logo

భూతగాదాలో ఘర్షణ

భూతగాదా విషయమై జరిగిన ఘర్షణలో తల్లీకుమారుడికి తీవ్ర గాయాలైన సంఘటన మెట్‌పల్లి మండలం వేంపేటలో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్సై సధాకర్‌ కథనం ప్రకారం.. వేంపేటకు చెందిన నల్ల లక్పతిరెడ్డి, నల్ల శేఖర్‌రెడ్డి బంధువులు.

Published : 25 Jun 2022 06:42 IST

తల్లీకుమారులకు తీవ్ర గాయాలు.. ఆసుపత్రికి తరలింపు

మెట్‌పల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: భూతగాదా విషయమై జరిగిన ఘర్షణలో తల్లీకుమారుడికి తీవ్ర గాయాలైన సంఘటన మెట్‌పల్లి మండలం వేంపేటలో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్సై సధాకర్‌ కథనం ప్రకారం.. వేంపేటకు చెందిన నల్ల లక్పతిరెడ్డి, నల్ల శేఖర్‌రెడ్డి బంధువులు. వీరిరువురు కోనరావుపేటకు చెందిన మరో వ్యక్తితో కలిసి మారుతినగర్‌ వద్ద కొంత స్థలం కొనుగోలు చేసి శేఖర్‌రెడ్డి పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేయించారు. అప్పట్నుంచి ఇరువురి మధ్య వివాదం నడుస్తోంది. శుక్రవారం శేఖర్‌రెడ్డి తన భూమిలో వ్యవసాయ పనులు చేస్తుండగా లక్పతిరెడ్డి తన తల్లి గంగుతో కలిసి వెళ్లి తన పేరు మీద భూమి రిజిస్ట్రేషన్‌ చేయాలని కోరాడు. దీంతో వాగ్వాదం చోటుచేసుకుని గొడవ జరిగింది. పోలీసులకు సమాచారం అందడంతో సంఘటనా స్థలానికి వెళ్లి ఇరువర్గాలకు నచ్చజెప్పి ఏమైనా సమస్య ఉంటే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఆ తర్వాత కొద్దిసేపటికి లక్పతిరెడ్డి మళ్లీ గొడ్డలి తీసుకుని శేఖర్‌రెడ్డి వద్దకు వెళ్లడంతో గొడవ ముదిరి పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో శేఖర్‌రెడ్డి ఆయన బంధువులు మరో చికిత్స పొందుతున్న లక్పతిరెడ్డి, తల్లి గంగు ద్దరు కలిసి లక్పతిరెడ్డితో పాటు అతని తల్లి గంగుపై కర్రలతో దాడి చేశారు. ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమ్తితం జగిత్యాలకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని