ఆరోగ్య కేంద్రంగా రామగుండం
రాష్ట్ర ప్రభుత్వ చొరవ, స్థానిక పరిశ్రమల సహకారంతో రామగుండం ప్రాంతం ఆరోగ్య కేంద్రం(మెడికల్ హబ్)గా ఏర్పడుతోందని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. రామగుండం ఎన్టీపీసీ ఆధ్వర్యంలో రూ.7.5 కోట్లతో
ప్రభుత్వం, పరిశ్రమల సహకారంతో అభివృద్ధి : ఎమ్మెల్యే చందర్
సమావేశంలో ప్రసంగిస్తున్న ఎమ్మెల్యే చందర్
గోదావరిఖని పట్టణం, న్యూస్టుడే : రాష్ట్ర ప్రభుత్వ చొరవ, స్థానిక పరిశ్రమల సహకారంతో రామగుండం ప్రాంతం ఆరోగ్య కేంద్రం(మెడికల్ హబ్)గా ఏర్పడుతోందని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. రామగుండం ఎన్టీపీసీ ఆధ్వర్యంలో రూ.7.5 కోట్లతో ఆస్పత్రి భవనంపైన నిర్మించిన మరో అంతస్థును మంగళవారం ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ రామగుండం ప్రాంతానికి వైద్య కళాశాల మంజూరు చేసిన ముఖ్యమంత్రి ఈ ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించేందుకు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారన్నారు. ఆస్పత్రిలో అవసరమైన వైద్య, వైద్యేతర పరికరాలను సమకూర్చడంతో పాటు మరో అంతస్థు నిర్మాణానికి ఎన్టీపీసీ యాజమాన్యం చర్యలు తీసుకోగా వైద్య కళాశాల భవన నిర్మాణానికి సింగరేణి యాజమాన్యం రూ.500 కోట్లు కేటాయించడం హర్షదాయకమన్నారు. ఆస్పత్రిలో అవసరమైన వైద్య పరికరాల కోసం రామగుండం నగరపాలక సంస్థ నుంచి రూ.65 లక్షలు కేటాయించారన్నారు.. ఎన్టీపీసీ(హెచ్.ఆర్.) ఉన్నతాధికారిణి విజయలక్ష్మీ మురళీధరన్ మాట్లాడుతూ ఎన్టీపీసీ నిధులతో ఇంత చక్కటి భవన నిర్మాణం తమకెంతో సంతోషాన్ని ఇస్తోందని అన్నారు. ఎన్టీపీసీ జీఎం(ఓఅండ్ఎం) అతుల్ కమలాకర్ దేశాయ్, నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్కుమార్, జడ్పీటీసీ సభ్యుడు ఆముల నారాయణ, స్థానిక కార్పొరేటర్ నగునూరి సుమలత, వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ హిమబిందుసింగ్, ఎన్టీపీసీ అధికారులు డాక్టర్ లేహర్, డి.ఎస్.కుమార్తో పాటు పలువురు వైద్యులు, వైద్య కళాశాల, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు. ఆస్పత్రి భవన ప్రారంభ కార్యక్రమ నిర్వహణలో కీలకంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వ సార్వజనిక ఆస్పత్రి సూపరింటెండెంట్ సభా వేదికపై కనిపించకపోవడం గమనార్హం. ముందుగా ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించి పలు అంశాలపై తీర్మానం చేశారు. .
‘అభివృద్ధి గిట్టకనే ఆరోపణలు’
రామగుండం ప్రాంతాభివృద్ధి గిట్టని కొందరు నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. విలేకరులతో మాట్లాడుతూ ఈ ప్రాంతంలో వైద్య కళాశాల ఏర్పాటు ఆవశ్యకతను తాను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి మంజూరు చేయడం ఈ ప్రాంతంలోని కొందరు నాయకులు జీర్ణించుకోలేక పోతున్నారన్నారు. వైద్య కళాశాల భవనం పూర్తయ్యేంత వరకు తాత్కాలికంగా డిగ్రీ కళాశాల భవనంలో తరగతులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుండగా డిగ్రీ విద్యార్థులను తప్పుదోవ పట్టించి వారిచే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు ఆందోళన చేయించిన ఘనత వారికే దక్కుతుందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కరీంనగర్ కాంగ్రెస్ టికెట్ ఎవరి చేతికి?.. మల్లగుల్లాలు పడుతున్న అధిష్ఠానం
[ 29-03-2024]
కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి ఖరారుపై ఆ పార్టీ అధిష్ఠానం మల్లగుల్లాలు పడుతోంది.. ఇప్పటికే భారాస, భాజపాల అభ్యర్థులు ఖరారవగా.. హస్తం పార్టీ తరఫున బరిలో నిలిచేదెవరో తెలియకపోవడంతో కాంగ్రెస్ స్థానిక నాయకులు, కార్యకర్తలు అభ్యర్థి తేలేదెప్పుడు.. అని ఆందోళన చెందుతున్నారు. -
కనుల పండువగా శివయ్య కల్యాణం
[ 29-03-2024]
ప్రసిద్ధ శైవక్షేత్రమైన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి క్షేత్రంలో గురువారం శివ కల్యాణోత్సవం కనుల పండువగా జరిగింది. -
ఆందోళన వద్దు.. అవకాశాలు కోకొల్లలు!
[ 29-03-2024]
విద్యార్థులు ప్రాథమిక విద్య నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ పదో తరగతి పూర్తి చేశారు. ఒకట్రెండు రోజుల్లో పరీక్షలు కూడా పూర్తి చేసి ఉన్నతవిద్య వైపు అడుగులు వేయనున్నారు. -
అవసరాల మేరకు ఏదీ అనుసంధానం!
[ 29-03-2024]
ఈ రెండు అంశాల్లోనే కాదు. ప్రయాణికుల అవసరాలు తీర్చడంలో ద.మ.రై.అధికారులు ఆది నుంచీ నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. రైల్వే ఉద్యోగుల అవసరాలు, అధికారులు, నాయకులు లాబీయింగులతోనే కొత్త హాల్టింగులు, ఇతర వసతులు కల్పిస్తున్నారు. -
కరీంనగర్ బస్స్టేషన్ ఆస్తి పన్ను రూ.1.88 కోట్లు చెల్లింపు
[ 29-03-2024]
ఆస్తిపన్ను బకాయిలపై 90 శాతం రాయితీ గడువు మూడు రోజుల్లో ముగుస్తుందని నగరపాలక కమిషనర్ బోనగిరి శ్రీనివాస్ తెలిపారు. -
భార్య చేతిలో భర్త హతం
[ 29-03-2024]
భర్త మద్యానికి బానిసై శారీరకంగా.. మానసికంగా వేధిస్తున్నాడని వేదనకు గురైన ఓ భార్య తనకు తెలిసిన ఇద్దరి సహాయంతో తాళ్లతో కట్టేసి.. కళ్లలో కారం చల్లి... ఒంటిపై వేడి నీళ్లు పోసి తీవ్రంగా కొట్టడంతో స్పృహ కోల్పోయి మృతి చెందాడు. -
లోక్సభ ఎన్నికలు ప్రజాస్వామ్యానికి పరీక్ష
[ 29-03-2024]
రానున్న లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 15 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయమని శాసనమండలి సభ్యుడు, నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి టి.జీవన్రెడ్డి అన్నారు. -
వేసవి గట్టెక్కేనా!
[ 29-03-2024]
జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, రాయికల్ పట్టణాలకు డబ్బాలోని గ్రిడ్ ద్వారా మిషన్ భగీరథ పథకం నీరు సరఫరా అవుతోంది. ధర్మపురి పట్టణానికి డబ్బా నుంచి పైపులైన్లు వేసినా చివరి ప్రాంతం కావడంతో నీరు సరఫరా సక్రమంగా కావడం లేదు. -
మట్టి గుట్టలు మాయం!
[ 29-03-2024]
మండలంలోని వరద కాలువ మట్టిని కొందరు గుత్తేదార్లు, స్తిరాస్థి వ్యాపారులు అక్రమంగా తరలించుకుపోతుండటంతో మట్టికట్టలు మాయమవుతున్నాయి. -
నిధులు దూరం.. నిర్వహణ భారం
[ 29-03-2024]
వ్యవసాయ శాఖ సేవలను రైతులకు మరింత చేరువ చేసే లక్ష్యంతో గత ప్రభుత్వం క్లస్టర్ల వారీగా రైతు వేదికలను నిర్మించింది. శాఖాపరంగా రైతులకు ఆధునిక సాగు విధానంపై సలహాలు, సూచనలు ఇవ్వాలనేది ప్రధాన లక్ష్యం. -
లక్ష్యానికి చేరువగా సింగరేణి
[ 29-03-2024]
సింగరేణి సంస్థ తొలిసారిగా 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి చేరువ అవుతోంది. మూడేళ్లుగా ఈ లక్ష్యాన్ని నిర్దేశించుకున్న సంస్థ ఇప్పటివరకు ఆ మేరకు బొగ్గు ఉత్పత్తిని చేరుకోలేకపోయింది. -
బయో మైనింగ్ ప్రక్రియకు అవాంతరాలు
[ 29-03-2024]
పెరుగుతున్న నగరీకరణ.. అందుకు అనుగుణంగా పారిశుద్ధ్య నిర్వహణ ప్రభుత్వ యంత్రాంగానికి సవాల్గా మారుతోంది. ఈ క్రమంలో చెత్త నుంచి సేంద్రియ ఎరువును తయారు చేసేందుకు రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. -
భాజపా పాలనపై ప్రజల్లో విసుగు
[ 29-03-2024]
రానున్న పార్లమెంటు ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించాలని భారాస ఎంపీ అభ్యర్థులు ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్, కొప్పుల ఈశ్వర్లు అన్నారు. -
మతం పేరిట కేసీఆర్ రాజకీయం చేయలేదు: కేటీఆర్
[ 29-03-2024]
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పదేళ్లలో ఏ రోజు కూడా మతం పేరిట రాజకీయం చేయలేదని మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. -
రాష్ట్రాన్ని దోచుకుంది భారాసనే: ఆది శ్రీనివాస్
[ 29-03-2024]
తెలంగాణ ఏర్పడిన తరవాత రూ.16 వేల కోట్ల నిల్వ బడ్జెట్తో రాష్ట్రాన్ని అప్పగిస్తే భారాస తొమ్మిదిన్నరేళ్ల పాలనలో రాష్ట్రాన్ని రాబంధుల్లా దోచుకుందని, రూ.6.67 లక్షల కోట్ల అప్పుల భారాన్ని రాష్ట్ర ప్రజలపై మోపిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్
-
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్
-
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?
-
కేజ్రీవాల్కు సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి
-
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!
-
రైలు ప్రయాణికుడి సెల్ఫీతో డెత్ మిస్టరీని ఛేదించిన పోలీసులు