గెలుపే ధ్యేయంగా ముందుకు సాగాలి
రాబోయే ఎన్నికల్లో జిల్లాలోని అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో తెరాస గెలుపే ధ్యేయంగా పార్టీ శ్రేణలు ముందుండాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు.
ఎమ్మెల్సీ కవిత పిలుపు
తెరాస జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే విద్యాసాగర్రావును సన్మానిస్తున్న ఎమ్మెల్సీ కవిత
మెట్పల్లి, న్యూస్టుడే: రాబోయే ఎన్నికల్లో జిల్లాలోని అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో తెరాస గెలుపే ధ్యేయంగా పార్టీ శ్రేణలు ముందుండాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. మెట్పల్లి పట్టణంలోని వెంకటరెడ్డి గార్డెన్స్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు, కోరుట్ల ఎమ్మెల్యే అధ్యక్షతన జరిగిన కోరుట్ల నియోజకవర్గస్థాయి విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో తెరాస హయాంలో జరిగిన అభివృద్ధిపై గ్రామ కూడళ్లలో కార్యకర్తలు చర్చజరపాలని, ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. తెలంగాణా వచ్చిందే యువత కోసమని, అలాంటి యువకులకు ప్రభుత్వం తప్పకుండా ఉద్యోగావకాశాలు కల్పిస్తుందన్నారు. పింఛన్లలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందన్నారు. జీవన్రెడ్డికి కేసీఆర్ను తిట్టడమే తప్ప వేరే పనిలేదని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు మీ ఇళ్లలోకి వస్తే వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు చూపాలన్నారు. ఎమ్మెల్సీ ఎల్.రమణ మాట్లాడుతూ ఎంపీ అర్వింద్కు పసుపు బోర్డుకు స్పైసెస్ బోర్డుకు తేడా తెలియదని విమర్శించారు. జిల్లా పరిషత్ అధ్యక్షురాలు వసంత మాట్లాడుతూ కత్తులు కటార్లు మాకు కూడా తిప్పడం వచ్చని, మాకు సంస్కారం అడ్డువస్తుందన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్రావు మాట్లాడుతూ ఎంపీ అర్వింద్, బండి సంజయ్లకు సంస్కారం లేదన్నారు. ఎంపీీ కవిత హయాంలోనే మెట్పల్లి, కోరుట్ల పట్టణాల్లో అభివృద్ధి జరిగిందని, సుందరీకరణ పనులు జరుగుతున్నాయన్నారు. జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక తొలిసారి కార్యకర్తల సమావేశం నిర్వహించడం, పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే విద్యాసాగర్రావును ఎమ్మెల్సీ కవిత సన్మానించారు. ప్రభుత్వం దృష్టికి తీసికెళ్లి వేతన సవరణ జరిగేలా చూడాలని ఆర్పీలు ఎమ్మెల్సీకి వినతి ప్రతం సమర్పించారు. పుర అధ్యక్షులు, ఎంపీీపీీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మెట్పల్లిలో కార్యకర్తలు బహూకరించిన కత్తితో ఎమ్మెల్సీ కవిత, చిత్రంలో ఎమ్మెల్సీ రమణ, ఎమ్మెల్యే విద్యాసాగర్రావు
జగిత్యాలలో శాశ్వత పండ్ల మార్కెట్గా అభివృద్ధి
జగిత్యాల ధరూర్క్యాంపు: జగిత్యాల చల్గల్లోని మామిడిమండీని శాశ్వత పండ్ల మార్కెట్గా మార్చేలా ప్రభుత్వం ప్రత్యేక నిధులతో అభివృద్ధి చేస్తున్నట్లు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. చల్గల్ మండీలోని అభివృద్ధి పనులను శనివారం పరిశీలించారు. కవిత మాట్లాడుతూ రూ.30 కోట్లతో సమీకృత పండ్ల మార్కెట్ నిర్మాణ పనులను చేపట్టగా రాష్ట్రంలోనే జగిత్యాల ప్రత్యేకస్థానం పొందుతుందన్నారు. రంగు, రుచి, నాణ్యతరీత్యా జగిత్యాల మామిడికి దిల్లీ మార్కెట్లో మంచి డిమాండ్ ఉందన్నారు. మండీలోని అభివృద్ధి పనులను గూర్చి ఎమ్మెల్యే డాక్టర్ ఎం.సంజయ్కుమార్ ఎమ్మెల్సీ కవితకు వివరించారు. ఎమ్మెల్సీ ఎల్.రమణ, కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్రావు, జిల్లా పరిషత్ అధ్యక్షురాలు దావ వసంత, గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు చంద్రశేఖర్గౌడ్, పురపాలక అధ్యక్షురాలు బోగ శ్రావణి, మార్కెట్ కమిటీ అధ్యక్షుడు కె.దామోదర్రావు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
సమావేశంలో పాల్గొన్న పార్టీ శ్రేణులు
గండి హన్మాన్ ఆలయంలో...
