పకడ్బందీగా పదోతరగతి పరీక్షలు
కొవిడ్ నేపథ్యంలో రెండేళ్ల తర్వాత ఈ నెల 23 నుంచి పదోతరగతి వార్షిక పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా పరీక్షలు రాసేలా పాలనాధికారి రవి పర్యవేక్షణలో పకడ్బందీగా....
జిల్లా విద్యాశాఖ అధికారి జగన్మోహన్రెడ్డి
న్యూస్టుడే, మెట్పల్లి
కొవిడ్ నేపథ్యంలో రెండేళ్ల తర్వాత ఈ నెల 23 నుంచి పదోతరగతి వార్షిక పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా పరీక్షలు రాసేలా పాలనాధికారి రవి పర్యవేక్షణలో పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా విద్యాశాఖ అధికారి జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణకు చేపట్టిన ఏర్పాట్లు, చర్యలు, సిబ్బంది నియామకం తదితర అంశాలపై డీఈవోతో ‘న్యూస్టుడే’ ముఖాముఖి నిర్వహించింది. ఆ వివరాలు.
న్యూస్టుడే: కొవిడ్ నేపథ్యంలో రెండేళ్లు పాఠశాలలు సరిగ్గా నడవక తీవ్ర నష్టం జరిగింది. పరీక్షలపై విద్యార్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని తెలుస్తోంది.?
డీఈవో: విద్యార్థులకు పరీక్షలపై భయం పోయేలా పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యేలా కృషి చేశాం. ప్రభుత్వం 30 శాతం సిలబస్ తగ్గించడంతోపాటు 11 పేపర్లకు బదులు 6 పేపర్లకు కుదించింది. సిలబస్ త్వరగా పూర్తిచేసి జనవరి నుంచి సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించి. మరుసటి రోజు ఉదయం ఆయా పాఠ్యాంశాలకు సంబంధించి పరీక్షలు నిర్వహించాం. 15 రోజులకు ఒకసారి గ్రాండ్ టెస్టులు, ప్రీఫైనల్ పరీక్షలు నిర్వహించాం.
న్యూ: పరీక్ష నిర్వహణకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు.?
డీఈవో: జిల్లా పాలనాధికారి పర్యవేక్షణలో పదోతరగతి పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నాం. జిల్లాలో 11,826 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఇందులో 6,150 మంది బాలురు, 5,676 మంది బాలికలు ఉన్నారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా 67 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశాం.
న్యూ: పర్యవేక్షణకు ఎంతమందిని నియమించనున్నారు.?
డీఈవో: ప్రతి కేంద్రంలో సిట్టింగ్ స్క్వాడ్ ఉంటుంది. నిత్యం ప్రతి కేంద్రాన్ని పర్యవేక్షించేలా నాలుగు ప్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఏర్పాటు చేశాం. అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఉంటాయి. వాటి నిఘా పర్యవేక్షణలో సీఎస్, డీవోలు ప్రశ్నాపత్రాలను తెరవాల్సి ఉంటుంది. పోలీసు స్టేషన్లోని ప్రశ్నాపత్రాలను గంట ముందే పరీక్ష కేంద్రానికి, అక్కడి నుంచి తపాలా కార్యాలయానికి తరలించేలా చర్యలు చేపట్టాం. బాలురు, బాలికల తనిఖీకి ప్రత్యేక ఏర్పాట్లు చేశాం.
న్యూ: వేసవి దృష్ట్యా పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి సౌకర్యాలు కల్పించనున్నారు.?
డీఈవో: పరీక్ష హాలులో అన్ని సౌకర్యాలు పూర్తిస్థాయిలో కల్పించాం. వెలుతురు, ప్యాన్లు ఉండేలా చర్యలు చేపడుతున్నాం. తాగునీటి సౌకర్యం, ప్రతి కేంద్రం వద్ద ఆరోగ్య సిబ్బందితోపాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంటాయి. ఏ ఒక్క విద్యార్థి నేలపై కూర్చుని పరీక్ష రాసే పరిస్థితి ఉండదు.
న్యూ: జిల్లాలో పరీక్షల నిర్వహణకు ఎంత మంది సిబ్బందిని నియమించారు.?
డీఈవో: జిల్లా వ్యాప్తంగా 1035 మంది ఇన్విజిలేటర్లను నియమించాం. 67 కేంద్రాల్లో 67 మంది సీఎస్, 67 మంది డీవోలను నియమించాం. అధికారులు, సిబ్బందికి గుర్తింపుకార్డులు ఇస్తున్నాం.
న్యూ: ఒక్క నిమిషం నిబంధన అమల్లో ఉందా.?
డీఈవో: ఒక్క నిమిషం నిబంధన లేదు. అయిదు నిమిషాల వరకు అవకాశం కల్పిస్తాం. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. ఉదయం 8.30 గంటల నుంచే విద్యార్థులకు థర్మల్ స్ర్కీనింగ్ పరీక్షలు చేసి కేంద్రాల్లోకి పంపిస్తాం. విద్యార్థులు ఆందోళనకు గురికాకుండా గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకునేలా తల్లిదండ్రులు చూడాలి.
న్యూ: కేంద్రాల వద్ద ఏవైనా ఇబ్బందులు ఎదురైతే ఎవరికి ఫిర్యాదు చేయాలి.?
డీఈవో: ప్రతి కేంద్రం వద్ద డీఈవో, ఎంఈవో ఫోన్ నెంబర్లను అందరికీ కనిపించేలా ప్రదర్శించాలని అధికారులకు సూచించాం. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. జిరాక్స్ కేంద్రాలను మూసివేయాలి.
న్యూ: విద్యార్థులకు మీరిచ్చే సూచనలు, సలహాలు.?
డీఈవో: విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు గురికావద్ధు పరీక్షల భయం వీడి ఆత్మవిశ్వాసంతో రాయాలి. జవాబు పత్రంలోని ప్రతి పేజీపై విద్యార్థులు హాల్టికెట్ సంఖ్యను తప్పనిసరిగా వేయాలి. విద్యార్థులు నిర్ణీత సమయంలోగా కేంద్రానికి చేరుకుంటే ఎలాంటి గందరగోళానికి అవకాశం ఉండదు. ఎలక్ట్రానిక్ వస్తువులు తెచ్చుకోవద్దు, చూచిరాతలకు పాల్పడి భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసుకోవద్దు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పత్తి రైతులు, వ్యాపారుల ఆందోళన
[ 23-04-2024]
ఎన్నికల కోడ్ పేరుతో తనిఖీలు నిర్వహించి బ్యాంకుల నుంచి డబ్బును తీసుకొస్తున్న తమను ఇబ్బందులకు గురి చేయవద్దని జమ్మికుంట పత్తి మార్కెట్ వద్ద వ్యాపారులు, పత్తి రైతులు ఆందోళనకు దిగారు. -
మానేరు వాగుపై కూలిన నిర్మాణంలోని వంతెన
[ 23-04-2024]
పెద్దపల్లి జిల్లాలో మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. ముత్తారం మండలం ఓడేడు పరిధిలో సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. -
పిల్లల అల్లరిని దారి మళ్లించండి
[ 23-04-2024]
పది నెలలపాటు చదువుతో కుస్తీ పడిన పిల్లలకు వేసవి సెలవులు ఉపశమనం ఇస్తాయి. ఆటాపాటలతో సరదాగా గడపొచ్చని భావిస్తుంటారు. -
మోదీ వ్యాఖ్యల్లో ఓటమి భయం
[ 23-04-2024]
లోక్సభ మొదటి దశ ఎన్నికల తీరును చూసిన ప్రధాని మోదీ ఓటమి భయంతో దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సంపద అంతా ముస్లింలకు ఇస్తుందని వ్యాఖ్యానించారని మంత్రి పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు. -
నాలుగో రోజు 25 నామినేషన్లు
[ 23-04-2024]
నామినేషన్ల ప్రక్రియ నాలుగో రోజు సోమవారం కరీంనగర్, పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గ స్థానాలకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. -
హామీలను విస్మరించిన ప్రభుత్వం
[ 23-04-2024]
శాసనసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిందని కరీంనగర్ భారాస అభ్యర్థి వినోద్కుమార్ అన్నారు. -
సెప్టెంబరులో చక్కెర కర్మాగారం తెరిపిస్తాం
[ 23-04-2024]
శాసనసభ ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీ మేరకు నిజాం చక్కెర కర్మాగారాలు తెరిపించేందుకు అవసరమైన చర్యలు చేపట్టినట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. -
అవకాశమిస్తే అభివృద్ధి చేసి చూపిస్తా!
[ 23-04-2024]
ప్రాంతానికి కొత్త కావచ్చు, రాజకీయాలకు, ప్రజా సేవకు కొత్తకాదని, అవకాశమిస్తే పార్లమెంట్ పరిధిని అభివృద్ధి చేసి చూపిస్తానని నిజామాబాద్ భారాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. -
దారులన్నీ కొండగట్టుకే
[ 23-04-2024]
తమ ఇష్టదైవాన్ని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి దీక్షాపరులు తరలివస్తున్నారు. -
ఓటరు నమోదులో ఫలించిన చైతన్యం
[ 23-04-2024]
ప్రజాస్వామ్యం కల్పించిన ఓటు హక్కు నమోదుకు యువతలో నూతనోత్సాహం ఉరకలేసింది. -
ప్రత్యేక నిధులు.. తీరనున్న ఇక్కట్లు
[ 23-04-2024]
రామగుండం నగరపాలక ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు అమృత్-2.0, యు.ఐ.డి.ఎఫ్.(అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్) నిధులతో పరిష్కారం కానున్నాయి. -
కాంగ్రెస్ నైజాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి
[ 23-04-2024]
భారాస పాలనలోనే అన్ని వర్గాల ప్రజలు సంక్షేమ ఫలాలు అందుకున్నారని, గడిచిన నాలుగు నెలల కాలంలో సంక్షేమ పథకాలను అటకెక్కించిన కాంగ్రెస్ పాలకుల నైజాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పెద్దపల్లి లోక్సభ భారాస అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. -
లెక్కలు తేలేనా?
[ 23-04-2024]
జిల్లా వస్త్ర పరిశ్రమకు గత ప్రభుత్వం సంక్షేమ, పాఠశాల విద్యాశాఖలకు సంబంధించిన వస్త్రోత్పత్తుల ఆర్డర్లు ఇచ్చింది. -
నిధులున్నా ప్రారంభం కాని పనులు
[ 23-04-2024]
గ్రామీణ, గిరిజన ప్రాంతాలకు రవాణా వ్యవస్థ మెరుగుపరిచి రెండు జిల్లాల గ్రామాలను అనుసంధానం చేయాలనే లక్ష్యంతో తారు రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. -
పట్టాలెక్కని ప్రతిపాదనలు
[ 23-04-2024]
ఉమ్మడి జిల్లాలో రైల్వే శాఖాపరంగా అభివృద్ధికి అడుగులు పడాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు. -
అమాత్యులుగా ఆ నలుగురు
[ 23-04-2024]
ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, పెద్దపల్లి లోక్సభా నియోజకవర్గాల నుంచి ఎన్నికైన ఎంపీల్లో ఇప్పటివరకు నలుగురికి మాత్రమే కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది.
తాజా వార్తలు (Latest News)
-
బ్రిటన్కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?
-
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్