భూతగాదాలో ఘర్షణ
భూతగాదా విషయమై జరిగిన ఘర్షణలో తల్లీకుమారుడికి తీవ్ర గాయాలైన సంఘటన మెట్పల్లి మండలం వేంపేటలో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్సై సధాకర్ కథనం ప్రకారం.. వేంపేటకు చెందిన నల్ల లక్పతిరెడ్డి, నల్ల శేఖర్రెడ్డి బంధువులు.
తల్లీకుమారులకు తీవ్ర గాయాలు.. ఆసుపత్రికి తరలింపు
మెట్పల్లి గ్రామీణం, న్యూస్టుడే: భూతగాదా విషయమై జరిగిన ఘర్షణలో తల్లీకుమారుడికి తీవ్ర గాయాలైన సంఘటన మెట్పల్లి మండలం వేంపేటలో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్సై సధాకర్ కథనం ప్రకారం.. వేంపేటకు చెందిన నల్ల లక్పతిరెడ్డి, నల్ల శేఖర్రెడ్డి బంధువులు. వీరిరువురు కోనరావుపేటకు చెందిన మరో వ్యక్తితో కలిసి మారుతినగర్ వద్ద కొంత స్థలం కొనుగోలు చేసి శేఖర్రెడ్డి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారు. అప్పట్నుంచి ఇరువురి మధ్య వివాదం నడుస్తోంది. శుక్రవారం శేఖర్రెడ్డి తన భూమిలో వ్యవసాయ పనులు చేస్తుండగా లక్పతిరెడ్డి తన తల్లి గంగుతో కలిసి వెళ్లి తన పేరు మీద భూమి రిజిస్ట్రేషన్ చేయాలని కోరాడు. దీంతో వాగ్వాదం చోటుచేసుకుని గొడవ జరిగింది. పోలీసులకు సమాచారం అందడంతో సంఘటనా స్థలానికి వెళ్లి ఇరువర్గాలకు నచ్చజెప్పి ఏమైనా సమస్య ఉంటే పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఆ తర్వాత కొద్దిసేపటికి లక్పతిరెడ్డి మళ్లీ గొడ్డలి తీసుకుని శేఖర్రెడ్డి వద్దకు వెళ్లడంతో గొడవ ముదిరి పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో శేఖర్రెడ్డి ఆయన బంధువులు మరో చికిత్స పొందుతున్న లక్పతిరెడ్డి, తల్లి గంగు ద్దరు కలిసి లక్పతిరెడ్డితో పాటు అతని తల్లి గంగుపై కర్రలతో దాడి చేశారు. ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమ్తితం జగిత్యాలకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భూసేకరణలో జాప్యం
[ 28-03-2024]
భూసేకరణలో జాప్యమే జాతీయ రహదారుల విస్తరణకు శాపంగా మారుతోంది. జిల్లాలో ప్రధానంగా జగిత్యాల-కరీంనగర్ జాతీయ రహదారిగా మార్చి దశాబ్దం కావస్తున్నా.. నిర్మాణం మొదలు కావటం లేదు -
నత్తనడకన నిర్మాణాలు
[ 28-03-2024]
వైద్యాన్ని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం పల్లెదవాఖానాలు ఏర్పాటు చేసింది. గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్ర(సబ్సెంటర్ల)ను పల్లె దవాఖానాలుగా మార్చారు -
నిధులు వెచ్చించి.. పనులు వదిలేసి
[ 28-03-2024]
పారిశుద్ధ్య పనుల నిర్వహణలో ఆధునిక సాంకేతికను జోడించి పెద్ద నగరాలకు దీటుగా పోటీ పడేందుకు ప్రణాళికలు చేసిన నగరపాలిక.. ఆ విధానం అమలులో వెనుకబడింది -
తాగునీటి వృథా వద్దు : కలెక్టర్
[ 28-03-2024]
అధికారులంతా అప్రమత్తంగా ఉంటూ ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు -
నిజామాబాద్ బరిలో జీవన్రెడ్డి
[ 28-03-2024]
కాంగ్రెస్ నిజామాబాద్ లోక్సభ స్థానం టికెట్ జీవన్రెడ్డికే దక్కింది. పార్టీకి సుదీర్ఘ కాలంగా సేవలందిస్తున్న ఆయనను కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం అభ్యర్థిగా ప్రకటించింది -
తొలిమెట్టు నోడల్ అధికారులకు భత్యం
[ 28-03-2024]
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలను పెంచేందుకు ప్రభుత్వం ‘తొలిమెట్టు’ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ప్రత్యేక బోధన పద్ధతులతో కొనసాగుతున్న ఈ కార్యక్రమ పర్యవేక్షణకు మండలానికి ఒక నోడల్ అధికారిని నియమించారు. -
అరచేతిలో వాతావరణ సమాచారం
[ 28-03-2024]
వాతావరణ సమాచారాన్ని ప్రతిఒక్కరి దైనందిన కార్యకలాపాల్లో భాగం చేయాలనే ఉద్దేశంతో భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఇటీవల ‘పంచాయత్ మౌసం సేవా’ మొబైల్ యాప్ విడుదల చేసింది. -
పఠనాలయం సద్వినియోగం... కల సాకారం
[ 28-03-2024]
గ్రంథాలయ పుస్తకాలతోనే ఏకకాలంలో రెండు ఉద్యోగాలు సాధించగలిగాను. తెలంగాణ మైనార్టీ గురుకుల సొసైటీ నిర్వహించిన ఫలితాల్లో పీజీటీ సాంఘికశాస్త్రం, జూనియర్ కళాశాలలో పౌరశాస్త్రం లెక్చరర్గా ఉద్యోగాలకు ఎంపికయ్యాను -
పంచాయతీల ఖజానా ఖాళీ
[ 28-03-2024]
ఓవైపు ఖజానా ఖాళీ, మరోవైపు సమస్యలు పంచాయతీలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. జమయ్యే నిధులకు మించిన వ్యయం చేయడంతో పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు ఇవ్వలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. -
ఓటు నమోదుకు ప్రత్యేక సాధారణ సెలవు
[ 28-03-2024]
పార్లమెంట్ ఎన్నికల్లో విధులు నిర్వహించే ప్రతి ఉద్యోగికి తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి పేర్కొన్నారు
తాజా వార్తలు (Latest News)
-
బుల్లెట్ రైలు.. మరో కీలక అప్డేట్ ఇచ్చిన అశ్వినీ వైష్ణవ్
-
దిల్లీకి మళ్లీ నిరాశే.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం
-
మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య