వేతనం ఆసుపత్రిలో.. విధులు అధికారుల ఇళ్లలో..
కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో 17 మంది శాశ్వాత రోగి సహాయకుల(ఎంఎన్వోలు, ఎఫ్ఎన్వోలు)తో పాటు 36 మంది తాత్కాలిక పేషెంట్కేర్లు ఉన్నారు. అయినా రోగులకు పూర్తిస్థాయిలో సేవలు అందటం లేదు. రోడ్డు ప్రమాద క్షతగాత్రులు,
న్యూస్టుడే, చైతన్యపురి
కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో 17 మంది శాశ్వాత రోగి సహాయకుల(ఎంఎన్వోలు, ఎఫ్ఎన్వోలు)తో పాటు 36 మంది తాత్కాలిక పేషెంట్కేర్లు ఉన్నారు. అయినా రోగులకు పూర్తిస్థాయిలో సేవలు అందటం లేదు. రోడ్డు ప్రమాద క్షతగాత్రులు, అత్యవసర వైద్యం నిమిత్తం ఆసుపత్రికి వచ్చిన రోగులను, వికలాంగులను అడ్మిట్ నిమిత్తం వార్డులకు తీసుకెళ్లాలన్నా, వైద్య పరీక్షల నిమిత్తం ఎక్స్రే, స్కానింగ్ కేంద్రాల వద్దకు స్ట్రెచర్పై తీసుకెళ్లాలంటే పేషెంట్ కేర్ల సహాయం తప్పని సరి. జిల్లా ఆసుపత్రిలో 53 మంది సహాయకులు ఉన్నప్పటికీ రోగులకు అందుబాటులో ఉండటం లేదు. కుటుంబీకులు, బంధువులే వారికి సహాయకులుగా ఉంటున్నారు.
సొంత పనులకు
36 మంది తాత్కాలిక పేషెంట్కేర్లు ఉండగా (ఎంసీహెచ్ అదనం) అందులో 10 మందికి పైగా విధులకు హాజరవకుండా ఆసుపత్రి అధికారుల ఇళ్లలో పని చేస్తున్నారు. ఒకరిని ఆసుపత్రిలో ఓ ఉద్యోగి సహాయకుడికిగా పెట్టుకున్నారు. మరో ఇద్దరు ఆసుపత్రి అధికారులకు పర్సనల్ పీఏలుగా, మరొకరిని ప్రజాప్రతినిధి ఇంటి వద్ద, మరో ఇద్దరిని ఆసుపత్రి అధికారుల ఇళ్లలో పని మనుషులుగా ఉపయోగించుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అసలే సిబ్బంది కొరతతో ఆసుపత్రిలో ఇబ్బందులు ఎదర్కొంటుండగా ఉన్నవారిని అధికారులు సొంత అవసరాలకు ఉపయోగించుకోవడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు.
ఈ చిత్రంలో చక్రాల కుర్చీలో రోగిని వార్డుకు తీసుకెళుతున్న వ్యక్తి వారి బంధువే. చికిత్స నిమిత్తం సర్జికల్వార్డులో అడ్మిటైన ఇతనికి వైద్యులు స్కానింగ్ రాయడంతో ఈ నె 24న కుర్చీలో స్కానింగ్ గదికి తీసుకువచ్చారు. స్కానింగ్ అనంతరం తిరిగి వార్డుకు తీసుకెళ్లేందుకు అందుబాటులో పేషెంట్కేర్ లేకపోవడంతో బంధువే వార్డుకు తీసుకెళ్లారు.
ఈ చిత్రంలో రెండు కాళ్లు లేక చేతులతో పాకుతూ ఆసుపత్రిలో తిరుగుతున్న ఇతని పేరు దుర్గయ్య, బెజ్జంకి గ్రామానికి చెందిన ఇతనికి జ్వరం రావడంతో చికిత్స నిమిత్తం ఈ నెల 24న ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. ఆసుపత్రి ప్రధాన గేట్ వద్ద అతని మూడు చక్రాల సైకిల్ను పెట్టి ఆసుపత్రి వరండాలోకి వచ్చారు. అక్కడి నుంచి ఓపీ గదుల వద్దకు వెళ్లేందుకు స్ట్రెచర్బాయ్ (పేషెంట్కేర్) కోసం చూడగా అక్కడ అందుబాటులో లేక చేతులతో పాకుతూ ఓపీ గదికి వెళ్లారు. పరీక్షల అనంతరం ఇంజక్షన్ నిమిత్తం క్యాజువాలిటీ వద్దకు ఇలా గంట పాటు ఆసుపత్రిలో జ్వరంతోనే నేలపై పాకుతూ తిరిగారు. వార్డుబాయ్, పేషెంట్కేర్ సిబ్బంది చక్రాల కుర్చీలో వైద్యుడి వద్దకు తీసుకెళ్లాల్సి ఉన్నా పట్టించుకోలేదు.
సమాచారం ఇవ్వకుండానే గైర్హాజరవుతున్నారు
-డాక్టర్ జ్యోతి, ఆర్ఎంవో
జిల్లా ఆసుపత్రిలో పని చేసే పారిశుద్ధ్య కార్మికులు, పేషెంట్కేర్, సెక్యూరిటీ సిబ్బంది మూడు షిప్టులుగా పని చేయాల్సి ఉంటుంది. పేషెంట్కేర్ సిబ్బంది ముందుస్తు సమాచారం లేకుండా గైర్హాజరు కావడంతో కొన్ని సందర్భాల్లో రోగులకు అందుబాటులో ఉండటం లేదు. అలాంటి వారిని తొలగించి కొత్తవారికి అవకాశం వచ్చి రోగులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వం నుంచి కొత్త పోస్టులు మంజూరు లేకపోవడంతో పరిపాలన సౌలభ్యం దృష్ట్యా కొంత మందిని రికార్డు రూంలో సహాయకులుగా, అధికారుల పీఏలుగా వినియోగించుకుంటాం. డ్యూటీ సమయంలో అధికారులు ఇళ్లలో పని చేస్తున్న విషయం నా దృష్టికి రాలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్వితీయంలో 4.. ప్రథమంలో 5
[ 25-04-2024]
రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు వారు బుధవారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. గత విద్యాసంవత్సరం కంటే మెరుగైన ఫలితాలను సాధించారు. ద్వితీయ సంవత్సరంలో నాలుగు, ప్రథమలో అయిదో స్థానం సాధించారు. -
రాజేందర్రావు చేతికే టికెట్
[ 25-04-2024]
రోజుల తరబడి నిరీక్షణకు కాంగ్రెస్ పార్టీ తెరదించింది. ఎట్టకేలకు నామినేషన్ల చివరి రోజుకు ముందు బుధవారం రాత్రి అభ్యర్థిని ప్రకటించింది. కరీంనగర్ లోక్సభ స్థానంలో పోటీ చేసేందుకు వెలిచాల రాజేందర్రావుకు అవకాశమిచ్చింది. -
కాంగ్రెస్తో భారాస నేతల కుమ్మక్కు
[ 25-04-2024]
కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలని తాను కొట్లాడుతుంటే భారాస నేతలు ఆ పార్టీతో కుమ్మక్కై తనను ఓడించాలని చూస్తున్నారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విమర్శించారు. -
ఆరో రోజు 17 నామినేషన్లు
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలక అంకానికి గురువారంతో తెరపడనుంది. లోక్సభ నియోజకవర్గం బరిలో నిలిచే అభ్యర్థుల నామినేషన్ దాఖలుకు నేడు చివరి రోజు కావడంతో గడిచిన వారం రోజుల నుంచి కొనసాగుతున్న ప్రక్రియ మధ్యాహ్నం 3 గంటలతో ముగియనుంది. -
పేదింటి బిడ్డలు ఇంటర్లో మెరిశారు
[ 25-04-2024]
కరీంనగర్ విద్యావిభాగం, భాగ్యనగర్, న్యూస్టుడే : ఇంటర్మీడియెట్ ఫలితాల్లో పేద విద్యార్థులు ప్రతిభ చాటారు. తల్లిదండ్రులు కష్టపడి చదివించగా.. వారి పేరు నిలబెట్టారు. ఉపాధ్యాయుల సహకారంతో ఉత్తమ మార్కులు సాధించారు. -
