లారీలు రాక... కాంటాలు కాక
ఈ ధాన్యం బస్తా వద్ద కూర్చొన్న మహిళా రైతు పేరు కొంపల్లి లచ్చవ్వ. ఈమెది వేములవాడ గ్రామీణ మండలంలోని మల్లారం. ధాన్యం తీసుకొచ్చి వారం రోజులైంది. తేమ శాతం వచ్చినా లారీల కొరత కారణంగా కాంటా పెట్టలేదు. దీంతో రోజూ కుప్పను చూస్తూ ఇలా చెట్టు కింద కూర్చొంటుంది.
వేములవాడలోని కేంద్రంలో ధాన్యం బస్తాలు
ఈ ధాన్యం బస్తా వద్ద కూర్చొన్న మహిళా రైతు పేరు కొంపల్లి లచ్చవ్వ. ఈమెది వేములవాడ గ్రామీణ మండలంలోని మల్లారం. ధాన్యం తీసుకొచ్చి వారం రోజులైంది. తేమ శాతం వచ్చినా లారీల కొరత కారణంగా కాంటా పెట్టలేదు. దీంతో రోజూ కుప్పను చూస్తూ ఇలా చెట్టు కింద కూర్చొంటుంది. లచ్చవ్వనే కాదు ఇలా చాలా మంది అన్నదాతలు ధాన్యం కాంటాలు కాక పడిగాపులు కాస్తున్నారు.
ఆరుగాలం చెమటోడ్చి పండించిన ధాన్యం విక్రయించుకునేందుకు రైతులు కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాయాల్సిన దుస్థితి ఏర్పడింది. చాలా కేంద్రాల్లో లారీలు రాకపోవడంతో కేంద్రాల నిర్వాహకులు ధాన్యం కాంటాలు పెట్టడం లేదు. దీంతో కేంద్రాల్లో వేలాది క్వింటాళ్ల ధాన్యం కుప్పలు, కాంటాలైన బస్తాలు పేరుకుపోయాయి. పలు దఫాలుగా కురిసిన వర్షాలతో ఇబ్బందులు పడిన రైతులకు రోజూ ఆకాశంలో మబ్బులు కమ్ముకోవడం మరింత ఆందోళనకు గురిచేస్తోంది.
జిల్లాలో యాసంగిలో 1.18 లక్షల ఎకరాల్లో రైతులు వరి పంటను సాగు చేశారు. ఈ సీజన్లో పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు సింగిల్ విండోలు, ఐకేపీ, డీసీఎంఎస్, మెప్మా ద్వారా 265 కొనుగోలు కేంద్రాలను అధికారులు ప్రారంభించారు. 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జిల్లాలో కొనుగోళ్లు ప్రారంభమై దాదాపు 20 రోజులు కావస్తోంది. ఇప్పటి వరకు 1.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. తూకాలైన బస్తాలను మిల్లులకు తరలించడానికి అవసరమైన లారీలు, ఇతర వాహనాల కొరత కారణంగా చాలా కేంద్రాల్లో బస్తాలు పేరుకుపోతున్నాయి. మరోవైపు వర్షాల భయం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను ఆందోళనకు గురిచేస్తోంది. తూకాలైన బస్తాలపై టార్పాలిన్ కవర్లు కప్పి పెట్టారు. లారీలు వస్తే మిల్లులకు తరలించేందుకు ఎదురుచూస్తున్నారు. మరో వైపు కాంటాలు కాక రైతులు ధాన్యం కుప్పల వద్ద పడిగాపులు పడుతున్నారు.
వారం రోజులుగా నిరీక్షణ...
లారీల కొరతతో కేంద్రాల్లో సకాలంలో ధాన్యం కాంటాలు కావడం లేదు. ఫలితంగా రైతులు తమ ధాన్యం కుప్పల వద్ద వారం రోజులుగా నిరీక్షిస్తున్నారు. చాలా చోట్ల రోజుల తరబడి కుప్పలు కాంటాలకు నోచుకోవడం లేదు. జిల్లాలో రోజూ 270 నుంచి 280 వరకు లారీల ధాన్యాన్ని తరలిస్తున్నట్లు అధికారులు చెబుతున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో అలా జరగడం లేదు. కొన్ని ప్రాంతాల్లో రైసు మిల్లుల యజమానులు సకాలంలో లారీల నుంచి ధాన్యం బస్తాలను దింపుకోవడం లేదు. దీనివల్ల మిల్లుల వద్ద లారీలు నిలిచిపోయి ధాన్యం తరలింపులో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ధాన్యం తరలింపులో జరుగుతున్న జాప్యంతో కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిల్వలు, కాంటాలైన బస్తాలు పేరుకుపోతున్నాయి. మిల్లుల్లో నిల్వలుండటంతో మిల్లుల యజమానులు ధాన్యం దింపుకునేందుకు వెనుకంజ వేస్తునట్లు తెలుస్తోంది. జిల్లాలో ఒక్కొక్క కేంద్రంలో దాదాపు రెండు, మూడు లారీల ధాన్యం బస్తాలు నిల్వ ఉన్నట్లు కర్షకులు పేర్కొంటున్నారు. ధాన్యం కాంటాలు పెడితే సమస్యలు ఎక్కువ అవుతుందని కేంద్రాల నిర్వాహకులు లారీల రాకను బట్టి తూకాలు వేస్తున్నారు. దీంతో రైతులు రోజుల తరబడి కుప్పల వద్ద నిరీక్షించాల్సిన దుస్థితి ఏర్పడింది.
కొనుగోళ్ల వేగవంతానికి చర్యలు
- హరికృష్ణ, జిల్లా పౌరసరఫరాల మేనేజరు
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. సాధ్యమైనంత వరకు లారీల కొరత లేకుండా చూస్తున్నాం. జిల్లాలో ప్రతి రోజు 185 లారీల్లో ధాన్యం లోడ్ చేసి మిల్లులకు తరలిస్తున్నాం. లారీలతో పాటు డీసీఎం వ్యాన్లు, ట్రాక్టర్లను ధాన్యం తరలింపునకు వినియోగిస్తున్నాం. ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ చర్యలు తీసుకుంటున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పద్మవ్యూహంలో ఉన్నా.. నావైపూ చూడండి
[ 19-04-2024]
‘నిజామాబాద్ నియోజకవర్గం పద్మవ్యూహంలా ఉంది. నన్ను అభిమన్యుడిని చేస్తారో.. అర్జునుడిని చేస్తారో అంతా మీ చేతుల్లో ఉంది’ అని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుతో నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్రెడ్డి పేర్కొన్నారు. -
మొదటిరోజు ఆరు నామినేషన్లు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం గురువారం ప్రారంభమైంది. మొదటి రోజు స్వతంత్ర అభ్యర్థులు మాత్రమే నామపత్రాలను దాఖలు చేశారు. కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు కోట శ్యామ్కుమార్, పోతూరి రాజేందర్లు -
350 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్
[ 19-04-2024]
హుజూరాబాద్లో పట్టుబడ్డ 350 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులు గురువారం సీజ్ చేశారు. హనుమకొండ జిల్లా పరకాలలోని శ్రీరాజరాజేశ్వర రైస్మిల్లులో 1,347 బస్తాల బియ్యాన్ని లారీలో లోడ్ చేసి... -
కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేయండి
[ 19-04-2024]
పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపునకు కలిసికట్టుగా కృషి చేయాలని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. ధర్మపురి పట్టణంలోని ఓ వేడుక మందిరంలో పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల... -
గీతదాటితే కొరడా ఝళిపిస్తారు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఆ మేరకు ఉమ్మడి జిల్లాలో రాజకీయ పార్టీల ప్రచార పర్వం వేడెక్కనుంది. మరోవైపు ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఎంసీసీ (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్)ని తీసుకొచ్చింది. -
కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు : మంత్రి
[ 19-04-2024]
ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులను ఇస్తామని, అవసరమైతే పక్క రాష్ట్రం నుంచి భిక్షాటన చేసైనా పదవులను తెచ్చిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ అన్నారు. -
నాలుగేళ్లా.. రెండేళ్లా!
[ 19-04-2024]
సింగరేణి గుర్తింపు సంఘం కాలపరిమితిపై సందిగ్ధం నెలకొంది. గెలిచిన అనంతరం సంఘానికి అధికారిక పత్రం ఇప్పటి వరకు అందలేదు.గుర్తింపు ఎన్నికలకు ముందు కాలపరిమితిపై స్పష్టత లేకపోవడంతో ఫలితాల అనంతరం కార్మిక శాఖ -
గంట ముందే పోలింగ్ ప్రారంభం
[ 19-04-2024]
గోదావరి పరీవాహక ప్రాంతం.. అంతర్రాష్ట్ర సరిహద్దు.. దట్టమైన అడవులు విస్తరించిన పెద్దపల్లి లోక్సభ పరిధిలో కొన్ని ప్రాంతాల్లో ముందస్తు పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. -
రహదారి నిర్మించారు.. సమస్యలు మరిచారు
[ 19-04-2024]
గుంతల రహదారితో ఇబ్బందులు ఎదురవుతుండటంతో ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. దీంతో పక్కా రోడ్డు నిర్మాణంతో రవాణా సదుపాయం మెరుగైంది. దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం లభించింది. -
స్థలం కేటాయించారు.. ఆసుపత్రి నిర్మాణం విస్మరించారు
[ 19-04-2024]
తంగళ్లపల్లి మండలం టెక్స్టైల్ పార్కు వద్ద బీడీ కార్మికుల కోసం ఏర్పాటు చేసే ఈఎస్ఐ ఆసుపత్రికి పదేళ్ల క్రితం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 13 ఎకరాల స్థలం కేటాయించింది. -
ఓట్లు కొల్లగొట్టి.. దిల్లీ తలుపుతట్టి
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలో కొంత మంది నేతలు అత్యధిక ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. రికార్డు స్థాయిలో ఓట్లు సంపాదించి ప్రత్యర్థులకు అందనంత దూరంలో నిలిచారు. -
స్వశక్తి.. ప్రజాస్వామ్య స్ఫూర్తి
[ 19-04-2024]
అన్నింటా ముందుంటున్న అతివలు ప్రతి ఎన్నికల్లో అధిక సంఖ్యలో ఓటు వేయడంలోనూ పైచేయి సాధిస్తున్నారు. ప్రజాస్వామ్యం కల్పించిన వజ్రాయుధాన్ని తప్పనిసరిగా వినియోగించుకొంటూ స్ఫూర్తి నింపుతున్నారు. -
ఇంటి నుంచే నామినేషన్
[ 19-04-2024]
ఎన్నికల ప్రక్రియను సులభతరం చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. ఓటరు నమోదు, ప్రచార సభలు, సమావేశాల నిర్వహణకు అనుమతుల కోసం -
17 ఎన్నికలు.. ఒక్కసారే అతివకు అవకాశం
[ 19-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి సాధారణ, ఉప ఎన్నికలతో కలిపి ఇప్పటివరకు 17 సార్లు ఎన్నికలు జరగగా ఒక్కసారే మహిళకు అవకాశం లభించింది. -
ఫోన్ ట్యాపింగ్లో ఎవరినీ వదిలేది లేదు
[ 19-04-2024]
రాముడిపై తాను అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఎంపీ బండి సంజయ్ నిరూపిస్తే సజీవ దహనం చేసుకుంటానని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ పొన్నం ప్రభాకర్ అన్నారు. -
వామ్మో.. ఇదేం ఎండ!
[ 19-04-2024]
జనం బెదిరేలా ఎండ ఠారెత్తిస్తోంది. ఉమ్మడి జిల్లాను ఉక్కపోతతో ఉడికిస్తోంది. రోజురోజుకు గణనీయంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు గురువారంతో మరింతగా పెరిగాయి. -
గంజాయి మాయం కేసులో ఇద్దరు ఎస్సైలు సహా నలుగురి సస్పెన్షన్తో కలకలం
[ 19-04-2024]
సారంగాపూర్ పోలీసుస్టేషన్ నుంచి గంజాయి మాయమైన సంఘటనలో ఇద్దరు ఎస్సైలు సహా నలుగురు సస్పెన్షన్కు గురవడం కలకలం రేపింది. -
చిట్టీల పేరిట ఆర్ఎంపీ డబ్బు వసూళ్లు
[ 19-04-2024]
శంకరపట్నం మండలం కొత్తగట్టులో ఓ ఆర్ఎంపీ సుమారు రూ.70 లక్షలతో ఉడాయించినట్లు ఆలస్యంగా తెలిసింది. బాధితుల కథనం ప్రకారం..
తాజా వార్తలు (Latest News)
-
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
-
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!