వీధి వ్యాపారులకు చేయూత
వీధివ్యాపారులు కరోనా, లాక్డౌన్ సమయంలో దయనీయ పరిస్థితులు ఎదుర్కొనగా.. ఇప్పటికీ కోలుకోవడం లేదు.. కొంతమేర వారి జీవితాల్లో మార్పు తీసుకొచ్చేందుకు, జీవనోపాధిలో చేదోడుగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పీఎం స్వనిధి పథకం
కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై నమోదు
నగరంలోని వీధివ్యాపారులు(దాచిన చిత్రం)
న్యూస్టుడే, కరీంనగర్ సుభాష్నగర్: వీధివ్యాపారులు కరోనా, లాక్డౌన్ సమయంలో దయనీయ పరిస్థితులు ఎదుర్కొనగా.. ఇప్పటికీ కోలుకోవడం లేదు.. కొంతమేర వారి జీవితాల్లో మార్పు తీసుకొచ్చేందుకు, జీవనోపాధిలో చేదోడుగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పీఎం స్వనిధి పథకం ద్వారా రుణాలు మంజూరు చేసింది. అన్ని పుర, నగరపాలికల్లో లక్ష్యాన్ని విధించగా..రెండోవిడత రుణాలు అందేలా చర్యలు చేపట్టారు. వీధి వ్యాపారుల కుటుంబ స్థితి గతులు తెలుసుకోవడానికి స్వనిధి నుంచి సమృద్ధి వైపు మళ్లించాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని మొదటగా తొమ్మిది నగరపాలక సంస్థలను ఎంపిక చేశారు. అందులో కరీంనగర్ ఒకటి కాగా, రెండోవిడతలో జగిత్యాల మున్సిపాలిటీ ఎంపికైనట్లు సమాచారం.
సంక్షేమ పథకాలు అమలు
కేంద్ర ప్రభుత్వం స్వనిధి కింద వీధివ్యాపారులకు రుణాలు ఇస్తుండగా వారి కుటుంబాలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. ఎనిమిది రకాల పథకాలు వీరికి అందించాల్సి ఉంటుంది. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు బీమా వర్తింపజేయడం, ప్రతీ ఒక్కరికీ రేషన్కార్డు అందేలా చూడటం వంటి సంక్షేమ పథకాలు ప్రధానంగా ఉన్నాయి.
ఎనిమిదింటిలో 45,818 మంది అర్హులు
కేంద్రం అమలు చేస్తున్న ఎనిమిది రకాల పథకాలకు ఒక్క కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోనే 45,818 మంది కుటుంబ సభ్యులు అర్హులుగా ఉన్నారు. వీరిలో 45,349 మంది దరఖాస్తు చేసుకోగా, 45,232 మంది కుటుంబ సభ్యులకు మంజూరయ్యాయి. పీఎం స్వనిధి కింద మొదటి విడతలో 9,845 మందికి, రెండో విడతలో 2,285 మంది వీధివ్యాపారులకు రుణాలు మంజూరయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాకా.. వెంకటస్వామికి ఆ పేరెలా వచ్చింది?
[ 24-04-2024]
కాంగ్రెస్ పార్టీ దివంగత, కేంద్ర మాజీ మంత్రి జి.వెంకటస్వామి ‘కాకా’గానే ఎక్కువ మందికి సుపరిచితులు. ఆయనకు ఈ పేరు రావడం వెనుక ఆసక్తికర అంశం ఉంది. -
యాప్ కష్టాలు
[ 24-04-2024]
జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల నిర్వాహకులు అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన యాప్ల్లో సమాచారం నిక్షిప్తం చేయాల్సి ఉంది. -
నిర్వహణ భారం.. కమీషన్లో కోత
[ 24-04-2024]
కేంద్రాల నిర్వహణ భారంగా మారగా.. వచ్చిన కమీషన్లో కోత విధించడంతో నిర్వాహకులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. -
ఇక ట్వంటీ20 పోరు!
[ 24-04-2024]
పోలింగ్ తేదీకి బుధవారం నుంచి సరిగ్గా ఇరవై రోజులుంది.. అచ్చంగా ట్వంటీ20 క్రికెట్ ఆటలోని 20 ఓవర్ల మాదిరి సమరం. -
మిగిలింది రెండు రోజులే!
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో తొలి అంకం రెండు రోజుల్లో ముగియనుంది. ఈ నెల 25వ తేదీతో నామినేషన్ల స్వీకరణ పూర్తవనుంది. -
నకిలీ పత్రాలు సృష్టించి.. ఇల్లు ధ్వంసం
[ 24-04-2024]
నకిలీ పత్రాలు సృష్టించి, ఇంటిని ధ్వంసం చేసి, దాడికి పాల్పడిన అయిదుగురిని కరీంనగర్ కొత్తపల్లి పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. -
పార్టీ పెద్దల సమ్మతితోనే రాజేందర్ నామినేషన్
[ 24-04-2024]
పార్టీ పెద్దల సమ్మతితోనే తామంతా కలిసి కాంగ్రెస్ తరఫున వెలిచాల రాజేందర్రావుతో నామినేషన్ వేయించామని, గెలిపిం చుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. -
అతివల ఉపాధికి ఆదరువేదీ!
[ 24-04-2024]
రాష్ట్రంలో 6 లక్షల మంది బీడీ కార్మికులుండగా అత్యధికంగా నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోనే ఉన్నారు. -
ఆ పది మందికే 50 శాతం ఓటర్ల మద్దతు
[ 24-04-2024]
ఎన్నికల్లో ప్రత్యర్థి కంటే ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా విజయం సాధించినట్లే. అయితే గెలుపొందిన అభ్యర్థికి నియోజకవర్గంలోని ఎంత మంది ఓటర్ల మద్దతు ఉందనేది పోటీలో ఉన్న అభ్యర్థులు, నమోదైన పోలింగ్ శాతాన్ని బట్టి మారుతుంది. -
ఆయుధాలు అప్పగించారు..
[ 24-04-2024]
వ్యక్తిగత భద్రత కోసం లైసెన్సు తీసుకొని వెంట ఉంచుకున్న ఆయుధాలను ఉమ్మడి జిల్లావాసులు ఠాణాలకు అప్పగించారు. -
మాతాశిశుకు తప్పని ఉక్కపోత
[ 24-04-2024]
చంటి బిడ్డలు, బాలింతలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో వేసవి ఉక్కపోత తప్పడం లేదు. -
బ్యాలెట్ యుద్ధానికి చకచకా సన్నద్ధం
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికలను సమర్థంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. -
పనులకు ఆటంకాలు.. రాకపోకలకు అవస్థలు
[ 24-04-2024]
రెండు జిల్లాల సరిహద్దులోని మానేరు వాగు దాటడానికి ఇరువైపులా గ్రామాల ప్రజలు దశాబ్దాల తరబడి నానా అవస్థలు పడుతున్నారు. -
తైబజార్... చిరు వ్యాపారుల బేజార్
[ 24-04-2024]
పురపాలక సంఘంలో తైబజార్ గుత్తేదారు ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేస్తున్నా పట్టించుకున్న నాథుడు లేడు.
తాజా వార్తలు (Latest News)
-
యూట్యూబ్కు పోటీగా.. వీడియోల కోసం ‘ఎక్స్’ టీవీ యాప్!
-
విజయ్తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
-
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్
-
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
-
ప్రమాదవశాత్తు పేలిన తుపాకీ.. సీఆర్పీఎఫ్ డీఎస్పీ మృతి
-
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు