logo

అభివృద్ధిని చూసి ఓర్వలేక విమర్శలు: పోచారం

అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బీర్కూర్‌ మండలంలోని భైరాపూర్‌ గ్రామంలో నూతనంగా నిర్మించిన

Updated : 24 Jun 2022 20:29 IST

బీర్కూర్‌: అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బీర్కూర్‌ మండలంలోని భైరాపూర్‌ గ్రామంలో నూతనంగా నిర్మించిన 80 రెండు పడక గదుల ఇళ్లు, గ్రామపంచాయతీ కార్యాలయం, రైతు  వేదిక భవనం, ముదిరాజ్‌ సంఘ భవనం, విఠలేశ్వరాలయం ఫంక్షన్‌హాల్‌, ఎస్సీ సామాజిక భవనం, దర్గా షెడ్డును శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పీకర్‌ మాట్లాడుతూ.. కొంత మంది నాయకులు తనపై, తన కుటుంబ సభ్యులపై అవినీతి ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలు వారికి తగిన గుణపాఠం చెబుతారని చెప్పారు. సీఎం కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను భాజపా పాలిత రాష్ట్రాల్లో అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో కలెక్టర్‌ జితేశ్‌ వి.పాటిల్, ఆర్డీవో రాజాగౌడ్‌, సర్పంచి అంజవ్వ, మాజీ జడ్పీటీసీ ద్రోణవల్లి సతీశ్‌, తెరాస నాయకులు వీరేశం, గంగాధర్‌, అరీఫ్‌, రఘు, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని