పురపాలిక.. ఆటలకు వేదిక
నగరాలు, పట్టణాల్లో క్రీడా మైదానాలు కనుమరుగవుతున్నాయి. పలు ప్రాంతాల్లో ఒకటెండ్రు ఉన్నా పెరుగుతున్న జనాభాకు సరిపోవడం లేదు. పిల్లలు శారీరక దారుఢ్యం, మానసిక ఉల్లాసంతో ఎదిగేందుకు వీలుగా వార్డులు, గ్రామాల్లో వీటిని ఏర్పాటు చేసేలా రాష్ట్ర
జూన్ 2న క్రీడా ప్రాంగణాలు ప్రారంభించేలా కార్యాచరణ
ఎకరం స్థలం తప్పనిసరి
పురపాలకశాఖ సూచించిన క్రీడా ప్రాంగణం నమూనా
న్యూస్టుడే-కరీంనగర్ కార్పొరేషన్: నగరాలు, పట్టణాల్లో క్రీడా మైదానాలు కనుమరుగవుతున్నాయి. పలు ప్రాంతాల్లో ఒకటెండ్రు ఉన్నా పెరుగుతున్న జనాభాకు సరిపోవడం లేదు. పిల్లలు శారీరక దారుఢ్యం, మానసిక ఉల్లాసంతో ఎదిగేందుకు వీలుగా వార్డులు, గ్రామాల్లో వీటిని ఏర్పాటు చేసేలా రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఈ నెల 18న హైదరాబాద్లో జరిగిన పట్టణ, పల్లె ప్రగతి నిర్వహణ సమావేశంలో ఆదేశించడంతో ఆ దిశగా కసరత్తు ప్రారంభించారు.
కరీంనగర్, రామగుండం నగరపాలికలు, మున్సిపాలిటీల్లో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ ముమ్మరం చేశారు. కరీంనగర్లో స్మార్ట్సిటీలో భాగంగా ఏటా నగరపాలక సంస్థ తరఫున క్రీడా శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఈ సారి దీనికోసం రూ.10లక్షలు కేటాయించారు. క్రీడాశాఖ మైదానంలో శిక్షణ ఇస్తుండగా ఎప్పటికీ నగరపాలికలోనే క్రీడలను నిర్వహించుకునేలా ప్రణాళికలు చేస్తున్నారు. ప్రత్యేకంగా విభాగం చేసి క్రీడలను ప్రోత్సహించేలా డిప్యూటేషన్పై కోచ్లను నియమించుకోవాలని భావించి క్రీడా మైదానాలు అన్వేషిస్తున్న సమయంలోనే పట్టణ ప్రగతి కార్యక్రమంలో దీనికి ప్రాధాన్యం ఇవ్వడంతో నగరపాలకకు మార్గం సులభమైంది.
తెలంగాణ క్రీడా ప్రాంగణం(టీకేపీ-అర్బన్) పేరుతో ప్రతీ మున్సిపాలిటీలో క్రీడా ప్రాంగణలు నిర్మించేందుకు వార్డుల వారీగా లక్ష్యాన్ని విధించారు. కనీసం ఒక వార్డుకు మూడు ఉండాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఇందులో పేరుగాంచిన ఐదు క్రీడలకు సరిపడా మైదానం ఒకే చోటా ఉండేలా ఎకరం స్థలం తప్పనిసరిగా ఉండాలని నిర్ణయించారు. ఈ మేరకు అన్ని పురపాలికలకు సీడీఎంఏ డాక్టర్ ఎన్.సత్యనారాయణ ఈ నెల 21న ఉత్తర్వులు జారీ చేశారు. ఖో-ఖో, కబడ్డీ, వాలీబాల్, లాంగ్ జంప్ పిట్, వ్యాయమం చేసేందుకు సింగిల్, డబుల్ బార్ ఉండేలా, వీటికి మైదానాలు ఎంతమేర ఉండాలనే విషయాలతో మార్గదర్శకాలు, డిజైన్ విడుదల చేశారు. దీంతో పాటు చుట్టూ మొక్కలను పెంచాలి. వచ్చే నెల 2లోగా నగరంలో నిర్ణయించిన టార్గెట్ ప్రకారం మైదానాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నగర పరిధిలో ముందుగా గుర్తించిన స్థలాల్లో క్రీడా ప్రాంగణాలు ప్రారంభించేలా కసరత్తు చేస్తున్నట్లు నగర మేయర్ వై.సునీల్రావు తెలిపారు. ఈ మేరకు అధికారులతో కలిసి స్థల పరిశీలన చేస్తామని ప్రకటించారు.
