వాహన యోగం ఎప్పుడో?
రైతే దేశానికి వెన్నుముఖ అని సభా వేదికల్లో గొప్పగా చెప్పే నాయకులు వారికి సేవలందించే వ్యవసాయశాఖ అధికారులకు సౌకర్యాల కల్పన పట్ల ఆలోచించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గ్రామాల్లో రైతన్నలకు
క్షేత్రస్థాయి పర్యటనకు ఇబ్బంది పడుతున్న వ్యవసాయాధికారులు
న్యూస్టుడే, వేములవాడ
సాగుపై అవగాహన కల్పిస్తున్న అధికారులు
రైతే దేశానికి వెన్నుముఖ అని సభా వేదికల్లో గొప్పగా చెప్పే నాయకులు వారికి సేవలందించే వ్యవసాయశాఖ అధికారులకు సౌకర్యాల కల్పన పట్ల ఆలోచించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గ్రామాల్లో రైతన్నలకు క్షేత్రస్థాయిలో పంటల సాగుపై సూచనలు, సలహాలు ఇతరత్రా సహాయ సహకారాలు అందిస్తూ రైతన్నల ముంగింట్లో సేవలందించే సంబంధిత వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లేందుకు అవసరమైన వాహన సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించడంలో చిన్నచూపు చూస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఏటా వానాకాలం, యాసంగి పంటల సాగు సమయాల్లో రైతులకు అవసరమైన మెలకువలు, సూచనలు చేసేందుకు వ్యవసాయాధికారులు గ్రామాల్లో పర్యటిస్తుంటారు. రైతు వేదికల్లో పంటల సాగుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లడానికి అనేక రకాల ఇబ్బందులను అధిగమించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇతర ప్రభుత్వ శాఖల్లో కొందరి అధికారులకు ప్రభుత్వం వాహనాలను సమకూర్చగా కొన్ని శాఖలకు ప్రతి నెలా వాహనాల వినియోగానికి రూ. 33 వేలను ఖర్చుల కింద అందజేస్తుంది. అలాంటిది గ్రామాల్లోని వ్యవసాయ పంట క్షేత్రాల్లో, క్లస్టర్లలోని గ్రామాల్లో పర్యటించే ఆయా మండలాల వ్యవసాయాధికారులకు మాత్రం ప్రభుత్వ వాహన సౌకర్యం కల్పించకపోవడం పట్ల సంబంధిత అధికారుల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది. వీరికి కేవలం నెలకు టూర్ అలవెన్స్ కింద రూ.900లను ప్రభుత్వం ఇస్తున్నప్పటికి అవి ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇతర శాఖల మాదిరిగా ఇవ్వాలి
- భాస్కర్, ఏడీఏ, వేములవాడ
మొదటి నుంచీ వ్యవసాయశాఖకు ప్రభుత్వ వాహనాలు లేవు. రైతుల పంట చేలల్లోకి ఎప్పుడు క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లినా వ్యవసాయ అధికారులు సొంత వాహనాలపై వెళ్లాల్సి ఉంటుంది. అరకొరగా కొంత ట్రావెల్ అలవెన్స్ను ప్రభుత్వం ఇస్తుంది. ఇతర శాఖల మాదిరి వ్యవసాయశాఖకు ప్రభుత్వ వాహనాలు అవసరమే.
సొంత డబ్బులతో...
జిల్లాలో 13 మంది మండల వ్యవసాయ అధికారులతో పాటు 57 మంది వ్యవసాయ విస్తరణ అధికారుల పోస్టులున్నాయి. విస్తరణాధికారులు పూర్తిస్థాయిలో ఉన్నప్పటికీ వ్యవసాయాధికారులు ఎనిమిది మందే విధులు నిర్వహిస్తున్నారు. ప్రతి మండల వ్యవసాయ అధికారికి ఒక ప్రభుత్వ వాహనం అవసరం. ఇలాంటి సందర్భంలో చాలా మంది ఏవోలు తమ సొంత డబ్బులతో ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాలను సమకూర్చుకుని గ్రామాల్లో క్షేత్రస్థాయి పర్యటిస్తున్నారు. చాలా మంది వ్యవసాయ విస్తరణ అధికారులు తమకు కేటాయించిన క్లస్టర్ పరిధిలోని రైతు వేదికలకు వెళ్లి గ్రామాల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో కనీసం ఏవోలకైనా ప్రభుత్వ వాహనాన్ని సమకూర్చితే రైతులకు మరింతగా సేవలు అందించడానికి అవకాశం ఉంటుంది. గ్రామాల్లో పంటల నమోదు, రైతు బీమా వివరాల సేకరణ, పంటల సాగు వివరాలు తదితర వాటికి తప్పనిసరిగా వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లాల్సి ఉంటుంది. వీటితో పాటు శాస్త్రవేత్తల పర్యటన, ఇతరత్రా సందర్భాల్లోనూ వ్యవసాయ అధికారులు గ్రామాల్లోని పంట క్షేత్రాలను క్షేత్రస్థాయిలో పర్యటించాల్సి ఉంటుంది. అలాంటప్పుడు వాహనం తప్పనిసరి అవసరమవుతుంది. జిల్లా స్థాయిలో, ఏడీఏ పరిధిలో జరిగే సమావేశాలకు ఏవోలు హాజరువుతుంటారు. ఇలాంటి సందర్భంలోనూ సొంత వాహనాల్లో సమావేశాలకు వెళ్లాల్సి వస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వ్యవసాయశాఖ అధికారులకు వాహన సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెండో రోజు నలుగురు నామినేషన్
[ 20-04-2024]
కరీంనగర్, పెద్దపల్లి లోక్సభ స్థానాలకు రెండో రోజు శుక్రవారం కేవలం నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. కరీంనగర్ స్థానం కోసం భాజపా అభ్యర్థి బండి సంజయ్ తరఫున ఆ పార్టీ నాయకులు ఎన్నికల అధికారికి నామపత్రాలను అందజేశారు. -
ఆర్ఎం కార్యాలయానికి ఆరుగురు ఉద్యోగుల సరెండర్
[ 20-04-2024]
హుజూరాబాద్ ఆర్టీసీ డిపోనకు చెందిన ఆరుగురు ఉద్యోగులను కరీంనగర్ ఆర్ఎం కార్యాలయానికి సరెండర్ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. స్థానిక డిపోలో పనిచేసే డ్రైవర్ రవీందర్ వద్ద రూ.20 వేలు లంచం తీసుకుంటూ డిపో మేనేజర్ శ్రీకాంత్ ఈ నెల 15న అనిశా అధికారులకు చిక్కిన విషయం విదితమే. -
ఉక్కపోతతో తల్లీబిడ్డల ఉక్కిరిబిక్కిరి
[ 20-04-2024]
భానుడి భగభగలకు ఉదయం 9 గంటలు దాటితే ఇళ్ల నుంచి బయటకు రావడానికి జనం భయపడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఎండలు 40 డిగ్రీల కంటే అధికంగానే ఉంటున్నాయి. -
కాంగ్రెస్ నేతలకు మానసిక చికిత్స అవసరం
[ 20-04-2024]
కాంగ్రెస్ నేతలకు మానసిక చికిత్స అవసరమని హుస్నాబాద్ నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు అన్నారు. వారికి చికిత్స అందేలా చూడాలని శుక్రవారం కరీంనగర్లో ఎంపీ, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్కి వినతిపత్రం అందజేశారు. -
గంగుల, బండిల స్నేహం అందరికీ తెలుసు
[ 20-04-2024]
కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎంపీ బండి సంజయ్ల మధ్య స్నేహం అందరికీ తెలుసునని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. భారాస ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్ను ఓడించేందుకు గంగుల కమలాకర్ భాజపాతో కుమ్మకైనట్లు ఆరోపించారు. -
వారసత్వ సంపద పరిరక్షణకు ఓటేద్దాం
[ 20-04-2024]
ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంటేనే ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలకు, వారసత్వ కట్టడాలకు పెట్టింది పేరు. శాతవాహనులు, కాకతీయులు, నిజాముల కాలంలో నిర్మించిన కోటలు, మెట్ల బావులు, ఆలయాలు ఇక్కడ కనిపిస్తాయి. -
ఇదీ అన్నదాత ఎజెండా!
[ 20-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గం వ్యవసాయపరంగా అభివృద్ధి చెందిన ప్రాంతం. భిన్న వ్యవసాయ ఉత్పత్తులతో రాష్ట్రంలోనే ప్రత్యేకత చాటుకుంటోంది. దేశ విదేశాలకు ఎగుమతి చేసే పసుపు, మామిడి, మొక్కజొన్న, సన్న వరి, చెరకు, ఆవాలు, ఎర్రజొన్న, తెల్లజొన్న, సజ్జ తదితర పంటల దిగుబడిలో ఆదర్శంగా నిలుస్తున్నా అన్నదాతను సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. -
ఒక ఎంపీ.. అయిదు జిల్లాలు
[ 20-04-2024]
కరీంనగర్ లోక్సభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు గతంలో ఒకే జిల్లా పరిధిలో ఉండేవి. తెలంగాణ ఆవిర్భావం అనంతరం జిల్లాల పునర్విభజనతో ఎంపీ స్థానం అయిదు జిల్లాలకు విస్తరించింది. -
నీటి తొట్టిలో పడి బాలుడి మృతి
[ 20-04-2024]
ఇటుక బట్టీ వద్ద నీటి తొట్టిలో పడి ఏడేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన విషాదం నింపింది. కుటుంబసభ్యులు పోలీసుల కథనం ప్రకారం.. -
శిక్షణ తరగతులు సద్వినియోగం చేసుకోండి
[ 20-04-2024]
కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని కేజీబీవీల్లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పూర్తి చేసుకున్న విద్యార్థినులకు కరీంనగర్ కేజీబీవీలో నిర్వహిస్తున్న ఎప్సెట్ శిక్షణ తరగతులను సమగ్ర శిక్షా రాష్ట్ర ప్రాజెక్టు అధికారి మల్లయ్య భట్టు శుక్రవారం సందర్శించారు. -
కరీంనగర్లో రూ.15.81 లక్షల పట్టివేత
[ 20-04-2024]
పార్లమెంటు ఎన్నికల సందర్భంగా శుక్రవారం పోలీసులు కరీంనగర్లో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో రూ.15.81 లక్షల నగదును పట్టుకున్నట్లు కమిషనర్ కార్యాలయం తెలిపింది. -
ఇంటి నుంచే ఓటింగ్పై అధికారులకు శిక్షణ
[ 20-04-2024]
ఇంటినుంచే ఓటింగ్పై పాటించాల్సిన నిబంధనలపై అధికారులకు మంథని శాసనసభ సెగ్మెంట్ అధికారి హనుమనాయక్ అవగాహన కల్పించారు. శుక్రవారం మంథని ఆర్డీవో కార్యాలయంలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న అధికారులకు శిక్షణ ఇచ్చారు. -
అడుగడుగునా తనిఖీలతో ప్రలోభాలకు అడ్డుకట్ట
[ 20-04-2024]
ఎన్నికల్లో డబ్బు, మద్యం, మాదకద్రవ్యాల పంపిణీకి అడ్డుకట్ట వేసేందుకు జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. లోక్సభ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల, జగిత్యాల జిల్లాలో జిల్లా సరిహద్దు, అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. -
పెరుగుతున్న పసిడి ధరలు... తగ్గుతున్న వ్యాపారం
[ 20-04-2024]
బంగారం ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకి వెళుతున్నాయి. గతంలో పెళ్లి ముహూర్తాల సమయంలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టేవి. దీనికి భిన్నంగా మార్కెట్లో ప్రస్తుతం పసిడి ధర పది గ్రాములు(తులం) రూ.76,000 వరకు పలుకుతోంది. -
కిట్టు సరే.. పరీక్ష చేసేవారేరీ?
[ 20-04-2024]
కలుషిత నీటితో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. దీంతో ప్రజలకు శుద్ధ జలం అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే అక్కడక్కడ పైపులు పగిలి లీకేజీతో కలుషితమైన నీరు సరఫరా అయ్యే అవకాశం ఉంది. -
ఆరేళ్లుగా ఉపాధి కరవు
[ 20-04-2024]
వలసల నివారణకు అమలు చేస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల కోసం ఆరేళ్లుగా అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా ఆ కుటుంబాలకు పనులు కల్పించడం లేదు. -
ప్రజలు మళ్లీ మోసపోవద్దు
[ 20-04-2024]
భాజపా అభ్యర్థి అర్వింద్ రాముడి పేరుతో రాజకీయం తప్ప.. ప్రజలకు చేసింది ఏమీ లేదని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. పొద్దునలేస్తే హిందూ-ముస్లిం, పాకిస్థాన్-ఇండియా, రోహింగ్యాంటూ మాటలు చెప్పడమే గాని ఎంపీగా ప్రజలకు చేసింది శూన్యమని ఎద్దేవా చేశారు. -
‘పసుపు బోర్డు పేరుతో మోసం’
[ 20-04-2024]
పసుపు బోర్డు పేరుతో ఎంపీ ధర్మపురి అర్వింద్ రైతులను మోసం చేశారని కాంగ్రెస్ అభ్యర్థి జీవన్రెడ్డి ఆరోపించారు. ఇప్పుడు కూడా మభ్యపెట్టి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
తాజా వార్తలు (Latest News)
-
రాజీనామా చేయకుంటే ఊరుకోం.. వాలంటీర్లపై వైకాపా నాయకుల ఒత్తిడి
-
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
-
నిషేధమెక్కడ.. ‘నిషా’దమే.. రక్త మాంసాలతో జగన్ వ్యాపారం
-
పనసపండు గుర్తు ఎక్కడ?.. గందరగోళానికి గురైన ఓటర్లు
-
బాబు సీఎం అయ్యే వరకు పాదరక్షలు ధరించనని..!
-
బస్సులు జగన్ సభకు.. కష్టాలు ప్రయాణికులకు