాజా వార్తలు (Latest News)
-
‘చోటా కె గారు.. మీ గౌరవాన్ని కాపాడుకోండి’.. కాదు.. కూడదంటే I AM Waiting: హరీశ్
-
హెచ్డీఎఫ్సీ ఫలితాలు.. నికర లాభం రూ.17,622 కోట్లు
-
అనారోగ్య సమస్యలతో కేజ్రీవాల్ మరణించేలా కుట్ర: దిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్
-
‘ఇంకెవరూ మీ భార్యే..’: కోహ్లీ ఆన్సర్కు షాకైన దినేశ్ కార్తిక్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘నానమ్మా.. మీ కోడలు పచ్చళ్లు సరిగ్గా చేయట్లేదా?’: ఉపాసన ఫన్నీ వీడియో