logo

విద్యార్థి మృతి సంఘటనలో జూనియర్‌ లెక్చరర్‌ సస్పెన్షన్‌

ఎన్టీపీసీ కృష్ణానగర్‌ సమీపంలోని తెలంగాణ మైనారిటీ గురుకుల కళాశాలలో విద్యార్థి మృతి సంఘటనలో జూనియర్‌ లెక్చరర్‌ ఎం.సత్యనారాయణను విధుల నుంచి సస్పెండ్‌ చేస్తూ

Published : 20 May 2022 03:47 IST

జ్యోతినగర్, న్యూస్‌టుడే: ఎన్టీపీసీ కృష్ణానగర్‌ సమీపంలోని తెలంగాణ మైనారిటీ గురుకుల కళాశాలలో విద్యార్థి మృతి సంఘటనలో జూనియర్‌ లెక్చరర్‌ ఎం.సత్యనారాయణను విధుల నుంచి సస్పెండ్‌ చేస్తూ సొసైటీ కార్యదర్శి ఎం.షఫీఉల్లా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. గత ఆదివారం మైనారిటీ కళాశాలలో ఇంటర్‌ ఎంపీసీ రెండో సంవత్సరం విద్యార్థి ఎండీ.రవూఫ్‌ భవనంపై నుంచి పడి మృతి చెందిన విషయం విధితమే. ఈక్రమంలో విద్యార్థి మృతిపై లోతైన విచారణ చేసిన మైనారిటీ సొసైటీ విజిలెన్స్‌ అధికారులు ఫిజిక్స్‌ జూనియర్‌ లెక్చరర్‌ ఎం.సత్యనారాయణపై చర్యలు తీసుకోవాలని నివేదిక ఇచ్చారు. ఈమేరకు విద్యార్థి మృతి సమయంలో విధుల్లో ఉన్న జూనియర్‌ లెక్చరర్‌ సత్యనారాయణను సస్పెండ్‌ చేసినట్లు సొసైటీ పంపిన ప్రత్యేక ఉత్తర్వుల్లో పేర్కొంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని