క్లరికల్ సిబ్బందిపై తగ్గనున్న పని భారం
సింగరేణిలో పనిచేస్తున్న క్లరికల్ సిబ్బందిపై పని భారం తగ్గనుంది. ప్రస్తుతం సింగరేణిలో క్లరికల్ సిబ్బంది కొరత ఉండటంతో ఉన్న వారిపై పని భారం పడుతుంది. చాలా కాలంగా
అంతర్గత అభ్యర్థులతో ఖాళీల భర్తీ
న్యూస్టుడే, గోదావరిఖని: సింగరేణిలో పనిచేస్తున్న క్లరికల్ సిబ్బందిపై పని భారం తగ్గనుంది. ప్రస్తుతం సింగరేణిలో క్లరికల్ సిబ్బంది కొరత ఉండటంతో ఉన్న వారిపై పని భారం పడుతుంది. చాలా కాలంగా ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నా యాజమాన్యం స్పందించలేదు. సంస్థలో పనిచేస్తున్న అంతర్గత అభ్యర్థులతో భర్తీ చేయాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో యాజమాన్యం 155 క్లరికల్ ఖాళీలను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంది. ఈమేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. జూనియర్ అసిస్టెంట్ గ్రేడు-2 పోస్టులను భర్తీ చేసేందుకు అంతర్గత అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. సింగరేణిలో ప్రస్తుతం 1500 మంది వరకు క్లరికల్ సిబ్బంది పనిచేస్తున్నారు. 3000 మందికి పైగా ఉన్న క్లరికల్ సిబ్బంది ఉద్యోగ విరమణ పొందడంతో వారి సంఖ్య తగ్గుతూ వచ్చింది. ఇటీవల కొత్తగా ఉద్యోగంలో చేరిన వారితో యాక్టింగ్ క్లర్కులుగా సంస్థ వినియోగించుకుంటుంది. ఇంకా కొరత ఉండటంతో కొత్తగా అర్హులైన అంతర్గత అభ్యర్థులతో భర్తీ చేసేందుకు యాజమాన్యం నిర్ణయించింది.
25 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు
ఈ నెల 25 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను సంస్థ ఆహ్వానించింది. అర్హులైన అభ్యర్థులు జూన్ 10 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు నివేదించాలని సూచించింది. ఆ తర్వాత జూన్ 25 లోగా దరఖాస్తుల హార్డ్కాపీ పోస్టు ద్వారా పంపించాలని వెల్లడించింది. భూగర్భ గనుల్లో పనిచేసే ఉద్యోగులకు ఏడాదిలో 190 మస్టర్లు, ఉపరితల విభాగాల్లో పనిచేసే ఉద్యోగులకు 240 మస్టర్లు తప్పనిసరిగా ఉండాలి. ఏదైనా డిగ్రీ కనీస అర్హతతో పాటు కంప్యూటర్ కోర్సులో 6 నెలల డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. వయోపరిమితితో సంబంధం లేదు. అభ్యర్థులు తాము పనిచేస్తున్న గని, విభాగం అధికారి ద్వారా దరఖాస్తులను సమర్పించాలి. అభ్యర్థికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని గని, విభాగం అధికారి జత చేసి పర్సనల్ జీఎం రిక్రూట్మెంట్ విభాగానికి పంపించాలి. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 95 శాతం ఖాళీలు స్థానికులు(సింగరేణి విస్తరించి ఉన్న ఉమ్మడి నాలుగు జిల్లాలు), 5 శాతం స్థానికేతరులైన అంతర్గత అభ్యర్థులతో భర్తీ చేయనుంది. అభ్యర్థులకు రాత పరీక్షలు నిర్వహించనున్నారు. 85 శాతం మార్కులు రాత పరీక్ష, 15 శాతం మార్కులు అసెస్మెంటు రిపోర్టుకు కేటాయించనున్నారు. పరీక్ష పూర్తయిన వెంటనే మెరిట్ జాబితాను వెంటనే ప్రకటించనున్నారు.
విద్యావంతులు ఎక్కువగా..
సింగరేణిలో ప్రస్తుతం ఎక్కువ శాతం మంది విద్యావంతులు పనిచేస్తున్నారు. గతంలో చాలా మంది నిరక్ష్యరాసులు ఉండే వారు. వారసత్వ ఉద్యోగాలతో చాలా మంది డిగ్రీ ఆపైన చదివిన వారు ఎక్కువగా చేరారు. బదిలీ, జనరల్ మజ్దూర్లుగా పనిచేస్తున్న వారిలో 90శాతం మంది ఇంజినీరింగ్, ఎంబీఏ, పీజీలు చదివిన వారు ఉన్నారు. దీంతో అంతర్గత అభ్యర్థులతో 155 క్లరికల్ ఖాళీలను భర్తీ చేసేందుకు యాజమాన్యం చర్యలు తీసుకుంది.