భూ కబ్జా వ్యవహారంలో కార్పొరేటర్.. ఆమె భర్తపై కేసు
[ 25-04-2024]
కొనుగోలు చేసిన భూమికి సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించడమే కాకుండా బాధితుడిని డబ్బుల కోసం బెదిరించిన నాయకులతోపాటు వారికి సహకరించిన నగరపాలక సంస్థ సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేసి కొంత మందిని అరెస్టు చేశారు. -
బాలికలదే పై చేయి
[ 25-04-2024]
జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు నిరాశ పరిచాయి. సర్కారు కళాశాలల్లో ఆధునిక వసతులు, సరిపడా బోధన సిబ్బంది, విద్యార్థుల దత్తత, తరుచూ చరవాణిలో తల్లిదండ్రులను సంప్రదించినా ఆశించిన మేర ఫలితాలు రాలేదు. -
జూన్ 6 తర్వాత నిరుపేదలకు ఇళ్లు
[ 25-04-2024]
జూన్ 6 తర్వాత ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్లు ఇచ్చే కార్యాచరణ చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పేర్కొన్నారు. -
భాజపా బీఫామ్ ఎవరికో!
[ 25-04-2024]
నామినేషన్ల ఘట్టం తుది దశకు చేరిన వేళ పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలో భాజపా తరఫున బరిలో ఉండే అభ్యర్థిపై ఉత్కంఠ వీడటం లేదు. పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన గోమాసె శ్రీనివాస్ బుధవారం రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాల్లో అమ్మాయిల హవా కొనసాగింది. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరిగిన పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో ఒకేషనల్ కలిపి 7,624 మంది పరీక్షలకు హాజరవగా అందులో 4,628 మంది ఉత్తీర్ణత సాధించారు. -
పెరిగిన వినియోగం.. తగ్గిన గృహజ్యోతి లబ్ధిదారులు
[ 25-04-2024]
వేసవి ఎండల తీవ్రత కారణంగా విద్యుత్తు వినియోగం భారీగా పెరిగింది. దీని ప్రభావం గృహజ్యోతి పథకం లబ్ధిదారులపై పడింది. దీంతో చాలా మంది మార్చిలో ఈ పథకానికి అనర్హులుగా తేలారు. -
ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్లు కుమ్మక్కు: కేటీఆర్
[ 25-04-2024]
ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని, అందుకే ప్రజలకు తెలియని వ్యక్తిని కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
ఇంటర్లో బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ప్రథమ సంవత్సరంలో 5,717 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 2,955 మంది ఉత్తీర్ణులయ్యారు. 51.69 శాతం ఉత్తీర్ణత నమోదైంది. వొకేషనల్లో 949 మంది విద్యార్థులకుగాను 419 మంది ఉత్తీర్ణత సాధించారు. -
భానుడి భగభగ
[ 25-04-2024]
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నమోదైన పది గరిష్ఠ పగటి ఉష్ణోగ్రత ప్రాంతాల్లో కరీంనగర్ జిల్లాలోని రెండు ప్రదేశాలున్నాయి. -
బెదిరింపు రాజకీయాలు సరికాదు
[ 25-04-2024]
కాంగ్రెస్ నాయకులు బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతూ తమ పార్టీ అభ్యర్థులు, శ్రేణులను చేర్చుకుంటున్నారని, అలాంటి చర్యలు తగవని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
30 వైడ్ బాడీ విమనాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM