logo

ఎనిమిది జంటలకు సామూహిక వివాహాలు

పెద్దపల్లి జిల్లాకేంద్రంలో బుధవారం ఆసరా ఫౌండేషన్‌ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఎనిమిది జంటలకు సామూహిక వివాహాలు జరిపించారు. పట్టణంలోని జూనియర్‌ కళాశాల మైదానంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై ఒకే ముహూర్తానికి కల్యాణం నిర్వహించారు.

Published : 26 May 2022 04:26 IST

జీలకర్ర బెల్లం పెట్టుకుంటున్న వధూవరులు

పెద్దపల్లి, న్యూస్‌టుడే: పెద్దపల్లి జిల్లాకేంద్రంలో బుధవారం ఆసరా ఫౌండేషన్‌ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఎనిమిది జంటలకు సామూహిక వివాహాలు జరిపించారు. పట్టణంలోని జూనియర్‌ కళాశాల మైదానంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై ఒకే ముహూర్తానికి కల్యాణం నిర్వహించారు. సంస్థ వ్యవస్థాపకులు పెంట రాజేశ్‌ దంపతులు పలువురి కాళ్లు కడిగి కన్యాదానం చేశారు. మాట్లాడుతూ వివాహ ఖర్చు భరించలేక ఇబ్బందులు పడుతున్న పేద తల్లిదండ్రులకు అండగా నిలిచేందుకే ఈ కార్యక్రమం చేపట్టినట్లు రాజేశ్‌ చెప్పారు. వేడుక అనంతరం వధూవరుల బంధువులకు భోజనం ఏర్పాటు చేశారు. పెద్దపల్లి, రామగుండం ఎమ్మెల్యేలు మనోహర్‌రెడ్డి, చందర్‌, మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు తదితరులు వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని