మత్తులో ముంచుతున్నారు
ఇక్కడ సీసాల్లో కనిపిస్తున్నది గంజాయి ద్రావణం. నేరుగా గంజాయి రవాణా చేయడం కష్టం కావడంతో రవాణాదారులు ద్రావణం రూపంలో కూడా సరఫరా చేస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 11న రామగుండంలో గంజాయి ద్రావణాన్ని ఆబ్కారీ శాఖ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వైజాగ్ నుంచి వస్తున్నట్లు గుర్తించారు.
గంజాయి తాగేవారే సూత్రధారులు
కట్టడి చేస్తున్నా.. గుట్టుగా రవాణా
ఉమ్మడి జిల్లాలో పెరిగిన వినియోగం
ఈనాడు డిజిటల్, పెద్దపల్లి, న్యూస్టుడే, గోదావరిఖని
ఇక్కడ సీసాల్లో కనిపిస్తున్నది గంజాయి ద్రావణం. నేరుగా గంజాయి రవాణా చేయడం కష్టం కావడంతో రవాణాదారులు ద్రావణం రూపంలో కూడా సరఫరా చేస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 11న రామగుండంలో గంజాయి ద్రావణాన్ని ఆబ్కారీ శాఖ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వైజాగ్ నుంచి వస్తున్నట్లు గుర్తించారు.
ప్రభుత్వ ఉపాధ్యాయుడే స్వయంగా గంజాయి రవాణాలో కీలక పాత్ర పోషించాడు. మహారాష్ట్ర పోలీసులు చేపట్టిన తనిఖీల్లో మంథని పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు మాచిడి శ్రీనివాస్గౌడ్తో పాటు అతని డ్రైవర్ రాజు వేరు వేరు కార్లలో గంజాయి రవాణా చేస్తూ పట్టుబడ్డారు. రూ.32 లక్షల విలువ చేసే 103.83 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో 20 కిలోల గంజాయిని మార్చిలో స్వాధీనం చేసుకున్నారు. నిజమాబాద్ జిల్లా కామారెడ్డి నుంచి సిరిసిల్లకు గంజాయిని ప్లాస్టిక్ కవర్లలలో రవాణా చేస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వేములవాడలో చాక్లెట్ ప్యాకెట్ల మాదిరిగా పాన్షాపుల్లో రహస్యంగా విక్రయిస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో గంజాయి రవాణా గుట్టుగా సాగుతోంది.. గంజాయి మత్తుకు అలవాటుపడ్డ యువత దేనికైనా సిద్ధపడే పరిస్థితికి చేరుకుంటున్నారు.. గతంలో గంజాయిని జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతాల్లో పండించేవారు.. పోలీసుల నిఘా పెరగడంతో గంజాయి సాగు క్రమంగా తగ్గిపోయింది. అనంతరం కొంత మంది వైజాగ్, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి రవాణా చేసే వారు. ఇటీవల అక్కడి నుంచి కూడా నిఘా పెరగడంతో చింతూరు ప్రాంతం నుంచి రవాణా చేసుకుంటున్నారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, తిర్యాణి ప్రాంతాల్లో పత్తిలో అంతర సాగుగా గంజాయిని పండిస్తున్నట్లు తెలుస్తోంది. గంజాయిని భారీ ఎత్తున ఒకేసారి కాకుండా చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేసుకుని ప్రజా రవాణా సంస్థలకు చెందిన బస్సులు, రైలు మార్గాల్లో ఎక్కువగా గమ్యస్థానాలకు చేరవేస్తున్నారు.
పెద్దపల్లి జిల్లాలో స్వాధీనం చేసుకున్న గంజాయిని
దహనం చేసేందుకు సిద్ధం చేసిన పోలీసులు(పాతచిత్రం)
బానిసలుగా మారి..
గంజాయి మత్తుకు బానిసలుగా మారిన వారే ప్రస్తుతం దందాను సాగిస్తున్నారు. గతంలో మత్తు కోసం గంజాయి సరఫరా చేసే వారితో సంబంధాలు పెట్టుకుని వినియోగించే వారు. ప్రస్తుతం వారే స్వయంగా గంజాయిని రవాణా చేస్తూ వారు వినియోగించుకుంటూ.. ఖర్చులకు సరిపడా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో గంజాయి మత్తుకు అలవాటుపడ్డ యువత గంజాయి సాగుచేసే ప్రాంతాలను తెలుసుకుని అక్కడి నుంచి రవాణా చేసుకుంటున్నారు. వాట్సాప్ గ్రూపులుగా ఏర్పాటు చేసుకుని కోడ్ భాషల్లో మెసేజ్లు చేసుకుంటున్నారు.
సరిహద్దు జిల్లాల నుంచి
ఉమ్మడి జిల్లాలోని సరిహద్దు జిల్లాల నుంచి గంజాయి చేరుకుంటుంది. పెద్దపల్లి జిల్లాకు రైలు మార్గం ద్వారా ఎక్కువగా చేరుకుంటుంది. మహారాష్ట్ర, చత్తీష్ఘడ్తో పాటు ఆంధ్రప్రదేశ్ల నుంచి గంజాయి సరఫరా చేసే వారు రైలు మార్గం ద్వారా రామగుండం, పెద్దపల్లి స్టేషన్లకు చేరుకుంటున్నారు. జగిత్యాల జిల్లాకు మహారాష్ట్ర నుంచి మంచిర్యాల మీదుగా రవాణా అవుతున్నట్లు తెలుస్తోంది. సిరిసిల్ల జిల్లాకు నిజమాబాద్ మీదుగా సరఫరా అవుతుంది. కరీంనగర్ జిల్లాలోని ప్రధాన నగరం, పట్టణాలకు కూడా ఎక్కువగా మహారాష్ట్ర నుంచే చేరుకుంటున్నట్లు తెలుస్తోంది.
మహారాష్ట్రలో ప్రభుత్వ ఉపాధ్యాయుడి నుంచి
స్వాధీనం చేసుకున్న గంజాయి(పాతచిత్రం)
వలస కార్మికుల వినియోగం
ఉమ్మడి జిల్లాలో ఎక్కువగా వలస కార్మికులు పనిచేస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టులతో పాటు ఇళ్ల నిర్మాణాలు, భారీ ప్రాజెక్టుల్లో ఎక్కువగా బీహార్, చత్తీస్ఘడ్, ఒడిశా ప్రాంతాలకు చెందిన కార్మికులు పని చేస్తుండటంతో ఇందులో చాలా మందికి గంజాయి తాగే అలవాటు ఉంది. ఇటీవల ఆర్ఎఫ్సీఎల్లో పనిచేసే ఇతర రాష్ట్రానికి చెందిన ఓ కార్మికున్ని పోలీసులు పట్టుకున్నారు. పెద్దపల్లి జిల్లాలోని కోల్బెల్టు ప్రాంతంలో ఆర్ఎఫ్సీఎల్, ఎన్టీపీసీ ప్లాంట్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇటుక బట్టీల్లో పనిచేసే కార్మికులు కూడా ఇతర రాష్ట్రాలకు చెందిన వారే. కాళేశ్వరం ప్రాజెక్టు వివిధ ప్యాకేజీ పనుల్లో కూడా ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులే ఎక్కువగా పనిచేస్తున్నారు. వారి సొంత రాష్ట్రాలకు రాకపోకలు సాగించడంతో పాటు గంజాయి మత్తుకు అలవాటున్న వారు అక్కడి నుంచి తెస్తున్నట్లు తెలుస్తోంది.
పెరిగిన పోలీసుల నిఘా
గంజాయి రవాణాపై పోలీసులు నిఘా పెంచారు. గతం కంటే రవాణా తగ్గినప్పటికీ ఇంకా మత్తుకు బానిసలైన వారికి చేరుతోంది. రాష్ట్రవ్యాప్తంగా పోలీసు శాఖ, ఆబ్కారీ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక నిఘా పెట్టడంతో పాటు పక్కా సమాచారం సేకరిస్తూ ఎక్కడికక్కడ పట్టుకుంటున్నారు. గంజాయి మత్తుకు అలవాటు పడ్డ వారి వివరాలను సేకరిస్తున్నారు. వారి కదలికలపై నిఘా ఏర్పాటు చేస్తున్నారు.
కరీంనగర్ అర్బన్ ఆబ్కారీ శాఖ పోలీసులు పట్టుకున్న
గంజాయితో ఇంజినీరింగ్ విద్యార్థి
ఫిబ్రవరి 12న కరీంనగర్ విద్యానగర్లో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి వద్ద ఉన్న 1.5 కిలోల గంజాయిని ఆబ్కారీ శాఖ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తోటి విద్యార్థులతో పాటు యువతకు విక్రయిస్తున్నట్లు సమాచారం అందిన మేరకు పట్టుకున్నారు.
పీడీ చట్టం అమలు చేస్తున్నాం - సత్యనారాయణ, కరీంనగర్ పోలీసు కమిషనర్
గంజాయి రవాణా చేస్తున్నట్లు సమాచారం తెలిస్తే వెంటనే వారిపై చర్యలు తీసుకుంటున్నాం. ఒకటి రెండు సార్లు పట్టుబడితే పీడీ చట్టం అమలు చేస్తున్నాం. చాలా వరకు గంజాయి రవాణా అదుపులోకి వచ్చింది. పూర్తిగా తగ్గించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. గంజాయి మత్తుకు అలవాటు పడ్డ వారిపైనే నిఘా పెట్టాం. ఇటీవల ఎక్కువగా వారే రవాణా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొంతమందిపై పీడీ చట్టం అమలు చేశాం. కౌన్సెలింగ్ ఇస్తున్నాం. మార్పు రాకపోతే పీడీ చట్టం అమలు చేస్తామని హెచ్చరిస్తున్నాం. ఆబ్కారీ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటు పూర్తిస్థాయిలో నివారణకు చర్యలు తీసుకుంటున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కరీంనగర్ కాంగ్రెస్ టికెట్ ఎవరి చేతికి?.. మల్లగుల్లాలు పడుతున్న అధిష్ఠానం
[ 29-03-2024]
కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి ఖరారుపై ఆ పార్టీ అధిష్ఠానం మల్లగుల్లాలు పడుతోంది.. ఇప్పటికే భారాస, భాజపాల అభ్యర్థులు ఖరారవగా.. హస్తం పార్టీ తరఫున బరిలో నిలిచేదెవరో తెలియకపోవడంతో కాంగ్రెస్ స్థానిక నాయకులు, కార్యకర్తలు అభ్యర్థి తేలేదెప్పుడు.. అని ఆందోళన చెందుతున్నారు. -
కనుల పండువగా శివయ్య కల్యాణం
[ 29-03-2024]
ప్రసిద్ధ శైవక్షేత్రమైన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి క్షేత్రంలో గురువారం శివ కల్యాణోత్సవం కనుల పండువగా జరిగింది. -
ఆందోళన వద్దు.. అవకాశాలు కోకొల్లలు!
[ 29-03-2024]
విద్యార్థులు ప్రాథమిక విద్య నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ పదో తరగతి పూర్తి చేశారు. ఒకట్రెండు రోజుల్లో పరీక్షలు కూడా పూర్తి చేసి ఉన్నతవిద్య వైపు అడుగులు వేయనున్నారు. -
అవసరాల మేరకు ఏదీ అనుసంధానం!
[ 29-03-2024]
ఈ రెండు అంశాల్లోనే కాదు. ప్రయాణికుల అవసరాలు తీర్చడంలో ద.మ.రై.అధికారులు ఆది నుంచీ నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. రైల్వే ఉద్యోగుల అవసరాలు, అధికారులు, నాయకులు లాబీయింగులతోనే కొత్త హాల్టింగులు, ఇతర వసతులు కల్పిస్తున్నారు. -
కరీంనగర్ బస్స్టేషన్ ఆస్తి పన్ను రూ.1.88 కోట్లు చెల్లింపు
[ 29-03-2024]
ఆస్తిపన్ను బకాయిలపై 90 శాతం రాయితీ గడువు మూడు రోజుల్లో ముగుస్తుందని నగరపాలక కమిషనర్ బోనగిరి శ్రీనివాస్ తెలిపారు. -
భార్య చేతిలో భర్త హతం
[ 29-03-2024]
భర్త మద్యానికి బానిసై శారీరకంగా.. మానసికంగా వేధిస్తున్నాడని వేదనకు గురైన ఓ భార్య తనకు తెలిసిన ఇద్దరి సహాయంతో తాళ్లతో కట్టేసి.. కళ్లలో కారం చల్లి... ఒంటిపై వేడి నీళ్లు పోసి తీవ్రంగా కొట్టడంతో స్పృహ కోల్పోయి మృతి చెందాడు. -
లోక్సభ ఎన్నికలు ప్రజాస్వామ్యానికి పరీక్ష
[ 29-03-2024]
రానున్న లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 15 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయమని శాసనమండలి సభ్యుడు, నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి టి.జీవన్రెడ్డి అన్నారు. -
వేసవి గట్టెక్కేనా!
[ 29-03-2024]
జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, రాయికల్ పట్టణాలకు డబ్బాలోని గ్రిడ్ ద్వారా మిషన్ భగీరథ పథకం నీరు సరఫరా అవుతోంది. ధర్మపురి పట్టణానికి డబ్బా నుంచి పైపులైన్లు వేసినా చివరి ప్రాంతం కావడంతో నీరు సరఫరా సక్రమంగా కావడం లేదు. -
మట్టి గుట్టలు మాయం!
[ 29-03-2024]
మండలంలోని వరద కాలువ మట్టిని కొందరు గుత్తేదార్లు, స్తిరాస్థి వ్యాపారులు అక్రమంగా తరలించుకుపోతుండటంతో మట్టికట్టలు మాయమవుతున్నాయి. -
నిధులు దూరం.. నిర్వహణ భారం
[ 29-03-2024]
వ్యవసాయ శాఖ సేవలను రైతులకు మరింత చేరువ చేసే లక్ష్యంతో గత ప్రభుత్వం క్లస్టర్ల వారీగా రైతు వేదికలను నిర్మించింది. శాఖాపరంగా రైతులకు ఆధునిక సాగు విధానంపై సలహాలు, సూచనలు ఇవ్వాలనేది ప్రధాన లక్ష్యం. -
లక్ష్యానికి చేరువగా సింగరేణి
[ 29-03-2024]
సింగరేణి సంస్థ తొలిసారిగా 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి చేరువ అవుతోంది. మూడేళ్లుగా ఈ లక్ష్యాన్ని నిర్దేశించుకున్న సంస్థ ఇప్పటివరకు ఆ మేరకు బొగ్గు ఉత్పత్తిని చేరుకోలేకపోయింది. -
బయో మైనింగ్ ప్రక్రియకు అవాంతరాలు
[ 29-03-2024]
పెరుగుతున్న నగరీకరణ.. అందుకు అనుగుణంగా పారిశుద్ధ్య నిర్వహణ ప్రభుత్వ యంత్రాంగానికి సవాల్గా మారుతోంది. ఈ క్రమంలో చెత్త నుంచి సేంద్రియ ఎరువును తయారు చేసేందుకు రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. -
భాజపా పాలనపై ప్రజల్లో విసుగు
[ 29-03-2024]
రానున్న పార్లమెంటు ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించాలని భారాస ఎంపీ అభ్యర్థులు ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్, కొప్పుల ఈశ్వర్లు అన్నారు. -
మతం పేరిట కేసీఆర్ రాజకీయం చేయలేదు: కేటీఆర్
[ 29-03-2024]
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పదేళ్లలో ఏ రోజు కూడా మతం పేరిట రాజకీయం చేయలేదని మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. -
రాష్ట్రాన్ని దోచుకుంది భారాసనే: ఆది శ్రీనివాస్
[ 29-03-2024]
తెలంగాణ ఏర్పడిన తరవాత రూ.16 వేల కోట్ల నిల్వ బడ్జెట్తో రాష్ట్రాన్ని అప్పగిస్తే భారాస తొమ్మిదిన్నరేళ్ల పాలనలో రాష్ట్రాన్ని రాబంధుల్లా దోచుకుందని, రూ.6.67 లక్షల కోట్ల అప్పుల భారాన్ని రాష్ట్ర ప్రజలపై మోపిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ
-
ఫోన్ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు
-
కొరియాపై ఐరాస ఆంక్షల వల్ల ప్రయోజనం లేదు: రష్యా