logo

అన్నదాతలకు అండగా ఉంటాం : ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

రైతులకు కాంగ్రెస్‌ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని మాజీమంత్రి, ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి అన్నారు. శనివారం పొలాస గ్రామంలో కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

Published : 22 May 2022 04:19 IST


మాట్లాడుతున్న జీవన్‌రెడ్డి

జగిత్యాల, న్యూస్‌టుడే: రైతులకు కాంగ్రెస్‌ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని మాజీమంత్రి, ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి అన్నారు. శనివారం పొలాస గ్రామంలో కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఉచిత విద్యుత్తు ఇచ్చి, ధాన్యానికి మద్దతు ధర కల్పించి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని, తెరాస అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఒరిగిందేమి లేదన్నారు.

రాజీవ్‌గాంధీకి నివాళి: జిల్లా కేంద్రంలో రాజీవ్‌ గాంధీ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి పోరండ్ల చౌరస్తా రాజీవ్‌గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, పురపాలక మాజీ ఛైర్మన్‌ గిరినాగభూషణం తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని