logo

కారును ఢీకొన్న లారీ... గాయపడ్డ గర్భిణికి యాతన

లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యం ఫలితంగా ఓ గర్భిణి తీవ్ర గాయాలపాలై ,కారులో  నరకయాతనపడటం పలువురిని కలచివేసింది...కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలంలోని రేణికుంట టోల్‌ ప్లాజా వద్ద ఆదివారం ఉదయం  ఓ ట్రాక్టర్‌ డ్రైవర్‌

Published : 27 Jun 2022 04:28 IST

టోల్‌ప్లాజా వద్ద ఘటన

తిమ్మాపూర్‌,న్యూస్‌టుడే: లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యం ఫలితంగా ఓ గర్భిణి తీవ్ర గాయాలపాలై ,కారులో  నరకయాతనపడటం పలువురిని కలచివేసింది...కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలంలోని రేణికుంట టోల్‌ ప్లాజా వద్ద ఆదివారం ఉదయం  ఓ ట్రాక్టర్‌ డ్రైవర్‌ టోల్‌ రసీదు తీసుకుంటున్నాడు. దాని వెనకాలే ఆల్టో కార్లో హైద్రాబాద్‌ నుంచి సుల్తానాబాద్‌ వెళ్తున్న గర్భిణి వీర్ల రజిత కుటుంబ సభ్యులతో కలిసి ఉన్నారు. ఆ కారు వెనకాలే మరో కారు సైతం టోల్‌ రసీదు కోసం వేచి ఉంది. ఇంతలో ఒక లారీ డ్రైవర్‌ అజాగ్రత్త, అతివేగంతో వచ్చి కారును ఢీకొట్టగా, ఆ కారు ముందు ఉన్న ఆల్టోకారును ఢీకొట్టింది. ఆల్టో కారు ముందు ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. దీంతో ఆల్టో కారు నుజ్జయి డోర్‌ తెరుచుకోలేదు. రజిత ,భర్త మహేందర్‌లు అందులోనే ఇరుక్కుపోయారు. సమాచారం అందుకున్న ఎల్‌ఎండీ పోలీసులు టోల్‌ప్లాజా సిబ్బంది, స్థానికుల సాయంతో సుమారు గంట  శ్రమించి కారులోంచి దంపతులిద్దరినీ బయటకు తీశారు. రజితకు తీవ్రగాయాలు కాగా, మహేందర్‌ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.రజితను కరీంనగర్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని