ప్రగతి తప్పిన పారిశుద్ధ్యం
నిధులు వచ్చాయా.. కొనుగోలు చేశామా... మూలన పడేశామా... అన్నట్లుంది రామగుండం నగరపాలకవర్గం తీరు.. తమకు రావాల్సిన కమీషన్ వస్తే చాలు.. కొనుగోలు చేసిన యంత్రాలు ఏమైపోతే ఏంటన్న తరహాలో వ్యవహరిస్తుండటం విమర్శలకు దారి తీస్తోంది. గ
మూలనపడ్డ వాహనాలు.. నిధులు నిష్ఫలం
రోడ్లు ఊడ్చే యంత్రం
న్యూస్టుడే, గోదావరిఖని పట్టణం: నిధులు వచ్చాయా.. కొనుగోలు చేశామా... మూలన పడేశామా... అన్నట్లుంది రామగుండం నగరపాలకవర్గం తీరు.. తమకు రావాల్సిన కమీషన్ వస్తే చాలు.. కొనుగోలు చేసిన యంత్రాలు ఏమైపోతే ఏంటన్న తరహాలో వ్యవహరిస్తుండటం విమర్శలకు దారి తీస్తోంది. గతేడాది పట్టణ ప్రణాళికలో యంత్రాల కొనుగోలుకే అధిక నిధులను కేటాయించిన నగరపాలిక వాటిని వినియోగించుకోవడం లేదు. నిర్వహణ ఖర్చు ఎక్కువవుతుందని కొన్నింటిని, తక్షణ మరమ్మతులు చేయించలేక కొన్నింటిని మూలన పడేశారు. యంత్రాలను కొనుగోలు చేసేటప్పుడే నిర్ణీత కాలం పాటు వారంటీ ఉంటుంది. అదీ కాకుండా నిర్వహణ బాధ్యతను మరో సంస్థకు అప్పగించారు. ఈ రెండు విధానాల్లో యంత్రాల నిర్వహణలో బల్దియా విఫలమవుతోంది. తాజాగా జూన్ 2వ తేదీ నుంచి ఐదో విడత పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రారంభం కానున్న నేపథ్యంలోనైనా గత పట్టణ ప్రగతిలో కొనుగోలు చేసిన యంత్రాలను వినియోగంలోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. నగరపాలికలో కొనుగోలు చేసి మూలనపడేసిన యంత్రాల తీరిలా..
పుష్కరకాలంగా నిరుపయోగం
నీటి సరఫరాలో విద్యుత్తు అంతరాయాలను అధిగమించాలనే లక్ష్యంతో సుమారు రూ.కోటి వ్యయంతో 440 కేవీ సామర్థ్యం గల రెండు జనరేటర్లను పన్నెండేళ్ల క్రితం కొనుగోలు చేశారు. ఒకటి గోదావరి ఒడ్డున హెడ్ వర్క్సు వద్ద, మరొకటి శారదానగర్లోని ప్రధాన ట్యాంకు వద్ద ఏర్పాటు చేశారు. వినియోగిస్తే డీజిల్ బిల్లులే తడిసిమోపెడవుతాయని భావించిన నగరపాలిక వినియోగంలోకి తేలేదు.
అవసరం లేకపోయినా..
నగరంలోని రహదారులు సరిగా లేనందున తోపుడు బండ్లతో చెత్త సేకరణ సాధ్యం కాదని స్థానిక అధికారులు మొరపెట్టుకున్నా పట్టించుకోకుండా తొమ్మిదేళ్ల క్రితం రూ.15 లక్షలతో 80 తోపుడు బండ్లు, మరో 10 లక్షలతో 1360 చెత్త డబ్బాలను కొనుగోలు చేశారు. కమీషన్ల కోసమే ఉన్నతాధికారుల ఒత్తిళ్ల వల్లనే రాష్ట్రవ్యాప్తంగా పట్టణ స్థానిక సంస్థల్లో కొనుగోలు చేశారనే ఆరోపణలున్నాయి. తోపుడు బండ్లు స్టోర్ రూమ్కే పరిమితం కాగా చెత్త డబ్బాల్లో కొన్నింటిని వివిధ కార్యక్రమాల్లో నీటి నిల్వల కోసం వినియోగిస్తున్నారు.
హుక్ హోల్డర్ వాహనం
చెత్త నిర్వహణ కేంద్రంలో చెత్తతో నింపిన కంపాక్టర్లను డంపింగ్ యార్డుకు తరలించేందుకు వీలుగా రూ.45 లక్షలు వెచ్చించి హుక్ హోల్డర్ వాహనాన్ని కొనుగోలు చేశారు. కంపాక్టర్లనే వినియోగించకపోవడంతో ఇక హుక్ హోల్డర్ వాహనానికి పనిలేక మూలన పడింది.
వేగంగా రోడ్లు ఊడ్చేందుకని..
నగరంలోని రోడ్లను కార్మికులకంటే వేగంగా ఊడుస్తుందనే భావంతో రూ.65 లక్షల వ్యయంతో రోడ్లు ఊడ్చే యంత్రాన్ని కొనుగోలు చేసిన నగరపాలక అధికారులు నెల రోజులకు మించి వినియోగించలేదు. అందులో రెండు సార్లు మొరాయించింది. దీంతో యంత్రాన్ని మూలన పడేశారు. కార్మికులతోనే రహదారులను శుభ్రం చేయిస్తున్నారు.
చెత్త సేకరించేందుకని..
రహదారుల పక్కన చెత్తను ట్యాంకులో వేసుకొని నగరానికి దూరంగా తరలించేందుకు రూ.23.5 లక్షలతో లిట్టర్ పిక్కర్ వాహనాన్ని కొనుగోలు చేశారు. ఒకరు వాహనాన్ని నడిపిస్తుండగా మరో ఇద్దరు పైపును పట్టుకోవాలి. దీంతో యంత్రం వినియోగం కంటే కార్మికులతో చెత్త ఎత్తించడమే ఉత్తమమనుకున్న బల్దియా వారం రోజుల్లోనే యంత్రాన్ని మూలన పడేశారు.
మొబైల్ బయో టాయ్లెటు
ఏడాదిలో ఒకటి రెండు సార్లు జరిగే ఉత్సవాల్లో ఏర్పాటు చేసేందుకు పట్టణ ప్రగతి నిధులతో రెండు మొబైల్ బయో టాయెలెట్ వాహనాలను కొనుగోలు చేశారు. సుమారు రూ.50 లక్షలతో బస్సును తయారు చేయించినప్పటికీ నగరపాలక కార్యాలయం దాటి బయటకు వెళ్లలేదు. వినియోగం లేకపోవడంతో యంత్రాలు తుప్పుపట్టే పరిస్థితులు నెలకొన్నాయి.
చెత్త తరలింపులో కీలకంగా..
నగరంలో సేకరించిన చెత్తను కంపాక్టు చేసి తరలించేందుకు వీలుగా ఒక్కొక్కటి రూ.35 లక్షల వ్యయంతో రూ.70 లక్షలతో మినీ కంపాక్టర్లను కొనుగోలు చేశారు. ఒకటి గౌతమినగర్లో మరొకటి మల్కాపూర్లోని చెత్త నిర్వహణ కేంద్రంలో ఏర్పాటు చేసినప్పటికీ ఇంతవరకు వినియోగంలోకి తేలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కరీంనగర్ కాంగ్రెస్ టికెట్ ఎవరి చేతికి?.. మల్లగుల్లాలు పడుతున్న అధిష్ఠానం
[ 29-03-2024]
కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి ఖరారుపై ఆ పార్టీ అధిష్ఠానం మల్లగుల్లాలు పడుతోంది.. ఇప్పటికే భారాస, భాజపాల అభ్యర్థులు ఖరారవగా.. హస్తం పార్టీ తరఫున బరిలో నిలిచేదెవరో తెలియకపోవడంతో కాంగ్రెస్ స్థానిక నాయకులు, కార్యకర్తలు అభ్యర్థి తేలేదెప్పుడు.. అని ఆందోళన చెందుతున్నారు. -
కనుల పండువగా శివయ్య కల్యాణం
[ 29-03-2024]
ప్రసిద్ధ శైవక్షేత్రమైన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి క్షేత్రంలో గురువారం శివ కల్యాణోత్సవం కనుల పండువగా జరిగింది. -
ఆందోళన వద్దు.. అవకాశాలు కోకొల్లలు!
[ 29-03-2024]
విద్యార్థులు ప్రాథమిక విద్య నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ పదో తరగతి పూర్తి చేశారు. ఒకట్రెండు రోజుల్లో పరీక్షలు కూడా పూర్తి చేసి ఉన్నతవిద్య వైపు అడుగులు వేయనున్నారు. -
అవసరాల మేరకు ఏదీ అనుసంధానం!
[ 29-03-2024]
ఈ రెండు అంశాల్లోనే కాదు. ప్రయాణికుల అవసరాలు తీర్చడంలో ద.మ.రై.అధికారులు ఆది నుంచీ నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. రైల్వే ఉద్యోగుల అవసరాలు, అధికారులు, నాయకులు లాబీయింగులతోనే కొత్త హాల్టింగులు, ఇతర వసతులు కల్పిస్తున్నారు. -
కరీంనగర్ బస్స్టేషన్ ఆస్తి పన్ను రూ.1.88 కోట్లు చెల్లింపు
[ 29-03-2024]
ఆస్తిపన్ను బకాయిలపై 90 శాతం రాయితీ గడువు మూడు రోజుల్లో ముగుస్తుందని నగరపాలక కమిషనర్ బోనగిరి శ్రీనివాస్ తెలిపారు. -
భార్య చేతిలో భర్త హతం
[ 29-03-2024]
భర్త మద్యానికి బానిసై శారీరకంగా.. మానసికంగా వేధిస్తున్నాడని వేదనకు గురైన ఓ భార్య తనకు తెలిసిన ఇద్దరి సహాయంతో తాళ్లతో కట్టేసి.. కళ్లలో కారం చల్లి... ఒంటిపై వేడి నీళ్లు పోసి తీవ్రంగా కొట్టడంతో స్పృహ కోల్పోయి మృతి చెందాడు. -
లోక్సభ ఎన్నికలు ప్రజాస్వామ్యానికి పరీక్ష
[ 29-03-2024]
రానున్న లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 15 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయమని శాసనమండలి సభ్యుడు, నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి టి.జీవన్రెడ్డి అన్నారు. -
వేసవి గట్టెక్కేనా!
[ 29-03-2024]
జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, రాయికల్ పట్టణాలకు డబ్బాలోని గ్రిడ్ ద్వారా మిషన్ భగీరథ పథకం నీరు సరఫరా అవుతోంది. ధర్మపురి పట్టణానికి డబ్బా నుంచి పైపులైన్లు వేసినా చివరి ప్రాంతం కావడంతో నీరు సరఫరా సక్రమంగా కావడం లేదు. -
మట్టి గుట్టలు మాయం!
[ 29-03-2024]
మండలంలోని వరద కాలువ మట్టిని కొందరు గుత్తేదార్లు, స్తిరాస్థి వ్యాపారులు అక్రమంగా తరలించుకుపోతుండటంతో మట్టికట్టలు మాయమవుతున్నాయి. -
నిధులు దూరం.. నిర్వహణ భారం
[ 29-03-2024]
వ్యవసాయ శాఖ సేవలను రైతులకు మరింత చేరువ చేసే లక్ష్యంతో గత ప్రభుత్వం క్లస్టర్ల వారీగా రైతు వేదికలను నిర్మించింది. శాఖాపరంగా రైతులకు ఆధునిక సాగు విధానంపై సలహాలు, సూచనలు ఇవ్వాలనేది ప్రధాన లక్ష్యం. -
లక్ష్యానికి చేరువగా సింగరేణి
[ 29-03-2024]
సింగరేణి సంస్థ తొలిసారిగా 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి చేరువ అవుతోంది. మూడేళ్లుగా ఈ లక్ష్యాన్ని నిర్దేశించుకున్న సంస్థ ఇప్పటివరకు ఆ మేరకు బొగ్గు ఉత్పత్తిని చేరుకోలేకపోయింది. -
బయో మైనింగ్ ప్రక్రియకు అవాంతరాలు
[ 29-03-2024]
పెరుగుతున్న నగరీకరణ.. అందుకు అనుగుణంగా పారిశుద్ధ్య నిర్వహణ ప్రభుత్వ యంత్రాంగానికి సవాల్గా మారుతోంది. ఈ క్రమంలో చెత్త నుంచి సేంద్రియ ఎరువును తయారు చేసేందుకు రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. -
భాజపా పాలనపై ప్రజల్లో విసుగు
[ 29-03-2024]
రానున్న పార్లమెంటు ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించాలని భారాస ఎంపీ అభ్యర్థులు ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్, కొప్పుల ఈశ్వర్లు అన్నారు. -
మతం పేరిట కేసీఆర్ రాజకీయం చేయలేదు: కేటీఆర్
[ 29-03-2024]
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పదేళ్లలో ఏ రోజు కూడా మతం పేరిట రాజకీయం చేయలేదని మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. -
రాష్ట్రాన్ని దోచుకుంది భారాసనే: ఆది శ్రీనివాస్
[ 29-03-2024]
తెలంగాణ ఏర్పడిన తరవాత రూ.16 వేల కోట్ల నిల్వ బడ్జెట్తో రాష్ట్రాన్ని అప్పగిస్తే భారాస తొమ్మిదిన్నరేళ్ల పాలనలో రాష్ట్రాన్ని రాబంధుల్లా దోచుకుందని, రూ.6.67 లక్షల కోట్ల అప్పుల భారాన్ని రాష్ట్ర ప్రజలపై మోపిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
ఉత్తర్ప్రదేశ్లో హైఅలర్ట్.. గ్యాంగ్స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
-
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!