కారును ఢీకొన్న లారీ... గాయపడ్డ గర్భిణికి యాతన
లారీ డ్రైవర్ నిర్లక్ష్యం ఫలితంగా ఓ గర్భిణి తీవ్ర గాయాలపాలై ,కారులో నరకయాతనపడటం పలువురిని కలచివేసింది...కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని రేణికుంట టోల్ ప్లాజా వద్ద ఆదివారం ఉదయం ఓ ట్రాక్టర్ డ్రైవర్
టోల్ప్లాజా వద్ద ఘటన
తిమ్మాపూర్,న్యూస్టుడే: లారీ డ్రైవర్ నిర్లక్ష్యం ఫలితంగా ఓ గర్భిణి తీవ్ర గాయాలపాలై ,కారులో నరకయాతనపడటం పలువురిని కలచివేసింది...కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని రేణికుంట టోల్ ప్లాజా వద్ద ఆదివారం ఉదయం ఓ ట్రాక్టర్ డ్రైవర్ టోల్ రసీదు తీసుకుంటున్నాడు. దాని వెనకాలే ఆల్టో కార్లో హైద్రాబాద్ నుంచి సుల్తానాబాద్ వెళ్తున్న గర్భిణి వీర్ల రజిత కుటుంబ సభ్యులతో కలిసి ఉన్నారు. ఆ కారు వెనకాలే మరో కారు సైతం టోల్ రసీదు కోసం వేచి ఉంది. ఇంతలో ఒక లారీ డ్రైవర్ అజాగ్రత్త, అతివేగంతో వచ్చి కారును ఢీకొట్టగా, ఆ కారు ముందు ఉన్న ఆల్టోకారును ఢీకొట్టింది. ఆల్టో కారు ముందు ఉన్న ట్రాక్టర్ను ఢీకొట్టింది. దీంతో ఆల్టో కారు నుజ్జయి డోర్ తెరుచుకోలేదు. రజిత ,భర్త మహేందర్లు అందులోనే ఇరుక్కుపోయారు. సమాచారం అందుకున్న ఎల్ఎండీ పోలీసులు టోల్ప్లాజా సిబ్బంది, స్థానికుల సాయంతో సుమారు గంట శ్రమించి కారులోంచి దంపతులిద్దరినీ బయటకు తీశారు. రజితకు తీవ్రగాయాలు కాగా, మహేందర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.రజితను కరీంనగర్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణం
[ 18-04-2024]
దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి క్షేత్రంలో బుధవారం శ్రీరామనవమి సందర్భంగా శ్రీసీతారాముల కల్యాణోత్సవాన్ని ఆలయ వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. -
నేటి నుంచి నామినేషన్లు షురూ!
[ 18-04-2024]
ఎన్నికల సమరంలో అసలైన ఘట్టం గురువారం నుంచి మొదలవనుంది. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ నెల రోజుల కిందటే వెలువడినప్పటికీ నేడు వెలువడే అధికారిక నోటిఫికేషన్తో అసలు అంకం షురూ అవనుంది. -
ప్రచార పర్వానికి కాంగ్రెస్ సిద్ధం!
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికలకు సంబంధించి గురువారం నామపత్రాల స్వీకరణ కార్యక్రమం ప్రారంభమవుతున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ లోక్సభ స్థానం పరిధిలో ప్రచార కసరత్తు ప్రారంభించింది. -
కొప్పుల మొదటిసారి.. జీవన్ మూడోసారి
[ 18-04-2024]
ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో వేర్వేరు పార్టీలు, వేర్వేరు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్న తాటిపర్తి జీవన్రెడ్డి, కొప్పుల ఈశ్వర్లకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. ఆరు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా గెలుపొందిన జీవన్రెడ్డి స్వగ్రామం పెగడపల్లి మండలం బతికెపల్లి. -
క్లిక్ దూరంలో సమగ్ర సమాచారం
[ 18-04-2024]
ఎన్నికలకు సంబంధించిన సమగ్ర సమాచారం అందుబాటులో ఉండేలా కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక వెబ్సైట్ రూపొందించింది. ceotelangana.nic.in లో ఓటరు నమోదుతో పాటు సవరణలు, తొలగింపులు తదితర అంశాలుంటాయి. -
రెండు సార్లు ఎంపీ.. సాధారణ జీవనం
[ 18-04-2024]
వరుసగా రెండు సార్లు ఎంపీగా ఎన్నికైనా చివరి శ్వాస వరకు పల్లెటూరులోనే సాధారణ జీవితం గడిపారు జువ్వాడి రమాపతిరావు. 1916లో గన్నేరువరంలో జన్మించిన ఆయన వివాహం అనంతరం అత్తగారి ఊరైన గంగాధర మండలం సర్వారెడ్డిపల్లికి వచ్చి స్థిరపడ్డారు. -
ఎన్నికల పరిశీలకులొస్తున్నారు
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికలను స్వేచ్ఛగా, శాంతియుతంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పకడ్బందీ చర్యలు చేపట్టింది. ప్రలోభాలకు అడ్డుకట్ట వేసేందుకు ఉన్నతాధికారుల పర్యవేక్షణ పెంచింది. -
హాట్రిక్ విజేత..అరుదైన ఘనత
[ 18-04-2024]
ఉమ్మడి జిల్లాలో నలుగురు నేతలు వరుసగా మూడు సార్లు లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా హ్యాట్రిక్ రికార్డు సొంతం చేసుకున్నారు. కరీంనగర్ నుంచి ముగ్గురు, పెద్దపల్లి నుంచి ఒకరు గెలుపొంది రాజకీయాల్లో తమదైన ముద్ర వేసుకున్నారు. -
అక్కడ స్థానికేతరులే అధికం
[ 18-04-2024]
1962లో ఆవిర్భవించిన పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గం నుంచి ఇప్పటివరకు ఒక్కసారి మినహా అన్ని ఎన్నికల్లో స్థానికేతరులే గెలుపొందారు. 1980లో 7వ లోక్సభ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించిన కోదాటి రాజలింగం మాత్రమే స్థానికుడు. -
వసతుల మెరుగుకు కార్యాచరణ
[ 18-04-2024]
ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, రామగుండం నగరపాలికల్లో కనీస మౌలిక వసతులు మెరుగుపర్చడానికి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ప్రధానంగా తాగునీరు, భూగర్భ మురుగునీటి వ్యవస్థను బలోపేతం చేసేలా చర్యలు తీసుకుంటారు. -
ఆదాయంలో జమ్మికుంట మార్కెట్ టాప్
[ 18-04-2024]
పంటలకు పెరిగిన మద్దతు ధర, ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా పాత బకాయిలు జమకావటం, చెక్పోస్టులు, గిడ్డంగుల అద్దెలు, లైసెన్సులు, మార్కెట్లకు వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాల ద్వారా లభించే ఆదాయంతో ఉమ్మడి జిల్లాలోని జగిత్యాల వ్యవసాయ మార్కెట్ మినహా కరీంనగర్, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లు మార్కెటింగ్ శాఖ నిర్ణయించిన ఆర్థిక ఆదాయ లక్ష్యాన్ని అధిగమించాయి. -
ఓటరు దరఖాస్తులకు త్వరితగతిన పరిష్కారం
[ 18-04-2024]
నామినేషన్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ సూచించారు. బుధవారం ఆయన నిర్వహించిన పెద్దపల్లి నుంచి కలెక్టర్ ముజమ్మిల్ఖాన్, అదనపు కలెక్టర్లు అరుణశ్రీ, శ్యామ్ప్రసాద్లాల్లు పాల్గొన్నారు. -
మిల్లుల్లోనే బియ్యం.. ధాన్యానికేదీ స్థలం?
[ 18-04-2024]
గత వానాకాలం సీజన్కు సంబంధించిన బియ్యానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో మిల్లుల్లోనే నిల్వలు పేరుకుపోయాయి. గత సీజన్కు సంబంధించిన సీఎంఆర్ లక్ష్యాలను మిల్లర్లు పూర్తి చేయాలనే గడువును జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు పొడిగిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కోహ్లీకి అరుదైన గౌరవం.. జైపుర్ మ్యూజియంలో మైనపు విగ్రహం
-
స్టార్ హీరోను కలిసిన రిషబ్ శెట్టి.. ‘కాంతార 2’ కోసమేనా..!
-
102 స్థానాలు.. 16 కోట్ల మంది ఓటర్లు.. తొలిదశ పోలింగ్కు సర్వం సిద్ధం
-
రుణం కోసం ‘చావు తెలివి’.. మృతదేహాన్ని బ్యాంకుకు తీసుకొచ్చి..!
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె
-
జగన్పై రాయిదాడి కేసు.. నిందితుడికి 14 రోజుల రిమాండ్