విద్యుత్తు సమస్యలకు పరిష్కారమెప్పుడో?
చొప్పదండి మేజర్ గ్రామపంచాయతీ నుంచి పురపాలక సంఘంగా మారినప్పటికి విద్యుత్తు సమస్యలు పరిష్కారం కావడం లేదు. నాలుగేళ్లుగా నిర్వహిస్తున్న పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో కేవలం కొన్ని సమస్యలకు పరిష్కారం
సమస్యలను క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తున్న అధికారులు (పాతచిత్రం)
చొప్పదండి, న్యూస్టుడే: చొప్పదండి మేజర్ గ్రామపంచాయతీ నుంచి పురపాలక సంఘంగా మారినప్పటికి విద్యుత్తు సమస్యలు పరిష్కారం కావడం లేదు. నాలుగేళ్లుగా నిర్వహిస్తున్న పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో కేవలం కొన్ని సమస్యలకు పరిష్కారం చూపగా మరికొన్నింటిని గాలికొదిలేశారు. ప్రతీ ఏటా సమస్యలను గుర్తించి వాటిని త్వరితగతిన పరిష్కరించాలని కార్యచరణ రూపొందిస్తున్నప్పటికీ అవి కాగితాలకే పరిమితమవుతున్నాయి.
ఇళ్లపై తీగలు
పట్టణంలోని వినాయకనగర్, శ్రీరామ టాకీసు, మారుతీనగర్తో పాటు పలు కాలనీల్లో విద్యుత్తు తీగలు ఇళ్లపై ప్రమాదకరంగా దర్శనమిస్తున్నాయి. వాటిని ఇళ్లకు సమీపంలో లేకుండా కొంచెం దూరంగా ఏర్పాటు చేయాలని ప్రజలు ఏళ్ల తరబడి విన్నవిస్తున్నా ఫలితంలేకుండా పోతుంది. తమ ఇళ్ల నుంచి చేతికందేవిధంగా ఉండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని కాలనీవాసులు బిక్కుబిక్కుమంటూ కాలంవెళ్లదీస్తున్నారు. ప్రధాన కూడళ్ల సమీపంలో పలు రకాల విద్యుత్తు తీగలు ఒకే స్తంబానికి ఉండటంతో సైతం పలు ప్రమాదాలకు నెలవుగా మారింది. కొంతమంది ఇంటిలోనే ఇనుప స్తంబాలు ఉండటంతో వారు భయంతో జీవిస్తున్నారు.
నూతన స్తంభాల జాడేదీ?
కొన్ని విద్యుత్తు స్తంభాల నుంచి కనెక్షన్లు తొలగించినప్పటికి వాటిని అక్కడి నుంచి తొలగించలేదు. విరిగిపోయిన స్తంబాల స్థానంలో కొత్తవి వేసినప్పటికీ పాతవి అలాగే ఉంటున్నాయి. పట్టణం రోజురోజుకు విస్తరిస్తున్న నేపథ్యంలో నూతన ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. దానికి అనుగుణంగా కొత్త స్తంభాలను వేయాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. కేవలం మొదటి నాలుగు వార్డుల్లో 30 చొప్పున నూతన స్తంభాలు వేసి చేతులు దులుపుకున్నారు. మిగతా వార్డుల్లో విద్యుత్తు స్తంభాలు లేక రాత్రిపూట అంధకారంలో ఉంటున్నారు.
దశల వారీగా..
- రజిత, ఇన్ఛార్జి కమిషనర్, పురపాలకసంఘం
పట్టణ ప్రగతిలో భాగంగా విద్యుత్తు సమస్యలన్నింటిని గుర్తించడం జరిగింది. వాటన్నింటిని దశలవారీగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాం. విద్యుత్తు అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధుల సాయంతో త్వరితగతిన సమస్యలను పరిష్కరిస్తాం. ఇప్పటికే వార్డుల వారీగా కావాల్సిన అవసరాలు, తీర్చాల్సిన సమస్యలపై సమావేశాలు నిర్వహించడం జరిగింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆరో రోజు 17 నామినేషన్లు
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలక అంకానికి గురువారంతో తెరపడనుంది. లోక్సభ నియోజకవర్గం బరిలో నిలిచే అభ్యర్థుల నామినేషన్ దాఖలుకు నేడు చివరి రోజు కావడంతో గడిచిన వారం రోజుల నుంచి కొనసాగుతున్న ప్రక్రియ మధ్యాహ్నం 3 గంటలతో ముగియనుంది. -
పేదింటి బిడ్డలు ఇంటర్లో మెరిశారు
[ 25-04-2024]
కరీంనగర్ విద్యావిభాగం, భాగ్యనగర్, న్యూస్టుడే : ఇంటర్మీడియెట్ ఫలితాల్లో పేద విద్యార్థులు ప్రతిభ చాటారు. తల్లిదండ్రులు కష్టపడి చదివించగా.. వారి పేరు నిలబెట్టారు. ఉపాధ్యాయుల సహకారంతో ఉత్తమ మార్కులు సాధించారు. -
భూ కబ్జా వ్యవహారంలో కార్పొరేటర్.. ఆమె భర్తపై కేసు
[ 25-04-2024]
కొనుగోలు చేసిన భూమికి సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించడమే కాకుండా బాధితుడిని డబ్బుల కోసం బెదిరించిన నాయకులతోపాటు వారికి సహకరించిన నగరపాలక సంస్థ సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేసి కొంత మందిని అరెస్టు చేశారు. -
బాలికలదే పై చేయి
[ 25-04-2024]
జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు నిరాశ పరిచాయి. సర్కారు కళాశాలల్లో ఆధునిక వసతులు, సరిపడా బోధన సిబ్బంది, విద్యార్థుల దత్తత, తరుచూ చరవాణిలో తల్లిదండ్రులను సంప్రదించినా ఆశించిన మేర ఫలితాలు రాలేదు. -
జూన్ 6 తర్వాత నిరుపేదలకు ఇళ్లు
[ 25-04-2024]
జూన్ 6 తర్వాత ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్లు ఇచ్చే కార్యాచరణ చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పేర్కొన్నారు. -
భాజపా బీఫామ్ ఎవరికో!
[ 25-04-2024]
నామినేషన్ల ఘట్టం తుది దశకు చేరిన వేళ పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలో భాజపా తరఫున బరిలో ఉండే అభ్యర్థిపై ఉత్కంఠ వీడటం లేదు. పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన గోమాసె శ్రీనివాస్ బుధవారం రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాల్లో అమ్మాయిల హవా కొనసాగింది. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరిగిన పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో ఒకేషనల్ కలిపి 7,624 మంది పరీక్షలకు హాజరవగా అందులో 4,628 మంది ఉత్తీర్ణత సాధించారు. -
పెరిగిన వినియోగం.. తగ్గిన గృహజ్యోతి లబ్ధిదారులు
[ 25-04-2024]
వేసవి ఎండల తీవ్రత కారణంగా విద్యుత్తు వినియోగం భారీగా పెరిగింది. దీని ప్రభావం గృహజ్యోతి పథకం లబ్ధిదారులపై పడింది. దీంతో చాలా మంది మార్చిలో ఈ పథకానికి అనర్హులుగా తేలారు. -
ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్లు కుమ్మక్కు: కేటీఆర్
[ 25-04-2024]
ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని, అందుకే ప్రజలకు తెలియని వ్యక్తిని కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
ఇంటర్లో బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ప్రథమ సంవత్సరంలో 5,717 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 2,955 మంది ఉత్తీర్ణులయ్యారు. 51.69 శాతం ఉత్తీర్ణత నమోదైంది. వొకేషనల్లో 949 మంది విద్యార్థులకుగాను 419 మంది ఉత్తీర్ణత సాధించారు. -
భానుడి భగభగ
[ 25-04-2024]
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నమోదైన పది గరిష్ఠ పగటి ఉష్ణోగ్రత ప్రాంతాల్లో కరీంనగర్ జిల్లాలోని రెండు ప్రదేశాలున్నాయి. -
బెదిరింపు రాజకీయాలు సరికాదు
[ 25-04-2024]
కాంగ్రెస్ నాయకులు బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతూ తమ పార్టీ అభ్యర్థులు, శ్రేణులను చేర్చుకుంటున్నారని, అలాంటి చర్యలు తగవని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!