ప్రతీ వార్డు, డివిజన్లో మైదానం
ప్రభుత్వ ఆదేశాల మేరకు పుర, నగరపాలికల్లోని అన్నీ వార్డులు, డివిజన్లలో క్రీడా మైదానాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ స్థలాలు గుర్తించి అవసరమున్నంత మేరకు దీనికోసం తీసుకునే అవకాశముంది. విలీన కాలనీల్లో ఎక్కువగా స్థలాలు ఉండగా అక్కడ ఎలాంటి సమస్యలుండవు. పెద్ద మున్సిపాలిటీల్లో స్థలం దొరకడం గగనమే. ఇక్కడి ప్రజలకు అందుబాటులో ఉండేలా పాలకవర్గ సభ్యులు, అధికారులు ఆలోచన చేయాలి. వీటిని ఏర్పాటు చేయడంతోనే క్రీడా సామగ్రి కొనుగోలు చేసేందుకు రూ.50వేలు ఇవ్వనుంది. క్రీడలను ప్రోత్సహించేందుకు క్రీడాకారుల నుంచే కమిటీ ఉంటుంది. కమిటీ పర్యవేక్షణలోనే క్రీడా ప్రాంగణలు, క్రీడలు ఉంటాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పద్మవ్యూహంలో ఉన్నా.. నావైపూ చూడండి
[ 19-04-2024]
‘నిజామాబాద్ నియోజకవర్గం పద్మవ్యూహంలా ఉంది. నన్ను అభిమన్యుడిని చేస్తారో.. అర్జునుడిని చేస్తారో అంతా మీ చేతుల్లో ఉంది’ అని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుతో నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్రెడ్డి పేర్కొన్నారు. -
మొదటిరోజు ఆరు నామినేషన్లు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం గురువారం ప్రారంభమైంది. మొదటి రోజు స్వతంత్ర అభ్యర్థులు మాత్రమే నామపత్రాలను దాఖలు చేశారు. కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు కోట శ్యామ్కుమార్, పోతూరి రాజేందర్లు -
350 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్
[ 19-04-2024]
హుజూరాబాద్లో పట్టుబడ్డ 350 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులు గురువారం సీజ్ చేశారు. హనుమకొండ జిల్లా పరకాలలోని శ్రీరాజరాజేశ్వర రైస్మిల్లులో 1,347 బస్తాల బియ్యాన్ని లారీలో లోడ్ చేసి... -
కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేయండి
[ 19-04-2024]
పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపునకు కలిసికట్టుగా కృషి చేయాలని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. ధర్మపురి పట్టణంలోని ఓ వేడుక మందిరంలో పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల... -
గీతదాటితే కొరడా ఝళిపిస్తారు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఆ మేరకు ఉమ్మడి జిల్లాలో రాజకీయ పార్టీల ప్రచార పర్వం వేడెక్కనుంది. మరోవైపు ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఎంసీసీ (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్)ని తీసుకొచ్చింది. -
కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు : మంత్రి
[ 19-04-2024]
ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులను ఇస్తామని, అవసరమైతే పక్క రాష్ట్రం నుంచి భిక్షాటన చేసైనా పదవులను తెచ్చిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ అన్నారు. -
నాలుగేళ్లా.. రెండేళ్లా!
