logo

రైతును రాజును చేయడమే కాంగ్రెస్‌ లక్ష్యం

రైతును రాజును చేయడమే కాంగ్రెస్‌ లక్ష్యమని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ అన్నారు. శనివారం కరీంనగర్‌ రూరల్‌ మండలం నగునూరులో ‘రైతు రచ్చబండ’ కార్యక్రమం పార్టీ శ్రేణులతో కలిసి నిర్వహించారు. ప్రజల ఆకాంక్షలు, అమరుల....

Published : 22 May 2022 04:09 IST


రైతు రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడుతున్న పొన్నం ప్రభాకర్‌

నగునూరు(కరీంనగర్‌ గ్రామీణం), న్యూస్‌టుడే: రైతును రాజును చేయడమే కాంగ్రెస్‌ లక్ష్యమని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ అన్నారు. శనివారం కరీంనగర్‌ రూరల్‌ మండలం నగునూరులో ‘రైతు రచ్చబండ’ కార్యక్రమం పార్టీ శ్రేణులతో కలిసి నిర్వహించారు. ప్రజల ఆకాంక్షలు, అమరుల ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీ అన్నారు. తెరాస, భాజపా పాలనలో పెరిగిన నిత్యావసర ధరలతో సామాన్య ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారన్నారు. రైతుల జీవితాల్లో వెలుగులు నింపేందుకే వరంగల్‌ డిక్లరేషన్‌ను రాహుల్‌గాంధీ ప్రకటించారన్నారు. రాజీవ్‌గాంధీ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ పద్మాకర్‌రెడ్డి, పార్టీ నేతలు పి.లక్ష్మణ్‌రావు, పొన్నం సత్యం, తోట నారాయణ, సాయిళ్ల రాజు, శ్రీనివాస్‌గౌడ్‌, మహేందర్‌, బుర్ర హరీశ్‌గౌడ్‌ గ్రామస్థులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని