24 గంటల వైద్యం అందేదెక్కడ
గ్రామీణ ప్రాంత ప్రజలకు 24గంటల పాటు వైద్యం అందించేందుకు ప్రభుత్వం ప్రతి జిల్లాలో కొన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను గుర్తించింది. ప్రభుత్వ లక్ష్యం మంచిదే అయినా అక్కడ రాత్రివేళ వైద్యం అందడం లేదు. సాధారణ ఆరోగ్య కేంద్రాల మాదిరిగానే ఉదయం నుంచి సాయంత్రం వరకు
అరకొర సౌకర్యాలతో అవస్థలు
వైద్యులు, స్టాఫ్ నర్సులు, సిబ్బంది కొరత
న్యూస్టుడే, కరీంనగర్ పట్టణం, పెద్దపల్లి కలెక్టరేట్
వెల్ది 24గంటల ఆరోగ్య కేంద్రం 50ఏళ్ల కిందట నిర్మించగా శిథిలావస్థలో ఉంది. 13 గ్రామాలకు సేవలందించాల్సిన ఇక్కడ పరిస్థితి అధ్వానంగా మారింది. ప్రతిరోజు 80-100మంది ఔట్ పేషెంట్లు చికిత్స పొందుతున్నారు. ఇద్దరు వైద్యులున్నా స్టాఫ్నర్సు ఇతర సిబ్బంది లేక రాత్రి వైద్యం అందడం లేదు. ల్యాబ్ టెక్నీషియన్ లేక కరీంనగర్ వెళ్తున్నారు. మూడు హెల్త్ అసిస్టెంట్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రోగులు ఆసుపత్రిని చూస్తే భయపడుతున్నారు.
గ్రామీణ ప్రాంత ప్రజలకు 24గంటల పాటు వైద్యం అందించేందుకు ప్రభుత్వం ప్రతి జిల్లాలో కొన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను గుర్తించింది. ప్రభుత్వ లక్ష్యం మంచిదే అయినా అక్కడ రాత్రివేళ వైద్యం అందడం లేదు. సాధారణ ఆరోగ్య కేంద్రాల మాదిరిగానే ఉదయం నుంచి సాయంత్రం వరకు సేవలందించి చేతులు దులుపుకుంటున్నారు. ఈ ఆసుపత్రుల పనితీరుపై ఉమ్మడి జిల్లా స్థాయిలో టాస్క్ఫోర్స్ బృందం పరిశీలన కథనం.
లక్ష్యం ఇదీ
24 గంటల వైద్య కేంద్రాల్లో సాయంత్రం 4 నుంచి తెల్లవారు 9గంటల వరకు స్టాపు నర్సు, వాచ్మెన్ అందుబాటులో ఉండాల్సి ఉంటుంది. గర్భిణులు రాత్రివేళలో పురిటి నొప్పులు, ఇతర సమస్యలతో బాధపడితే వారికి తక్షణ వైద్యం అందించాలి. పాము, తేలు కుట్టిన వారికి ప్రాథమ చికిత్స అందించాలి. ఇద్దరు వైద్యులు ఉండాలి. ప్రతిరోజు రాత్రి ఒక వైద్యుడు పర్యవేక్షించాలి. మందుల కొరత లేకుండా చూడాలి. అవసరమైతే ప్రధాన ఆసుపత్రులకు పంపించాలి. చాలా ఆసుపత్రుల్లో స్టాఫ్ నర్సులు లేరు. ఉన్నా వారిని ఇతర ఆసుపత్రులకు డిప్యూటేషన్పై పంపిస్తున్నారు. వైద్యులదీ అదే దారి. ఫలితంగా 24గంటల వైద్యం అందని ద్రాక్షగానే మారుతోంది.