[ 19-04-2024]
సింగరేణి గుర్తింపు సంఘం కాలపరిమితిపై సందిగ్ధం నెలకొంది. గెలిచిన అనంతరం సంఘానికి అధికారిక పత్రం ఇప్పటి వరకు అందలేదు.గుర్తింపు ఎన్నికలకు ముందు కాలపరిమితిపై స్పష్టత లేకపోవడంతో ఫలితాల అనంతరం కార్మిక శాఖ -
గంట ముందే పోలింగ్ ప్రారంభం
[ 19-04-2024]
గోదావరి పరీవాహక ప్రాంతం.. అంతర్రాష్ట్ర సరిహద్దు.. దట్టమైన అడవులు విస్తరించిన పెద్దపల్లి లోక్సభ పరిధిలో కొన్ని ప్రాంతాల్లో ముందస్తు పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. -
రహదారి నిర్మించారు.. సమస్యలు మరిచారు
[ 19-04-2024]
గుంతల రహదారితో ఇబ్బందులు ఎదురవుతుండటంతో ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. దీంతో పక్కా రోడ్డు నిర్మాణంతో రవాణా సదుపాయం మెరుగైంది. దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం లభించింది. -
స్థలం కేటాయించారు.. ఆసుపత్రి నిర్మాణం విస్మరించారు
[ 19-04-2024]
తంగళ్లపల్లి మండలం టెక్స్టైల్ పార్కు వద్ద బీడీ కార్మికుల కోసం ఏర్పాటు చేసే ఈఎస్ఐ ఆసుపత్రికి పదేళ్ల క్రితం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 13 ఎకరాల స్థలం కేటాయించింది. -
ఓట్లు కొల్లగొట్టి.. దిల్లీ తలుపుతట్టి
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలో కొంత మంది నేతలు అత్యధిక ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. రికార్డు స్థాయిలో ఓట్లు సంపాదించి ప్రత్యర్థులకు అందనంత దూరంలో నిలిచారు. -
స్వశక్తి.. ప్రజాస్వామ్య స్ఫూర్తి
[ 19-04-2024]
అన్నింటా ముందుంటున్న అతివలు ప్రతి ఎన్నికల్లో అధిక సంఖ్యలో ఓటు వేయడంలోనూ పైచేయి సాధిస్తున్నారు. ప్రజాస్వామ్యం కల్పించిన వజ్రాయుధాన్ని తప్పనిసరిగా వినియోగించుకొంటూ స్ఫూర్తి నింపుతున్నారు. -
ఇంటి నుంచే నామినేషన్
[ 19-04-2024]
ఎన్నికల ప్రక్రియను సులభతరం చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. ఓటరు నమోదు, ప్రచార సభలు, సమావేశాల నిర్వహణకు అనుమతుల కోసం -
17 ఎన్నికలు.. ఒక్కసారే అతివకు అవకాశం
[ 19-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి సాధారణ, ఉప ఎన్నికలతో కలిపి ఇప్పటివరకు 17 సార్లు ఎన్నికలు జరగగా ఒక్కసారే మహిళకు అవకాశం లభించింది. -
ఫోన్ ట్యాపింగ్లో ఎవరినీ వదిలేది లేదు
[ 19-04-2024]
రాముడిపై తాను అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఎంపీ బండి సంజయ్ నిరూపిస్తే సజీవ దహనం చేసుకుంటానని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ పొన్నం ప్రభాకర్ అన్నారు. -
వామ్మో.. ఇదేం ఎండ!
[ 19-04-2024]
జనం బెదిరేలా ఎండ ఠారెత్తిస్తోంది. ఉమ్మడి జిల్లాను ఉక్కపోతతో ఉడికిస్తోంది. రోజురోజుకు గణనీయంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు గురువారంతో మరింతగా పెరిగాయి. -
గంజాయి మాయం కేసులో ఇద్దరు ఎస్సైలు సహా నలుగురి సస్పెన్షన్తో కలకలం
[ 19-04-2024]
సారంగాపూర్ పోలీసుస్టేషన్ నుంచి గంజాయి మాయమైన సంఘటనలో ఇద్దరు ఎస్సైలు సహా నలుగురు సస్పెన్షన్కు గురవడం కలకలం రేపింది. -
చిట్టీల పేరిట ఆర్ఎంపీ డబ్బు వసూళ్లు
[ 19-04-2024]
శంకరపట్నం మండలం కొత్తగట్టులో ఓ ఆర్ఎంపీ సుమారు రూ.70 లక్షలతో ఉడాయించినట్లు ఆలస్యంగా తెలిసింది. బాధితుల కథనం ప్రకారం..
తాజా వార్తలు (Latest News)
-
వైకాపాకి ఓటు వేస్తే డ్రైనేజీలో వేసినట్టే: వైఎస్ షర్మిల
-
నారాయణమూర్తి మనవడికి జాక్పాట్.. ఒక్క రోజులో ₹4 కోట్లు!
-
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్
-
‘ఇద్దరు యువ రాజుల చిత్రాన్ని’ యూపీ ప్రజలు తిరస్కరించారు: మోదీ
-
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
-
‘దుబాయ్ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోండి’ - ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