పారదర్శకంగా నియామకాలు: బలరాం, సింగరేణి సంచాలకులు
క్లరికల్ ఉద్యోగ నియామకాలు పారదర్శకంగా చేపడతాం. ఎలాంటి పైరవీలకు ఆస్కారం లేదు. ప్రతిభపై ఆధారపడి అభ్యర్థులు పరీక్షలకు హాజరు కావాలి. తొలిసారి అంతర్గత అభ్యర్థులతో ఖాళీలను భర్తీ చేస్తున్నాం. త్వరలో బయటి వారితో కూడా మరికొన్ని క్లరికల్ ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నాం. త్వరలోనే ప్రకటన విడుదల చేస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాకా.. వెంకటస్వామికి ఆ పేరెలా వచ్చింది?
[ 24-04-2024]
కాంగ్రెస్ పార్టీ దివంగత, కేంద్ర మాజీ మంత్రి జి.వెంకటస్వామి ‘కాకా’గానే ఎక్కువ మందికి సుపరిచితులు. ఆయనకు ఈ పేరు రావడం వెనుక ఆసక్తికర అంశం ఉంది. -
యాప్ కష్టాలు
[ 24-04-2024]
జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల నిర్వాహకులు అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన యాప్ల్లో సమాచారం నిక్షిప్తం చేయాల్సి ఉంది. -
నిర్వహణ భారం.. కమీషన్లో కోత
[ 24-04-2024]
కేంద్రాల నిర్వహణ భారంగా మారగా.. వచ్చిన కమీషన్లో కోత విధించడంతో నిర్వాహకులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. -
ఇక ట్వంటీ20 పోరు!
[ 24-04-2024]
పోలింగ్ తేదీకి బుధవారం నుంచి సరిగ్గా ఇరవై రోజులుంది.. అచ్చంగా ట్వంటీ20 క్రికెట్ ఆటలోని 20 ఓవర్ల మాదిరి సమరం. -
మిగిలింది రెండు రోజులే!
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో తొలి అంకం రెండు రోజుల్లో ముగియనుంది. ఈ నెల 25వ తేదీతో నామినేషన్ల స్వీకరణ పూర్తవనుంది. -
నకిలీ పత్రాలు సృష్టించి.. ఇల్లు ధ్వంసం
[ 24-04-2024]
నకిలీ పత్రాలు సృష్టించి, ఇంటిని ధ్వంసం చేసి, దాడికి పాల్పడిన అయిదుగురిని కరీంనగర్ కొత్తపల్లి పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. -
పార్టీ పెద్దల సమ్మతితోనే రాజేందర్ నామినేషన్
[ 24-04-2024]
పార్టీ పెద్దల సమ్మతితోనే తామంతా కలిసి కాంగ్రెస్ తరఫున వెలిచాల రాజేందర్రావుతో నామినేషన్ వేయించామని, గెలిపిం చుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. -
అతివల ఉపాధికి ఆదరువేదీ!
[ 24-04-2024]
రాష్ట్రంలో 6 లక్షల మంది బీడీ కార్మికులుండగా అత్యధికంగా నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోనే ఉన్నారు. -
ఆ పది మందికే 50 శాతం ఓటర్ల మద్దతు
[ 24-04-2024]
ఎన్నికల్లో ప్రత్యర్థి కంటే ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా విజయం సాధించినట్లే. అయితే గెలుపొందిన అభ్యర్థికి నియోజకవర్గంలోని ఎంత మంది ఓటర్ల మద్దతు ఉందనేది పోటీలో ఉన్న అభ్యర్థులు, నమోదైన పోలింగ్ శాతాన్ని బట్టి మారుతుంది. -
ఆయుధాలు అప్పగించారు..
[ 24-04-2024]
వ్యక్తిగత భద్రత కోసం లైసెన్సు తీసుకొని వెంట ఉంచుకున్న ఆయుధాలను ఉమ్మడి జిల్లావాసులు ఠాణాలకు అప్పగించారు. -
మాతాశిశుకు తప్పని ఉక్కపోత
[ 24-04-2024]
చంటి బిడ్డలు, బాలింతలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో వేసవి ఉక్కపోత తప్పడం లేదు. -
బ్యాలెట్ యుద్ధానికి చకచకా సన్నద్ధం
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికలను సమర్థంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. -
పనులకు ఆటంకాలు.. రాకపోకలకు అవస్థలు
[ 24-04-2024]
రెండు జిల్లాల సరిహద్దులోని మానేరు వాగు దాటడానికి ఇరువైపులా గ్రామాల ప్రజలు దశాబ్దాల తరబడి నానా అవస్థలు పడుతున్నారు. -
తైబజార్... చిరు వ్యాపారుల బేజార్
[ 24-04-2024]
పురపాలక సంఘంలో తైబజార్ గుత్తేదారు ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేస్తున్నా పట్టించుకున్న నాథుడు లేడు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం