సమావేశాన్ని బహిష్కరించిన కౌన్సిలర్లు
తమకు తెలియకుండానే కౌన్సిల్ అజెండాలను రూపొందిస్తూ.. మున్సిపల్ ఛైర్పర్సన్, కమిషనర్లు కలిసి నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపిస్తూ వైస్ ఛైర్పర్సన్
నిధుల దుర్వినియోగంపై విచారణకు డిమాండ్
హుజూరాబాద్, న్యూస్టుడే: తమకు తెలియకుండానే కౌన్సిల్ అజెండాలను రూపొందిస్తూ.. మున్సిపల్ ఛైర్పర్సన్, కమిషనర్లు కలిసి నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపిస్తూ వైస్ ఛైర్పర్సన్ కొలిపాక నిర్మలతో పాటు మరో 25మంది అధికార పార్టీ, భాజపా కౌన్సిలర్లు గురువారం జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరించారు. ఇందులో భాగంగా ఛైర్పర్సన్, కమిషనర్ వైఖరికి నిరసనగా అధికార పార్టీ కౌన్సిలర్లతో పాటు భాజపా కౌన్సిలర్లు ఛైర్పర్సన్, కమిషనర్పై కలెక్టర్కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. హుజూరాబాద్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం గురువారం నిర్వహించేందుకు ఛైర్పర్సన్ గందె రాధిక కౌన్సిల్ అజెండాను రూపొందించగా దాదాపుగా 25మంది హాజరుకాకపోవడంతో సమావేశాన్ని వాయిదా వేశారు. 25మంది కౌన్సిలర్ల సంతకాలతో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయనున్న పత్రాన్ని ఆయా కౌన్సిలర్లు విలేకరులకు అందజేశారు. హుజూరాబాద్లో అభివృద్ధి పనుల కోసం రూ.85కోట్లు కేటాయించగా వార్డుల్లో పనులు కాకుండానే బిల్లులు చెల్లిస్తున్నారని, పనులు, బిల్లుల వివరాలు అడిగినా ఇవ్వడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. మిషన్ భరీరథ పథకం కింద పైపులైన్లు, ప్యాచ్ల పనుల కోసం రూ.15కోట్లు కేటాయించగా అస్తవ్యస్తంగా పనులు చేశారని, నల్లా కనెక్షన్లు ఇవ్వకుండానే బిల్లులు తీసుకున్నారని ఆరోపించారు. పట్టణ ప్రగతి కింద ప్రతి నెలా రూ.42లక్షలు కేటాయిస్తుండగా నిధులను దుర్వినియోగం చేస్తున్నారని వీటిపై వివరాలు అడిగితే రెండేళ్లుగా దాటవేస్తున్నారని ఆరోపించారు. కౌన్సిల్ అజెండాలో రూ.50వేలు దాటిన పనులకు కౌన్సిలర్లకు వివరాలివ్వాలని గతంలో తీర్మానించినప్పటికీ అమలు పర్చడం లేదని, రూ.83లక్షలతో స్వీపింగ్ మిషన్ కొనుగోలు చేశారని, దీనికి సంబంధించిన బిల్లులు అడిగితే ఇవ్వడం లేదన్నారు. అలాగే డీజిల్ బిల్లులు, ఇతర బిల్లులపై వివరాలు ఇవ్వాలని కోరగా సమాధానం ఇవ్వకపోగా సాధారణ నిధుల నుంచి లక్షల రూ.లు ఖర్చు చేస్తూ దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొన్నారు. హరితహారం కింద మొక్కలు, ట్రీగార్డులు, సపోర్టు కర్రలు, గుంతల తవ్వకం పనులకు ఎలాంటి బిల్లులు లేకుండానే లక్షలు ఖర్చు చేశారని మొక్కలు నాటకుండానే నాటినట్లు బిల్లులు తీసుకున్నారని ఆరోపించారు. వీటన్నింటిపై విచారణ జరిపి ఛైర్పర్సన్, కమిషనర్లపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో డిమాండ్ చేశారు. దీనిపై ఛైర్పర్సన్ గందె రాధిక, కమిషనర్ వెంకన్న మాట్లాడుతూ కౌన్సిలర్ల ఆరోపణలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. నిబంధనలకు అనుగుణంగానే నిధులు ఖర్చు చేస్తున్నామని వివరణ ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పత్తి రైతులు, వ్యాపారుల ఆందోళన
[ 23-04-2024]
ఎన్నికల కోడ్ పేరుతో తనిఖీలు నిర్వహించి బ్యాంకుల నుంచి డబ్బును తీసుకొస్తున్న తమను ఇబ్బందులకు గురి చేయవద్దని జమ్మికుంట పత్తి మార్కెట్ వద్ద వ్యాపారులు, పత్తి రైతులు ఆందోళనకు దిగారు. -
మానేరు వాగుపై కూలిన నిర్మాణంలోని వంతెన
[ 23-04-2024]
పెద్దపల్లి జిల్లాలో మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. ముత్తారం మండలం ఓడేడు పరిధిలో సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. -
పిల్లల అల్లరిని దారి మళ్లించండి
[ 23-04-2024]
పది నెలలపాటు చదువుతో కుస్తీ పడిన పిల్లలకు వేసవి సెలవులు ఉపశమనం ఇస్తాయి. ఆటాపాటలతో సరదాగా గడపొచ్చని భావిస్తుంటారు. -
మోదీ వ్యాఖ్యల్లో ఓటమి భయం
[ 23-04-2024]
లోక్సభ మొదటి దశ ఎన్నికల తీరును చూసిన ప్రధాని మోదీ ఓటమి భయంతో దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సంపద అంతా ముస్లింలకు ఇస్తుందని వ్యాఖ్యానించారని మంత్రి పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు. -
నాలుగో రోజు 25 నామినేషన్లు
[ 23-04-2024]
నామినేషన్ల ప్రక్రియ నాలుగో రోజు సోమవారం కరీంనగర్, పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గ స్థానాలకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. -
హామీలను విస్మరించిన ప్రభుత్వం
[ 23-04-2024]
శాసనసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిందని కరీంనగర్ భారాస అభ్యర్థి వినోద్కుమార్ అన్నారు. -
సెప్టెంబరులో చక్కెర కర్మాగారం తెరిపిస్తాం
[ 23-04-2024]
శాసనసభ ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీ మేరకు నిజాం చక్కెర కర్మాగారాలు తెరిపించేందుకు అవసరమైన చర్యలు చేపట్టినట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. -
అవకాశమిస్తే అభివృద్ధి చేసి చూపిస్తా!
[ 23-04-2024]
ప్రాంతానికి కొత్త కావచ్చు, రాజకీయాలకు, ప్రజా సేవకు కొత్తకాదని, అవకాశమిస్తే పార్లమెంట్ పరిధిని అభివృద్ధి చేసి చూపిస్తానని నిజామాబాద్ భారాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. -
దారులన్నీ కొండగట్టుకే
[ 23-04-2024]
తమ ఇష్టదైవాన్ని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి దీక్షాపరులు తరలివస్తున్నారు. -
ఓటరు నమోదులో ఫలించిన చైతన్యం
[ 23-04-2024]
ప్రజాస్వామ్యం కల్పించిన ఓటు హక్కు నమోదుకు యువతలో నూతనోత్సాహం ఉరకలేసింది. -
ప్రత్యేక నిధులు.. తీరనున్న ఇక్కట్లు
[ 23-04-2024]
రామగుండం నగరపాలక ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు అమృత్-2.0, యు.ఐ.డి.ఎఫ్.(అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్) నిధులతో పరిష్కారం కానున్నాయి. -
కాంగ్రెస్ నైజాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి
[ 23-04-2024]
భారాస పాలనలోనే అన్ని వర్గాల ప్రజలు సంక్షేమ ఫలాలు అందుకున్నారని, గడిచిన నాలుగు నెలల కాలంలో సంక్షేమ పథకాలను అటకెక్కించిన కాంగ్రెస్ పాలకుల నైజాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పెద్దపల్లి లోక్సభ భారాస అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. -
లెక్కలు తేలేనా?
[ 23-04-2024]
జిల్లా వస్త్ర పరిశ్రమకు గత ప్రభుత్వం సంక్షేమ, పాఠశాల విద్యాశాఖలకు సంబంధించిన వస్త్రోత్పత్తుల ఆర్డర్లు ఇచ్చింది. -
నిధులున్నా ప్రారంభం కాని పనులు
[ 23-04-2024]
గ్రామీణ, గిరిజన ప్రాంతాలకు రవాణా వ్యవస్థ మెరుగుపరిచి రెండు జిల్లాల గ్రామాలను అనుసంధానం చేయాలనే లక్ష్యంతో తారు రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. -
పట్టాలెక్కని ప్రతిపాదనలు
[ 23-04-2024]
ఉమ్మడి జిల్లాలో రైల్వే శాఖాపరంగా అభివృద్ధికి అడుగులు పడాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు. -
అమాత్యులుగా ఆ నలుగురు
[ 23-04-2024]
ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, పెద్దపల్లి లోక్సభా నియోజకవర్గాల నుంచి ఎన్నికైన ఎంపీల్లో ఇప్పటివరకు నలుగురికి మాత్రమే కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది.
తాజా వార్తలు (Latest News)
-
ఫొటోకు పోజులిస్తూ... అగ్నిపర్వతంలో జారిపడిన పర్యటకురాలు
-
విమానాల్లో 12 ఏళ్లలోపు వారికి తల్లిదండ్రుల పక్కనే సీటివ్వాలి: డీజీసీఏ
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
-
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?