భారంగా మారినా.. ప్రైవేటు వైపు పరుగులు
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆశించిన స్థాయిలో వైద్యం అందకపోవడంతో అత్యవసర పరిస్థితిలో భారమైనా ప్రైవేటుకు ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. ప్రధానంగా పురిటి నొప్పులు, ఇతర సమస్యలతో బాధ పడుతున్న వారు గత్యంతరం లేక ప్రైవేటును ఆశ్రయిస్తున్నారు. వైద్యులు, స్టాపు నర్సులను అందుబాటులో ఉంచితే ఎంతగానో ప్రయోజనం ఉంటుంది.
ఇతర చోట్ల విధులు
కరీంనగర్ జిల్లాలో 24గంటల ఆసుపత్రుల పరిస్థితి విచిత్రంగా ఉంది. చొప్పదండి, శంకరపట్నం, వావిలాలలో పని చేస్తున్న స్టాఫ్ నర్సులను కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అర్బన్ ఆసుపత్రి, నర్సింగ్ స్కూల్, జిల్లా ఆసుపత్రికి డిప్యూటేషన్పై పంపించడంతో అక్కడ సేవలందడం లేదు. కొన్నింటిలో వైద్యులు అలాగే ఉన్నారు. డిప్యూటేషన్లు రద్దు చేసి పూర్తిస్థాయిలో వైద్యులను నియమించుకోవాల్సిన అవసరముంది. కొన్ని చోట్ల సిబ్బంది కొరత తీర్చాలి. నైట్ వాచ్మెన్లు తప్పనిసరిగా ఉండేలా చూడాలి.
మారుమూల ప్రాంతాల్లో..
పెద్దపల్లి జిల్లాలో ఐదు 24గంటల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. కొలనూర్లో స్టాఫ్ నర్సుతో పాటు ఇతర సిబ్బంది, ముత్తారం ఆసుపత్రిలో కూడా సిబ్బంది కొరత ఉంది. ఈ జిల్లాలో 24గంటల వైద్య సేవలు అంతంతా మాత్రంగానే ఉన్నాయి. మారుమూల ప్రాంతాల్లో మరి దయనీయంగా ఉంది.
ఖాళీల భర్తీతోనే..
సిరిసిల్ల జిల్లాలో ఐదు ఆసుపత్రులు ఉన్నాయి. ఇల్లంతకుంట 24గంటల ఆసుపత్రిలో ఇద్దరు వైద్యులకు గాను ఒక్కరే ఉన్నారు. ఒక్క వైద్యుడు సెలవులో వెళ్లినా, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరైతే స్టాఫ్ నర్సు, ఇతర సిబ్బంది వైద్యం అందిస్తారు. కోనరావుపేట, చందుర్తి, పోతుగల్ ఆసుపత్రుల్లో ఒక్కో వైద్యుడు మాత్రమే ఉన్నారు. ఎల్లారెడ్డిపేట ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు వైద్యులుండగా ఒకరిని రాచర్ల బొప్పాపూర్ ఉపకేంద్రంలో డిప్యూటేషన్పై నియమించారు. కొన్ని ప్రాంతాల్లో రాత్రివేళలలో వైద్యం అందుబాటులో ఉంది. మొత్తానికి వైద్యుల ఖాళీలు భర్తీ చేయాలి.
జగిత్యాలలో అంతంత మాత్రమే
జగిత్యాల జిల్లాలో కూడా రాత్రివేళలో మొక్కుబడి వైద్యం అందుతోంది. తొమ్మిది ఆసుపత్రుల్లో కొన్ని చోట్ల వైద్యులు, సిబ్బంది కొరత ఉంది.
ఉమ్మడి జిల్లాలో 24గంటల ఆసుపత్రుల వివరాలు
జిల్లా ప్రాథమిక ఆరోగ్య 24గంటల
కేంద్రాలు ఆసుపత్రులు
కరీంనగర్ 18 07
జగిత్యాల 19 09
రాజన్న సిరిసిల్ల 11 05
పెద్దపల్లి 18 05
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాకా.. వెంకటస్వామికి ఆ పేరెలా వచ్చింది?
[ 24-04-2024]
కాంగ్రెస్ పార్టీ దివంగత, కేంద్ర మాజీ మంత్రి జి.వెంకటస్వామి ‘కాకా’గానే ఎక్కువ మందికి సుపరిచితులు. ఆయనకు ఈ పేరు రావడం వెనుక ఆసక్తికర అంశం ఉంది. -
యాప్ కష్టాలు
[ 24-04-2024]
జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల నిర్వాహకులు అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన యాప్ల్లో సమాచారం నిక్షిప్తం చేయాల్సి ఉంది. -
నిర్వహణ భారం.. కమీషన్లో కోత
[ 24-04-2024]
కేంద్రాల నిర్వహణ భారంగా మారగా.. వచ్చిన కమీషన్లో కోత విధించడంతో నిర్వాహకులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. -
ఇక ట్వంటీ20 పోరు!
[ 24-04-2024]
పోలింగ్ తేదీకి బుధవారం నుంచి సరిగ్గా ఇరవై రోజులుంది.. అచ్చంగా ట్వంటీ20 క్రికెట్ ఆటలోని 20 ఓవర్ల మాదిరి సమరం. -
మిగిలింది రెండు రోజులే!
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో తొలి అంకం రెండు రోజుల్లో ముగియనుంది. ఈ నెల 25వ తేదీతో నామినేషన్ల స్వీకరణ పూర్తవనుంది. -
నకిలీ పత్రాలు సృష్టించి.. ఇల్లు ధ్వంసం
[ 24-04-2024]
నకిలీ పత్రాలు సృష్టించి, ఇంటిని ధ్వంసం చేసి, దాడికి పాల్పడిన అయిదుగురిని కరీంనగర్ కొత్తపల్లి పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. -
పార్టీ పెద్దల సమ్మతితోనే రాజేందర్ నామినేషన్
[ 24-04-2024]
పార్టీ పెద్దల సమ్మతితోనే తామంతా కలిసి కాంగ్రెస్ తరఫున వెలిచాల రాజేందర్రావుతో నామినేషన్ వేయించామని, గెలిపిం చుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. -
అతివల ఉపాధికి ఆదరువేదీ!
[ 24-04-2024]
రాష్ట్రంలో 6 లక్షల మంది బీడీ కార్మికులుండగా అత్యధికంగా నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోనే ఉన్నారు. -
ఆ పది మందికే 50 శాతం ఓటర్ల మద్దతు
[ 24-04-2024]
ఎన్నికల్లో ప్రత్యర్థి కంటే ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా విజయం సాధించినట్లే. అయితే గెలుపొందిన అభ్యర్థికి నియోజకవర్గంలోని ఎంత మంది ఓటర్ల మద్దతు ఉందనేది పోటీలో ఉన్న అభ్యర్థులు, నమోదైన పోలింగ్ శాతాన్ని బట్టి మారుతుంది. -
ఆయుధాలు అప్పగించారు..
[ 24-04-2024]
వ్యక్తిగత భద్రత కోసం లైసెన్సు తీసుకొని వెంట ఉంచుకున్న ఆయుధాలను ఉమ్మడి జిల్లావాసులు ఠాణాలకు అప్పగించారు. -
మాతాశిశుకు తప్పని ఉక్కపోత
[ 24-04-2024]
చంటి బిడ్డలు, బాలింతలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో వేసవి ఉక్కపోత తప్పడం లేదు. -
బ్యాలెట్ యుద్ధానికి చకచకా సన్నద్ధం
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికలను సమర్థంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. -
పనులకు ఆటంకాలు.. రాకపోకలకు అవస్థలు
[ 24-04-2024]
రెండు జిల్లాల సరిహద్దులోని మానేరు వాగు దాటడానికి ఇరువైపులా గ్రామాల ప్రజలు దశాబ్దాల తరబడి నానా అవస్థలు పడుతున్నారు. -
తైబజార్... చిరు వ్యాపారుల బేజార్
[ 24-04-2024]
పురపాలక సంఘంలో తైబజార్ గుత్తేదారు ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేస్తున్నా పట్టించుకున్న నాథుడు లేడు.