చిత్ర వార్తలు
రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు గురువారం తెరుచుకున్నాయి. విద్యార్థులు కాకుండా కేవలం ఉపాధ్యాయులు మాత్రమే పాఠశాలలకు వెళ్లాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఎప్పుడెప్పుడు పాఠశాలలు తెరుస్తారా... పిల్లలు ఎప్పుడు బడికి వెళతారా అని వారి తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు.
పాఠశాలలకు ఉపాధ్యాయులు
రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు గురువారం తెరుచుకున్నాయి. విద్యార్థులు కాకుండా కేవలం ఉపాధ్యాయులు మాత్రమే పాఠశాలలకు వెళ్లాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఎప్పుడెప్పుడు పాఠశాలలు తెరుస్తారా... పిల్లలు ఎప్పుడు బడికి వెళతారా అని వారి తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు. గురువారం నుంచి అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులు 50 శాతం మంది రొటేషన్ పద్ధతిలో హాజరుకావాలని జిల్లా విద్యాశాఖ ఆదేశాలు జారీ చేయడంతో అధ్యాపకులు విద్యాలయాలకు వచ్చారు. కొత్తపల్లి మండలంలోని ప్రాథమిక పాఠశాలలో కనిపించిన దృశ్యమిది.
- ఈనాడు, కరీంనగర్
మురుగుతో అవస్థలు
పట్టణంలోని బీడీకాలనీలో ప్రధాన రహదారిపై మురుగునీరు నిలిచి దుర్వాసనతో పాటు దోమలు పెరిగి కాలనీ ప్రజలు అవస్థలు పడుతున్నారు. మురుగునీరు నిల్వకుండా చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరుతున్నారు.
-న్యూస్టుడే, మెట్పల్లి పట్టణం
ఫుట్పాత్ ధ్వంసం
పట్టణ సుందరీకరణలో భాగంగా ప్రధాన రహదారికిరువైపులా సుమారు 4 కి.మీ పొడవునా నూతనంగా మురుగు కాలువ నిర్మాణం చేపట్టారు. కాలినడక కోసం ఫుట్పాత్ నిర్మించి టైల్స్ను పరిచారు. గురువారం మెట్పల్లిరోడ్లోని ఓరైస్మిల్ ముందున్న ఫుట్పాత్ను పూర్తిగా ధ్వంసం చేశారు. ప్రభుత్వ కట్టడాలను ధ్వంసం చేసిన యజమానిపై మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.
-న్యూస్టుడే, కోరుట్ల
ప్రగతి ప్రాంగణానికి కాంతుల తోరణం
జిల్లాకేంద్రంలోని పెద్దకల్వల క్యాంపులో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న సమీకృత పాలనా ప్రాంగణ భవనం బుధవారం రాత్రి విద్యుద్దీపాలతో కాంతులీనింది. నూతన భవనంలో విద్యుత్తు లైటింగ్, నీటి ఫౌంటేన్ల పనితీరును పరీక్షించేందుకు కాంట్రాక్టు కంపెనీ ఉద్యోగులు సాయంత్రం వేళ ఈ ఏర్పాటు చేశారు. ఇందులో ఆవరణలోని ఫౌంటేన్ ఆకర్షణీయంగా నిలిచింది.
-ఈనాడు డిజిటల్, పెద్దపల్లి
సీఎంను కలిసిన చందర్
రామగుండం ఎమ్మెల్యే, జిల్లా తెరాస అధ్యక్షుడు కోరుకంటి చందర్ గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ను హైదరాబాద్ ప్రగతిభవన్లో కలిశారు. జిల్లా అధ్యక్షునిగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛం అందజేశారు. పెద్దపల్లి జిల్లా పార్టీ అధ్యక్షులుగా నియమించినందుకు తన నమ్మకాన్ని నిలబెడతానని సీఎంకు విన్నవించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. సీఎంతో పాటు మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎంపీ బోర్లకుంట వెంకటేశ్నేతను కలిసినట్లు వెల్లడించారు.
-న్యూస్టుడే, గోదావరిఖని
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణం
[ 18-04-2024]
దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి క్షేత్రంలో బుధవారం శ్రీరామనవమి సందర్భంగా శ్రీసీతారాముల కల్యాణోత్సవాన్ని ఆలయ వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. -
నేటి నుంచి నామినేషన్లు షురూ!
[ 18-04-2024]
ఎన్నికల సమరంలో అసలైన ఘట్టం గురువారం నుంచి మొదలవనుంది. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ నెల రోజుల కిందటే వెలువడినప్పటికీ నేడు వెలువడే అధికారిక నోటిఫికేషన్తో అసలు అంకం షురూ అవనుంది. -
ప్రచార పర్వానికి కాంగ్రెస్ సిద్ధం!
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికలకు సంబంధించి గురువారం నామపత్రాల స్వీకరణ కార్యక్రమం ప్రారంభమవుతున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ లోక్సభ స్థానం పరిధిలో ప్రచార కసరత్తు ప్రారంభించింది. -
కొప్పుల మొదటిసారి.. జీవన్ మూడోసారి
[ 18-04-2024]
ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో వేర్వేరు పార్టీలు, వేర్వేరు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్న తాటిపర్తి జీవన్రెడ్డి, కొప్పుల ఈశ్వర్లకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. ఆరు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా గెలుపొందిన జీవన్రెడ్డి స్వగ్రామం పెగడపల్లి మండలం బతికెపల్లి. -
క్లిక్ దూరంలో సమగ్ర సమాచారం
[ 18-04-2024]
ఎన్నికలకు సంబంధించిన సమగ్ర సమాచారం అందుబాటులో ఉండేలా కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక వెబ్సైట్ రూపొందించింది. ceotelangana.nic.in లో ఓటరు నమోదుతో పాటు సవరణలు, తొలగింపులు తదితర అంశాలుంటాయి. -
రెండు సార్లు ఎంపీ.. సాధారణ జీవనం
[ 18-04-2024]
వరుసగా రెండు సార్లు ఎంపీగా ఎన్నికైనా చివరి శ్వాస వరకు పల్లెటూరులోనే సాధారణ జీవితం గడిపారు జువ్వాడి రమాపతిరావు. 1916లో గన్నేరువరంలో జన్మించిన ఆయన వివాహం అనంతరం అత్తగారి ఊరైన గంగాధర మండలం సర్వారెడ్డిపల్లికి వచ్చి స్థిరపడ్డారు. -
ఎన్నికల పరిశీలకులొస్తున్నారు
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికలను స్వేచ్ఛగా, శాంతియుతంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పకడ్బందీ చర్యలు చేపట్టింది. ప్రలోభాలకు అడ్డుకట్ట వేసేందుకు ఉన్నతాధికారుల పర్యవేక్షణ పెంచింది. -
హాట్రిక్ విజేత..అరుదైన ఘనత
[ 18-04-2024]
ఉమ్మడి జిల్లాలో నలుగురు నేతలు వరుసగా మూడు సార్లు లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా హ్యాట్రిక్ రికార్డు సొంతం చేసుకున్నారు. కరీంనగర్ నుంచి ముగ్గురు, పెద్దపల్లి నుంచి ఒకరు గెలుపొంది రాజకీయాల్లో తమదైన ముద్ర వేసుకున్నారు. -
అక్కడ స్థానికేతరులే అధికం
[ 18-04-2024]
1962లో ఆవిర్భవించిన పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గం నుంచి ఇప్పటివరకు ఒక్కసారి మినహా అన్ని ఎన్నికల్లో స్థానికేతరులే గెలుపొందారు. 1980లో 7వ లోక్సభ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించిన కోదాటి రాజలింగం మాత్రమే స్థానికుడు. -
వసతుల మెరుగుకు కార్యాచరణ
[ 18-04-2024]
ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, రామగుండం నగరపాలికల్లో కనీస మౌలిక వసతులు మెరుగుపర్చడానికి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ప్రధానంగా తాగునీరు, భూగర్భ మురుగునీటి వ్యవస్థను బలోపేతం చేసేలా చర్యలు తీసుకుంటారు. -
ఆదాయంలో జమ్మికుంట మార్కెట్ టాప్
[ 18-04-2024]
పంటలకు పెరిగిన మద్దతు ధర, ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా పాత బకాయిలు జమకావటం, చెక్పోస్టులు, గిడ్డంగుల అద్దెలు, లైసెన్సులు, మార్కెట్లకు వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాల ద్వారా లభించే ఆదాయంతో ఉమ్మడి జిల్లాలోని జగిత్యాల వ్యవసాయ మార్కెట్ మినహా కరీంనగర్, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లు మార్కెటింగ్ శాఖ నిర్ణయించిన ఆర్థిక ఆదాయ లక్ష్యాన్ని అధిగమించాయి. -
ఓటరు దరఖాస్తులకు త్వరితగతిన పరిష్కారం
[ 18-04-2024]
నామినేషన్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ సూచించారు. బుధవారం ఆయన నిర్వహించిన పెద్దపల్లి నుంచి కలెక్టర్ ముజమ్మిల్ఖాన్, అదనపు కలెక్టర్లు అరుణశ్రీ, శ్యామ్ప్రసాద్లాల్లు పాల్గొన్నారు. -
మిల్లుల్లోనే బియ్యం.. ధాన్యానికేదీ స్థలం?
[ 18-04-2024]
గత వానాకాలం సీజన్కు సంబంధించిన బియ్యానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో మిల్లుల్లోనే నిల్వలు పేరుకుపోయాయి. గత సీజన్కు సంబంధించిన సీఎంఆర్ లక్ష్యాలను మిల్లర్లు పూర్తి చేయాలనే గడువును జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు పొడిగిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
గూగుల్లో మరోసారి ఉద్యోగుల తొలగింపు.. తోషిబాలోనూ 5,000 మంది!
-
ఆ లక్ష్యంతోనే బరిలోకి దిగాం : రిషభ్ పంత్
-
సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫిర్యాదు.. కేసీఆర్ అన్న కుమారుడిపై మరో కేసు
-
మణి అన్నపురెడ్డిని ఎందుకు పట్టుకోవట్లేదు?
-
ఉత్తర్ప్రదేశ్ బరిలో తెలంగాణ మహిళ.. ఆమె ఆస్తులు ఎంతంటే?
-
నాయికలు ‘తెర’ పంచుకుంటే.. వినోదం పెంచినట్టే