ఉపాధికి రుణాలు.. ఆర్థికాభివృద్ధికి బాటలు
జిల్లాలోని మహిళా సంఘాలు రుణాలు సద్వినియోగం చేసుకుని ఆర్థికాభివృద్ధి సాధిస్తూ ఉమ్మడి జిల్లా మహిళలు రాష్ట్రంలో ఆదర్శంగా నిలుస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిరువ్యాపారాల ప్రోత్సాహంలో భాగంగా ఆహార ఉత్పత్తులతోపాటు వివిధ రకాల
ఉమ్మడి జిల్లాలో 14,973 యూనిట్ల లక్ష్యం
సారంగాపూర్, న్యూస్టుడే
యూనిట్ను పరిశీలిస్తున్న అధికారులు
జిల్లాలోని మహిళా సంఘాలు రుణాలు సద్వినియోగం చేసుకుని ఆర్థికాభివృద్ధి సాధిస్తూ ఉమ్మడి జిల్లా మహిళలు రాష్ట్రంలో ఆదర్శంగా నిలుస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిరువ్యాపారాల ప్రోత్సాహంలో భాగంగా ఆహార ఉత్పత్తులతోపాటు వివిధ రకాల యూనిట్లను మహిళల ద్వారా ఏర్పాటు చేయిస్తున్నారు. దీని ద్వారా మార్కెట్లోకి నాణ్యమైన ఆహార ఉత్పత్తులు, వస్తువులతోపాటు మహిళలకు జీవనోపాధి లభించేలా చూస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది 14,973 యూనిట్లు ఏర్పాటు చేసేందుకు లక్ష్యాన్ని నిర్దేశించగా, 14,423 యూనిట్లను గుర్తించి, 10,322 ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. జగిత్యాల జిల్లాలో 4,328 లక్ష్యం కాగా 4,180, కరీంనగర్లో 4,067కి గాను 3,709, పెద్దపల్లిలో 3,447కు 3,530, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 3,131 లక్ష్యానికి గానూ 3,004 యూనిట్లను ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రణాళిక తయారు చేశారు. కరీంనగర్లో లక్ష్యానికి మించి యూనిట్లను గుర్తించగా, ఇప్పటికే జగిత్యాలలో 2,496 యూనిట్లు, కరీంనగర్లో 2,622, పెద్దపల్లలో 2,704. రాజన్న సిరిసిల్లలో 2,500 యూనిట్లను నెలకొల్పేలా చూశారు. ఆయా మహిళా సంఘాల సభ్యులకు రూ.17.05 కోట్ల రుణాలు అందించి ప్రోత్సహించారు. మరిన్ని ఏర్పాటు చేసేందుకు అధికారులు గ్రామాల వారీగా మహిళా సభ్యులకు అవగాహన కల్పిస్తున్నారు.
ఉత్పత్తులను విక్రయిస్తున్న మహిళలు
జగిత్యాలలో విక్రయ కేంద్రం ఏర్పాటు
జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి నాబార్డు సహకారంతో రూ.5 లక్షల రుణాన్ని తీసుకుని జగిత్యాలలో విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేసి నాణ్యమైన ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. సారంగాపూర్ మండలంలోని రంగపేటలో న్యాప్కిన్ యూనిట్, జగిత్యాల మండలంలోని అంతర్గాంలో పసుపు పొడి తయారీ, లక్ష్మీపూర్, చల్గల్లో గానుగతో తయారీ, పిండి వంటలు చేసే నూనె యూనిట్, పెగడపల్లిలో చేనేత వస్త్ర తయారీ, గొల్లపల్లి మండలంలో ఫ్లోర్ క్లీనర్, కథలాపూర్లో ఎల్ఈడీ బల్బుల తయారీ, మల్యాల, కోరుట్లలో అగరుబత్తుల తయారీ, పచ్చళ్లు, బియ్యం విక్రయాలు చేస్తున్నారు. వెల్గటూర్ మండలంలో జ్యూట్ బ్యాగులు, రాయికల్ మండలంలో బనియన్స్, పెట్టీకోట్స్, ఇబ్రహీంపట్నంలో పేపర్ ప్లేట్ల తయారీ చేస్తున్నారు.
సహజ పేరుతో మార్కెటింగ్
ఆదాయాభివృద్ధిలో భాగంగా బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలు అందిస్తున్నారు. దీనిద్వారా మహిళలు అర్థికంగా బలోపేతం అవుతుండడమే కాకుండా చిరువ్యాపారాలను ప్రోత్సహించేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించి యూనిట్లను ఏర్పాటు చేస్తున్నారు, ఇందుకుగాను ఒక్కో మహిళకు రూ.75వేలు తగ్గకుండా రూ.3 లక్షల వరకు అందిస్తున్నారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి మరిన్ని రుణాలు అందించేలా చూస్తున్నారు. వీటితోపాటు ఇప్పటికే మండలాల్లో తయారు చేస్తున్న ఉత్తత్పులను గుర్తించి ‘సహజ’ బ్రాండ్ పేరుతో మార్కెంటింగ్ చేస్తున్నారు.
నాణ్యమైన ఉత్పత్తులు
-శ్రీకార్ సుధీర్, అదనపు పీడీ, జగిత్యాల
చిరువ్యాపారులను ప్రోత్సహించడమే కాకుండా మహిళల ఆదాయాభివృద్ధికోసం యూనిట్లు ఏర్పాటు చేస్తున్నాం. దీని ద్వారా అందుబాటులో నాణ్యమైన ఉత్పత్తులు లభించనున్నాయి. జగిత్యాల జిల్లాలో ఇప్పటికే జిల్లాలో 4328 లక్ష్యానికి గానూ 2496 యూనిట్లను ఏర్పాటు చేశాం. ఒక్కో మహిళ చిరువ్యాపారాన్ని ఏర్పాటు చేసుకునేందుకు రూ.75వేలు తగ్గకుండా రుణం అందించేలా చర్యలు తీసుకుంటున్నాం.
స్థానికంగా ఉపాధి..
- శ్రీలత, జిల్లా సమాఖ్య కోశాధికారి
చిరువ్యాపారాలను ప్రోత్సహించడంతో అందుబాటులో నాణ్యమైన ఉత్పత్తులు లభించనున్నాయి. అంతేకాకుండా స్థానికంగా వ్యాపారం చేయడంతో మహిళలకు ఆదాయాభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుంది. జిల్లాలోని మహిళలందరి సహకారంతో ‘సహజ’ బ్రాండ్ పేరుతో మార్కెట్లో పలు ఉత్పత్తులు విక్రయిస్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యాప్ కష్టాలు
[ 24-04-2024]
జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల నిర్వాహకులు అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన యాప్ల్లో సమాచారం నిక్షిప్తం చేయాల్సి ఉంది. -
నిర్వహణ భారం.. కమీషన్లో కోత
[ 24-04-2024]
కేంద్రాల నిర్వహణ భారంగా మారగా.. వచ్చిన కమీషన్లో కోత విధించడంతో నిర్వాహకులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. -
ఇక ట్వంటీ20 పోరు!
[ 24-04-2024]
పోలింగ్ తేదీకి బుధవారం నుంచి సరిగ్గా ఇరవై రోజులుంది.. అచ్చంగా ట్వంటీ20 క్రికెట్ ఆటలోని 20 ఓవర్ల మాదిరి సమరం. -
మిగిలింది రెండు రోజులే!
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో తొలి అంకం రెండు రోజుల్లో ముగియనుంది. ఈ నెల 25వ తేదీతో నామినేషన్ల స్వీకరణ పూర్తవనుంది. -
నకిలీ పత్రాలు సృష్టించి.. ఇల్లు ధ్వంసం
[ 24-04-2024]
నకిలీ పత్రాలు సృష్టించి, ఇంటిని ధ్వంసం చేసి, దాడికి పాల్పడిన అయిదుగురిని కరీంనగర్ కొత్తపల్లి పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. -
పార్టీ పెద్దల సమ్మతితోనే రాజేందర్ నామినేషన్
[ 24-04-2024]
పార్టీ పెద్దల సమ్మతితోనే తామంతా కలిసి కాంగ్రెస్ తరఫున వెలిచాల రాజేందర్రావుతో నామినేషన్ వేయించామని, గెలిపిం చుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. -
అతివల ఉపాధికి ఆదరువేదీ!
[ 24-04-2024]
రాష్ట్రంలో 6 లక్షల మంది బీడీ కార్మికులుండగా అత్యధికంగా నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోనే ఉన్నారు. -
ఆ పది మందికే 50 శాతం ఓటర్ల మద్దతు
[ 24-04-2024]
ఎన్నికల్లో ప్రత్యర్థి కంటే ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా విజయం సాధించినట్లే. అయితే గెలుపొందిన అభ్యర్థికి నియోజకవర్గంలోని ఎంత మంది ఓటర్ల మద్దతు ఉందనేది పోటీలో ఉన్న అభ్యర్థులు, నమోదైన పోలింగ్ శాతాన్ని బట్టి మారుతుంది. -
అన్న కొడుక్కే కాదు.. అందరికీ కాకా!
[ 24-04-2024]
కాంగ్రెస్ పార్టీ దివంగత, కేంద్ర మాజీ మంత్రి జి.వెంకటస్వామి ‘కాకా’గానే ఎక్కువ మందికి సుపరిచితులు. ఆయనకు ఈ పేరు రావడం వెనుక ఆసక్తికర అంశం ఉంది. -
ఆయుధాలు అప్పగించారు..
[ 24-04-2024]
వ్యక్తిగత భద్రత కోసం లైసెన్సు తీసుకొని వెంట ఉంచుకున్న ఆయుధాలను ఉమ్మడి జిల్లావాసులు ఠాణాలకు అప్పగించారు. -
మాతాశిశుకు తప్పని ఉక్కపోత
[ 24-04-2024]
చంటి బిడ్డలు, బాలింతలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో వేసవి ఉక్కపోత తప్పడం లేదు. -
బ్యాలెట్ యుద్ధానికి చకచకా సన్నద్ధం
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికలను సమర్థంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. -
పనులకు ఆటంకాలు.. రాకపోకలకు అవస్థలు
[ 24-04-2024]
రెండు జిల్లాల సరిహద్దులోని మానేరు వాగు దాటడానికి ఇరువైపులా గ్రామాల ప్రజలు దశాబ్దాల తరబడి నానా అవస్థలు పడుతున్నారు. -
తైబజార్... చిరు వ్యాపారుల బేజార్
[ 24-04-2024]
పురపాలక సంఘంలో తైబజార్ గుత్తేదారు ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేస్తున్నా పట్టించుకున్న నాథుడు లేడు.