మెట్పల్లి గ్రామీణం: జిల్లా సరిహద్దులోని గండి హన్మాన్ ఆలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు చేశారు. జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆమెకు గండి హన్మాన్ ఆలయం వద్ద ఎమ్మెల్యే విద్యాసాగర్రావు, జడ్పీ ఛైర్పర్సన్ దావ వసంత, నాయకులు సంజయ్తో పాటు తెరాస శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం గండి హన్మాన్ ఆలయంలో ఆమె స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయగా, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పత్తి రైతులు, వ్యాపారుల ఆందోళన
[ 23-04-2024]
ఎన్నికల కోడ్ పేరుతో తనిఖీలు నిర్వహించి బ్యాంకుల నుంచి డబ్బును తీసుకొస్తున్న తమను ఇబ్బందులకు గురి చేయవద్దని జమ్మికుంట పత్తి మార్కెట్ వద్ద వ్యాపారులు, పత్తి రైతులు ఆందోళనకు దిగారు. -
మానేరు వాగుపై కూలిన నిర్మాణంలోని వంతెన
[ 23-04-2024]
పెద్దపల్లి జిల్లాలో మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. ముత్తారం మండలం ఓడేడు పరిధిలో సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. -
పిల్లల అల్లరిని దారి మళ్లించండి
[ 23-04-2024]
పది నెలలపాటు చదువుతో కుస్తీ పడిన పిల్లలకు వేసవి సెలవులు ఉపశమనం ఇస్తాయి. ఆటాపాటలతో సరదాగా గడపొచ్చని భావిస్తుంటారు. -
మోదీ వ్యాఖ్యల్లో ఓటమి భయం
[ 23-04-2024]
లోక్సభ మొదటి దశ ఎన్నికల తీరును చూసిన ప్రధాని మోదీ ఓటమి భయంతో దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సంపద అంతా ముస్లింలకు ఇస్తుందని వ్యాఖ్యానించారని మంత్రి పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు. -
నాలుగో రోజు 25 నామినేషన్లు
[ 23-04-2024]
నామినేషన్ల ప్రక్రియ నాలుగో రోజు సోమవారం కరీంనగర్, పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గ స్థానాలకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. -
హామీలను విస్మరించిన ప్రభుత్వం
[ 23-04-2024]
శాసనసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిందని కరీంనగర్ భారాస అభ్యర్థి వినోద్కుమార్ అన్నారు. -
సెప్టెంబరులో చక్కెర కర్మాగారం తెరిపిస్తాం
[ 23-04-2024]
శాసనసభ ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీ మేరకు నిజాం చక్కెర కర్మాగారాలు తెరిపించేందుకు అవసరమైన చర్యలు చేపట్టినట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. -
అవకాశమిస్తే అభివృద్ధి చేసి చూపిస్తా!
[ 23-04-2024]
ప్రాంతానికి కొత్త కావచ్చు, రాజకీయాలకు, ప్రజా సేవకు కొత్తకాదని, అవకాశమిస్తే పార్లమెంట్ పరిధిని అభివృద్ధి చేసి చూపిస్తానని నిజామాబాద్ భారాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. -
దారులన్నీ కొండగట్టుకే
[ 23-04-2024]
తమ ఇష్టదైవాన్ని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి దీక్షాపరులు తరలివస్తున్నారు. -
ఓటరు నమోదులో ఫలించిన చైతన్యం
[ 23-04-2024]
ప్రజాస్వామ్యం కల్పించిన ఓటు హక్కు నమోదుకు యువతలో నూతనోత్సాహం ఉరకలేసింది. -
ప్రత్యేక నిధులు.. తీరనున్న ఇక్కట్లు
[ 23-04-2024]
రామగుండం నగరపాలక ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు అమృత్-2.0, యు.ఐ.డి.ఎఫ్.(అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్) నిధులతో పరిష్కారం కానున్నాయి. -
కాంగ్రెస్ నైజాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి
[ 23-04-2024]
భారాస పాలనలోనే అన్ని వర్గాల ప్రజలు సంక్షేమ ఫలాలు అందుకున్నారని, గడిచిన నాలుగు నెలల కాలంలో సంక్షేమ పథకాలను అటకెక్కించిన కాంగ్రెస్ పాలకుల నైజాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పెద్దపల్లి లోక్సభ భారాస అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. -
లెక్కలు తేలేనా?
[ 23-04-2024]
జిల్లా వస్త్ర పరిశ్రమకు గత ప్రభుత్వం సంక్షేమ, పాఠశాల విద్యాశాఖలకు సంబంధించిన వస్త్రోత్పత్తుల ఆర్డర్లు ఇచ్చింది. -
నిధులున్నా ప్రారంభం కాని పనులు
[ 23-04-2024]
గ్రామీణ, గిరిజన ప్రాంతాలకు రవాణా వ్యవస్థ మెరుగుపరిచి రెండు జిల్లాల గ్రామాలను అనుసంధానం చేయాలనే లక్ష్యంతో తారు రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. -
పట్టాలెక్కని ప్రతిపాదనలు
[ 23-04-2024]
ఉమ్మడి జిల్లాలో రైల్వే శాఖాపరంగా అభివృద్ధికి అడుగులు పడాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు. -
అమాత్యులుగా ఆ నలుగురు
[ 23-04-2024]
ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, పెద్దపల్లి లోక్సభా నియోజకవర్గాల నుంచి ఎన్నికైన ఎంపీల్లో ఇప్పటివరకు నలుగురికి మాత్రమే కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది.
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు
-
ఫొటోకు పోజులిస్తూ... అగ్నిపర్వతంలో జారిపడిన పర్యటకురాలు
-
విమానాల్లో 12 ఏళ్లలోపు వారికి తల్లిదండ్రుల పక్కనే సీటివ్వాలి: డీజీసీఏ
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
-
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా