logo

గతుకుల రోడ్డు... ప్రయాణం బితుకుబితుకు

చందుర్తి మండలంలోని కోరుట్ల-వేములవాడ ప్రధాన మార్గంలో మర్రిగడ్డ-మూడపల్లి మధ్య రహదారిపై తారు చెదిరిపోయి గుంతలు ఏర్పడ్డాయి. వీటి కారణంగా రెండేళ్లుగా  వాహనదారులు ప్రమాదాలకు

Updated : 20 May 2022 04:10 IST

చందుర్తి మండలంలోని కోరుట్ల-వేములవాడ ప్రధాన మార్గంలో మర్రిగడ్డ-మూడపల్లి మధ్య రహదారిపై తారు చెదిరిపోయి గుంతలు ఏర్పడ్డాయి. వీటి కారణంగా రెండేళ్లుగా  వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నా ఆర్‌అండ్‌బీ అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో రవాణా కష్టాలు తీరడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వర్షాకాలం ప్రారంభం కాకముందే మరమ్మతులు చేపట్టాలని ప్రయాణికులు, వాహనదారులు కోరుతున్నారు.

- న్యూస్‌టుడే, రుద్రంగి 



ముగిసిన పరీక్షలు.. సందడి మొదలు

ఇంటర్మీడియట్‌ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మంగళవారం మొదటి సంవత్సరం, బుధవారం ద్వితీయ సంవత్సర పరీక్షలు ముగియడంతో విద్యార్థులు ఇంటిదారి పట్టారు. తల్లిదండ్రులు కళాశాలలకు చేరుకుని పుస్తకాలు, బ్యాగులు, తదితర సామగ్రితో పిల్లలను తీసుకుని పయనమయ్యారు. పరీక్ష కేంద్రాలు, బస్టాండ్‌ తదితర ప్రాంతాల్లో విద్యార్థుల రద్దీ దర్శనమిచ్చింది.

- న్యూస్‌టుడే, కరీంనగర్‌ రాంనగర్‌ 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని